-
1500 మీటర్ల విభాగంలో దీక్ష జాతీయ రికార్డు
న్యూఢిల్లీ: సౌండ్ రన్నింగ్ ట్రాక్ ఫెస్టివల్ అథ్లెటిక్స్ మీట్లో భారత మహిళా అథ్లెట్ కేఎం దీక్ష 1500 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. లాస్ ఏంజెలిస్లో జరిగిన ఈ మీట్లో దీక్ష 1500 మీటర్ల దూరాన్ని 4ని:04.78 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో 2021 నుంచి హర్మిలన్ బైన్స్ (4ని:05.39 సెకన్లు) పేరిట ఉన్న జాతీయ రికార్డును దీక్ష బద్దలు కొట్టింది. సుజీత్, జైదీప్లకు నిరాశ.. ఇస్తాంబుల్: వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ చివరి రోజు భారత ఫ్రీస్టయిల్ రెజ్లర్లు సుజీత్ (65 కేజీలు), జైదీప్ (74 కేజీలు) ఒలింపిక్ బెర్త్లను దక్కించుకోవడంలో విఫలమయ్యారు. మూడో స్థానం కోసం జరిగిన బౌట్లో రూథర్ఫర్డ్ (అమెరికా) చేతిలో సుదీప్ ఓడిపోగా... కాంస్య పతక బౌట్లో జైదీప్ 1–2తో దెమిర్తాస్ (టర్కీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. దాంతో ఈసారి పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి పురుషుల విభాగంలో ఒక్క రెజ్లర్ (అమన్; 57 కేజీలు) మాత్రమే పోటీపడనున్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
లాస్ ఏంజెలిస్: గాజాలో తక్షణ కాల్పుల విరమణ డిమాండ్తో లాస్ ఏంజెలిస్ నగరంలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తిష్టవేసిన పాలస్తీనా అనుకూల విద్యార్థులు, నిరసనకారుల తాత్కాలిక శిబిరాలను పోలీసులు చెల్లాచెదురుచేశారు. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల నిరసనకారులకు మధ్య ఘర్షణతో వర్సిటీలో బుధవారం ఉద్రిక్తత నెలకొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు వర్సిటీలోకి ప్రవేశించారు. టెంట్లను తొలగించి నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో 1000 మందికిపైగా నిరసనకారులు పోలీసులను ప్రతిఘటించారు. ‘‘ జరిగింది చాలు శాంతించండి’’ అని వర్సిటీ చాన్స్లర్ జీన్ బ్లాక్ వేడుకున్నారు. డార్ట్మౌత్ కాలేజీలో టెంట్లు కూల్చేసి 90 మందిని పోలీసులు అరెస్ట్చేశారు. ఏప్రిల్ 17న కొలంబియాలో మొదలైన ఈ పాలస్తీనా అనుకూల నిరసన ఉదంతాల్లో అమెరికావ్యాప్తంగా 30 విద్యాలయాల్లో 2,000 మందికిపైగా అరెస్ట్చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ‘అసమ్మతి ప్రజాస్వామ్యానికి కీలకం. అయితే శాంతిభద్రతలకు విఘాతం కల్గించేస్థాయికి అసమ్మతి పెరిగిపోకూడదు’’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. బ్రిటన్లోని బ్రిస్టల్, లీడ్స్, మాంచెస్టర్, న్యూక్యాజిల్, షెఫీల్డ్ వర్సిటీల్లోనూ నిరసనకారుల శిబిరాలు వెలిశాయి. యూనివర్సిటీ కాలేజ్ లండన్లలో ఇప్పటికే నిరసనకారులు ఆందోళనలు మొదలెట్టారు. ఫ్రాన్స్, లెబనాన్, ఆ్రస్టేలియాలకూ నిరసనలు విస్తరించాయి. -
Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలో ఉద్రిక్తత
లాస్ఏంజెలిస్: పాలస్తీనా–ఇజ్రాయెల్ రగడ అమెరికాలో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. లాస్ ఏంజెలిస్లోని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాలో పాలస్తీనా, ఇజ్రాయెల్ అనుకూల వర్గాల విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బైడెన్ ప్రభుత్వ ఇజ్రాయెల్ అనుకూల విధానాలను నిరసిస్తూ పాలస్తీనా వర్గం వర్సిటీలో టెంట్లు వేసుకుని నిరసనలను సాగిస్తున్న విషయం తెలిసిందే. హెల్మెట్లు, మాస్కులు ధరించిన కొందరు కర్రలు చేతబట్టుకుని మంగళవారం అర్ధరాత్రి టెంట్లపైకి దాడికి దిగారు. బాణసంచా కూడా కాల్చినట్టు లాస్ఏంజెలెస్ టైమ్స్ తెలిపింది. ఈ సందర్భంగా ఇరువర్గాల వారు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కుర్చీలతోపాటు అందిన వస్తువులను విసురుకున్నారు. వర్సిటీని పాలస్తీనా అనుకూల వర్గాలు ఆక్రమించుకుని తమను లోపలికి రానివ్వడం లేదన్న ఇజ్రాయెల్ అనుకూల విద్యార్థుల ఆరోపణల నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. హింసాత్మక ఘటనల కారణంగా వర్సిటీలో బుధవారం తరగతులు రద్దయ్యాయి. సోమవారం కొలంబియా వర్సిటీ కూడా ఈ ఘర్షణలకు వేదికవడం తెలిసిందే. హామిల్టన్ హాల్లో దాదాపు 20 గంటలపాటు తిష్టవేసిన పాలస్తీనా అనుకూల విద్యార్థులను పోలీసులు బలవంతంగా బయటకు పంపించారు. వర్సిటీతోపాటు సిటీ కాలేజీలో ఆందోళనలకు దిగిన దాదాపు 300 మందిని అరెస్టు చేశారు. నార్తర్న్ ఆరిజోనా యూనివర్సిటీలో టెంట్లు వేసి నిరసన సాగిస్తున్న పాలస్తీనా అనుకూల విద్యార్థులను పోలీసులు ఖాళీ చేయించారు. కొద్ది వారాలుగా అమెరికాలో పాలస్తీనా, ఇజ్రాయెల్ విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు వర్సిటీలకు విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. రోడ్ ఐలాండ్స్ క్యాంపస్లో ఆందోళన చేస్తున్న పాలస్తీనా అనుకూల విద్యార్థి వర్గంతో బ్రౌన్ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే అక్టోబర్ నుంచి వర్సిటీలోకి ఇజ్రాయెల్ వ్యక్తుల పెట్టుబడులను స్వీకరించరాదనేది వారిలో ప్రధాన షరతు. ఆందోళనకారుల డిమాండ్కు ఇలా ఒక యూనివర్సిటీ తలొగ్గడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారని చెబుతున్నారు! -
లగ్జరీ బంగ్లాను విక్రయించిన ఇషా అంబానీ? ఎవరు కొన్నారు?
రిలయన్స్ అధినేత ముఖేష్, నీతా అంబానీ ముద్దుల తనయ, వ్యాపారవేత్త ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రిలయన్స్ రీటైల్ వ్యాపారాన్ని విజయ వంతంగా నడిపిస్తూ తండ్రికి తగ్గ తనయగా వ్యాపారంలో రాణిస్తోంది. తాజాగా ఇషా, భర్త ఆనంద్ పిరమల్ ఇంటికి సంబంధించి ఒక ముఖ్య సమాచారం వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని ఇషా ఖరీదైన ఇంటిని ప్రముఖ హాలీవుడ్ జంట కొనుగోలు చేసిందట. ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ, ఈ డీల్ మాత్రం హాట్ టాపిక్గా నిలిచింది. ఇషా-ఆనంద్ పిరమల్ లాస్ ఎంజేల్స్లోని విలాసవంతమైన భవనాన్ని విక్రయించినట్టు తెలుస్తోంది. దీన్ని అమెరికన్ టాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ బెన్ అఫ్లెక్ జంట కొనుగోలు చేసిందట. 38వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఇంటిని 'క్వీన్ ఆఫ్ డ్యాన్స్' జెలో,బెన్ దంపతులు సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇందులో 12 బెడ్రూమ్లు, 24 బాత్రూమ్లు ఉన్నాయి. ప్రత్యేక జిమ్లు, స్పాలు, సెలూన్లు, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ లాంటి స్పెషల్ వసతులు కూడా లగ్జరీ హౌస్లో కొలువు దీరాయి. దాదాపు 61 మిలియన్ డాలర్ల (రూ. 508కోట్లు) ఇంటిని కొనుగోలు చేశారని కూడా ఇన్స్టా ఫ్యాన్ పేజీ నివేదించింది. కాగా ఇషాకు ఈ ఇంటితో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైందే అని చెప్పవచ్చు. ఇషా గర్భంతో ఉన్నపుడు తల్లి నీతాతో కలిసి ఆ ఇంట్లోనే గడిపింది. ఇద్దరు పిల్లలకు ఈ ఇంట్లోనే జన్మనిచ్చింది. అయితే ఈ ఇల్లు విక్రయించడానికి గల కారణాలు ఏంటి అనేదానిపై స్పష్టత లేదు. -
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ వేడుక.. ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
సినీరంగంలో అందించే ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. అమెరికా లాస్ ఎంజిల్స్లోని డాల్బీ థియేటర్లో మార్చి 10న 96వ ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన అకాడమీ అవార్డ్స్ వేడుకలను హాస్యనటుడు జిమ్మీ కిమ్మెల్ నాల్గవ సారి హోస్ట్ చేయనున్నారు. ఆదివారం రాత్రి జరగనున్న ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని భారతీయులకు లైవ్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించారు. తాజాగా ఈ ఈవెంట్ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. భారతీయ కాలమానం ప్రకారం మార్చి 11న సోమవారం ఉదయం నాలుగు గంటలకు ఆస్కార్ వేడుకను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు డిస్నీ ప్లస్ హాట్స్టార్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆస్కార్కు నామినేట్ అయిన చిత్రాలతో వీడియోను షేర్ చేసింది. ఈ ఏడాది అవార్డులకు కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, ఓపెన్హైమర్, బార్బీ, మాస్ట్రో, పూర్ థింగ్స్, అమెరికన్ ఫిక్షన్ వంటి లాంటి పోటీ పడుతున్నాయి. ఇండియా నుంచి పోటీలో ‘టు కిల్ ఏ టైగర్’ ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్కు ‘టు కిల్ ఏ టైగర్’ చిత్రం నామినేట్ అయింది. భారత్లోని ఓ గ్రామంలో చిత్రీకరణ జరుపుకున్న ‘టు కిల్ ఏ టైగర్’ ఆస్కార్ బరిలో నిలిచింది. నిషా పహుజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా.. గతేడాది ఇండియాకు రెండు ఆస్కార్ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ఆస్కార్ వేడుకల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కింది. అలాగే ది ఎలిఫెంట్ విష్పరర్స్ అనే డాక్యుమెంటరీ సిరీస్ సైతం ప్రతిష్ఠాత్మక అవార్డ్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. -
జోగానీ బ్రదర్స్ కేసు : బిజినెస్ టైకూన్కి వేల కోట్ల షాక్!
భారతదేశానికి చెందిన ఐదుగురు సోదరుల మధ్య రెండు దశాబ్దాలుగా సాగిన జటిలమైన కుటుంబ స్థిరాస్తి వివాదంలో లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో నలుగురు తోబుట్టువులకు తీర్పునిచ్చింది. బిజినెస్ టైకూన్ హరేష్ జోగాని తన నలుగురు సోదరులకు దాదాపు 20వేల కోట్ల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అమెరికా చరిత్రలో ఇప్పటివరకు కోర్టు ప్రకటించిన ఇదే అతిపెద్దనష్టపరిహారం అని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. జోగాని వర్సెస్ జోగానిగా పాపులర్ అయిన 21 ఏళ్ల నాటి కేసును విచారించిన కోర్టు తాజా తీర్పు వెలువరించింది. హరేష్ జోగానీపై, అతని సోదరులు శశికాంత్, రాజేష్, చేతన్ , శైలేష్ జోగానీఆస్తి పంపకాల విషయమై సుదీర్ఘ భాగస్వామ్యాన్ని ఉల్లంఘించాడనే ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఐదు నెలల విచారణ త తాజా 7 బిలియన్ డాలర్ల విలువైన తీర్పునిచ్చింది. సోదరులకు హరీష్ 2.5 బిలియన్ల డాలర్ల (రూ. 20 వేల కోట్ల) నష్టపరిహారం చెల్లించాలని, వందల కోట్ల డాలర్ల విలువైన దాదాపు 17,000 అపార్ట్మెంట్లతో కూడిన దక్షిణ కాలిఫోర్నియా రియల్ ఎస్టేట్ ఆస్తిని వాటాల ప్రకారం విభజించాలని ఆదేశించింది. భారతదేశంలోని గుజరాత్కు చెందిన జోగాని కుటుంబం, ఐరోపా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం ఉత్తర అమెరికాలో ప్రపంచ వజ్రాల వ్యాపారంతో రాణించింది. అలాగే శశికాంత్ లేదా "శశి" జోగాని 1969లో 22 ఏళ్ల వయస్సులో కాలిఫోర్నియాకు వెళ్లాడు. అక్కడ సొంతంగా రత్నాల వ్యాపారంలో సోలో సంస్థను ప్రారంభించి సక్సెస్ అయ్యాడు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చి బాగా విస్తరించాడు కూడా. అయితే 1990ల ప్రారంభంలో మాంద్యం కారణంగా వీరు ఆస్తులు నష్టపోయారు. దీంతో పాటు 1994 నార్త్రిడ్జ్ భూకంపం సందర్భంగా శశికి చెందిన భవనం ఒక దానిలో 16 మంది చనిపోవడంతో ఇది మరింత ముదిరింది. ఈ క్రమంలో శశికాంత్ తన సోదరులను బోర్డు లోకి తీసుకువచ్చి, వారిని తన సంస్థ భాగస్వాములుగా చేసుకున్నాడు. రియల్ ఎస్టేట్హోల్డింగ్ ద్వారా దాదాపు 17,000 అపార్ట్మెంట్ యూనిట్లను నిర్మించారు. దీని తర్వాతే వివాదం మొదలైంది. హరేష్ మేనేజ్మెంట్ నుండి తనను బలవంతంగా తొలగించి, తమకు రావాల్సిన దానిని అడ్డు కున్నాడని 2003లో శశి జోగాని ఫిర్యాదు చేశాడు. అయితే రాతపూర్వక భాగస్వామ్యం ఏదీ లేదని హరేష్ జోగాని వాదించాడు. విచారణ తర్వాత హరేష్ మౌఖిక ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు జ్యూరీ గుర్తించింది. 170కి పైగా అపార్ట్మెంట్ భవనాలున్న పోర్ట్ఫోలియోకు హరేష్ జోగాని ఏకైక యజమాని కాదని, ఇందులో శశికాంత్(72) కు 50 శాతం , హరేష్ 24 శాతం, రాజేష్ 10 శాతం, శైలేష్ 9.5 శాతం, చేతన్ 6.5 శాతం వాటాలు ఉన్నట్టు జ్యూరీ నిర్ధారించింది. ఇంకా చర్చలు జరుపుతున్నందున,ప్రతివాది హరేష్ జోగాని తరపు న్యాయవాది రిక్ రిచ్మండ్ వ్యాఖ్యానించడానికి నిరాకరించినట్టు సమాచారం. -
Megastar Chiranjeevi: ఇంతకంటే అవార్డ్ ఏముంటుంది?: మెగాస్టార్ ఎమోషనల్ స్పీచ్!
-
Grammy Awards 2024: భారత్కు ‘గ్రామీ’ సంబరం
ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. 2024 సంవత్సరానికి గాను ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలిస్ నగరంలో ఆదివారం రాత్రి ఈ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్రామ్ను గ్రామీ అవార్డులు వరించాయి. జాకీర్ హుస్సేన్కు మొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. న్యూఢిల్లీ: ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలెస్లో ఆదివారం పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహాదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్రామ్ను గ్రామీలు వరించాయి. జాకీర్ హుస్సేన్కుమొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. ‘శక్తి’ అనే సంగీత బృందం 2023 జూన్లో విడుదల చేసిన ‘దిస్ మూమెంట్’ అనే ఆల్బమ్కు గాను శంకర్ మహాదేవన్, గణేశ్ రాజగోపాలన్, సెల్వగణేశ్ వినాయక్రామ్, జాకీర్ హుస్సేన్కు ఒక్కొక్కటి చొప్పున గ్రామీలు లభించాయి. ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్కు గాను శక్తి బృందం ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్’ కేటగిరీలో గ్రామీని గెలుచుకుంది. జాకీర్ హుస్సేన్కు దీంతోపాటు మరో రెండు గ్రామీలు దక్కాయి. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఫెర్ఫార్మెన్స్(పాష్తో), బెస్ట్ కాంటెపరరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్(యాజ్ వీ స్పీక్) కేటగిరీ కింద రెండు గ్రామీలు ఆయన వశమయ్యాయి. పాష్తో, యాజ్ వీ స్పీక్ ఆల్బమ్లకు గాను చౌరాసియాకు రెండు గ్రామీలు లభించాయి. గ్రామీ విజేతలను ప్రధాని మోదీ ప్రశంసించారు. టేలర్ స్విఫ్ట్కు ‘ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఈ ఏడాది 80కి పైగా కేటగిరీల్లో గ్రామీ పురస్కారాలు ప్రదానం చేశారు. ‘మిడ్నైట్స్’ ఆల్బమ్కుఅమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్కు ‘ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ లభించింది. ఈ కేటగిరీ కింద గ్రామీ అవార్డు అందుకోవడం ఆమెకిది నాలుగోసారి! మిలీ సైరస్కు రికార్డు ఆఫ్ ద ఇయర్ (ఫ్లవర్స్), బిల్లీ ఐలి‹Ùకు సాంగ్ ఆఫ్ ద ఇయర్ (వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్?) గ్రామీలు దక్కాయి. ‘బెస్ట్ న్యూ ఆర్టిస్టు’ విభాగంలో విక్టోరియా మాంట్ గ్రామీని సొంతం చేసుకున్నారు. -
ఆ ఇంటిని మడత పెట్టి..! ధర ఎంతంటే..
అమెజాన్లో అమ్ముడుపోతున్న ఓ ఇంటి గురించి ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. లాస్ ఏంజెల్స్లో ఎక్కువ అమ్ముడుపోతున్న ఆ ఇంటికి ఓ ప్రత్యేకత ఉంది. అది మడతపెట్టేదిగా ఉండడమే. దీని ధర 26 వేల డాలర్లు(మన కరెన్సీలో 21 లక్షల రూపాయలు)గా ఉంది. చిన్న కిచెన్, లివింగ్ ఏరియా, బెడ్ రూంతో పాటు టాయిలెట్ సౌకర్యం ఉంది ఈ ఇంట్లో. టిక్టాక్ ద్వారా అక్కడ ట్రెండ్లోకి రాగా.. అక్కడి నుంచి సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. అయితే ఈ ఇంటిపై ఇంటర్నెట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. Someone bought a "foldable" house from Amazon 😳!! How would the future of homes be if you could buy them today from Amazon? pic.twitter.com/PAQGrILPIQ — Tom Valentino (@TomValentinoo) February 4, 2024 Y'all better go head and get yourselves a Amazon foldable house ‼️ pic.twitter.com/m4748K9xNy — Mesh🇧🇧 (@rahsh33m) January 30, 2024 -
‘బార్బెన్హైమర్’ పోరు ఖరారు!
గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు కురిపించిన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ‘ఒప్పెన్హైమర్’, దర్శకురాలు గ్రెటా గెర్విగ్ ‘బార్బీ’ చిత్రాలు ఆస్కార్ అవార్డ్స్లోనూ పో టీలో నిలిచాయి. 96వ ఆస్కార్ అవార్డులకు సంబంధించిన నామినేషన్లు మంగళవారం సాయంత్రం (భారతీయ కాలమాన ప్రకారం) వెలువడ్డాయి. 23 విభాగాల్లోని ప్రధాన విభాగాల్లో ‘ఒప్పెన్హైమర్’కు 13 నామినేషన్లు దక్కగా, ‘బార్బీ’ ఎనిమిది నామినేషన్లను సొంతం చేసుకుంది. నామినేషన్ల జాబితాను నటుడు జాక్ క్వైడ్, నటి జాజీ బీట్జ్ ప్రకటించారు. ఇంకా అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న చిత్రాల్లో 11 నామినేషన్లతో యోర్గోస్ లాంతిమోస్ దర్శకత్వం వహించిన ‘పూర్ థింగ్స్’, పది నామినేషన్లతో మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వం వహించిన ‘కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’, ఏడు నామినేషన్లతో ‘మేస్ట్రో’ ఉన్నాయి. ఉత్తమ చిత్రం విభాగంలో ‘ఒప్పెన్హైమర్’, ‘బార్బీ’ పో టీ పడుతుండటంతో ‘ఇది బార్బెన్హైమర్ పో రు’ అని హాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఉత్తమ దర్శకుల విభాగంలో ‘బార్బీ’ దర్శకురాలు గ్రెటా గెర్విగ్కి నామినేషన్ దక్కుతుందనే అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఆమె నామినేట్ కాకపో వడం ఆశ్చర్యానికి గురి చేసిందని హాలీవుడ్ అంటున్న మాట. కానీ ఇదే చిత్రానికి సహాయ నటి విభాగంలో అమెరికా ఫెర్రెరాకి దక్కడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫెర్రెరాకి నామినేషన్ దక్కుతుందనే కనీస అంచనాలు లేకపో వడమే ఈ ఆశ్చర్యానికి కారణం. అలాగే ‘బార్బీ’లో టైటిల్ రోల్ చేసిన మార్గెట్ రాబీకి ఉత్తమ నటి నామినేషన్ దక్కకపో వడం ఘోరం అనే టాక్ కూడా ఉంది. ఇక దర్శకుల విభాగంలో గ్రెటా గెర్విగ్కి దక్కకపో యినప్పటికీ ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’ చిత్రదర్శకురాలు జస్టిన్ ట్రైట్కి దక్కడంతో ఈ కేటగిరీలో ఓ మహిళ ఉన్నట్లు అయింది. ఇక మార్చి 10న లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో (భారత కాలమానం ప్రకారం మార్చి 11) ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. మూడేళ్లుగా వ్యాఖ్యాతగా వ్యవహరించిన జిమ్మీ కెమ్మెల్ ఈసారి కూడా ఆ బాధ్యతను నిర్వర్తించనున్నారు. ఇదిలా ఉంటే గతేడాది ‘ఆర్ఆర్ఆర్’ (‘నాటు నాటు...’ పాటకు ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ అవార్డు), బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డు దక్కించుకుని, భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటాయి. ఈసారి దేశం నుంచి ఏ సినిమా పో టీలో లేదు. అయితే కెనడాలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన నిషా పహుజా దర్శకత్వం వహించిన కెనెడియన్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘టు కిల్ ఏ టైగర్’కి నామినేషన్ దక్కింది. ఉత్తమ చిత్రం: అమెరికన్ ఫిక్షన్ అటానమీ ఆఫ్ ఎ ఫాల్ బార్బీ ది హోల్డోవర్స్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ మేస్ట్రో ∙ఒప్పెన్హైమర్ పాస్ట్ లైవ్స్ ∙పూర్ థింగ్స్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉత్తమ దర్శకుడు: అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రైట్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: మార్టిన్ స్కోర్సెస్ ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్ పూర్ థింగ్స్: యోర్గోస్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లేజర్ ఉత్తమ నటుడు: బ్రాడ్లీ కూపర్: మేస్ట్రో కోల్మన్ డొమింగో: రస్టిన్ పాల్ జియామటి: ది హోల్డోవర్స్ కిలియన్ మర్ఫీ: ఒప్పెన్ హైమర్ జెఫ్రీ రైట్: అమెరికన్ ఫిక్షన్ ఉత్తమ నటి: అన్నెతే బెనింగ్: నయాడ్ లిల్లీ గ్లాడ్స్టోన్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సాండ్రా హూల్లర్: అటానమీ ఆఫ్ ఎ ఫాల్ కెర్రీ ములిగన్: మేస్ట్రో ఎమ్మా స్టోన్: పూర్ థింగ్స్ ఏ 91 ఏళ్ల కంపో జర్ జాన్ విల్లియమ్స్ 54వ నామినేషన్ దక్కించుకున్నారు. ‘ఇండియా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ’ చిత్రానికి గాను ఆయనకు నామినేషన్ దక్కింది. అత్యధిక సార్లు నామినేషన్ దక్కించుకున్న సంగీతదర్శకుడిగా ఆయన రికార్డ్ సాధించారు. ఇప్పటికే ఐదు ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న జాన్కి ఈ చిత్రం కూడా ఆస్కార్ తెచ్చి, ఆనందపరుస్తుందా అనేది చూడాలి ఏ ఈ ఏడాది నామినేషన్స్ 61 ఏళ్ల జోడీ ఫాస్టర్ని మళ్లీ పో టీలో నిలబెట్టాయి. 29 ఏళ్ల తర్వాత ‘నయాడ్’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటి విభాగంలో ఆమె నామినేషన్ దక్కించుకున్నారు. అంతకు ముందు ‘నెల్’ చిత్రానికిగాను 1995లో ఆమెకు నామినేషన్ దక్కింది. కాగా ‘ది అక్యూస్డ్’, ‘ది సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్’ చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డులు అందుకున్నారు జోడీ. ఇప్పుడు సహాయ నటి అవార్డును ఇంటి తీసుకెళతారా చూడాలి ఏ 96వ ఆస్కార్ అవార్డ్స్లో దర్శకుడు మార్టిన్ ఏ స్కోర్సెస్కి ఉత్తమ దర్శకుడిగా నామినేషన్ దక్కింది. దర్శకుడిగా పది నామినేషన్లు దక్కించుకుని, ప్రస్తుతం జీవించి ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు సొంతం చేసుకున్నారు. ఉత్తమ దర్శకునిగా స్టీవెన్ స్పీల్బర్గ్ తొమ్మిది నామినేషన్స్ దక్కించుకున్నారు. అయితే ఇప్పటివరకు పది సార్లు నామినేషన్ దక్కించుకున్న మార్టిన్కు ఒక ఆస్కార్ అవార్డు మాత్రమే దక్కింది. 2006లో వచ్చిన ‘డిపార్టెడ్’ సినిమాకు అవార్డు అందుకున్నారు మార్టిన్. ఇదిలా ఉంటే.. తొమ్మిదిసార్లు నామినేట్ అయినప్పటికీ రెండు సార్లు ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నారు స్టీవెన్ సీల్బర్గ్. ఉత్తమ దర్శకుడి విభాగంలో విలియమ్ వైలర్ 12 నామినేషన్స్ దక్కించుకుని రికార్డు సొంతం చేసుకున్నారు.. అలాగే మూడు ఆస్కార్ అవార్డులు సాధించారు. అయితే ప్రస్తుతం ఆయన జీవించి లేరు. -
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక.. ఈ ఏడాది బరిలో నిలిచిన చిత్రాలివే!
గతేడాదిలో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు మన దర్శకధీరుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కింది. అలాగే ది ఎలిఫెంట్ విష్పర్స్ అనే డాక్యుమెంటరీ సిరీస్ సైతం ప్రతిష్ఠాత్మక అవార్డ్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఏడాదికి సంబంధించి ఆస్కార్ అవార్డుల వేడుకకు సమయం ఆసన్నమైంది. 96వ ఆస్కార్ అవార్డుల వేడుక లాగే లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో జరగనుంది. మార్చి 10, 2024న ఈ ఏడాది ఆస్కార్ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేట్ అయిన చిత్రాలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించిన ఆస్కార్ అకాడమీ.. బరిలో నిలిచిన చిత్రాల జాబితాను వెల్లడించింది. 2024 ఆస్కార్ అవార్డుల కోసం వివిధ కేటగిరీల్లో పోటీ పడే చిత్రాల జాబితాను అకాడమీ ప్రకటించింది. ఈ ఏడాది కూడా వరుసగా నాలుగోసారి జిమ్మీ కిమ్మెల్ కామెంటేటర్గా వ్యవహరించనున్నారు. ఇండియా నుంచి ఆస్కార్ పోటీలో ‘టు కిల్ ఏ టైగర్’ ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్కు ‘టు కిల్ ఏ టైగర్’ చిత్రం నామినేట్ అయింది. భారత్లోని ఓ గ్రామంలో చిత్రీకరణ జరుపుకున్న ‘టు కిల్ ఏ టైగర్’ ఆస్కార్ బరిలో నిలిచింది. నిషా పహుజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా.. గతేడాది ఇండియాకు రెండు ఆస్కార్ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. 2024లో వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలివే! ►ఉత్తమ చిత్రం విభాగం అమెరికన్ ఫిక్షన్ అటానమీ ఆఫ్ ఎ ఫాల్ బార్బీ ది హోల్డోవర్స్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ మేస్ట్రో ఒప్పైన్ హైమర్ పాస్ట్ లైవ్స్ పూర్ థింగ్స్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ►ఉత్తమ దర్శకుడి విభాగం అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రిఎట్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: మార్టిన్ స్కోర్స్ ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్ పూర్ థింగ్స్: యోర్గోస్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లేజర్ ►ఉత్తమ నటుడు విభాగం బ్రాడ్లీ కూపర్: మేస్ట్రో కోల్మన్ డొమింగో: రస్టిన్ పాల్ జియామటి: ది హోల్డోవర్స్ కిలియన్ మర్ఫీ: ఒప్పైన్ హైమర్ జెఫ్రీ రైట్: అమెరికన్ ఫిక్షన్ ►ఉత్తమ నటి విభాగం అన్నెతే బెనింగ్: నయాడ్ లిల్లీ గ్లాడ్స్టోన్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సాండ్రా హూల్లర్: అటానమీ ఆఫ్ ఎ ఫాల్ కెర్రీ ములిగన్: మేస్ట్రో ఎమ్మాస్టోన్: పూర్ థింగ్స్ ►ఉత్తమ సహాయ నటుడు స్టెర్లింగ్ కె. బ్రౌన్ : అమెరికన్ ఫిక్షన్ రాబర్ట్ డినోరో: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ రాబర్ట్ డౌనీ జూనియర్: ఒప్పైన్ హైమర్ రేయాన్ గాస్లింగ్: బార్బీ మార్క్ రఫెలో: పూర్ థింగ్స్ ► ఉత్తమ సహాయ నటి ఎమిలీ బ్లంట్: ఒప్పైన్ హైమర్ డానియల్ బ్రూక్స్: ది కలర్ పర్పుల్ అమెరికా ఫెర్రారా: బార్బీ జోడీ ఫాస్టర్: నయాడ్ డేవైన్ జో రాండాల్ఫ్: ది హోల్డోవర్స్ ►బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రిఎట్, ఆర్థర్ హరారీ ది హోల్డోవర్స్: డేవిడ్ హేమింగ్సన్ మేస్ట్రో: బ్రాడ్లీ కూపర్, జోష్ సింగర్ మే డిసెంబర్: సామీ బరుచ్, అలెక్స్ మెకానిక్ పాస్ట్ లివ్స్: సీలింగ్ సాంగ్ ►బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ది ఫైర్ ఇన్సైడ్: ఫ్లామిన్ హాట్ ఐయామ్ జస్ట్ కెన్: బార్బీ ఇట్నెవ్వర్ వెంట్ అవే: అమెరికన్ సింఫనీ వజాజీ (ఏ సాంగ్ ఫర్ మై పీపుల్): కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్: బార్బీ ►బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అమెరికన్ ఫిక్షన్ ఇండియా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ కిల్లర్స్ ఆఫ్ది ఫ్లవర్ మూన్ ఒప్పైన్ హైమర్ పూర్ థింగ్స్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ బాబీ వైన్: ది పీపుల్స్ ప్రెసిడెంట్ ది ఇటర్నల్మెమెరీ ఫోర్ డాటర్స్ టు కిల్ ఏ టైగర్ 20 డేస్ ఇన్ మరియా పోల్ ►బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ఫిల్మ్ ది ఏబీసీస్ఆఫ్ బుక్ బ్యానింగ్ ది బార్బర్ ఆఫ్ లిటిల్ రాక్ ఐలాండ్ ఇన్ బిట్విన్ ది లాస్ట్ రిపేష్ షాప్ నైనాయ్ అండ్ వైపో ►బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఇయల్కాపిటానో (ఇటలీ పర్ఫెక్ట్ డేస్ (జపాన్) సొసైట్ ఆఫ్ ది స్నో (స్పెయిన్) ది టీచర్స్ లాంజ్ (జర్మనీ) ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ ( యూకే) ► బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ప్లే అమెరికన్ ఫిక్షన్: కార్డ్ జెఫర్సన్ బార్బీ: గ్రెటా గెర్విక్, నొవా బాంబాక్ ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్ పూర్ థింగ్స్: టోనీ మెక్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లాజర్ ►బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ అటానమీ ఇఫ్ ఎ ఫాల్: లారెంట్ ది హోల్డోవర్స్: కెవిన్ టెంట్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: తెల్మా స్కూన్మేకర్ ఒప్పైన్ హైమర్: జెన్నిఫర్ లేమ్ పూర్ థింగ్స్: యోర్గోస్ ►బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ బార్బీ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ నెపోలియన్ ఓపెన్హైమర్ పూర్ థింగ్స్ ►బెస్ట్ సౌండ్ ది క్రియేటర్ మ్యాస్ట్రో మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్: పార్ట్-1 ఒప్పైన్ హైమర్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ► ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ ది క్రియేటర్ గాడ్జిల్లా మైనస్ వన్ గార్డియన్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్3 మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్: పార్ట్-1 నెపోలియన్ ►బెస్ట్ సినిమాటోగ్రఫీ ఎల్కాండే : ఎడ్వర్డ్ లచ్మెన్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: రోడ్రిగో ప్రిటో మ్యాస్ట్రో: మాథ్యూ లిబ్టాక్యూ ఒప్పైన్ హైమర్: హైతీ వాన్ హోతిమా పూర్ థింగ్స్: రాబిన్ రియాన్ ► బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ జాక్వెలిన్ దురన్: బార్బీ జాక్వెలిన్ వెస్ట్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ జాంటీ ఏట్స్, డేవ్ క్రాస్మన్: నెపోలియన్ ఎలెన్ మిరాజ్నిక్: ఒప్పెన్ హైమర్ హాలీ వాడింగ్టన్: పూర్ థింగ్స్ ► బెస్ట్ మేకప్ అండ్ హెయిర్స్టైలింగ్ గోల్డా మాస్ట్రో ఓపెన్హైమర్ పూర్ థింగ్స్ సొసైటీ ఆఫ్ ది స్నో ► బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ది ఆఫ్టర్ ఇన్విన్సిబుల్ నైట్ ఆఫ్ ఫార్చ్యూన్ రెడ్, వైట్ అండ్ బ్లూ ది వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ సుగర్ ► బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ఫిల్మ్ లెటర్ టు ఎ పిగ్ నైంటీ- ఫైవ్ సెన్సెస్ అవర్ యూనిఫామ్ ప్యాచిడమ్ వార్ ఈజ్ ఓవర్! -
Cricket in Olympics: ఒలింపిక్స్లో క్రికెట్
ముంబై: లాంఛనం ముగిసింది. ఎట్టకేలకు క్రికెట్ ఒలింపిక్స్ క్రీడల్లో పునరాగమనం చేయనుంది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్తోపాటు స్క్వా‹Ù, బేస్బాల్/సాఫ్ట్బాల్, లాక్రాస్ (సిక్స్–ఎ–సైడ్), ఫ్లాగ్ ఫుట్బాల్ క్రీడాంశాలను కొత్తగా చేర్చారు. ఐదు కొత్త క్రీడాంశాలకు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో అనుమతి ఇవ్వాలని ఎగ్జిక్యూటివ్ బోర్డు చేసిన ప్రతిపాదనలకు సోమవారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యులు ఓటింగ్ ద్వారా ఆమోదం తెలిపినట్లు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ ప్రకటించారు. 99 మంది ఐఓసీ సభ్యుల్లో ఇద్దరు మాత్రమే ఈ ఐదు క్రీడాంశాల ప్రతిపాదనను వ్యతిరేకించగా... 97 మంది సమ్మతించారు. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో క్రికెట్ ఈవెంట్ను టి20 ఫార్మాట్లో పురుషుల, మహిళల విభాగాల్లో ఆరు జట్ల మధ్య నిర్వహిస్తారు. ఆతిథ్య దేశం హోదాలో అమెరికా జట్లకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా మిగతా ఐదు జట్లను నిర్ణయించే అవకాశముంది. ► 1877లో క్రికెట్లో తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. 1900 పారిస్ ఒలింపిక్స్లో ఒకే ఒకసారి క్రికెట్ మెడల్ ఈవెంట్గా ఉంది. పారిస్ గేమ్స్లో కేవలం ఫ్రాన్స్, బ్రిటన్ జట్లు మాత్రమే పాల్గొన్నాయి. బ్రిటన్ జట్టుకు స్వర్ణం, ఫ్రాన్స్ జట్టుకు రజతం లభించాయి. ఆ తర్వాత క్రికెట్ విశ్వ క్రీడల జాబితాలో చోటు కోల్పోయింది. టెస్టు, వన్డే ఫార్మాట్ల బదులు మూడు, నాలుగు గంటల్లో ఫలితం వచ్చే టి20 ఫార్మాట్ రాకతో క్రికెట్ స్వరూపమే మారిపోయింది. విశ్వవ్యాప్తంగా జరుగుతున్న టి20 లీగ్లు ఎంతోమంది క్రికెటర్లకు కొత్తగా అవకాశాలు కలి్పస్తుండటంతోపాటు ఆరి్థకంగా వారిని ఆదుకుంటున్నాయి. ప్రస్తుతం ఫుట్బాల్ తర్వాత ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగిన క్రీడగా క్రికెట్కు గుర్తింపు వచ్చింది. ఫలితంగా 128 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు క్రికెట్ ఒలింపిక్స్లో పునరాగమనం చేయనుంది. ► ప్రస్తుతానికి క్రికెట్తోపాటు మిగతా నాలుగు కొత్త క్రీడాంశాలు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ వరకే పరిమితం కానున్నాయి. తదుపరి ఒలింపిక్స్ క్రీడల్లోనూ క్రికెట్ కొనసాగడమనేది ఆయా దేశాల కార్యనిర్వాహక కమిటీల ఆసక్తిపై ఆధారపడి ఉంది. ఐఓసీ నిబంధనల ప్రకారం ఒలింపిక్స్ క్రీడల ఆతిథ్య దేశానికి తమకు నచి్చన కొన్ని క్రీడాంశాలను అదనంగా చేర్చే వెసులుబాటు ఉంది. 2032 ఒలింపిక్స్ ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్ నగరంలో జరుగుతాయి. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ ఆసక్తి కనబరుస్తోంది. ఆ్రస్టేలియా, భారత్లో క్రికెట్కు విపరీతమైన ఆదరణ ఉండటంతో 2032, 2036 ఒలింపిక్స్ల్లోనూ క్రికెట్ కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ► ‘విశ్వవ్యాప్తంగా 2.5 బిలియన్ అభిమానులు కలిగిన ప్రపంచంలోని రెండో అత్యధిక ఆదరణ కలిగిన క్రికెట్ క్రీడను ఒలింపిక్స్లోకి స్వాగతం పలుకుతున్నాం. అమెరికాలోనూ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ ద్వారా ఈ ఆటకు ఆదరణ పెరుగుతోంది. వచ్చే ఏడాది అమెరికా–వెస్టిండీస్ సంయుక్తంగా టి20 ప్రపంచకప్కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. నా మిత్రుడు విరాట్ కోహ్లికి సామాజిక మాధ్యమాల్లో ప్రపంచ వ్యాప్తంగా 340 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. బాస్కెట్బాల్ దిగ్గజం లేబ్రాన్ జేమ్స్, అమెరికన్ ఫుట్బాల్ స్టార్ టామ్ బ్రేడీ, గోల్ఫ్ స్టార్ టైగర్ వుడ్స్కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు కోహ్లికి ఉన్నారు. అందుకే క్రికెట్ కేవలం కొన్ని దేశాలకే పరిమితం కాకుండా విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందాలనే ఉద్దేశంతో ఒలింపిక్స్లో చోటు కల్పిస్తున్నాం’ అని లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ స్పోర్ట్స్ డైరెక్టర్, ఒలింపిక్ చాంపియన్ షూటర్ నికోలో కాంప్రియాని వ్యాఖ్యానించాడు. ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్కు చోటు లభించడంపట్ల ఐఓసీ సభ్యురాలు, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్లో క్రికెట్ శాశ్వతంగా కొనసాగేందుకు తమవంతుగా అన్ని చర్యలు తీసుకుంటామని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ గ్రెగ్ బార్క్లే తెలిపారు. ► రగ్బీ తరహాలో ఆడే ఫ్లాగ్ ఫుట్బాల్కు... స్వా్వష్కు ఒలింపిక్స్లో తొలిసారి స్థానం దక్కింది. బేస్బాల్/సాఫ్ట్బాల్కు వచ్చే ఏడాది పారిస్లో జరిగే ఒలింపిక్స్లో చోటు దక్కకపోయినా... అమెరికాలో ఎంతో ప్రాచుర్యం ఉండటంతో బేస్బాల్/సాఫ్ట్బాల్ లాస్ ఏంజెలిస్లో మళ్లీ కనిపిస్తాయి. ► హాకీ తరహాలో ఆడే లాక్రాస్ క్రీడాంశం 1904 సెయింట్ లూయిస్ ఒలింపిక్స్లో, 1908 లండన్ ఒలింపిక్స్లో మెడల్ ఈవెంట్గా ఉంది. ఆ తర్వాత 1928 అమ్స్టర్డామ్, 1932 లాస్ ఏంజెలిస్, 1948 లండన్ ఒలింపిక్స్లో ప్రదర్శన క్రీడగా కొనసాగి ఆ తర్వాత చోటు కోల్పోయింది. చదవండి: WC 2023: ఎదుటి వాళ్లను అన్నపుడు నవ్వుకొని.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు? అతడికి స్ట్రాంగ్ కౌంటర్ The proposal from the Organising Committee of the Olympic Games Los Angeles 2028 (@LA28) to include five new sports in the programme has been accepted by the IOC Session. Baseball/softball, cricket (T20), flag football, lacrosse (sixes) and squash will be in the programme at… — IOC MEDIA (@iocmedia) October 16, 2023 -
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త.. ఇకపై.. ‘ఒలింపిక్స్’లో కూడా.. గ్రీన్ సిగ్నల్
Cricket's Inclusion In 2028 Los Angeles Games: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త..! విశ్వ క్రీడల్లో క్రికెటర్లను చూడాలన్న అభిమానుల కల 2028లో తీరనుంది. ఇప్పటికే ఆసియా క్రీడల్లో క్రికెట్ను చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా.. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ను చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఐఓసీ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ విషయం గురించి ఏఓసీ అధ్యక్షుడు థామస్ బాష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ చేర్చాలన్న నిర్వాహకుల ప్రతిపాదనకు కమిటీ అంగీకారం తెలిపినట్లు ప్రకటించారు. 2028 ఒలింపిక్స్లో కొత్తగా చేర్చనున్న ఐదు క్రీడాంశాల్లో కూడా క్రికెట్ కూడా ఉందని వెల్లడించారు. ఆ ఐదు క్రీడల్లో ఒకటిగా క్రికెట్ కూడా కాగా ఒలింపిక్స్లో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. బేస్బాల్/సాఫ్ట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్(నాన్- కాంటాక్ట్ అమెరికన్ ఫుట్బాల్), స్క్వాష్, లాక్రోస్లతో పాటు క్రికెట్ కూడా చేర్చనున్నారు. కాగా అక్టోబరు 15 నుంచి 17 వరకు ముంబైలో ఐఓసీ సమావేశ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే ఐఓసీ సభ్యులు ముంబైకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ రెండో రోజున థామస్ బాష్ ఈ మేరకు ప్రకటన చేశారు. తొలి అడుగు.. పసిడి పతకాలతో చరిత్ర ఇక ఇటీవల ఆసియా క్రీడలు-2023 సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి తొలిసారి క్రికెట్ జట్లను చైనాకు పంపిన విషయం తెలిసిందే. హోంగ్జూలో టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నమెంట్లో భారత మహిళల, పురుష జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో మహిళా జట్టు, రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని టీమిండియా ద్వితీయ శ్రేణి జట్లు ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన ఎడిషన్లోనే గోల్డ్ మెడల్స్ గెలిచి చరిత్ర సృష్టించాయి. కాగా క్రికెట్కు భారత్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఒలింపిక్స్లో ఈ క్రీడను చేర్చడం ద్వారా నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రసార హక్కుల రూపంలో ఆర్జించే అవకాశం ఉంది. చదవండి: WC 2011లో నేనే కెప్టెన్ అయి ఉంటే అతడిని తప్పక తీసుకునేవాడిని.. కానీ! -
లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్లో క్రికెట్!
దుబాయ్: లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ మ్యాచ్లకు టాస్ పడే అవకాశాలు మెరుగయ్యాయి. 2028లో అమెరికాలో జరిగే ఈ విశ్వక్రీడల కోసం నిర్వాహకులు క్రికెట్ క్రీడను చేర్చేందుకు సిఫారసు చేశారు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) హర్షం వ్యక్తం చేసింది. ఒలింపిక్స్లో క్రికెట్ నిర్వహణ కోసం ఐసీసీ... లాస్ ఏంజెలిస్ నిర్వాహక కమిటీతో కొంతకాలంగా సంప్రదింపులు జరుపుతోంది. మొత్తానికి కమిటీ సిఫారసు చేయడంతో ఇక అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆమోదమే మిగిలుంది. ఐఓసీ ఓకే అంటే అమెరికాలో క్రికెట్ ఆటకు రంగం సిద్ధమవుతుంది. ఈనెల 15 నుంచి 17 వరకు ముంబైలో జరిగే ఐఓసీ సమావేశంలో క్రికెట్ను ఒలింపిక్స్లో క్రీడాంశంగా చేర్చాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటారు. -
ఐవీఎఫ్ హార్మోన్ల బదులు అబార్షన్ బిళ్లలిచ్చారు!
న్యూయార్క్: వైద్యపరమైన నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ ఉదంతం. అమెరికాలోని లాస్ ఏంజెలెస్లో సంతానం కోసం ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించిన తమికా థామస్ అనే మహిళకు మెడికల్ షాపు ఐవీఎఫ్ హార్మోన్ల బదులు పొరపాటున అబార్షన్ మాత్రలు ఇచి్చంది. ఏకంగా ఇద్దరు గర్భస్థ శిశువుల మరణానికి కారణమైంది! పుట్టబోయే బిడ్డలను పొట్టన పెట్టుకున్నారంటూ మెడికల్ షాప్పై ఆమె స్టేట్ బోర్డ్ ఆఫ్ ఫార్మసీకి ఫిర్యాదు చేసింది. ప్రిస్క్రిప్షన్లోని డాక్టర్ చేతిరాత అర్థం కాకపోవడం ఈ దారుణ పొరపాటుకు దారి తీసినట్టు విచారణలో తేలింది. ‘షాపు సిబ్బంది తప్పు మీద తప్పు చేశారు. ఆ రాతను తమకు తోచినట్టుగా అర్థం చేసుకుని ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. పైగా తాము ఏం మందులు ఇస్తున్నదీ, వాటివల్ల ఏం జరుగుతుందన్నది విధిగా చెప్పాల్సి ఉండగా ఆ పని కూడా చేయలేదు’అని బోర్డు తేలి్చంది. మెడికల్ షాప్కు పది వేల డాలర్ల జరిమానా విధించింది. కానీ దీనివల్ల పుట్టక ముందే కన్ను మూసిన తమ బిడ్డలు తిరిగొస్తారా అంటూ థామస్ దంపతులు విలపిస్తున్నారు. వారికి నలుగురు సంతానం. పెద్ద కుటుంబం కావాలనే కోరికతో మళ్లీ పిల్లలను కనాలని నిర్ణయించుకుని ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించారు. -
రూ.12.5 కోట్ల బుద్ధుడి విగ్రహం చోరీ.. కానీ అమ్మడం కష్టమేనట!
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ఆర్ట్ గ్యాలరీలో 1.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 12.5 కోట్లు) విలువైన శతాబ్దాల నాటి జపాన్ కాంస్య బుద్ధ విగ్రహం ఇటీవల చోరీకి గురైంది. ఆ చోరీకి సంబంధిచిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సెప్టెంబర్ 18న తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో బెవర్లీ గ్రోవ్లోని బరాకత్ గ్యాలరీలో 113 కిలోల బరువున్న ఈ శిల్పం చోరీకి గురైందని లాస్ ఏంజిల్స్ పోలీసు విభాగం మీడియాకు తెలిపింది. గ్యాలరీ గేట్ను బద్దలు కొట్టి ట్రక్కుతోపాటు లోపలికి దుండగుడు ప్రవేశించినట్లు సీసీటీవీ ఫుటేజీ చూపిస్తోంది. ఈ పురాతన బుద్ధుడి విగ్రహం 1603-1867 నాటిదని గ్యాలరీ యజమాని ఫయేజ్ బరాకత్ చెప్పారు. అద్భుతమైన ఈ కళాఖండం 55 సంవత్సరాల క్రితం ఆయన స్వాధీనంలోకి వచ్చింది. ఇలాంటిది మరెక్కడైనా ఉంటుందని తాను అనుకోనని గ్యాలరీ డైరెక్టర్ పాల్ హెండర్సన్ న్యూయార్క్ పోస్ట్తో తెలిపారు . నాలుగు అడుగుల పొడవు, లోపుల బోలుగా ఉండే ఈ కాంస్య విగ్రహం చాలా ప్రత్యేకమైందని, దీన్ని చోరీ చేసిన వ్యక్తి అమ్మడం చాలా కష్టమని ఆయన అన్నారు. -
స్టార్ హీరో లగ్జరీ విల్లా.. అద్దెకు కూడా ఇస్తారట!
స్టార్ హీరో అంటేనే ఆ రేంజే వేరు. ఎక్కడికెళ్లినా సరే ప్రత్యేకంగా కనిపించాల్సిందే. అలా ఏ దేశానికి వెళ్లినా వారికంటూ ప్రత్యేక సదుపాయాలు ఉండేలా లగ్జరీ విల్లాలు కొనేస్తుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. ప్రస్తుతం ఆయన నటించిన జవాన్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో షారుక్ జోడీగా నయనతార నటించింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బాలీవుడ్ హీరో ఆస్తుల విషయానికొస్తే ముంబయి, దుబాయ్లో కోట్ల విలువైన సౌధాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే విదేశాల్లో షారుక్ ఖాన్కు ఉన్న మరో ఖరీదైన విల్లా గురించి తెలుసుకుందాం. (ఇది చదవండి: దేశం పేరు మార్పుపై అమితాబ్ ఆసక్తికర ట్వీట్) అమెరికాలోని లాజ్ ఎంజిల్స్లో షారుక్ ఖాన్కు అత్యాధునిక వసతులతో ఖరీదైన విల్లా కూడా ఉంది. అంతే కాకుండా ఆ విల్లాను అద్దెకు కూడా ఇస్తారంట. ఓ రకంగా ఆ విల్లా ద్వారా పెద్ద బిజినెస్ నడిపిస్తున్నారు బాలీవుడ్ బాద్షా. అంతే కాకుండా ఫ్యామిలీతో కలిసి యూఎస్ వెళ్లినప్పుడు అక్కడే బస చేస్తారు. ఈ అత్యంత ఖరీదైన విల్లాలో ఆరు విశాలమైన గదులు, డ్రాయింగ్ రూమ్, స్విమ్మింగ్ పూల్, జిమ్ లాంటి ప్రత్యేక సదుపాయాలు కూడా ఉన్నాయి. అద్దె ఎంతో తెలుసా? లగ్జరీ సదుపాయాలున్న షారుక్ ఖాన్ విల్లాను అద్దెకు కూడా తీసుకోవచ్చు. ఆ ఇంట్లో ఒక రోజు ఉండాలంటే రూ.1.96 లక్షలు చెల్లించాల్సిందే. ఇంకేముంది మీరెప్పుడైనా అమెరికా లాస్ ఎంజిల్స్ వెళ్తే స్టార్ హీరో ఇంటికి అద్దె చెల్లించి విలాసవంతమైన సౌకర్యాలను ఆస్వాదించవచ్చు. గతంలో ఈ విల్లా గురించి షారుక్ మాట్లాడుతూ..బయటి ప్రపంచానికి దూరంగా ఫ్యామిలీతో కొంత సమయం ఉండేందుకు.. రిఫ్రెష్ అయ్యేందుకు ఉంటుందని వెల్లడించారు. జబ్ హ్యారీ మెట్ సెజల్ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఈ ఇంట్లోనే ఎక్కువ రోజులు ఉన్నారు షారుక్ భాయ్. ఇప్పటికే అతనికి దూబాయ్లోనూ రూ.200 కోట్ల విలువైన విల్లాను గిఫ్ట్గా వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. షారుక్ నటించిన జవాన్ సెప్టెంబర్ 7 న థియేటర్లలోకి రానుంది. (ఇది చదవండి: అందుకే అడల్ట్ సినిమాలు చేశా, ఎలాగో డబ్బులు కూడా బాగా వచ్చేవి..) -
భార్యను చంపిన జడ్జి.. ఇంట్లో 47 తుపాకులు, మందుగుండు సామాగ్రి..
లాస్ ఏంజెల్స్: కాలిఫోర్నియాకు చెందిన ఒక జడ్జి బాగా మద్యం సేవించిన తర్వాత భార్యతో వాగ్వాదానికి దిగారు. గొడవ అంతకంతకు పెద్దది కావడంతో మద్యం మత్తులో జడ్జి తనవద్ద ఉన్న తుపాకీని తీసి భార్యను కాల్చి చంపేశాడు. అనంతరం తన సహచరుడికి మెసేజ్ పెడుతూ.. రేపు నేను కోర్టుకి రాలేను.. నేను జైలులో ఉంటానని సందేశం పంపించినట్లు తెలిపారు పోలీసులు. కాలిఫోర్నియాకు చెందిన ఆరెంజ్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జి జెఫ్రీ ఫెర్గ్యూసన్(72) ఆగస్టు 3న తన భార్య షెరిల్(65) ఒక రెస్టారెంటుకు వెళ్లగా అక్కడ వారిద్దరూ వాగ్వాదానికి దిగారు. అలా వారి మధ్య జరిగిన వివాదం కొద్దిసేపటికి బాగా ముదిరిపోయింది. ఆరెంజ్ కౌంటీ డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ క్రిస్టోఫర్ అలెక్స్ తెలిపిన వివరాల ప్రకారం వారిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా గొడవ సద్దుమణగకపోవడంతో షెరిల్.. పదే పదే వేలు చూపించే బదులు ఒక తుపాకీ చూపించి కాల్చేయొచ్చు కదా అని అరిచింది. వెంటనే ఫెర్గ్యూసన్ తన వద్ద ఉన్న తుపాకీని తీసి తన భార్య గుండెల్లో చాలా దగ్గర నుండి కాల్చేశారు. అనంతరం తన స్నేహితుడికి ఫోనులో.. నేను సహనం కోల్పోయి, నా భార్యను చంపేశాను.. రేపు నేను రాకపోవచ్చు, బహుశా పోలీసుల అదుపులో ఉంటానేమోనని సందేశం పంపారు. అనంతరం ఫెర్గ్యూసన్ స్వయంగా తానే 911కి ఫోన్ చేసి పోలీసులకు విషయాన్ని వివరించారు. పోలీసులు అతడి ఇంటిని సోదా చేయగా ఆయన ఇంట్లో మొత్తం 47 తుపాకులు, 26,000 వరకు మందుగుండు సామాన్లు లభించినట్లు తెలిపారు. అరెస్టు చేసిన సమయంలో జడ్జి ఫెర్గ్యూసన్ బాగా మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు కోర్టుకు తెలపగా ఫెర్గ్యూసన్ నేరాన్ని అంగీకరించలేదు. ఆయన తరపు లాయర్ పాల్ మేయర్ ఈ హత్య ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదని పొరపాటున జరిగిందని దీన్ని నేరంగా పరిగణించవద్దని అన్నారు. కోర్టు లాయర్ వాదనంతో ఏకీభవించి జడ్జికి బెయిల్ మంజూరు చేయడమే కాదు మద్యం సేవంచవద్దని హితవు కూడా పలికింది. ఇది కూడా చదవండి: ప్రధానిగా కాదు ఒక హిందువుగా వచ్చాను: రిషి సునాక్ -
యంగ్ కమల్.. ఓ టెక్నిక్
పాతికేళ్ల క్రితం కమల్హాసన్ వయసుకు మించి కనిపించిన పాత్రల్లో ‘ఇండియన్’లో సేనాపతి, ‘భామనే సత్యభామనే’లో వృద్ధురాలి పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. నాలుగు పదుల వయసులో ఆరు పదుల వయసుకి మించి కమల్ కనిపించిన పాత్రలివి. ఇప్పుడు ఇంకో ఏడాదికి కమల్ ఏడు పదుల వయసుని టచ్ చేస్తున్న నేపథ్యంలో యువకుడిలా కనిపించాల్సి వస్తోంది. ‘ఇండియన్’లో కమల్ని యంగ్ అండ్ ఓల్డ్ పాత్రల్లో చూపించిన దర్శకుడు శంకర్ ఈ చిత్రం సీక్వెల్ ‘ఇండియన్ 2’లో కూడా వృద్ధుడిగా, యువకుడిగా చూపించనున్నారు. యువకుడి పాత్ర కోసం సాంకేతిక సహాయం తీసుకుంటున్నారట. ప్రస్తుతం శంకర్ లాస్ ఏంజిల్స్లో ఉన్నారు. ‘‘లాస్ ఏంజిల్స్లోని లోలా వీఎఫ్ఎక్స్లో అధునాతన సాంకేతికతను పర్యవేక్షిస్తున్నాను’’ అని శంకర్ పేర్కొన్నారు. కమల్ని యువకుడిగా చూపించడానికే లోలా సంస్థని శంకర్ సంప్రదించి ఉంటారనే ఊహాగానాలు నెలకొన్నాయి. ఎందుకంటే ‘డీ–ఏజింగ్’ (యంగ్గా చూపించడం) టెక్నాలజీకి లోలా పాపులర్. -
వరుడు కావలెను.. లైఫ్ లాంగ్ కాదంట.. బిగ్ ఆఫర్ ఇదే..
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు చెబుతుంటారు. కానీ.. వారి మాటలను పట్టించుకోకుండా కొందరు పెడచెవిన పెడతారు. అచ్చం అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. ఆమె వయసు 35 ఏండ్లు. ఇప్పటి వరకు డేటింగ్లో మునిగి తేలింది. ఇక, పుణ్య కాలం గడిపోయాక వరుడు కావలెను అని కోరుకుంటోంది. ఈ క్రమంలో తనకు భర్తను వెతికిపెట్టిన వారికి భారీ ఆఫర్ ప్రకటించింది. వివరాల ప్రకారం.. లాస్ ఏంజెల్స్కు చెందిన ఈవ్ టిల్లే కౌల్సన్(35).. కార్పొరేట్ లిటిగేషన్ అటార్నీగా పని చేస్తుంది. కానీ ఒంటరిగా ఉంటూ ఐదేండ్ల పాటు డేటింగ్ చేసింది. అయితే ఆమెకు ఈ డేటింగ్ జీవితం మీద విరక్తి రావడంతో.. తనకంటూ ఓ తోడు ఉండాలని నిర్ణయించుకుంది. దీంతో తనకు పది లక్షల ఫాలోవర్లు ఉన్న టిక్ టాక్ వేదికగా.. కౌల్సన్ ప్రకటన చేసింది. తనకు భర్తను వెతికి పెడితే 5 వేల డాలర్లు(రూ. 4,10,462) బహుమతిగా ఇస్తానని ప్రకటించింది. ఇదే సమయంలో కొన్ని కండీషన్స్ కూడా ఆమె పెట్టింది. మీరు వెతికిపెట్టే భర్తతో ఎక్కువ కాలం ఉండలేను. కేవలం 20 సంవత్సరాలు మాత్రమే ఉండి, ఆ తర్వాత విడాకులు ఇస్తాను అంటూ మెలిక పెట్టి ట్విస్ట్ ఇచ్చింది. అంతే కాకుండా తన డ్రీమ్ బాయ్ ఇలా ఉండాలని చెప్పుకొచ్చింది. వరుడికి ఉండాల్సిన స్పెషల్ లక్షణాలివే.. - 27 నుంచి 40 ఏండ్ల మధ్య వయసు ఉండాలి. - ఎత్తు 5 అడుగులపైనే ఉండాలి. - పిల్లలు, జంతువులతో పాటు ఆటలను ప్రేమించాలి. - అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి. - ఎత్తుకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాననంటే తాను పొడవుగా ఉంటాను కాబట్టి.. అతను కూడా ఎత్తుగా ఉంటేనే మంచిదని తెలిపింది. - హీల్స్ ధరించొద్దని గతంలో డేటింగ్ చేసిన వ్యక్తులు నన్ను అడిగారు. కానీ అది నాకు ఇష్టం లేదు. - డ్రగ్స్ కూడా తీసుకోవద్దని చెప్పింది. - ఇక ఫైనల్గా పెళ్లైన తర్వాత రిజిస్ట్రేషన్ పేపర్పై సంతకం చేసిన తర్వాత తనకు పెళ్లి సంబంధం చూసిన వ్యక్తికి తాను చెప్పిన విధంగానే నగదు బహుమతిని అందిస్తానని కౌల్సన్ ప్రకటించింది. I’m offering a $5,000 referral bonus to anyone who finds me a husband https://t.co/T3ntYQmj5A pic.twitter.com/D6mwMsKRGn — New York Post (@nypost) July 11, 2023 -
విడాకులు తీసుకున్న జంట.. ఇలా కూడా ఉంటారా బ్రో!
సాధారణంగా మన భార్య, భర్తలు విడాకులు తీసుకునే వార్తలు వింటుంటాం. భార్య, భర్తల మధ్య మనస్పర్థలతో విడాకుల కోసం కోట్లు మెట్లెక్కతుంటారు. కానీ.. ఈ విడాకులు గురించి వింటే మాత్రం ఇదేం పోయే కాలం రా నాయనా అనకుండా ఉండలేరు. ఎందుకంటే ఇక్కడ విడాకులు తీసుకుంది జంట కాదు.. ఇద్దరు ఘనులే. ఇంతకీ ఆ ఇద్దరి కథేందో జర చూద్దాం పదండి. (ఇది చదవండి: పుష్ప-2లో ఐటం సాంగ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లా! ) అమెరికాలోని లాస్ఎంజిల్స్కు చెందిన సంగీత సంచలనం రికీ మార్టిన్, జ్వాన్ యోసెఫ్ అనే ఇద్దరు పురుషులు 2018లో వివాహం చేసుకున్నారు. అవును మీరు విన్నది నిజమే.. పెళ్లయిన దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అంతే కాకుండా ఓ ఎమోషనల్ నోట్ను కూడా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇద్దరు జెంట్స్ పెళ్లి చేసుకోవడం.. అది మళ్లీ డైవర్స్ తీసుకోవడమేంటని తెగ చర్చించుకుంటున్నారు. నోట్లో రాస్తూ.. "మా పిల్లల పట్ల ప్రేమ, గౌరవంతో మా వివాహాన్ని ముగించాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ ఆరేళ్లలో మేము జంటగా అద్భుతమైన క్షణాలు ఆస్వాదించాం. దయచేసి మా నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరుతున్నాం. ఇప్పుడు ఆరోగ్యకరమైన కుటుంబం కోసం.. మా పిల్లల కోసం స్నేహపూర్వకమైన సంబంధాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం. మా పట్ల ఉన్న ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం, ప్రేమను నిలబెట్టుకుంటాం.' అంటూ ప్రత్యేకంగా ఒక ప్రకటనలో తెలిపారు. కాగా.. మార్టిన్, యోసెఫ్కు 2018లో కుమార్తె లూసియా జన్మించగా.. 2019లో కుమారుడు రెన్ పుట్టారు. అయితే మార్టిన్కు ఇదివరకే 2008లో జన్మించిన మాటియో, వాలెంటినో అనే కవల పిల్లలు కూడా ఉన్నారు. యోసెఫ్ ఒక చిత్రకారుడు కాగా.. ఆయన తన వృత్తిలో ప్రతిభకు గానూ అనేక అవార్డులను గెలుచుకున్నాడు. మార్టిన్ ఆపిల్ టీవీ ప్లస్లో ప్రసారమయ్యే పీరియడ్ కామెడీ "పామ్ రాయల్"లో నటించారు. ఇందులో క్రిస్టెన్ విగ్, లారా డెర్న్, అల్లిసన్ జానీ, కరోల్ బర్నెట్లతో కలిసి మార్టిన్ కనిపిస్తారు. కాగా.. 2015లో డేటింగ్ ప్రారంభించిన మార్టిన్, యోసెఫ్.. 2016లో యామ్ఫార్ ఇన్స్పిరేషన్ గాలాలో అఫీషియల్గా ప్రకటించారు. ఆ తర్వాత వీరిద్దరు 2018లో వివాహం బంధంతో ఒక్కటయ్యారు. (ఇది చదవండి: భార్య కోసం ఏకంగా ఆస్పత్రినే బుక్ చేసిన స్టార్ హీరో!) -
ఇంద్ర భవనం! బ్రిట్నీ స్పియర్స్ భారీ నష్టానికి అమ్మేసిన ఇల్లు ఇదే..
పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ లాస్ ఏంజిల్స్లోని విలాసవంతమైన బంగళాను ఏడాది కూడా కాకుండానే భారీ నష్టానికి అమ్మేసింది. ఈ ఇంటిని చూస్తే ఇంద్ర భవనం అంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. లాస్ ఏంజిల్స్ నగరంలోని కాలాబాసాస్ ఎన్క్లేవ్లో ఉన్న బ్రిట్నీ స్పియర్స్ నివాసం కొన్ని నెలల క్రితం 10.1 మిలియన్ డాలర్లకు చేతులు మారింది. ఏడాది క్రితం ఆమె దాన్ని 11.8 మిలియన్ డాలర్లకు కొనుక్కున్నారు. 2022 జూన్లో ఈ ఇంటిని కొనుగోలు చేసింది బ్రిట్నీ స్పియర్స్ భర్త సామ్ అస్గారితో కలిసి కొన్నాళ్లపాటు ఇక్కడే ఉండేది. అయితే ఇది అందరికీ తెలిసిపోయి తమ ఏకాంతానికి అనుకూలంగా లేకపోవడంతో వారు దీన్ని వదిలి వేరే ఇంటికి మారిపోయారు. 2008లో నిర్మించిన ఈ భవనంలో ఆరు బెడ్రూమ్లు, తొమ్మిది స్నానపు గదులు 11,600 చదరపు అడుగుల సింగిల్-లెవల్ లివింగ్ స్పేస్లో విస్తరించి ఉన్నాయి. వంపు హాలులు, కాఫర్డ్ సీలింగ్లు, చెక్కతో చేసిన యాక్సెంట్లు ఇంటి అంతటా ఉన్నాయి. విలాసవంతమైన గౌర్మెట్ కిచెన్, లెదర్ రిక్లైనింగ్ సీట్లు కలిగిన హోమ్ థియేటర్, వాక్-ఇన్ సేఫ్, గేమ్ రూమ్, పెట్ వాష్ బేసిన్ వంటివి చూస్తే కళ్లు చెదరకతప్పదు. వీటితోపాటు వాటర్ ఫౌంటైన్లు, మొజాయిక్ టైల్డ్ పూల్, హాట్ టబ్, వాటర్ ఫాల్స్, బార్బెక్యూ పెవిలియన్, గెస్ట్ హౌస్ వంటివి కూడా ఉన్నాయి. -
ఈ ఇల్లు చాలా ప్రత్యేకం: అమ్మకానికి బ్రిడ్జ్ హౌస్.. ధర ఎన్ని కోట్లో తెలుసా?
మీరు ఇప్పటివరకూ ఇన్నో రకాల ఇళ్లు చూసి ఉంటారు. ఖరీదైన భవంతుల గురించి విని ఉంటారు. కొండలపై రూ.కోట్లు పెట్టి కట్టిన , విలాసవంతమైన నివాసాల గురించి చదివి ఉంటారు. కానీ ఓ కాలువ బ్రిడ్జిపై నిర్మించిన ఈ ప్రత్యేకమైన ఇంటి గురించి తెలుసా? యునైటెడ్ స్టేట్స్లోని లాస్ ఏంజెల్స్లోని అల్హంబ్రా వాష్ కాలువకు అడ్డంగా బ్రిడ్జ్పై నిర్మించిన ఇల్లు తాజాగా అమ్మకానికి వచ్చింది. దీని విలువ దాదాపు రూ. 2 కోట్లు. ఒక పడకగది, ఒక బాత్రూమ్ ఉన్న ఈ ప్రత్యేకమైన ఇంటిని కంపాస్ రియల్ ఎస్టేట్ పోర్టల్ వెబ్సైట్లో విక్రయానికి ఉంచారు. 450 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని కొనుక్కునే వారు అందమైన రూఫ్ టాప్ డాబాను ఆనందించవచ్చని, రిటైల్ దుకాణాలు, ఎల్ఏ ఫిట్నెస్, 99 రాంచ్, మెయిన్ స్ట్రీట్లో మంచి ఫుడ్స్టాల్స్కు సమీపంలో ఉండవచ్చని, ఇది నిజంగా గొప్ప ఆస్తి అని ఇంటిని అమ్మకానికి ఉంచిన పోర్టల్ పేర్కొంది. Welcome to the L.A. Troll Apartment. You can live under a bridge for only $250,000 https://t.co/6crQ2gvOls pic.twitter.com/l5M7Yjpbjk — Mighty AP (@themightyap) June 6, 2023 లాస్ ఏంజిల్స్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆహ్లాదకరమైన కాలువ నీటి ప్రవాహానికి ఎదురుగా, రోడ్డు వంతెన పక్కన ఈ ఇల్లు ఉంటుంది. ఇంటి డాబా మీదకు వెళ్తే సుందరమైన పరిసరాలను వీక్షించవచ్చు. ఈ ఇల్లు ఒకప్పటి తన హైస్కూల్ స్నేహితుని తల్లిదండ్రులకు చెందినదని దీన్ని అమ్మకానికి ఉంచిన కంపాస్ ఏజెంట్ డౌగ్ లీ చెప్పారు. ఇదీ చదవండి: Oldest Real Estate Agent: 74 ఏళ్ల వయసులో రియల్ఎస్టేట్ ఏజెంట్! పరీక్ష రాసి మరీ.. -
Priyanka Chopra: సిటాడెల్ ప్రమోషన్స్లో మెరిసిన ప్రియాంక చోప్రా (ఫొటోలు)
ప్రి -
అంతర్జాతీయ పురస్కార బలగం
హాస్య నటుడు వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్రామ్ జంటగా నటించారు. ‘దిల్’ రాజు సారథ్యంలో శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమా మార్చి 3న విడుదలై, మంచి విజయం సాధించింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకుంది. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్లో ఈ చిత్రం బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీతోపాటు బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డులకు ఎంపికైన విషయాన్ని చిత్రదర్శకుడు వేణు వెల్లడించారు. ‘నా బలగం’కు ఇది మూడో అవార్డు. ప్రపంచ వేదికపై బలగం మెరుస్తోంది’’ అన్నారు. ఈ అవార్డును ఛాయాగ్రాహకుడు ఆచార్య వేణు, దర్శకుడు వేణు అందుకోనున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఏపీ ఎన్నికలపై సీఎం జగన్ ట్వీట్
May 15th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవితవ్యం:
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి హేయమైన చర్య
విజయం వైఎస్సార్ సీపీదే
20న ఎడ్ల బండలాగుడు పోటీలు
No Headline
ఓటేసిన 15,89,412 మంది
Hyderabad: కాస్త పెరిగినా చివరి స్థానమే..
జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement