
నేర నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్టౌన్: నేర నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఆదిలాబాద్ సబ్ డివిజనల్ అధికా రులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై కఠినన చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. బక్రీద్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పశువుల అక్రమ రవాణా జరగకుండా చూడాలని, చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేయాలని తెలిపారు. రా నున్న లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలని సూ చించారు. గంజాయి సాగు, వినియోగంపై చర్యలు చేపట్టాలని తెలిపారు. అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులు, డాక్యుమెంట్లను పోర్జరీ చేసి స్థలా లను కబ్జా చేసి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. గత నెలలో జరిగిన మోసాలు, నేరా ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదనపు ఎస్పీ బీ సురేందర్రావు, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస్, స్వామి, సీఐలు బీ సునీల్కుమార్, సీహెచ్ కరుణాకర్రావు, కే ఫణిదర్, ఎ.వెంకటేశ్వరరావు, పండే రా వు, గుణవంత్రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డీ వెంకటి, టీ మురళి, ఎన్.చంద్రశేఖర్, బీ శ్రీపాల్, ఆదిలా బాద్ సబ్ డివిజన్ ఎస్సైలు, ఐటీ కోర్, డీసీఆర్బీ, కమ్యూనికేషన్, పీసీఆర్, సిబ్బంది పాల్గొన్నారు.