
పెరటిలోనే ఔషధ మొక్కలు
అనకాపల్లి: రాణపాల, తులసి, అలివెరా, నేల ఉసిరి వంటి ఔషధ మొక్కలను ప్రతి ఇంటి పెరడులో పెంచుకోవచ్చని ఆయుష్మాన్ భారత్ వైద్యురాలు డాక్ట ర్ కె.లావణ్య చెప్పారు. వి.వి.రమణ రైతు భారతి హాల్లో గురువారం జిల్లా గ్రామీణ వయోవృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆ మె మాట్లాడారు. ఔషధ మొక్కలు అందుబాటులో ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టేనని చెప్పారు. పరి శుభ్రమైన గాలిని పీల్చాలంటే మొక్కల ద్వారానే సా ధ్యమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇళ్ల వద్ద మొక్కలను పెంచడం లేదని, వాతావరణంలో అనేక మార్పులు సంభవించి, వివిధ వ్యాధుల బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కొత్తగా గృహాలు నిర్మించే ప్రతి ఒక్కరూ మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర ప్రాంతీయ పర్యావరణ పరిరక్షణ కన్వీనర్ డాక్టర్ ఎస్.నూకరాజు మాట్లాడా రు. సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కాండ్రేగుల అప్పారావు, సభ్యులు కాండ్రేగుల విశ్వేశ్వరరావు, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.
చక్కని ఆరోగ్యానికి ఎంతో మేలు: డాక్టర్ లావణ్య