యూడైస్‌లో పొరపాట్లు సవరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

యూడైస్‌లో పొరపాట్లు సవరించుకోవాలి

Apr 17 2025 1:51 AM | Updated on Apr 17 2025 1:51 AM

యూడైస్‌లో పొరపాట్లు సవరించుకోవాలి

యూడైస్‌లో పొరపాట్లు సవరించుకోవాలి

ఆదిలాబాద్‌టౌన్‌(జైనథ్‌): యూడైస్‌లో పొరపాట్లు ఉంటే సవరించుకోవాలని డీఈవో శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జైనథ్‌ మండల కేంద్రంలోని జెడ్పీఎస్‌ఎస్‌ ను బుధవారం తనిఖీ చేశారు. జిల్లాలోని ఆయా పాఠశాలలను 59 మంది డైట్‌ ఛాత్రోపాధ్యాయులతో యూడైస్‌ను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఈ సమాచారంలో ఏవైనా పొరపాట్లు ఉంటే మార్పులు చేసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం డీఈవోను సన్మానించారు. ఆయన వెంట ఎంఈవో శ్రీనివాస్‌, ప్రధానోపాధ్యాయుడు లస్మన్న తదితరులున్నారు.

సర్వే పకడ్బందీగా చేపట్టాలి

బేల: యూడైస్‌లో నమోదైన వివరాల ప్రకారం వి ద్యార్థుల సంఖ్య, పాఠశాల భౌతిక వసతులపై డైట్‌ ఛాత్రోపాధ్యాయులు చేస్తున్న సర్వే పకడ్బందీగా చేపట్టాలని డీఈవో శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని అశోక్‌నగర్‌ ప్రాథమిక పాఠశాలలో ఛాత్రోపాధ్యాయురాలు వెంకమ్మ చేస్తున్న సర్వే తీరును బుధవారం పరిశీలించారు. ఆయన వెంట ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ నారాయణ, ఎంఈవో నర్సింలు, సీఆర్పీ వెంకన్న తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement