నివేదికలు సకాలంలో అందజేయాలి | Sakshi
Sakshi News home page

నివేదికలు సకాలంలో అందజేయాలి

Published Tue, May 14 2024 7:55 AM

-

సాక్షి,యాదాద్రి: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉంటూ టర్నవుట్‌ నివేదికలను సకాలంలో అందజేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హనుమంతు కే.జండగే ఆదేశించారు. ఆదివారం ఆయన సంబంధిత నోడల్‌ అధికారులతో సమావేశం అయ్యారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అనెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పోలింగ్‌ సరళి, ఓటరు టర్నవుట్‌, ఈవీఎంల రీప్లేస్‌మెంట్‌, పరిశీలకుల టీం రిపోర్డులను సేకరించాలని, ఓటింగ్‌ శాతం వివరాలు పక్కాగా నమోదు చేసి ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. పక్కాగా నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌, నోడల్‌ అధికారులు వెంకటేశ్వర్లు, సునంద, సాహితీ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్లు నాగేశ్వరాచారి, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement