
వేగవంతంగా జీపీవోల నియమాక ప్రక్రియ
● ఆప్షన్లు ఇచ్చిన 68 మంది అభ్యర్థులు
కై లాస్నగర్: గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెరపైకి తెచ్చిన గ్రామపాలన అధి కారి (జీపీవో) పోస్టుల భర్తీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న 83 మంది పూర్వ వీఆర్వో, వీఆర్ఏలకు ఈ నెల 25న రాత పరీక్ష నిర్వహించింది. ప రీక్షకు 73 మంది హాజరైన సంగతి తెలిసిందే. కాగా, పరీక్ష ఫలితాలు వెల్లడించని ప్రభుత్వం సదరు అ భ్యర్థులు ఏ జిల్లాలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నార నే దానిపై ఆప్షన్లు కోరింది. ఇందుకు గురువారమే తుది గడువుగా ప్రకటించింది. దీంతో 68 మంది అభ్యర్థులు కలెక్టరేట్ ఏవో వర్ణను కలిసి ఆప్షన్ ఫాంలు అందజేశారు. ఇందులో 66మంది జిల్లాలో పని చేసేందుకు ఆసక్తి చూపగా మరో ఇద్దరు ఇతర జిల్లాలకు అప్షన్లను అందజేసినట్లు అధికారులు తెలిపా రు. వీరందరికీ ప్రభుత్వం జూన్ 2న ఉద్యోగ నియమాక పత్రాలు అందజేయనున్నట్లు సమాచారం.