ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటు వేయొచ్చు | Sakshi
Sakshi News home page

ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటు వేయొచ్చు

Published Tue, May 14 2024 8:05 AM

-

భువనగిరి: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితాలో పేరున్న ప్రతిఒక్కరికి ఓటు వేసే హక్కు ఉంది. అయితే ఓటరు జాబితాలో ఉన్న వ్యక్తిని తానేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం ఎన్నికల సంఘం ఓటు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఓటరు గుర్తింపుకార్డు అందజేస్తుంది. దానితో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేయవచ్చ్చు. ఒకవేళ ఓటరు గుర్తింపు కార్డులేని వారు ప్రత్యామ్నాయంగా పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఫొటోతో ఉన్న బ్యాంక్‌ పాస్‌పుస్తకం, ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌ కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చిన అధికారిక గుర్తింపుకార్డులు, ఫొటోతో ఉన్న పింఛన్‌ పత్రం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన ఉద్యోగ గుర్తింపు కార్డు, దివ్యాంగుల గుర్తింపు కార్డు చూపించి ఓటు వేయవచ్చు.

Advertisement
 
Advertisement
 
Advertisement