
ఉపాధి దూరం చేశారు
నా పేరు సరిత. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ వాసిని. నా కొడుకు శివప్రసాద్ దివ్యాంగుడు. తన బాగోగులు చూసేందుకు ఆయన వెంటే ఉండాల్సి వస్తోంది. పట్టణంలోని భవిత కేంద్రంలో చేర్పించగా నాకు అక్కడ కేర్ గివ్గా ఉద్యోగం కల్పించారు. అయితే వైద్య చికిత్స నిమిత్తం నేను హైదరా బాద్కు వెళ్లగా నా స్థానంలో మరో మహిళను నియమించారు. వైకల్యం కలిగిన పిల్లల తల్లులతో నియమించాల్సిన ఈ పోస్టును సాధారణ పిల్లలున్న మహిళతో భర్తీ చేశారు. నా కొడుకు పరిస్థితి దృష్టిలో ఉంచుకుని నాకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంటున్నా.