
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులకు కలెక్టర్ అభినంద
రావికమతం: టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన మండలంలోని గర్ణికం కస్తూర్భా గాంధీ బాలకల విద్యాలయం విద్యార్థినులను కలెక్టర్ విజయ కృష్ణన్ అభినందించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదో తరగతి పరీక్షల్లో 568 మార్కులు సాధించిన వర్షిత లాస్య, 567 మార్కులు సాధించిన ఇందుశ్రీ, ఇంటర్మీడియట్లో 969 మార్కులు సాధించిన టి.అశ్వనిలను అభినందించి సత్కరించారు. కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ భానును పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఏ అదనపు ప్రాజెక్టు కోఆర్టినేటర్ జయ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.