రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్రగాయాలు | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్రగాయాలు

Published Tue, May 14 2024 7:55 AM

-

మిర్యాలగూడ అర్బన్‌: మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌లో విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిషా రాష్ట్రానికి చెందిన శంకర్‌జైన్‌ మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంలోని ఓ రైస్‌ మిల్లులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి శంకర్‌జైన్‌ తన స్వగ్రామం వెళ్లేందుకు విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కుతున్న క్రమంలో జారి పడి ప్లాట్‌ఫామ్‌ మధ్యలో ఇరుక్కుపోయాడు. దీంతో రెండు కాళ్లు విరిగి తీవ్రగాయాల పాలయ్యాడు. రైల్వే సిబ్బంది అప్రమత్తమై అతడిని 108లో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం నల్లగొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement