కీటకజనిత వ్యాధులను అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

కీటకజనిత వ్యాధులను అరికట్టాలి

May 31 2025 1:33 AM | Updated on May 31 2025 1:33 AM

కీటకజనిత వ్యాధులను అరికట్టాలి

కీటకజనిత వ్యాధులను అరికట్టాలి

ఆదిలాబాద్‌టౌన్‌: కీటకజనిత వ్యాధులు సంక్రమించకుండా చర్యలు చేపట్టాలని మహారాష్ట్ర వైద్యారో గ్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ బబితా కమలాపురే సూ చించారు. శుక్రవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెక్టర్‌ బోర్న్‌ డిసీసెస్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ వంశీకృష్ణ, తలమడుగు మెడికల్‌ ఆఫీసర్‌ హరీశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బబితా కమలాపురే మాట్లాడుతూ.. వర్షాకాలంలో మలేరియా, డెంగీ, ఫైలేరియా తదితర కీటకజ నిత వ్యాధులను అరికట్టడానికి అంతర్రాష్ట్ర అవగా హన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. 2030 నా టికి దేశంలో మలేరియాను అంతమొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు జనాలు రాకపోకలు చేస్తుంటారని, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చే పడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement