
భక్తిశ్రద్ధలతో బక్రీద్
● మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు
● జిల్లావ్యాప్తంగా ఘనంగా వేడుకలు
● సేవా కార్యక్రమాలు
సాక్షి,పాడేరు: జిల్లావ్యాప్తంగా బక్రీద్ పండగను ముస్లిం సోదరులు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక మెయిన్రోడ్డులోని పురాతన జిక్రి ఇలాహి జామియా మసీద్లో గురువు ఇమామ్ మహ్మద్ అలీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులంతా మసీదులో నమాజ్ చేశారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ ప్రతినిధులు షేక్ అబ్దుల్లా, మహ్మద్ ఇక్బాల్, మహ్మద్ సులేమాన్, షేక్ అన్సారీ, షేక్ మొహ్మద్ పాల్గొన్నారు. అలాగే తమిళనాడు ముస్లింలకు చెందిన జమాత్ మసీదులోను ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.

భక్తిశ్రద్ధలతో బక్రీద్

భక్తిశ్రద్ధలతో బక్రీద్