
150 యూనిట్లు మించి వాడలేదు..
మా ఊళ్లో అందరం ఎస్సీ కులానికి చెందినవారమే ఉంటాం. మేమెప్పుడూ 150 యూనిట్లు మించి కరెంట్ వాడలేదు. వారం రోజుల క్రితం రూ.7,874 బిల్లు వచ్చిందని మా ఇంటికి కరెంట్ కట్ చేశారు. వేసవి కాలమని ప్రాధేయపడినా కనికరించలేదు. సగం కడితే కనెక్షన్ ఇస్తామన్నారు. వెంటనే అప్పు చేసి రూ.4000 కట్టాను. ఈనెలాఖరుకు మిగిలిన బిల్లు కూడా కట్టకపోతే మీటర్ తీసుకెళ్లిపోతామని చెప్పారు. గత ప్రభుత్వంలో 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించిన వారందరికీ ఉచిత కరెంట్ ఇచ్చారు. ఇప్పుడు బకాయిలు చెల్లించాలని బెదిరిస్తున్నారు.
–ఏడిద లక్ష్మి, గజపతినగరం, రాజుపేట పంచాయతీ, పాయకరావుపేట మండలం