
అమరుల త్యాగాలు చిరస్మరణీయం●
ఆదిలాబాద్టౌన్: తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగాలు మరువలేనివని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పో లీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహించి జవాబుదారితనం అలవర్చుకోవాలన్నారు. కా ర్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, డీఎస్పీలు జీవన్రెడ్డి, శ్రీనివాస్, నాగేందర్, ఇన్స్పెక్టర్లు సునిల్కుమార్, కరుణాకర్రావు, వెంకటి, మురళి, శ్రీపాల్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.