ఎన్నికల నియమావళిపాటించాల్సిందే | Sakshi
Sakshi News home page

ఎన్నికల నియమావళిపాటించాల్సిందే

Published Wed, Mar 27 2024 2:15 AM

మాట్లాడుతున్న రిటర్నింగ్‌ అధికారి అభిషేక్‌  - Sakshi

అరకులోయ టౌన్‌: రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు ర్యాలీలు, సభలు, ఇంటింటి ప్రచారం, సమావేశాలకు అనుమతి తప్పనిసరి అని అరకులోయ అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారి అభిషేక్‌ సూచించారు. మంగళవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ర్యాలీలు. సభలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా సింగిల్‌ విండో అప్రూవల్‌ సిస్టం ద్వారా అనుమతి ఇచ్చేందుకు ఏర్పాటు చేసిందన్నారు. ఎవరైనా ర్యాలీలు, సభలు, సమాఏశాలు నిర్వహించే సమయానికి 24 గంటల ముందు తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి సోమేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్ధి రేగం మత్స్యలింగం వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement