-
మిర్యాలగూడలో బీఆర్ఎస్ నాయకులపై దాడి
మిర్యాలగూడ అర్బన్ : కాంగ్రెస్ నాయకులు తమపై దాడి చేశారని పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం జరిగిన ఎన్నికల నేపథ్యంలో మిర్యాలగూడ పట్టణంలోని బాబూజీనగర్లో బీఆర్ఎస్ నాయకులపై స్థానిక కాంగ్రెస్ నాయకులు మధ్యాహ్నం తీవ్ర పదజాలంతో దూషించారు. దీంతో అక్కడి నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్లిపోయారు. కాగా రాత్రి సమయంలో కాంగ్రెస్ నాయకులు పాతూరి ప్రసాద్, పాతూరి మురళి, అఖిల్, వెంకటేశ్వర్రావు, శరత్, శ్రీనివాస్, లక్కీ, తన్నీరు సాయి, రవి కర్రలు, రాడ్లు, పదునైన ఆయుధాలతో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్యాదవ్, దుర్గాచారి, శ్యామ్, క్రాంతి, జనార్దన్ ఇళ్లపై దాడికి దిగారు. ఈ దాడిలో దుర్గాచారి బొటనవేలుకు తీవ్రగాయం కాగా జానార్దన్, శ్యామ్లకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారు ఆస్పత్రి నుంచి ఇంటికి రాగా మరలా అర్ధరాత్రి కాంగ్రెస్ నాయకులు దాడి చేసి ఇక్కడే ఉంటే చంపుతామని బెదిరించినట్లు మంగళవారం బాధితులు టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమపై అకారణంగా దాడి చేసి, తమ ఇళ్లను కూల్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. -
ఆయిల్పామ్తోట దగ్ధం
ఆలేరురూరల్ : ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మంగళవారం 12ఎకరాల ఆయిల్పామ్ తోట దగ్ధమైంది. స్థానికులు, ఉద్యానవన శాఖ అధికారి సైదులు, తోట యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొలనుపాక గ్రామానికి చెందిన గోపి శ్రీనివాస్రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 12ఎకరాల్లో సంవత్సరం నరక్రితం దాదాపు 450 ఆయిల్పామ్ మొక్కలు నాటాడు. పక్కన గల పొలంలో ఎండిన గడ్డికి నిప్పుపెట్టడంతో తోటకు మంటలు అంటుకొని పామాయిల్ తోట, డ్రిప్పు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు. నష్టాన్ని అంచనా వేసి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి నష్టపరిహారం వచ్చేలా చూస్తామన్నారు. ఆగిఉన్న లారీల నుంచి డీజిల్ చోరీతుర్కపల్లి : ఆగిఉన్న ఓ లారీలోంచి గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం డీజిల్ చోరీకి పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. మండలంలోని వాసాలమర్రి గ్రామశివారులో ఉన్న సాయిబాలాజీ రైస్మిల్లో తవుడు లోడ్ చేసుకునేందుకు లారీతో వచ్చిన డ్రైవర్ మంగళవారం ఉదయం లోడ్ చేసుకుందామని అక్కడే ఉంచాడు. ఈ తరుణంలో రాత్రి 1గంట సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఆగిఉన్న లారీలో ఉన్న 350లీటర్ల డీజిల్ను దొంగిలించారు. ఈ క్రమంలో లారీ డ్రైవర్ ఉదయం ఇంజిన్ ఆన్చేయగా కాకపోవడంతో అనుమానంతో డీజిల్ చెక్ చేశాడు. ట్యాంక్లో డీజిల్ లేకపోవడంతో రైస్మిల్ యజమాన్యానికి తెలిపాడు. వారు రైస్మిల్ సీసీ కెమెరాలో పరిశీలించగా డీజిల్ దొంగతనం బయటపడింది. డ్రైవర్ శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తక్యూద్దీన్ తెలిపారు. శ్రీకృష్ణుడి విగ్రహం ధ్వంసంభువనగిరి క్రైం : మండలంలోని బస్వాపురం గ్రామం గల శ్రీకృష్ణుడి ఆలయంలోని విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు మంగళవారం ధ్వంసం చేశారు. మద్యం మత్తులో గ్రామస్తుడు చిక్క శేఖర్ అనే వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేశాడని గ్రామస్తులు రూరల్ పోలీ స్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుందని, అతడిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ద్విచక్రవాహనం అపహరణభువనగిరి క్రైం : పట్టణంలోని బస్టాండ్లో గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్రవాహనాన్ని అపహరించారు. వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన కొడారి వెంకటేశ్ మంగళవారం బస్టాండ్కు వచ్చి హైదరాబాద్ స్టాప్ వద్ద తన ద్విచక్రవాహనాన్ని పార్కింగ్ చేసి బస్టాండ్లోకి వెళ్లాడు. తిరిగి వచ్చేలోపు బయ ట ఉన్న ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని దుండగులు అపహరించారు. ఈ మేరకు బాధితుడు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
ఏపీ నుంచి హైదరాబాద్కు తిరుగు పయనం
చౌటుప్పల్ : పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఓటు వేసేందుకుగాను హైదరాబాద్, పరిసర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో ఏపీకి వెళ్లిన ప్రజానీకం మంగళవారం అదే స్థాయిలో తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో రహదారులన్నీ వాహనాలతో భారులుదీరాయి. ఎన్నికల రోజు మధ్యాహ్నం వరకు కూడా ఆంధ్రా వైపుకు వాహనాలు వెళ్లాయి. స్వగ్రామాల్లో ఓటు వేసిన అనంతరం ప్రజలంతా భారీగా తిరుగు ప్రయాణాలు ప్రారంభించారు. దీంతో సోమవారం సాయంత్రం నుంచి హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ప్లాజా పరిసరాలు వాహనాలతో నిండిపోయింది. హైదరాబాద్–విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ -
మామిడికోతలో జాగ్రత్తలు తప్పనిసరి..!
పెద్దవూర : ఈ ఏడాది వాతావరణ మార్పులతో మామిడిలో దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. మామిడి కాయలు ఇప్పుడిప్పుడే పక్వానికి వస్తుండడంతో కోతలు కూడా మొదలుపెట్టారు. అయితే చేతికందిన కాయలు, పండ్లను సరైన పద్ధతుల్లో నిల్వ, రవాణా చేస్తేనే కొంత లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో మామిడి కోతతో పాటు నిల్వ, రవాణా చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మామిడి కాయలు కోత సమయంలో నిర్లక్ష్యం చేసినా అపార నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఈ సమయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే రైతులు నష్టపోవాల్సి వస్తుందని పెద్దవూర మండల ఉద్యానవన శాఖ అధికారి బి.రవినాయక్ సూచిస్తున్నారు. యాజమాన్య పద్ధతులు పాటిస్తే నష్టాలను తగ్గించుకోవచ్చు.. కాయలను సరైన పద్ధతిలో కోయకపోవడం, ముదిరిన కాయలతో పాటుగా, ముదరని కాయలను కోయడం, గ్రేడింగ్, ప్యాకింగ్లో సరైన ప్రమాణాలు పాటించకపోవడం, అపరిశుభ్రత, నిల్వ లోపాల వలన పండ్లు చెడిపోతాయి. సరైన యాజమాన్య పద్ధతులను అనుసరించడంతో ఈ నష్టాలను తగ్గించుకోవచ్చు. నిల్వ, రవాణా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే అధిక లాభాలు పొందవచ్చనని మండల ఉద్యానవన శాఖ అధికారి తెలిపారు. ఎంపికే కీలకం.. ఉదయం 10గంటలోపే కోయాలి తోటల్లో కాయలను సరైన దశలోనే కోయాలి. కాయలకు భుజాలు ఏర్పడి, తొడిమ వద్ద గుంత ఉండడంతో పాటు శ్వేధగ్రంథులు కనిపిస్తుండాలి. కాయ ఆకుపచ్చ రంగు నుంచి బాగా ముదిరిన లేత ఆకుపచ్చ రంగు కలిగిన కాయలనే కోతకు ఎంపిక చేసుకోవాలి. వాటిలోనూ బ్రిక్స్(చక్కెర శాతం) ఉన్న కాయలనే కోయాలి. బ్రిక్స్ మీటర్ ద్వారా బ్రిక్స్ 10–13 ఉన్న కాయలను కోసుకోవాలి. రిఫ్రాక్టో మీటరును ఉపయోగించి కాయల పరిపక్వ దశను సులభంగా గుర్తించవచ్చు. ఇవి రవాణాకు అనుకూలంగా ఉంటాయి. కోత ఉదయం 10 గంటల లోపు లేదంటే సాయంత్రం వేళల్లోనే ఉండాలి. పక్వానికి వచ్చిన కాయలను చిక్కాలను ఉపయోగించి నేలపై పడకుండా కోసుకోవాలి. కాయలకు గాయాలైతే మగ్గబెట్టిన సందర్భంలో శిలీంధ్రాలు ఆశించి కుళ్లిపోయే ప్రమాదం ఉంది. కాయలకు 6నుంచి 7సెంటీమీటర్ల తొడిమ ఉండేటట్లు చూసుకోవాలి. కాయల మీద ఉండే చర్మానికి సొన(జిగురు) అంటకుండా జాగ్రత్త తీసుకోవాలి. కాయ కోసిన తర్వాత తప్పనిసరిగా సొన(జిగురు) పూర్తిగా కారేలా చూడాలి. తర్వాత తొడిమలను 0.5 నుంచి 1 సెంటీమీటర్ వరకు ఉండేలా పదునైన కత్తితో కత్తిరించాలి. వాటిని తలకిందులుగా పెట్టి రెండుమూడు గంటలపాటు కదిలించకుండా ఉంచాలి. అప్పుడే కాయల నుంచి సొన సజావుగా నేల మీదికి కారుతుంది. కోతల సమయంలో కాయలపై చిన్న మచ్చగానీ, దెబ్బగానీ తగలకుండా జాగ్రత్త పడాలి. కోసిన కాయలను మట్టినేలపై ఉంచకూడదు. శుభ్ర పర్చడం చాలా అవసరం.. మామిడి కాయలను శుభ్రపరచడం చాలా అవసరం. 10గ్రాముల డిటర్జెంట్ను 10లీటర్ల నీటికి కలిపిన ద్రావణంలో కడగాలి. తర్వాత 52సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత గల వేడినీటిలో 200 పీపీఎం సోడియం హైపోక్లోరైడ్ కలిపి 2 నుంచి 3నిమిషాల పాటు ఉంచాలి. రవాణా సమయంలో ఆంత్రాక్నోస్, పండు ఈగల ఉధ్రుతి ఎక్కువగా ఉంటుంది. వాటి నివారణకు కాయలను 48+0.3 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగిన నీటిలో గంట సేపు శుద్ధిచేయాలి. కాయలపై ఉన్న తేమ ఆరే వరకు నీడలో ఆరబెట్టాలి. 300–350 గ్రాముల బరువు ఉండేటట్లు గ్రేడింగ్ చేసుకుని, అట్టపెట్టెలలో 10 నుంచి 13 కాయలు అమర్చి ప్యాకింగ్ చేసుకోవాలి. ప్యాంకిగ్ కోసం టెలిస్కోపిక్ కార్గేటెడ్ ఫైబర్ బోర్డు బాక్సులను వాడాలి. వీటిని ఆరుగంటలలోపే ప్యాక్హౌజ్కు తరలించాలి. విదేశాలకు ఎగుమతి చేయాల్సిన పండ్లకు తప్పనిసరిగా ఇర్రాడియేషన్ చేయించాలి. ఒకసారి కోతకు ఉపయోగించిన పనిముట్లను మళ్లీ వాడాల్సి వస్తే వాటిని తప్పనిసరిగా శుభ్రం చేయాలి. ఇథిలిన్తో మాగించాలి.. మామిడి కాయలను వ్యాపారులు కార్బైడ్ అనే రసాయనాన్ని ఉపయోగించి కృత్రిమంగా మాగిస్తున్నారు. దీని వలన కాయ మంచి రంగు వస్తుంది కాని రుచి ఉండదు. పైగా అనారోగ్యానికి కారణమవుతోంది. రైతులు, వ్యాపారులు కార్భైడ్తో మాగించడానికి స్వస్తి పలికి ఆరోగ్యవంతమైన పద్ధతుల ద్వారా మాగించాలి. అప్పడే రుచి, శుచి లభిస్తాయి. ఈ రెండు ఉంటే మంచి ధర లభిస్తుంది. ఇథిలిన్తో మామిడని మాగించడం అన్ని విధాలా మంచిది. ఇథిలిన్ అనేది గ్రోత్ హార్మోన్.. ఇది అన్నిచోట్ల లభ్యమవుతుంది. 10 లీటర్ల నీటికి ఒక మిల్లీలీటర్ ఇథిలిన్ కలిపిన ద్రావణంలో మామిడి కాయలను ముంచి నీడలో ఆరబెట్టిన తర్వాత గదిలో మామిడిని పోసి వరిగడ్డి కప్పితే 14గంటల్లోనే మంచి రంగు, సువాసన వస్తుంది. ఇలా మామిడిని మాగించడం అన్ని విధాలా అరోగ్యదాయకం.పురుగు మందులను పిచికారీ చేయరాదునిషేధించిన పురుగు మందులను కాయలపై పిచికారీ చేయకూడదు. వీలైనంత వరకు సేంద్రియ పురుగు మందులను మాత్రమే వాడాలి. కోత తరువాత వచ్చే తెగుళ్ల నివారణకు తోటలో ముందు నుంచే మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. తోటలో కలుపు లేకుండా శుభ్రం చేసుకోవాలి. కాయలు చిన్నసైజులో ఉన్నప్పుడు, తిరిగి కాయ కోతకు ముందు లీటరు నీటికి ఒక గ్రాము కార్భండిజమ్ లేదా థయోఫానేట్ మిథైల్ కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. కాత దశలో మూడుసార్లు ఇలా పిచికారీ చేస్తే కాయలపై చీడల బెడద తగ్గుతుంది. కాయలు కుళ్లిపోకుండా ఉంటాయి. కాయలపై సొన కారకుండా చూడాలి ఉదయం 10గంటలోపే కోతకోయాలి సరైన జాగ్రత్తలు పాటించకపోతే నష్టపోవాల్సి వస్తుంది ఉద్యానవన శాఖ అధికారి బి.రవినాయక్ -
రైలు నుంచి జారిపడి మహిళ మృతి
భువనగిరి క్రైం : రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగిరెడ్డిపల్లి–బొమ్మాయిపల్లి రైల్వేస్టేషన్ల మధ్యన 13/18–19 మైలురాయి వద్ద సుమారు 40 సంవత్సరాల గల గుర్తు తెలియని మహిళ రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు తెలిపారు. మృతిరాలి ఒంటిపై ఎరుపు, నలుపు రంగు చీర, ఎరుపు, నలుపు రంగు గీతల జాకెట్ ధరించి ఉంది. మహిళ మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు. మహిళ ఆచూకీ కోసం 8712568454ను సంప్రదించాలని కోరారు. -
పిడుగుపాటుతో యువకుడు మృతి
త్రిపురారం : పిడుగుపాటుతో ఓ యువకుడు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన త్రిపురారం మండలంలోని నీలాయిగూడెం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలంలోని వెలుగుపల్లికి చెందిన మర్రి రిషి (20) బీటెక్ చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో త్రిపురారం మండలంలోని నీలాయిగూడెంలో ఉంటున్న రిషి మేనమామ గుండెబోయిన నాగయ్య ఇంటికి వెళ్లాడు. సాయంత్రం గ్రామంలోని కొంత మంది యువకులతో కలిసి సమీపంలో ఉన్న పొలాల్లో క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. కొద్దిసేపటికి గాలి దుమారం, మెరుపులతో కూడిన వర్షం వస్తుండడంతో పక్కనే ఉన్న తాటిచెట్టు కిందికి వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడింది. దీంతో మర్రి రిషి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మిర్యాలగూడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సరదాగా వేసవి సెలవులు గడుపుదామని వచ్చిన యువకుడు పిడుగుపాటుతో మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరో ఇద్దరికి గాయాలు -
ట్రాక్టర్ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు
నల్లగొండ క్రైం : మట్టిలోడ్తో వెళ్తున్న ఓ ట్రాక్టర్ను అతివేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనుక నుంచి ఢీకొటింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ముక్కలుగా విడిపోగా డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన నల్లగొండ పట్టణ సమీపంలోని అద్దంకి–నార్కట్పల్లి రహదారిలో ఆర్జాలబావి వద్ద మంగళవారం చోటు చేసుకుంది. నల్లగొండ రూరల్ ఎస్ఐ శివశంకర్ తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్న మార్నింగ్ స్టార్ ట్రావెల్ బస్సును డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడిపి పానగల్ వైపు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఫరంగి మహేష్(24) తన సీట్లో నుంచి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ తునాతునకలై కొన్ని ఇనుపరాడ్లు మహేష్ కడుపులో గుచ్చుకోవడంతో పేగులు బయటపడి తీవ్రగాయాల పాలయ్యాడు. గమనించిన స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స అందేలోగా మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ మహేష్ స్వగ్రామం పెద్దవూర మండలం లింగంపల్లి, అతడు జీవనోపాధి కోసం నల్లగొండలోని పాతబస్తి హనుమాన్నగర్లో భార్యతో ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడికి ఏడాది లోపు పాప ఉంది. మృతుడి భార్య వర్ష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ తెలిపారు. ముక్కలైన ట్రాక్టర్.. డ్రైవర్ మృతి అద్దంకి–నార్కట్పల్లి రహదారిలో ఘటన మృతుడు పెద్దవూర మండలం లింగంపల్లి గ్రామ వాసి -
సీబీఎస్ఈ ఫలితాల్లో ‘నవోదయ’ జయకేతనం
పెద్దవూర : మండలంలోని చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులు సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) ప్రకటించిన పది, పన్నెండు తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చినట్లు ప్రిన్సిపల్ ఆర్.నాగభూషణం మంగళవారం తెలిపారు. పదోతరగతిలో 80మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 80 మంది ఉత్తీర్ణత సాధించి వందశాతం ఫలితాలు సాధించినట్లు తెలిపారు. వారిలో 68 మంది విద్యార్థులు డిస్టింక్షన్లో, 8మంది ప్రథమ శ్రేణిలో, 4గురు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్థులైనట్లు వెల్లడించారు. పదోతరగతిలో కుర్ర కృష్ణప్రసాద్ 500మార్కులకు గాను 485మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, పంతంగి అఖిలేష్ 479 మార్కులతో ద్వి తీయ స్థానంలో, బుర్ర శిశిర 477మార్కులు సాధించి తృతీయ స్థానంలోనూ నిలిచినట్లు తెలిపారు. కుర్ర కృష్ణప్రసాద్, బెండల రాంచరణ్తేజ్ తెలుగులో వంద మార్కులు సాధించినట్లు తెలిపారు. పన్నెండో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత..పన్నెండో తరగతిలో 28మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 28 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వారిలో 19మంది విద్యార్థులు డిస్టింక్షన్లోనూ, 9 మంది ప్రథమ శ్రేణిలోనూ ఉత్తీర్థత సాధించినట్లు పేర్కొన్నారు. పన్నెండో తరగతిలో అలేటి స్టాలిన్ 500మార్కులకు గాను 455మార్కులతో ప్రథమ స్థానం, రమావత్ మహేందర్ 448మార్కులతో ద్వితీయ, ఎల్క కౌశిక్ 425మార్కులతో తృతీయ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. పది, పన్నెండు తరగతుల్లో వందశాతం ఉత్తీర్ణత -
పెరుగు ప్యాకెట్కు వెళ్లి..
● బస్సు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయిన ఒడిషా యువకుడు ● తూప్రాన్పేట శివారులో ఘటన చౌటుప్పల్ : తెచ్చుకున్న సరుకులోని పెరుగు ప్యాకెట్ రోడ్డుపై పడిపోవడంతో దానిని తీసుకొచ్చేందుకు వెళ్లిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని తప్రాన్పేట శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తూప్రాన్పేట గ్రామశివారులో ఆగస్థ్య ఆగ్రో లిమిటెడ్ కంపెనీలో ఒడిషా రాష్ట్రంలోని రాయఘడ్ జిల్లాకు చెందిన నికోలస్ సభర్(28)తో పాటు రుమీల్ సభర్, రాహుల్ సభర్, సిభాలు కొంతకాలంగా పనిచేస్తున్నారు. అందరూ కలిసి స్థానికంగానే నివాసం ఉంటున్నారు. సొంతంగా వంట చేసుకునే ఈ నలుగురు మంగళవారం ఉదయం 8గంటల ప్రాంతంలో సమీపంలోని కొత్తగూడకు వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకున్నారు. కంపెనీ ఎదురుగా జాతీయ రహదారిని దాటారు. అదే సమయంలో తమ వెంట తెచ్చుకున్న సరుకుల సంచిలో నుంచి ఓ పెరుగు ప్యాకెట్ రోడ్డుపై పడిపోవడాన్ని వారు గుర్తించారు. వెంటనే నికోలస్ సభర్ అనే యువకుడు పడిపోయిన పెరుగు ప్యాకెట్ కోసం మళ్లీ రోడ్డు దాటుకుంటూ వెళ్లాడు. పెరుగు ప్యాకెట్ తీసుకొని అక్కడే రోడ్డు దాటుతుండగా హైదరాబాద్కు రాంగ్రూట్లో వెళ్తున్న టీఎస్08 యూబీ 8184 గల ప్రైవేట్ ట్రావెల్ బస్సు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్నేహితులు చికిత్స నిమిత్తం అబ్దుల్లాపూర్మెట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కళ్ల ఎదుటే స్నేహితుడు రో డ్డు ప్రమాదానికి గురై మృతిచెందడంతో సహచరులు బోరున విలపించారు. అజాగ్రత్తగా, అతివేగంగా బస్సును నడిపిన బస్సు డ్రైవర్ మేలేని యాదగి రిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్రెడ్డి తెలిపారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని లారీ డ్రైవర్ దుర్మరణం
మాడుగులపల్లి : ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కుక్కడం గ్రామశివారులో అద్దంకి– నార్కట్పల్లి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాకు చెందిన లారీడ్రైవర్ గంధం ప్రసన్నతేజ చైన్నె నుంచి మెంతుల లోడు లారీతో మహారాష్ట్రకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కుక్కడం శివారుకు రాగానే లారీని రోడ్డు పక్కకు నిలుపుతుండగా పక్క నుంచి వేగంగా వచ్చిన ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రసన్నతేజ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు చిలకలూరిపేట ఆర్టీసీ డిపోకు చెందినదిగా తెలిసింది. అతివేగం, నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శోభన్బాబు తెలిపారు. -
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది
నల్లగొండ : నల్లగొండ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఆయన మాట్లాడారు. ఎన్నికల్లో తన గెలుపుకోసం జిల్లా మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రులు రాంరెడ్డి దామోదర్రెడ్డి, జానారెడ్డిలతో పాటు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా ఎంతో పని చేశారని.. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్.. తనను డ్రగ్ వ్యాపారి అంటూ ఎన్నికల్లో ఆరోపించారని ఈ విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందనే బాధలో ఇతరులపై ఆరోపణలు చేస్తోందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, జూలకంటి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ కాంగ్రెస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి -
వ్యవసాయ మోటార్ల చోరీ
మఠంపల్లి : వరిపొలాల సాగుకు పలువురు రైతులు చెరువులో ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ విద్యుత్ మోటార్లను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. మంగళవారం బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని యాతవాక్లిళ గ్రామం సమీపంలోని చీపురేణికుంటపై వరిసాగు కోసం ఏర్పాటు చేసుకున్న తొమ్మిది వ్యవసాయ విద్యుత్ మోటార్లను రెండురోజుల కిత్రం గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారని బాధిత రైతులు పాల్వాయి సైదయ్య, బానోతు పంతులనాయక్, ఎల్లావుల శివశంకర్, మల్లెబోయిన వీరబాబు, పులి కోటయ్య, సాముల నాగిరెడ్డి, మాళోతు సోమ్లానాయక్ వాపోయారు. సోమవారం రాత్రి మోటార్లను చోరీ చేశారని తెలిపారు. -
కాన్పుకెళ్తే కోతే..!
సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యమివ్వాలి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకే అధిక ప్రాధాన్యమివ్వాలి. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు ఆదేశాలిచ్చాం. అయినా అనేక ఆస్పత్రుల్లో వైద్యుల తీరు మారలేదు. అత్యవసరమైతేనే సిజేరియన్ పోవాల్సి ఉంటుంది. దీనిపై జిల్లా వ్యాప్తంగా నిఘా ఏర్పాటు చేశాం.నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్ ప్రాధాన్యమిస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే అనుమతులను రద్దు చేస్తాం. – డాక్టర్ అనిమళ్ల కొండల్రావు, డీఎంహెచ్ఓ నల్లగొండ టౌన్ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యుల తీరు మారడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు కేవలం డబ్బు సంపాదించడమే లక్ష్యంగా.. ప్రజల అమాకత్వాన్ని ఆసరాగా తీసుకుని రూ.కోట్ల కొల్లగొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ ప్రసవాలకే అధిక ప్రాధాన్యమివ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నా వారి తీరులో మార్పు రావడం లేదు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు కేవలం సిజేరియన్కే అధిక ప్రాధాన్యమిస్తూ ప్రజలు జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కేవలం డబ్బుల కోసమే సిజేరియన్ను చేస్తూ లక్షలాది రూపాయలను ఫీజుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉండడంతో పాటు సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యమిస్తుండడంతో చాలా మంది ప్రసవాల కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవాల కోసం చేరుతున్న వారి సంఖ్య బాగా తగ్గింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు వచ్చిన వారిలో 80 శాతం మందికి సిజేరియన్ చేస్తూ.. కేవలం 20 శాతం మందికి మాత్రమే సాధారణ ప్రసవాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇక, మరికొన్ని ఆస్పత్రులైతే కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా నూటికి నూరుశాతం సిజేరియన్లు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, అధునిక వైద్య పరికరాలు సమకూర్చడంతో పాటుగా ఎంసీహెచ్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు అందిస్తోంది. దాంతో పాటు ఆశ వర్కర్లు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు.. గర్భిణులు ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులు చేయించుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. 102 వాహనాల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకుపోయి కాన్పు తరువాత తల్లీబిడ్డను క్షేమంగా ఇంటికి వద్ద వదిలి వస్తున్నారు. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు తల్లుల బ్యాంకు ఖాతాల్లో చేస్తున్నారు. కానీ, కొందరు గర్భిణులు మాత్రం మూఢనమ్మకాలు, పుట్టిన రోజు ఘడియలు, పురిటినొప్పులు భయంతో సిజేరియన్లు చేయించుకుంటున్నారు. వారి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు ఎక్కువ శాతం సిజేరియన్లు చేస్తూ అమాయకుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటే తప్ప సాధారణ ప్రసవాలు పెరిగే అవకాశం ఉండదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఫ సిజేరియన్కే ప్రాధాన్యమిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు ఫ నార్మల్ డెలివరీలకు అవకాశం ఉన్నా పట్టించుకోని తీరు ఫ కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు ప్రైవేట్ వైద్యులు 2023 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రసవాలు ఇలా..ఆస్పత్రులు సాధారణ సిజేరియన్ మొత్తం ప్రభుత్వ 6,424 6,647 13,073 ప్రైవేట్ 1,813 7,890 9,703 -
క్షేత్రపాలకుడికి ఆకుపూజ
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం ఆంజనేయస్వామికి అర్చకులు ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. అంజనీపుత్రుడికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా కొనసాగించారు. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు నిర్వహించారు. -
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నల్లగొండ పబ్లిక్ స్కూల్లోని పోలింగ్ స్టేషన్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కోదాడలోని నయానగర్ పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర పౌర సరఫరాలు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, ఆయన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నల్లగొండలోని ఎన్జీ కాలనీ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి నాగార్జునసాగర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపుడి సైదిరెడ్డి తన తల్లితో కలిసి హుజూర్నగర్లో ఓటు వేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి చిట్యాల మండలం ఉరుమడ్లలో ఓటు హక్కు వేశారు. కలెక్టర్ దాసరి హరిచందన నల్లగొండలోని చెన్నకేశవ మోడల్ స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
ఈవీఎంలు మొరాయించిన ప్రాంతాలు ఇవే..
● కోదాడ నియోజకవర్గంలోని మునగాల మండలం 74వ పోలింగ్ కేంద్రంలో మాక్ పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎం మొరాయించింది. దీంతో అరగంటపాటు పోలింగ్ ఆగిపోయింది. తరువాత సరిచేయడంతో పోలింగ్ కొనసాగింది. మునగాల మండలంలోని 81వ బూత్లో కూడా ఈవీఎం మొరాయించడంతో కాసేపు పోలింగ్ ఆగిపోయింది. ● సాగర్ నియోజకవర్గంలోని హాలియాలోని 162వ పోలింగ్ స్టేషన్లో ఉదయం 7.30 గంటలకు ఈవీఎం కొద్దిసేపు మొరాయించింది. దీంతో ఈవీఎంను మార్చేసి పోలింగ్ను కొనసాగించారు. పెద్దవూరలోని 81వ పోలింగ్ స్టేషన్లో ఈవీఎం మొరాయించడంతో 20 నిమిషాల పాటు పోలింగ్ నిలిచిపోయింది. నిడమనూరు మండలం బంకాపురంలో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ అరగంట పాటు ఆలస్యమైంది. ● దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలం కుర్మేడులోని 11వ బూత్లో వీవీ ప్యాట్ పనిచేయకపోవడంతో దానిని మార్చారు. ● హుజూర్నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలం వజినేపల్లిలో ఈవీఎం మొరాయించడంతో కొద్దిసేపు పోలింగ్ ఆగిపోయింది. చింతలపాలెం, నక్కగూడెం గ్రామాల్లో వీవీ ప్యాట్స్ పనిచేయకపోవడంతో వాటిస్థానంలో కొత్తవి అమర్చారు. ● మిర్యాలగూడ మండలం జైత్యతండాలో ఈవీఎం నిర్వహణపై అవగాహన లేకపోవడంతో పోలింగ్ ఆరగంట పాటు నిలిచిపోయింది. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో సెక్టోరియల్ అధికారి వచ్చి దాన్ని ప్రారంభించడంతో పోలింగ్ కొనసాగింది. ● సూర్యాపేట మండలం పిల్లలమర్రిలోని 21వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం కాసేపు మోరాయించింది. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో టెక్నికల్ సిబ్బంది వచ్చి సరిచేశారు. ● పెన్పహాడ్ మండలం జలమాలకుంటతండా పోలింగ్ స్టేషన్లో వీవీ ప్యాట్ పనిచేయలేదు. దీంతో పోలింగ్ కొద్దిసేపు ఆగింది. అధికారులకు సమాచారం ఇవ్వడంతో దాని మరొకటి ఏర్పాటు చేశారు. -
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలి
ఫ కలెక్టర్ హరిచందన నల్లగొండ : ఈవీఎంలను భద్రపరిచే గోదాంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిచందన సూచించారు. సోమవారం నల్లగొండ సమీపంలోని అనిశెట్టిదుప్పలపల్లి వద్ద ఉన్న గోదాముల్లోని కౌంటింగ్ కేంద్రాన్ని, స్ట్రాంగ్ రూమ్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల ఆవరణ మొత్తం లైటింగ్ ఏర్పాటు చేయాలని, పోలీస్ సెక్యూరిటీకి అవసరమైన వసతి కల్పించాలని ఆదేశించారు. వర్షం వచ్చినా ఇబ్బంది కాకుండా అవసరమైన టార్పాలిన్లు సిద్ధం చేయాలన్నారు. ఈవీఎంలను స్వీకరించే సమయంలో సిబ్బంది, సెక్టోరల్ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆమె వెంట పంచాయతీరాజ్ ఈఈ భూమన్న, అధికారులు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం ఫ ఎస్పీ చందనాదీప్తి నల్లగొండ క్రైం : జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా.. ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. సోమవారం పలు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ తీరును ఆమె పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి.. ఎన్నికల నిర్వహణ, పోలింగ్ తరువాత ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలింపుపై పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రం సమీపంలో అనిశెట్టిదుప్పలపల్లి గోదాముల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహా శివుడికి పూజలు యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ఆధ్యాత్మిక పర్వాలు కొనసాగాయి. కొండపైన ఉన్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చన పూజలు నిర్వహించారు. మహాశివుడికి ఇష్టమైన రోజు కావడంతో అభిషేక పూజలు చేపట్టారు. ఇక ప్రధానాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు సంప్రదాయ పూజలు కొనసాగాయి. ఇక ఆలయ ముండపం, ప్రాకార మండపంలో నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, జోడు సేవోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. -
నారసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేవకుజామున ఆలయాన్ని తెరిచిన.. ఆచార్యులు సుప్రఽభాత సేవ, ఆరాధన.. అనంతరం నిజాభిషేకం, అర్చన చేశారు. ఇర ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు గావించారు. సాయంత్రం ఆలయంలో శ్రీస్వామి, అమ్మవారి జోడు సేవను ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలు శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో జగద్గురు శ్రీ ఆదిశంకరచార్యుల జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపించారు. ఈ వేడుకలో ఆలయ ఈఓ భాస్కర్రావు, డీఈఓ దోర్బల భాస్కర్శర్మ, అర్చకులు, పారాయణీకులు, రుత్వికులు పాల్గొన్నారు. -
పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
నల్లగొండ క్రైం : లోక్సభ ఎన్నికలు పోలింగ్ సందర్భంగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. ఆదివారం నల్లగొండ ఎన్జీ కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పోలీస్ సిబ్బంది, పారామిలరటీ బలగాలకు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. భద్రతా సిబ్బంది ఓటర్లు క్యూ పద్ధతి పాటించేలా చూడాలన్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా పని చేయాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రాలను వదిలి వెళ్లవద్దని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని.. ఐదురుగు కంటే ఎక్కువ మంది కలిసి తిరగొద్దని పేర్కొన్నారు. ఓటర్లకు డబ్బు, మద్యం వస్తువులు పంచితే వెంటనే సీ విజిల్ యాప్లో అప్ లోడ్ చేయడం లేదా డయల్ 100కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఫ ఎస్పీ చందనాదీప్తి -
ఓట్ల లెక్కింపు కేంద్రం పరిశీలన
నల్లగొండ : నల్లగొండ పట్టణ సమీపంలోని అనిశెట్టిదుప్పలపల్లి వద్ద ఉన్న గోదాంలో ఏర్పాటు చేసిన పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్ దాసరి హరిచందన ఆదివారం పరిశీలించారు. ఓట్ల లెక్కింపుకు ఏర్పాటు చేసే టేబుళ్లు, బ్యారీకేడ్లు, ఏజెంట్లు బ్యారీకేడ్లు, భద్రత, సౌకర్యాలను పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు రెండు రోజుల ముందు నుంచి కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు, రిటర్నింగ్ అధికారితో పాటు, సహాయ రిటర్నింగ్ అధికారులు అందరూ అక్కడే బస చేసేందుకు వసతి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ డి.రాజ్యలక్ష్మి, డీఆర్డీఓ నాగిరెడ్డి, నల్లగొండ ఆర్డీఓ రవికుమార్, పంచాయతీ రాజ్ ఈఈ భూమన్న పాల్గొన్నారు. కంట్రోల్ రూమ్నుంచి పోలింగ్ను పర్యవేక్షించాలి నల్లగొండ : పోలింగ్ సవ్యంగా జరిగేలా అధికారులు కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిచందన ఆదేశించారు. ఆమె కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను ఆమె పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు వివిధ రకాల కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. అధికారులకు వారికి కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈవీఎంల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రెండు గంటలకోసారి వచ్చే పోలింగ్ శాతం వివరాలను అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, సెక్టార్ల వారీగా సేకరించి కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ శాతాన్ని రూపొందించాలని వివరించారు. 13వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి అన్ని రూట్లు ట్రాక్ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి.రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
లౌకికవాదాన్ని బలపర్చాలి
మిర్యాలగూడ : ఈ ఎన్నికలపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని.. లౌకికవాదాన్ని బలపరిచేందుకు ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో యువత, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. పదేండ్ల కాలంలో మోదీ ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నకరంగా మార్చిందని, మతం పేరిట ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టించి రాజకీయంగా లబ్ధిపొందాలని చూసిందన్నారు. దేశ ప్రజల సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టిన మోదీ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో ఓడించాలన్నారు. లౌకికవాదాన్ని బలపరిచేందుకు ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రాగిరెడ్డి మంగారెడ్డి, తిరుపతి రామ్మూర్తి, పగిడోజు రామ్మూర్తి, కోటిరెడ్డి, ముత్యాల లక్ష్మీనారాయణ, సోమయ్య, వెంకట్రెడ్డి, బాషా తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
మళ్లీ భానుడి ప్రతాపం
నల్లగొండ టౌన్ : జిల్లాలో భానుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. సగటు ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. ఆదివారం అధికంగా మాడ్గులపల్లిలో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గి జనం కొంత ఉపశమనం పొందగా.. ఇప్పుడు మళ్లీ ఎండలు పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఎండకు తోడు ఉక్కపోత పెరగడంతో తల్లడిల్లుతున్నారు. ఆదివారం నిడమనూరు, అనుముల మండలం ఇబ్రహీంపేట, త్రిపురారం మండలం మాటూరులో 41 డిగ్రీలకు పైగా నమోదుకాగా.. నాంపల్లి మండలం మెడ్లబావి, కట్టంగూర్, తిప్పర్తి మండలం పజ్జూర్, దామరచర్ల మండలం తిమ్మాపూర్, గుండ్లపల్లి మండలం ఎర్రారం, మిర్యాలగూడ మండలం టీక్యాతండా, నాంపల్లి, తిరుమలగిరి సాగర్, నేరడుగొమ్మ, త్రిపురారం, కామారెడ్డిగూడెం, గట్టుప్పల్ మండలం శివన్నగూడెం, చందంపేట మండలం తెల్దేవర్పల్లి, మిర్యాలగూడ మండలం తడకమళ్లలో40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని 22 ప్రాంతాల్లో 39 డిగ్రీలకు పైగా.. ఆరు ప్రాంతాలలో 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా మర్రిగూడ, చింతపల్లిలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఫ అత్యధికంగా మాడ్గులపల్లిలో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు -
ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటు వేయొచ్చు
భువనగిరి: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితాలో పేరున్న ప్రతిఒక్కరికి ఓటు వేసే హక్కు ఉంది. అయితే ఓటరు జాబితాలో ఉన్న వ్యక్తిని తానేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం ఎన్నికల సంఘం ఓటు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఓటరు గుర్తింపుకార్డు అందజేస్తుంది. దానితో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయవచ్చ్చు. ఒకవేళ ఓటరు గుర్తింపు కార్డులేని వారు ప్రత్యామ్నాయంగా పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, ఆధార్కార్డు, ఫొటోతో ఉన్న బ్యాంక్ పాస్పుస్తకం, ఉపాధి హామీ పథకం జాబ్కార్డు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చిన అధికారిక గుర్తింపుకార్డులు, ఫొటోతో ఉన్న పింఛన్ పత్రం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన ఉద్యోగ గుర్తింపు కార్డు, దివ్యాంగుల గుర్తింపు కార్డు చూపించి ఓటు వేయవచ్చు. -
నివేదికలు సకాలంలో అందజేయాలి
సాక్షి,యాదాద్రి: లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉంటూ టర్నవుట్ నివేదికలను సకాలంలో అందజేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జండగే ఆదేశించారు. ఆదివారం ఆయన సంబంధిత నోడల్ అధికారులతో సమావేశం అయ్యారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అనెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పోలింగ్ సరళి, ఓటరు టర్నవుట్, ఈవీఎంల రీప్లేస్మెంట్, పరిశీలకుల టీం రిపోర్డులను సేకరించాలని, ఓటింగ్ శాతం వివరాలు పక్కాగా నమోదు చేసి ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. పక్కాగా నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, నోడల్ అధికారులు వెంకటేశ్వర్లు, సునంద, సాహితీ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్లు నాగేశ్వరాచారి, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్రగాయాలు
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ రైల్వేస్టేషన్లో విశాఖ ఎక్స్ప్రెస్ రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిషా రాష్ట్రానికి చెందిన శంకర్జైన్ మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంలోని ఓ రైస్ మిల్లులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి శంకర్జైన్ తన స్వగ్రామం వెళ్లేందుకు విశాఖ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కుతున్న క్రమంలో జారి పడి ప్లాట్ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయాడు. దీంతో రెండు కాళ్లు విరిగి తీవ్రగాయాల పాలయ్యాడు. రైల్వే సిబ్బంది అప్రమత్తమై అతడిని 108లో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం నల్లగొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' సీజన్ 2 ట్రైలర్ రిలీజ్
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్’ కథ రాశా: డైరెక్టర్ కృష్ణమాచారి
లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
రైతుల కష్టాలు రేవంత్కు కనిపించడం లేదా?: కేటీఆర్
నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
'అత్తమ్మాస్ కిచెన్'పై విమర్శలు.. వివరణ ఇచ్చిన టీమ్
ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్
ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు.. అక్కడే అత్యధికం: ఎంకే మీనా
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ‘మృతి చెందిన యువతికి వరుడు కావలెను’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- 4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
- పరిచయం పెంచుకొని.. పాపను విడిచి
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
Advertisement