
‘మా భూములు మాకివ్వండి’
బజార్హత్నూర్/ఇచ్చోడ: 60 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటుతున్నారని, మా భూములు మాకిప్పించాలని బజార్హత్నూర్ మండలం గంగాపూర్, దిగ్నూర్ గ్రామ రైతులు శుక్రవారం ఆదిలాబాద్లో డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, ఇచ్చోడ ఎఫ్ఆర్వో పుండలిక్కు వినతిపత్రం ఇచ్చారు. వారు మా ట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త అట వీహక్కు చట్టంతో గిరిజనులు, గిరిజనేతర రై తులు జీవనోపాధి కోల్పోయే ప్రమాదమేర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి అటవీ హక్కు పత్రాలు అందించాల ని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో పాల్వే మారుతి, రామగిరి రవీందర్, మోతే రాజేశ్, ఒ డింబే నాందేవ్, ఒడ్డెపల్లి అడెల్లు, చిన్న భూమ న్న, రమాడే బాబు, మిట్టు మల్లేశ్, పాల్వే నాందేవ్, సుభాష్, రాజేందర్, ప్రవీణ్, కేంద్రే శివా జీ, అశోక్, రమాకాంత్ తదితరులున్నారు.
భూముల ఆక్రమణ ఆపాలి
ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగి స్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీల భూముల ఆక్రమణ లు ఆపాలని ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నెల లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో అటవీ అధికారి పుండలిక్కు వినతిపత్రం అందజేశారు. బజార్హత్నూర్ మండలంలోని గంగాపూర్, డిగ్నూర్, రాజులగూడ గ్రా మాల రైతులకు న్యాయం చేసేదాకా తమ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.