
సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్యాబోధన
నేరడిగొండ: సర్కారు బడుల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నట్లు డీఈవో శ్రీనివాస్రెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని తేజాపూర్ గ్రామంలో గల జెడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్లను ఆదివారం సందర్శించారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 16 మంది విద్యార్థులను తల్లిదండ్రులు తేజాపూర్ ఎంపీపీఎస్లో చేర్పించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్యాబోధన అందుతుందన్నారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకున్న తల్లిదండ్రులను అభినందించారు. కార్యక్రమంలో ఎంఈవో భూమారెడ్డి, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.