-
రాజకీయ కక్షతో విజయవాడ సీపీపై బదిలీ వేటు
సాక్షి, విజయవాడ: రాజకీయ కక్షతోనే విజయవాడ సీపీపై బదిలీ వేటు పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును విజయవాడ సీపీ కాంతిరాణా దర్యాప్తు చేస్తున్నారు. అయితే విచారణ చేస్తున్న కాంతిరాణాపై కక్షతో టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఐపీఎస్ అధికారులపై తప్పుడు ఫిర్యాదులతో కూటమి బ్లాక్మెయిల్ చేసింది. ఈ క్రమంలో ష్ట్రంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీని బదిలీ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సీఎం జగన్పై హత్యాయత్నం కేసులో ఇప్పటికే వేముల సతీష్ అరెస్టయ్యారు. టీడీపీ నేత బోండా ఉమకు వేముల సతీష్అనుచరుడిగా ఉన్నారు. విచారణ కీలక దశలో ఉండగా సీపీ కాంతిరాణా బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. -
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బిగ్ ట్విస్ట్..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన కేసులపై విచారణ జరుపుతున్న రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జడ్జి ఎంకే నాగ్పాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో న్యాయమూర్తి కావేరీ బవేజా నియమితులయ్యారు. ఇక నుంచి ఢిల్లీ లిక్కర్ కేసును కావేరి భావేజా విచారించనున్నారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఢిల్లీ హయ్యర్ జ్యూడీషియల్ సర్వీసెస్కు చెందిన మరో 27 మంది న్యాయమూర్తులను(నాగ్పాల్తో సహా) ఢిల్లీ హైకోర్టు బదిలీ చేసింది. మరోవైపు ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీసెస్ (డీజేఎస్)కి చెందిన 31 మంది న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు. కాగా జస్టిస్ నాగ్పాల్మద్యం పాలసీ కేసును ప్రారంభం నుంచి విచారిస్తున్నారు. నాగ్పాల్ ఇక నుంచి ఢిల్లీ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వంటి పలువురు ప్రముఖులు అరెస్టయ్యారు. సిసోడియా, సింగ్ జ్యూడీషియల్ కస్టడీలో ఉండగా.. కవిత ఈడీ రిమాండ్లో ఉన్నారు. చదవండి: MLC Kavitha: మూడో రోజు ఈడీ విచారణ -
హర్యానా ఘర్షణల ఎఫెక్ట్.. నూహ్ ఎస్పీపై వేటు
చండీగఢ్: హర్యానాలో నెలకొన్న హింస ఎఫెక్ట్తో నూహ్ జిల్లా ఎస్పీపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నూహ్ కేంద్రంగా మత ఘర్షణలు చెలరేగిన సోమవారం రోజు సెలవులో ఉన్న ఎస్పీ వరుణ్ సింగ్లాపై బదిలీ వేటు వేసింది. జిల్లా కొత్త ఎస్పీగా ఐపీఎస్ నరేంద్ర బిజర్నియా నియమిస్తూ హర్యానా హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నూహ్ జిల్లా ఎస్పీ వరుణ్ సింగ్లా అల్లర్లు చెలరేగే ముందు రోజే సెలవులపై వెళ్లారు. దీంతొ ఘర్షణలు మొదలైన సోమవారం నుంచి నూహ్ తాత్కాలిక ఎస్పీగా ఐపీఎస్ అధికారి నరేంద్ర బిజర్నియా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన గతంలో 2020 ఫిబ్రవరి నుంచి 2021 అక్టోబర్ వరకు నూహ్ జిల్లాలో పోలీస్ బలగాలకు అధిపతిగా ఉన్నారు. తాజాగా వరుణ్ సింగ్లా 160 కిలోమీటర్ల దూరంలోని బివానీ జిల్లాకు ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యారు. సింగ్లా స్థానంలో నూహ్ శాశ్వత ఎస్పీగా శుక్రవారం నరేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు హర్యానా ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ మత ఘర్షణలకు కారణమైన వారిని విడిచిపెట్టబోమని, రాష్ట్రంలో పరిస్థితి వేగంగా సాధారణ స్థితికి వస్తోందని పేర్కొన్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కేంద్రాన్ని త్వరలో నుహ్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చదవండి: 8 ఫోర్లు జారిపడ్డ లిఫ్ట్.. గుండెపోటుతో మహిళ మృతి #WATCH | Security deployed outside Jama Masjid, Sadar Bazar in Haryana's Gurugram ahead of Friday prayers pic.twitter.com/V3sSwwAlma — ANI (@ANI) August 4, 2023 కాగా సోమవారం వీహెచ్పీ, బజరంగ్దళ్ చేపట్టిన మతపరమైన ఊరేగింపు రాజుకున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు ఆరుగురు మత్యువాత పడ్డారు. ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి. పలు వాహనాలు, మత ప్రార్థన స్థలాలు, రెస్టారెంట్లు, దుకాణలను అల్లరిమూకలు తగలబెట్టాయి. నూహ్లోని రెండు మసీదులకు గురువారం దుండగులు నిప్పటించారు. దీంతో నుహ్, గురుగ్రామ్ ప్రాంతాల్లో నిషేధ ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. హింస కారణంగా 176 మందిని అరెస్ట్ చేశారు90 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. VIDEO | Police personnel continue to remain deployed in parts of Gurugram in the aftermath of violence that broke out earlier this week. pic.twitter.com/1H6fHEmWlP — Press Trust of India (@PTI_News) August 4, 2023 నుహ్, ఫరీదాబాద్, పల్వాల్ జిల్లాలో అలాగే గురుగ్రామ్లోని మూడు సబ్ డివిజన్లు( సోహ్నా, పటౌడీ ,మనేసర్) ఆగస్టు 5 వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అయతితే నేడు నూహ్లో నేడు(శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటలకు వరకు కర్ఫ్యూ సడలించనున్నారు. సీఎం మనోహర్లాల్ ఖట్టర్ చండీగఢ్లో కేబినెట్ బేటీ ఏర్పాటు చేయనున్నారు. అంతకుముందే నుహ్ జిల్లా పోలీస్ బాధ్యతలను పాల్వాల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లోకేందర్ సింగ్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఎస్పీ సింగ్లా స్థానంలో నరేంద్ర బిజర్నియాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. చదవండి: రాహుల్ గాంధీ ఇంటికి కొత్త అతిథులు.. గోవా వెళ్లి మరీ తీసుకొచ్చారు -
మునుగోడు ఉపఎన్నికలో మరో ట్విస్ట్.. రిటర్నింగ్ అధికారి బదిలీ..
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉపఎన్నికల రిటర్నింగ్ అధికారి జగన్నాథరావును కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఎన్నికల గుర్తుల వ్యవహారంలో వివాదం నెలకొన్న తరుణంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్కు గుర్తు కేటాయింపు విషయంలో జగన్నాథరావు ఇష్టారీతిగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసీ వేగంగా చర్యలు తీసుకుంది. ఆయన స్థానంలో మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్కు మునుగోడు ఉపఎన్నికల బాధ్యతలు అప్పగించింది. మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ మునుగోడు ఉపఎన్నిక నామినేషన్లు ముగిసిన అక్టోబర్ 17న తనకు రోడ్ రోలర్ గుర్తు కేటాయించారని యుగతులసి అభ్యర్థి శివకుమార్ తెలిపారు. అయితే అక్టోబర్ 18న విడుదలైన జాబితాలో మాత్రం బేబీ వాల్కర్ గుర్తు ఇచ్చారని పేర్కొన్నారు. తమ కారు గుర్తును పోలి ఉన్న రోడ్డు రోలర్, క్యాప్, చపాతి రోలర్ వంటి గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని టీఆర్ఎస్ పార్టీ 17వ తేదీ రాత్రి ఆందోళన చేసింది. దీంతో తెల్లారేసరికి గుర్తులు మారిపోయాయని, దీనిపై వివరణ కోసం తాను ఎన్నికల రిటర్నింగ్ అధికారిని సంప్రదించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని శివకుమార్ ఎన్నికల సంఘానికి బుధవారం ఫిర్యాదు చేశారు. ఆ మరునాడే రిటర్నింగ్ అధికారిని బదిలీ చేస్తూ కేంద్రం ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. శివకుమార్కు రోడ్డురోలర్ గుర్తునే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి: మునుగోడులో గుర్తుల కేటాయింపుపై సీఈసీ సీరియస్.. అంతా మీ ఇష్టమా? -
పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ హెచ్చరికలు
ఛండీగఢ్: పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలకు.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక సందేశం పంపించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో దందాలకు పాల్పడవద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన విషయాల్లో మాత్రమే.. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను తప్పనిసరిగా కలవాలని కేజ్రీవాల్ అన్నారు. గతంలో.. పంజాబ్ ఎమ్మెల్యేలు కొందరు తమకు అనుకూలంగా ఉండే ఎస్పీలు/ఎస్ఎస్పీలను బదిలీ చేయించుకుని.. తమ నియోజకవర్గాల్లో దందాలను నడిపించుకున్నారని కేజ్రీవాల్ అన్నారు. అయితే ఆప్ ఎమ్మెల్యేలు మాత్రం అలాంటి కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. పోలీసుల బదీలీలకు సంబంధించిన ప్రక్రియను సీఎం భగవంత్మాన్కు, మంత్రులకు వదిలేయాలని.. ఎమ్మెల్యేలు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని, కేవలం నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటే చాలని అన్నారు. అలా కాకుండా అధికార ధోరణి ప్రదర్శిస్తే.. పరిణామాలు వేరుగా ఉంటాయని, చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే పార్టీ ఎమ్మెల్యేలంతా టీమ్గా పని చేయాలని కోరారు. మన వ్యక్తిగత ఆశయాలను వదిలి.. జట్టుగా పని చేస్తే పంజాబ్ పురోగమిస్తుంది అని కేజ్రీవాల్ పిలుపు ఇచ్చారు. ఈ జట్టుకు భగవంత్ మాన్ నాయకుడని కేజ్రీవాల్ నొక్కి చెప్పారు. పార్టీ నాయకులు, వాలంటీర్లు ఎల్లప్పుడూ హుందాగా వ్యవహరించాలని, అసభ్య- అభ్యంతరకరమైన ప్రవర్తనలను సహించేదే లేదని కేజ్రీవాల్ హెచ్చరించారు. (చదవండి: దేశంలోనే ఫస్ట్.. కేజ్రీవాల్ సంచలన నిర్ణయం.. అది జరిగితే..) -
మమత బదిలీ.. మరునాడే నిలిపివేత!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లోని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత బదిలీని మున్సిపల్ పరిపాలన శాఖ ఒక్కరోజులోనే నిలిపివేసింది. ఆమెను ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్గా బదిలీ చేస్తూ ప్రభుత్వకార్యదర్శి సి.సుదర్శన్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెతోపాటు మరో నలుగురు జీహెచ్ఎంసీ పరిధిలోని జోనల్/అదనపు కమిషనర్లను కూడా బదిలీ చేశారు. అయితే విధుల్లో చేరకముందే బుధవారం సాయంత్రానికల్లా మమత బదిలీని నిలిపివేస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. కూకట్పల్లి జోనల్ కమిషనర్గా బదిలీ అయిన జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ పంకజను తాజాగా ఎల్.బి.నగర్కు మార్చారు. రాష్ట్రవ్యాప్తంగా దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న స్పెషల్, సెలక్షన్ గ్రేడ్, అదనపు డైరెక్టర్, అదనపు కమిషనర్ స్థాయి అధికారులను బదిలీ చేయాలని మున్సిపల్ పరిపాలన శాఖ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని నగర శివారు జోన్ల కమిషనర్లను తొలుత బదిలీ చేసింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవికిరణ్ను ఖైరతాబాద్కు, ప్రధాన కార్యాలయంలో ఉన్న అదనపు కమిషనర్, ఐఏఎస్ అధికారి ప్రియాంకను శేరిలింగంపల్లికి బదిలీ చేశారు. ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ను నల్లగొండ మున్సిపల్ కమిషనర్గా బదిలీచేశారు. త్వరలోనే మరిన్ని బదిలీలు రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, ఏ గ్రేడ్ మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్ల పనితీరు ఆధారంగా త్వరలో బదిలీల ప్రక్రియ సాగనుందని సమాచారం. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లతో సత్సంబంధాలు కొనసాగించనివారిపై కూడా బదిలీ వేటు పడే అవకాశముందని తెలుస్తోంది. జీహెచ్ఎంసీతోపాటు శివార్లలో కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు కూడా స్థానభ్రంశం చెందనున్నారు. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసిన అధికారులు ఆమోదం కోసం సర్కారుకు ఫైల్ పంపించినట్లు సమాచారం. -
ట్విట్టర్ ఇండియా హెడ్ మనీశ్ మహేశ్వరి బదిలీ
-
ఏపీలో 22 మంది డీఎస్పీల బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. రాష్ట్రంలో 22 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: రూ.34 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు: సీఎం జగన్ మచిలీపట్నంలో టీడీపీ కార్పొరేటర్ వీరంగం -
ఏపీలో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ల బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా ఎం.వి.శేషగిరిబాబు, ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీగా కె.ప్రవీణ్కుమార్ రెడ్డి.. ఏపీ టవర్స్ లిమిటెడ్ సీఈవోగా ఎం.రమణారెడ్డి, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్గా ఎస్బిఆర్.కుమార్లకు బాధ్యతలు అప్పగించారు. -
ఐపీఎస్లకు పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.మొత్తం 9 మందికి ప్రమోషన్లు రాగా, వీరిలో 2002 బ్యాచ్కు చెందిన ముగ్గురికి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ)గా, 2006 బ్యాచ్కి చెందిన మరో ఆరుగురికి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ)గా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఆదేశాలు ఇచ్చారు. 2002 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన రాజేశ్కుమార్, ఎన్. శివశంకర్రెడ్డి, వి.రవీందర్లకు ఐజీలుగా ప్రమోట్ చేసింది. ప్రస్తుతం సీనియర్ ఎస్పీలుగా ఉన్న 2006 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన కార్తికేయ, కె. రమేశ్నాయుడు, వి.సత్యనారాయణ, బి.సుమతి, ఎం.శ్రీనివాసులు, ఎ.వెంకటేశ్వర్రావుకు డీఐజీలుగా పదోన్నతి కల్పించింది. 40మందికిపైగానే స్థానచలనం..! ఈసారి బదిలీలు భారీ ఎత్తున ఉంటాయని, దాదాపు 40 మందికిపైగా స్థానచలనం ఉంటుం దని ప్రచారం సాగుతున్న వేళ.. డీజీపీ కార్యాలయం నుంచి జిల్లా స్థాయిలో విధులు నిర్వహించే పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీలపై వాకబు చేస్తున్నారు. ఇప్పటికే సిద్ధమైన ఈ జాబితాకు ఇంకా సీఎం ఆమోదం తెలపాల్సి ఉంది. డబుల్ ప్రమోషన్లు దక్కినా.. పాత కుర్చీలోనే విధులు.. గతేడాది ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వం 23 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పించింది. వీరిలో సీనియర్ ఎస్పీ, డీఐజీ, ఐజీ, ఏడీజీ వరకు ర్యాంకులు ఉన్నాయి. ఈ పదోన్నతి కల్పించి దాదాపు 10 నెలలు కావస్తోంది. అయినా, వీరికి కొత్త పోస్టింగుగానీ, బదిలీగానీ కల్పించలేదు. అదే సమయంలో గతేడాది ఏప్రిల్లో ఎస్పీ ర్యాంకునుంచి సీనియర్ ఎస్పీలుగా పదోన్నతి పొందిన 2006 ఐపీఎస్ బ్యాచ్కుచెందిన కార్తికేయ, కె. రమేశ్నాయుడు, వి.సత్యనారాయణ, బి.సుమతి, ఎం.శ్రీనివాసులు, ఎ.వెంకటేశ్వర్రావు ప్రస్తుతం పదోన్నతి జాబితాలోనూ చోటు దక్కించున్నారు. పదినెలల కాలంలో రెండోసారి పదోన్నతి సాధించిన వీరికి తాజాగా ప్రభుత్వం డీఐజీ హోదా కల్పించింది. అయినా, వీరి విషయంలోనూ ప్రభుత్వం పోస్టింగ్, బదిలీపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఈ విషయంలో చాలమంది ఐపీఎస్ ఆఫీసర్లు ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ప్రమోషన్ వచ్చిందని సంతోషించాలా? లేక కిందిస్థాయి పోస్టులోనే కొనసాగాల్సి వస్తోందని బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని అంటున్నారు. -
కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలనలో భాగంగా..
న్యూఢిల్లీ: రైల్వే బోర్డులో సమర్థతను పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బోర్డు అధికారుల సంఖ్యను 200 నుంచి 150కి తగ్గించింది. డైరెక్టర్, ఆ పై స్థాయికి చెందిన 50 మంది అధికారులను వివిధ జోన్లకు బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పరిపాలన అనే ప్రధాని ఆలోచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ అధికారుల సేవలను గరిష్టంగా వినియోగించుకునేందుకు వారిని వివిధ జోన్లకు బదిలీ చేశాం’ అని రైల్వే ఉన్నతాధికారి చెప్పారు. బోర్డులో అవసరమైన మేరకే సిబ్బంది ఉండాలన్నది నాటి ప్రధాని వాజ్పేయి ఆలోచన. బోర్డును పునర్వ్యవస్థీకరించాలని 2015లో డెబ్రాయ్ కమిటీ సిఫారసు చేసింది. రైల్వే శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వేసిన తొలి అడుగే రైల్వే బోర్డులో సిబ్బందిని తగ్గించడమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బదిలీ
సాక్షి, అమరావతి : టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బదిలీ అయ్యారు. శ్రీనివాసరాజును సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో టీటీడీ జేఈవోగా బసంత్కుమార్కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని బసంత్కుమార్ను ఆదేశించింది. కాగా, బసంత్కుమార్ ప్రస్తుతం వీఎంఆర్డీఏ వైస్ చైర్మన్గా ఉన్నారు. -
వైఎస్ జగన్పై హత్యాయత్నం : ఎయిర్పోర్టు ఆఫీసర్ బదిలీ
-
వైఎస్ జగన్పై హత్యాయత్నం : ఎయిర్పోర్టు ఆఫీసర్ బదిలీ
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరగడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సాక్షాత్తు ఓ రాష్ట్ర ప్రతిపక్షనేత అందులోనూ కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలోనే వైఎస్ జగన్పై హత్యాయత్నం చోటుచేసుకోవడంతో విశాఖ ఎయిర్పోర్టులో ప్రముఖుల భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఎయిర్పోర్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై బదిలీ వేటు పడింది. వైజాగ్ ఎయిర్ పోర్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వేణుగోపాల్ను చెన్నై ఎయిర్ పోర్టుకు బదిలీ చేస్తున్నట్టు సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విమానాశ్రయ భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. -
ఇస్రో సీనియర్ శాస్త్రవేత్తపై బదిలీ వేటు
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సీనియర్ శాస్త్రవేత్త తపన్ మిశ్రాపై వేటు పడింది. ప్రస్తుతం అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్(ఎస్ఏసీ) డైరెక్టర్గా ఉన్న మిశ్రాను బెంగళూరులోని సంస్థ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేసిన చైర్మన్ కె.శివన్.. ఆయనకు ఇస్రో సలహాదారుగా కొత్త బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ఇస్రో చేపడుతున్న అంతరిక్ష కార్యక్రమాల్లో ప్రైవేటు సంస్థలకు శివన్ గణనీయమైన ప్రాధాన్యమివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో మిశ్రాపై వేటు పడిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. మిశ్రా స్థానంలో ఎస్ఏసీ డైరెక్టర్గా మరో సీనియర్ శాస్త్రవేత్త డీకే దాస్ను నియమించినట్లు పేర్కొన్నారు. దేశీయంగా పలు కీలక ఉపగ్రహాల తయారీలో పాలుపంచుకున్న మిశ్రా భవిష్యత్తో ఇస్రో చైర్మన్ పదవిని చేపట్టేవారిలో ముందువరుసలో ఉన్నారన్నారు. -
డీఎంహెచ్ఓ అన్నప్రసన్నకుమారి బదిలీ
జనగామ : జనగామ జిల్లా వైద్యాధికారి అన్నప్రసన్నకుమారిని పదోన్నతిపై బదిలీ చేస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. 2017 మేలో జిల్లా వైద్యాధికారిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ఆస్పత్రులను చక్కదిద్దడమే కాకండా.. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్న ప్రైవేట్ క్లినిక్, నర్సింగ్ హోం, స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలు స్కానింగ్ కేంద్రాలు, క్లినిక్, ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లను రద్దు చేయడమే కాకుండా, కేసులు కూడా నమోదు చేశారు. గుట్టుచప్పడు కాకుండా చేస్తున్న అబార్షన్లపై కన్నెర్రజేశారు. ప్రజలను అమాయకులను చేసి, అడ్డదారిలో వైద్యం చేసే ఎంతటి వారినైనా వదిలి పెట్టలేదు. రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లెక్క చేయకుండా ఆస్పత్రులను సీజ్ చేశారు. సుమారు 14 నెలల జనగామలో పని చేసిన అన్న ప్రసన్నకుమారి రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ అడిషినల్ ప్రాజెక్టు డైరెక్టర్గా పదోన్నతిపై వెళ్తున్నారు. జిల్లాలో పని చేసినంత కాలం వైద్య సేవల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశారు. నేడు విధుల్లో చేరాలని కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జనగామ జిల్లా వైద్యాధికారిగా మహేందర్ జనగామ జిల్లా వైద్యాధికారిగా ఎ.మహేందర్ను నియమిస్తూ వైద్యారోగ్య కమిషనర్ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం స్టేట్ ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. స్టేషన్ఘన్పూర్ ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్గా పని చేసిన మహేందర్ పదోన్నతిపై హైదరాబాద్కు వెళ్లారు. ప్రస్తుత డీఎంహెచ్ఓ పదోన్నతిపై బదిలీపై వెళ్లడంతో ఆమె స్థానంలో మహేందర్ను నియమించారు. -
విజిలెన్స్ ఎస్పీపై బదిలీ వేటు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అనంతపురం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ అనిల్పై బదిలీ వేటు పడింది. అనంతపురం నుంచి బదిలీ చేయడమే కాకుండా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులు ఆ శాఖ నుంచి రిలీవ్ చేశారు. దీంతో ప్రభుత్వం ఆయనను ఇంటెలిజెన్స్ ఏఎస్పీగా నియమిస్తూ, పోలీస్ హెడ్క్వార్టర్స్లో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అనురాధ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎస్పీ స్థాయిలోని అనిల్ను విజిలెన్స్ ఎస్పీగా నాలుగేళ్లకుపైగా ఎఫ్ఏసీ(పూర్తి అదనపు బాధ్యతలు)పై విధులు నిర్వహించారు. అయితే ఆయన పనితీరుపై విపక్షపార్టీ తరచూ విమర్శలు గుప్పించింది. అధికారపార్టీకి పూర్తి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, పలు శాఖలను బ్లాక్మెయిల్ చేసి అవినీతికి పాల్పడుతున్నారని డీజీకి ఫిర్యాదు చేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా అనిల్ విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 3న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, విజిలెన్స్ డీజీకి ఫిర్యాదు చేశారు.విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ జిల్లాపై నిఘా ఉంచి అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం వెచ్చించే నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలి. అలా జరిగితే తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాలి. కానీ ఈ శాఖ పనితీరు నాలుగేళ్లుగా వివాదాస్పదంగానే ఉంది. అనిల్ అధికార పార్టీకి అండగా ఉంటారని, ఓ సామాజికవర్గానికి వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకించి తనిఖీల పేరుతో బెదిరించి ఒకసారి కేసు నమోదు చేసి, తర్వాత వారితో సత్ససంబంధాలు నడుపుతున్నారనే ఆరోపణలు కూడా వినిపించా యి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అందనికాడికి దోచుకున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసే స్థాయికి వచ్చారంటే ఆ శాఖ పరిస్థితి ఎలా ఉందో? అధికారులు ఎలా వ్యవహరించారో? ఇట్టే తెలుస్తోంది. ఆర్అండ్బీలోని ఓ కీలక అధికారి, విజిలెన్స్లో పనిచేసిన ఓ ఎస్ఐ అండతో ఇతను అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఉన్నతాధికారులకు పలువురు ఫిర్యాదు చేశారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు అనిల్పై బదిలీ వేటు వేశారని తెలుస్తోంది. అనిల్పై వచ్చిన ఆరోపణలు కొన్ని: = సాయినగర్ పశువుల ఆస్పత్రిలో అప్పటి ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి నిధులు(బిల్లు నెంబర్–3160/29–3–2014,ఎంబుక్కు నెంబర్ 454/2012–2013)తో షెడ్డు నిర్మించారు. దీనికి ప్రస్తుత కార్పొరేషన్ అధికారులు 2014 అక్టోబర్ 29న మరో బిల్లు(బిల్లునెంబర్1648/29–10–2014, ఎంబుక్కు నెంబర్ 24/2008–09)డ్రా చే శారు. దీన్ని 2008–09 ఎంబుక్కులో ఎంటర్ చే శారు. ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు లేవు. = తాడిపత్రిలో గ్రానైట్ మాఫియా దందా ఏ స్థాయిలో సాగుతోందో పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. మాఫియాతో తనకు ప్రాణహాని ఉందని ఆ శాఖ విజిలెన్స్ సీఐ ప్రతాప్రెడ్డి ఉన్నతాధికారులకు ఫి ర్యాదుచేశారు. తాడిపత్రితో జిల్లా వ్యాప్తంగా గ్రానైట్ దందా సాగుతున్నా విజిలెన్స్ నిఘా కరువైంది. వారితో విజిలెన్స్ అధికారులు సన్ని హిత సంబంధాలు నడపడమేననే ఆరోపణలు ఉన్నాయి. =ఎరువుల దుకాణాల్లోని అవకతవకలు చూసీ చూడనట్లు వ్యవహరించేందుకు వ్యాపారుల నుంచి కొంత మొత్తం వసూలు చేసినట్లు తెలుస్తోంది. =కర్ణాటక నుంచి ప్రతి నెలా 80–100 వరకూ స్పాంజ్ ఐరన్ లారీలు హిందూపురం పరిధిలోని పరి శ్రమలకు వస్తుంటాయి. ఒక్కో వాహనానికి రూ.15వేలు ఇవ్వాలని హుకూం జారీ చేసినట్లు సమాచారం. = జిల్లాలో క్రషర్లతో పాటు మైనింగ్ 75శాతం ని బంధనలకు విరుద్ధంగా జరుగుతోంది. వీరి నుం చి కూడా భారీగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. = గుంతకల్లు సమీపంలోని కొందరు డీజిల్ మాఫియాగా ఏర్పడి కల్తీ ఆయిల్ సరఫరా చేస్తున్నారు. వీరి నుంచి భారీగా ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. = ఓ సిమెంట్ ట్రాన్స్పోర్ట్ సంస్థ నిబంధనలకు వి రుద్ధంగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నందుకు ప్రతి నెలా రూ.2లక్షలు వసూలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. = ఇసుక మాఫియా నుంచి కూడా భారీగా ముడుపులు అందుతున్నట్లు తెలిసింది. = తనకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్ల జోలి కి వెళ్లకుండా ఉండటం, విపక్ష పార్టీకి చెందిన ఏజెన్సీలు, దారికి రాని వారి పనుల్లో లోపాలు వెతికి కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించేలా చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. =అనంతపురంలోని ఒకటో డివిజన్లో సిమెంట్ రోడ్డు తనిఖీకి వెళ్లి ఒక శాంపిల్ తీయగానే అధికార పార్టీ నేతల నుంచి ఫోన్ రావడంతో వెనక్కు వెళ్లిపోవడం గమనార్హం. -
పాఠశాల విద్యా శాఖ కమిషనర్ బదిలీ
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యా శాఖ కమిషనర్ జి.కిషన్ బదిలీ అయ్యారు. ఆ స్థానంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హాకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యా శాఖ కమిషనర్గా కిషన్ రెండున్నరేళ్లు కొనసాగారు. ఉపాధ్యాయ బదిలీలు జరుగుతున్న కీలక సమయంలో ప్రభుత్వం అనూహ్యంగా బదిలీ చేయడం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయనకు ఇప్పటివరకు ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. పాఠశాల విద్యా శాఖ కమిషనర్గా కిషన్ పలు అంశాల్లో వివాదాల్లోకెక్కారు. సాధారణంగా శాఖాపరమైన నిర్ణయాలను త్వరితగతిన తీసుకోరన్న అభిప్రాయం ఉంది. కమిషనర్ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపేవారని సమాచారం. దీంతో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగేదన్న ఆరోపణలున్నా యి. చివరికి సొంతంగా తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ఉపాధ్యాయుల సెలవుల జారీలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యా శాఖాధికారికి బాధ్యతలు అప్పగించడం, స్కూల్ గ్రాంట్స్ ఖర్చులో చెక్కుల చెల్లింపులు, పాఠశాలల్లో డ్యూయల్ డెస్క్ల కొనుగోలులో పలు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి సీఎం వద్ద జరిగిన సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు కమిషనర్ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిషనర్ నిర్ణయాలతో ప్రభుత్వంపై చెడ్డ పేరు వస్తోందంటూ పలువురు సీఎం వద్ద ఏకరువు పెట్టారు. దీంతో కిషన్ బదిలీ జరిగినట్లు తెలుస్తోంది. -
కథువా కేసులో కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: కథువా కేసులో సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును పఠాన్కోట్ కోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తు విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. బాధిత కుటుంబానికి, న్యాయవాదికి, సాక్ష్యులకు రక్షణ కల్పించాలని జమ్ము కశ్మీర్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ‘కథువా కేసును పఠాన్కోట్ జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నాం ఈ కేసులో ప్రతీరోజు వాదనలు జరగాలి. కేసు విచారణ త్వరగతిన పూర్తి కావాలి. కోర్టు విచారణను రహస్య విచారణ చేపట్టాలని ఆదేశించింది(ఇన్-కెమెరా ప్రోసీడింగ్స్). ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించుకునేందుకు జమ్ము కశ్మీర్ ప్రభుత్వానికి అనుమతిస్తున్నాం’ అని బెంచ్ తెలిపింది. ఈ కేసులో తదుపరి వాదనను జూలై 9కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. మమ్మల్ని కాల్చిచంపండి:‘కథువా’ బాలిక తల్లి అందుకే చిన్నారిని చంపాం: సాంజిరామ్ 8 ఏళ్ల చిన్నారిని ఆలయంలో బంధించి అత్యాచారం చేసి, ఆపై అత్యంత దారుణంగా హతమార్చిన ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ కేసులో సాంజీరామ్ అనే మాజీ ప్రభుత్వ ఉద్యోగితోసహ ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును జమ్ము కశ్మీర్ నుంచి ఛండీగఢ్ కోర్టుకు బదిలీ చేయాలని బాధిత బాలిక తండ్రి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసింది. మరోపక్క నిందితులు మాత్రం ఆ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కేసును సీబీఐకి బదిలీ చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని, రాష్ట్ర పోలీసులు సమర్థవంతంగానే దర్యాప్తు జరుపుతున్నారంటూ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి తాజాగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కథువా కేసు; షమీ భార్య షాకింగ్ కామెంట్స్ కామాంధులకు మరణశిక్ష.. ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోదం -
‘కార్’కు ఏడీసీపీ గంగిరెడ్డి బదిలీ
సాక్షి, హైదరాబాద్: ముత్యాల యోగి కుమార్ అనే వ్యక్తిని బూటు కాలితో తన్నిన షీటీమ్స్ ఇన్చార్జి, మాదాపూర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డిని సిటీ ఆర్మ్డ్ రిజర్వు(సీఎఆర్) హెడ్ క్వార్టర్స్కు బదిలీ చేశారు. షార్టు ఫిలింలో నటించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హారిక ఫిర్యాదు మేరకు యోగిని విచారణకు పిలిచి ఏడీసీపీ గంగిరెడ్డి బూటు కాలితో తన్నినట్లు టీవీ చానళ్లలో వచ్చింది. అందులో వాస్తవం ఎంత ఉందో విచారణ చేపట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. ఈమేరకు డీసీపీ విశ్వప్రసాద్ను విచారణ అధికారిగా నియమించిన విషయం విదితమే. ఈ క్రమంలో గంగిరెడ్డిని బదిలీ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు. -
మాల్యాకు రూ.100కోట్ల షాక్
న్యూఢిల్లీ: వేల కోట్ల రూపాయలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇటీవల మాల్యాను ఇండియాకు తిరిగి రప్పించే చర్యలను వేగవంతం చేసిన కేంద్రం తాజాగా మరో కీలక చర్య తీసుకుంది. మాల్యాకు చెంఇన సుమారు రూ.100కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేంద్రానికి బదిలీచేసింది. ముఖ్యంగా యునైటెడ్ బ్రూవరీస్కు చెందిన ఆస్తులపై దృష్టిపెట్టిన ఈడీ తాజాగా మాల్యాకు చెందిన రూ.100 కోట్ల విలువైన వాటాలను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్హెచ్సీఐఎల్) యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీల్) కు చెందిన రూ. 100 కోట్ల విలువైన ( ప్రత్యక్ష, పరోక్ష)వాటాల హక్కులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. మనీలాండర్ చట్టం సెక్షన్9 ప్రకారం ఈ ఆస్తుల బదిలీ ప్రక్రియను చేపట్టింది. మరోవైపు ఈడీ ఇప్పటికే యూబీఎల్కు చెందిన 4 కోట్ల వాటాలు, యూఎస్ఎల్కు చెందిన 25.1లక్షల వాటాలు, మెక్డోవెల్స్ హోల్డింగ్స్లోని 22 లక్షల వాటాలను అటాచ్ చేసింది. వీటితోపాటు మాల్యావిగా అనుమానిస్తున్న మరికొన్ని కంపెనీలపై దృష్టి సారించింది. వీటిల్లో దేవీ ఇన్వెస్ట్మెంట్స్, కింగ్ఫిషర్ ఫిన్వెస్ట్ ఇండియా, మాల్యా ప్రైవేటు లిమిటెడ్, ఫార్మాట్రేడింగ్ కంపెనీ, విట్టల్ ఇన్వెస్ట్మెంట్స్, యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్ లిమిటెడ్, కామ్స్కో ఇండస్ట్రీస్, ‘ది గెమ్’ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీలపై కూడా దృష్టిపెట్టింది. రెండునెలల క్రితం యూబీఎల్, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యుఎస్ఎల్) మాక్టోవెల్ హోల్డింగ్స్ లిమిటెడ్లో మాల్యా, అతని అనుబంధ సంస్థలకు చెందిన రూ. 4వేల కోట్ల వాటాలను బదిలీ చేయాల్సిందిగా ఎస్హెచ్సీఐఎల్కు ఈడీ లేఖరాసింది. ఈ మేరకు ఫిబ్రవరిలో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్డర్ రూ .4,200 కోట్ల ఆస్తుల ఎటాచ్మెంట్ ఆర్డర్ను కోర్టు సమ్మతించింది. ఈ కంపెనీల్లో మాల్యాకు రూ.4,000 కోట్ల విలువైన షేర్లు ఉంటాయని అంచనా. అలాగే గత ఏడాది సెప్టెంబర్లో ఈడీ రూ .6,630 కోట్ల విలువైన అటాట చేసిన సంగతి తెలిసిందే. మనీ లావాదేవీ నిరోధక చట్టం (పిఎంఎల్ఏ) నిబంధనలో 9 వ సెక్షన్ కింద, జప్తు ఆర్డర్ తర్వాత, అటువంటి ఆస్తిలో అన్ని హక్కులు కేంద్ర ప్రభుత్వానికే చెందుతాయి. -
ఖాకీలకూ ‘పనిష్మెంట్’
పోలీసు ఉల్లంఘనలపై ప్రత్యేక నజర్ ♦ సిబ్బంది, అధికారుల వయొలేషన్స్పై సీరియస్ ♦ తాజాగా కానిస్టేబుల్పై అటాచ్మెంట్ వేటు సాక్షి, హైదరాబాద్: రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన సాధారణ ప్రజలకు జరిమానా, పాయింట్లు మాత్రమే పడుతున్నాయి. ఇదే పని పోలీసులు చేస్తే వారికి వీటితో పాటు తాఖీదులు తప్పట్లేదు. కొన్ని నెలలుగా నగర పోలీసులు ఈ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 242 మంది పోలీసు సిబ్బంది, అధికారులకు ఉన్నతాధికారులు చార్జ్ మెమోలు జారీ చేశారు. వీరిలో ఆరుగురిపై బదిలీ లేదా అటాచ్మెంట్ వేటు కూడా పడింది. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ మీడియాకు చిక్కిన రామ్గోపాల్పేట కానిస్టేబుల్ కె.రాకేష్సాగర్ను సీఏఆర్ హెడ్–క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ మధ్య మండల డీసీపీ జోయల్ డెవిస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమలు చేయాల్సిన వారే తప్పు చేస్తే... రహదారి భద్రతకు సంబంధించి అంశాలు, నిబంధనల్ని క్షేత్రస్థాయిలో ట్రాఫిక్, శాంతిభద్రతల అధికారులే అమలు చేస్తుంటారు. ఇలాంటి అధికారాలున్న వారే తప్పులు చేస్తే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని హెల్మెట్ నిబంధన పక్కా చేసినప్పుడు కమిషనరేట్లోకి వచ్చే ప్రతి ద్విచక్ర వాహనచోదకుడూ కచ్చితంగా దీన్ని ధరించాల్సిందేనని కొత్వాల్ గతంలోనే స్పష్టం చేశారు. ఈ విధానాన్ని మరింత విస్తరిస్తూ రహదారుల పైనా పోలీసులు నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. యూనిఫాంలో ఉంటే సీరియస్... నగర పోలీసు విభాగంలో పనిచేస్తున్న పది వేల మందికి పైగా సిబ్బంది నిత్యం ఇళ్ల నుంచి పోలీసుస్టేషన్/కార్యాలయం మధ్య, వ్యక్తిగత/అధికారిక పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ఇలా వీరు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో అత్యధిక శాతం యూనిఫాంలోనే ఉంటున్నారు. వీరు వినియోగిస్తున్న వాటిలో ప్రైవేట్ వాహనాలతో పాటు ప్రభుత్వం అందించినవీ ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో యూనిఫాంలో ఉన్న పోలీసులతో పాటు పోలీసు వాహనాలు ఉల్లంఘనలకు పాల్పడటాన్ని ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. వీరిలో మార్పు తీసుకురావడానికి కౌన్సెలింగ్లు చేపట్టిన అధికారులు, కొన్నాళ్లుగా తాఖీదులు జారీ చేయడం మొదలుపెట్టారు. నాలుగు రకాలుగా ఆధారాలు పోలీసుల ఉల్లంఘనలకు సంబంధించి పక్కా ఆధారాలు ఉంటేనే చర్యలు తీసుకుం టున్నామని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలి పారు. మొత్తం 4 రకాల సాధనాల ద్వారా వీటిని సేకరిస్తున్నారు. విధుల్లో ఉంటున్న సిబ్బంది తమ చేతిలో ఉండే కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నారు. బషీర్బాగ్లోని కమిషన రేట్లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచీ ఫొటోలు తీస్తున్నారు. ఈ రెంటితో పాటు సోషల్మీడియాలో సర్క్యు లేట్ అవుతున్న, పత్రికల్లో వస్తున్న ఫొటోలను పరిగణలోకి తీసుకుంటున్నారు. తాఖీదులు పొందిన వారు ఇలా.. అదనపు ఇన్స్పెక్టర్ 1 ఎòౖÜ్సలు 66 హెడ్–కానిస్టేబుళ్లు 9 కానిస్టేబుళ్లు 86 హోంగార్డులు 80 మొత్తం 242 ముందు ఫైన్... ఆపై మెమో... సేకరించిన ఫొటోలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది అధ్యయనం చేస్తున్నారు. ఆ సమయంలో వాహనాన్ని నడిపింది ఎవరనేది నిర్ధారించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. స్పష్టత వచ్చిన తర్వాత సదరు పోలీసుల నుంచి జరిమానా వసూలు చేసి, ఆపై చార్జ్మెమో జారీ చేస్తున్నారు. నిర్ణీత సమయంలోపు సంజాయిషీ ఇవ్వకపోయినా, ఇచ్చింది సం తృప్తికరంగా లేకపోయినా తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. మరో పక్క పోలీసు సిబ్బంది/అధికారులకు చెందిన వ్యక్తిగత, అధికారిక వాహనాలపై ఎలాంటి జరిమానాలు లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలని సీపీ స్పష్టం చేశారు. -
రెవెన్యూలో 174 మంది బదిలీ
ఏలూరు (మెట్రో): జిల్లావ్యాప్తంగా రెవెన్యూ శాఖలో 174 మందిని బదిలీ చేసినట్టు జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు తెలిపారు. కలెక్టరేట్లోని గోదావరి కాన్ఫెరె¯Œ్స హాల్లో బదిలీల ప్రక్రియ సోమవారం అర్ధరాత్రి వరకూ సాగింది. ఐదేళ్లు సర్వీసు నిండిన ప్రతి ఒక్కరినీ బదిలీ చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు చెప్పారు. వారు కోరుకున్న చోటుకు అర్హతను బట్టి బదిలీ చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 154 మంది వీఆర్ఓలు, 12 మంది సీనియర్ అసిస్టెంట్లు, 8 మంది జూనియర్ అసిస్టెంట్లను బదిలీ చేశామని చెప్పారు. బదిలీ పత్రాన్ని సిద్ధం చేసి సంబంధిత ఉద్యోగికి అందించామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.హైమావతి పాల్గొన్నారు. -
రాత్రికి రాత్రే యూపీ సీఎం మరో కీలక నిర్ణయం
పట్నా: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం సంచలన నిర్ణయాలతో దూసుకుపోతోంది. తాజాగా యోగి భారీగా ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 41 జిల్లాల పోలీసు బాస్లను, ఇతర ఆఫీసర్ల బదిలీలు, పోస్టింగులను చేపట్టారు. ఈ కీలక ఆదేశాలను బుధవారం అర్థరాత్రి జారీ చేశారు. సుమారు 50మందికిపైగా అధికారులకు స్థాన భ్రంశం కల్పించారు. ఇందులో భాగంగా వివిధ జిల్లాల పోలీస్ బాస్లను బదిలీ చేయడం ద్వారా పెద్ద సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెలరోజుల తరువాత ఇదే అతిపెద్ద పోలీస్ సంస్కరణగా నిలిచింది. ముఖ్యంగా మెయిన్పురి, నోయిడా, ఆగ్రా, సహారన్పూర్, అమ్రోహ, గోరఖ్పూర్, డియోరియా,కన్నౌజ్ జిల్లాల ఎస్ఎస్పీలను బదిలీ చేసింది. మెయిన్ పురి జిల్లాకు కొత్త పోలీస్ చీఫ్గా ఎస్ రాజేష్ నియమితుడయ్యారు. అలాగే బీజేపీ ఎమ్మెల్సీ నేతృత్వంలోని ఊరేగింపు నిషేధించి ఇటీవల వార్లల్లో నిలిచిన షహరన్పూర్ ఎస్ఎస్పీ లవ్కుమార్ను నోయిడాకు ట్రాన్సఫర్ చేయగా, రాయబరేలికి గౌరవ్ సింగ్, లక్నోకు దీపక్కుమార్, ఆగ్రాకు దినేష్ చంద్ర దుబే పోలీస్ ఛీప్గా వ్యవహరించనున్నారు. మునుపటి సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం నియమించిన ఐపీఎస్ లలో ఎక్కువమందిని రీ షఫిల్ చేయడ విశేషం. -
20 మంది సీఐలకు స్థానచలనం!
► బదిలీలకు రంగం సిద్ధం ► రాజకీయ సిఫార్సులకే కీలక ప్రాధాన్యం ► ఐఏఎస్ బదిలీల కంటే ముందే.. ► పైరవీలు ప్రారంభించిన సీఐలు సాక్షి, గుంటూరు : సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీలకు రంగం సిద్ధమైంది. గుంటూరు రేంజ్ పరిధిలో పెద్దసంఖ్యలో సీఐలను బదిలీ చేయటానికి ప్రాథమికంగా కసరత్తు పూర్తి చేశారు. ముఖ్యంగా రెండేళ్ళ కాలపరిమితిని ప్రామాణికంగా తీసుకొని బదిలీలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే అడుగడుగునా రాజకీయ సిఫార్సులు, భారీగా పైరవీలకు తెరలేవటంతో బదిలీల వ్యవహారం అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోకి వెళ్ళింది. దీంతో కొందరు సీఐలు తమకున్న రాజకీయ పరపతిని వినియోగించి ఆదాయం ఎక్కువ ఉన్న స్టేషన్ల పోస్టింగ్ కోసం ముందే లాబీయింగ్ నిర్వహిస్తున్నారు. సిఫార్సులకే పెద్దపీట! గుంటూరు రేంజ్ పరిధిలో గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాలతో పాటు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. రేంజ్ పరిధిలో రూరల్ ప్రాంతాల్లోని కొన్ని స్టేషన్లు, అలాగే అర్బన్ ప్రాంతాల్లోని కొన్ని పోలీస్స్టేషన్ల పోస్టింగ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఆయా స్టేషన్లలో పోస్టింగ్ దక్కాలంటే స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధితో పాటు భారీగా కొంతమేర చెల్లించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా గుంటూరు నగరంలోని మూడు కీలక స్టేషన్లలకు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఉన్న కొన్ని మున్సిపాలిటీల్లో పోస్టింగ్లు డిమాండ్ ఉంది. వాస్తవానికి రెండు నెలల క్రితమే బదిలీలకు సంబంధించి ఐజీ సంజయ్ ప్రాథమికంగా కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ సిఫార్సులకు పెద్దపీట వేసేలా జాబితాలు సిద్ధమైనట్లు సమాచారం. అయితే అమాత్యులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలు దాటి సిఫార్సులు చేస్తుండటంతో బదిలీలను అప్పుడు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో ఈ నెలాఖరులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు పెద్దసంఖ్యలో జరగనున్నాయి. ఈ క్రమంలో రేంజ్ ఐజీ సంజయ్, అర్బన్, రూరల్ ఎస్పీలకు స్థానచలనం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఐజీ, రూరల్ ఎస్పీ రెండేళ్ళ కాలపరిమితి పూర్తి చేసుకున్నారు. దీంతో ఇద్దరి బదిలీలు అనివార్యంగా మారాయి. ఈ క్రమంలో ఈనెల మొదటి వారంలో ఐపీఎస్ల బదిలీలు జరుగుతాయని ప్రచారం జరిగిన నేపథ్యంలో హడావుడి మళ్ళీ మొదలైంది. పల్నాడు ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ... రేంజ్ పరిధిలోని సీఐల బదిలీలు అన్ని పల్నాడు ప్రాంతంలో ఉన్న ఒక అధికార పార్టీ కనుసన్నల్లో జరుగుతున్నాయి. గత ఏడాది కాలంగా జరుగుతున్న బదిలీల్లో సదరు నేతదే కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో సీఐలు సదరు ప్రజాప్రతినిధి చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు సత్తెనపల్లి, నరసరావుపేటల్లో యువనేత అవినీతి ఆరోపణలతో నిమిత్తం లేకుండా తనకు కావాల్సిన ఎస్ఐలందరినీ ఇప్పటికే బదిలీలు చేయించుకొని పోలీస్ ఉన్నతాధికారులకు సీఐల బదిలీల జాబితా అందజేసినట్లు సమాచారం. జిల్లాలో మరికొందరు ప్రజాప్రతినిధులు కూడా ఇచ్చారు. అయితే మొత్తం మీద కీలకంగా మాత్రం పల్నాడు ఎమ్మెల్యే వ్యవహరిస్తుండటం గమనార్హం. మరోవైపు 20 మంది సీఐలకు బదిలీలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గుంటూరు ఈస్ట్ సర్కిల్లో ఒకరు, వెస్ట్ సర్కిల్ ఒకరుతో పాటు అర్బన్ పరిధిలో ఆరుగురు సీఐలు బదిలీల జాబితా ఉండే అవకాశం ఉంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement