-
ధనుష్, నాగార్జున మల్టీస్టారర్ ప్రాజెక్ట్..!
-
‘మెగా’ డైరెక్టర్తో ‘అక్కినేని’మల్టీస్టారర్.. స్క్రిప్ట్ రెడీ!
తండ్రీకొడుకు నాగార్జున, అఖిల్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ ఫిల్మ్ రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారట మోహన్ రాజా. ప్రస్తుతం ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారట. కాగా ఈ మధ్య వరుసగా యాక్షన్ సినిమాలతో బిజీగా గడిపారు నాగార్జున. ఓ చిన్న బ్రేక్ తర్వాత ఈ సినిమాను ఆరంభించాలనే ఆలోచనలో ఉన్నారట నాగార్జున. (చదవండి: గాడ్ ఫాదర్ ఆ రేంజ్ బ్లాక్బస్టర్) ఈలోపు అఖిల్ కూడా తన తాజా చిత్రం ‘ఏజెంట్’ను దాదాపు పూర్తి చేసేస్తారట. ఆ తర్వాత తండ్రితో కలిసి చేయనున్న సినిమా సెట్స్లో అడుగుపెడతారని టాక్. ఇదిలా ఉంటే.. ఇది నాగార్జున కెరీర్లో వందో చిత్రం అనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
నాగ్ మల్టీస్టారర్ ఆగిపోయిందా..?
ఈ ఏడాది దేవదాసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్ నాగార్జున తరువాత ఒక్క తెలుగు సినిమా కూడా అంగీకరించలేదు. బాలీవుడ్లో అతిథి పాత్రలో నటిస్తున్న బ్రహ్మాస్త్ర షూటింగ్ పూర్తి చేసిన నాగ్, కోలీవుడ్లో మరో మల్టీస్టారర్కు ఓకె చెప్పాడు. పవర్ పాండి సినిమాతో దర్శకుడిగా మారిన తమిళ స్టార్ హీరోగా ధనుష్ ఓ భారీ మల్టీస్టారర్ను డెరెక్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు. ముందుగా ఈ మల్టీస్టారర్లో రజనీకాంత్ను నటింప చేసేందుకు ప్రయత్నాలు జరిగినా.. తరువాత ఆ స్థానంలో నాగార్జునను తీసుకున్నారు. పూజ కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ సినిమా ఇంత వరకు పట్టాలెక్కలేదు. అయితే ఇటీవల ధనుష్ మారి 2 రిలీజ్ తరువాత మల్టీస్టారర్ పనులు ప్రారంభిస్తారని అంతా భావించారు. అయితే మారి 2 రిలీజ్ అయిన వెంటనే ధనుష్ , అసురన్ అనే మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. అసురన్ షూటింగ్ జనవరిలోనే ప్రారంభమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ధనుష్ డైరెక్ట్ చేయబోయే మల్టీస్టారర్ ఆగిపోయిందన్న ప్రచారం మొదలైంది. తేనాండల్ మూవీస్ ఆర్థిక సమస్యలు కూడా ఈ ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టడానికి ఓ కారణం అని తెలుస్తోంది. ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే చిత్రయూనిట్ నుంది అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
నాగ్, ధనుష్ మల్టీస్టారర్కు టైటిల్ ఫిక్స్
నటుడు ధనుష్ జోడు గుర్రాల పయనాన్ని జోరుగా సాగిస్తున్నారు. నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత అంటూ పలు కోణాలు ఉన్నాయి. ధనుష్ ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా బిజీగా ఉన్నారు. అదే సమయంలో దర్శకుడిగానూ దూసుకుపోతున్నారు. ధనుష్ నటించిన తాజా చిత్రం వడచెనై ఇటీవల తెరపైకి వచ్చి కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటిస్తున్న ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా, బాలాజిమోహన్ దర్శకత్వంలో నటించి నిర్మిస్తున్న మారి–2 చిత్రాలు వరుసగా విడుదలకు ముస్తాబవుతున్నాయి. వడచెన్నై చిత్ర దర్శకుడు వెట్రిమారన్ త్వరలో ధనుష్తో మరో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఇది వెక్కై అనే నవల ఆధారంగా తెరకెక్కనున్నట్లు సమాచారం. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థలో ధనుష్ నటించనున్నారట. ఈ సంస్థ ప్రస్తుతం అజిత్ హీరోగా విశ్వాసం చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతి సంబరాలకు సిద్ధం అవుతోంది. సత్యజ్యోతి ఫిలింస్ టీజే.త్యాగరాజన్ నటుడు ధనుష్ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇటీవల రాక్షసన్ చిత్రంతో విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు రామ్కుమార్ దర్శకత్వంలోనూ ధనుష్ ఒక చిత్రం చేయనున్నారు. ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తూనే ఒక మల్టీస్టారర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. బహుభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో టాలివుడ్ స్టార్ నటుడు నాగార్జున మరో హీరోగా నటిస్తున్నారు. దర్శకుడు ఎస్జే.సూర్య, నటి అదితిరావు తదితర భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి నాన్ రుద్రన్ అనే టైటిల్ను నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్ర కథలో 15వ శతాబ్ధానికి సంబంధించిన సన్నివేశాలుంటాయని, ఆ ఎపిసోడ్లోనే నాగార్జున కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. -
రాజమౌళి మల్టీస్టారర్పై ఇంట్రస్టింగ్ న్యూస్
బాహుబలి సక్సెస్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాజమౌళి ప్రస్తుతం ఓ భారీ మల్టీస్టారర్ను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ల కాంబినేషన్లో జక్కన్న దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుందని ఇప్పటికే ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనుందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ స్వాతంత్ర్యోధ్యమ కాలానికి సంబంధించిన కథ అని తెలుస్తోంది. ఇప్పటికే రెడీ అవుతున్న సెట్స్, ప్రాపర్టీస్ అన్ని ఆ కాలానికి తగ్గట్టుగా డిజైన్ చేస్తున్నారట.డిసెంబర్ నుంచి ప్రారంభం కానున్న తొలి షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొననున్నాడు చరణ్ కాస్త ఆలస్యంగా ఆర్ఆర్ఆర్ టీంతో జాయిన్ కానున్నాడట. -
మల్టీస్టారర్లో హీరోగా..!
విలన్గా టర్న్ అయిన తరువాత ఫుల్ బిజీ అయిన సీనియర్ యాక్టర్ జగపతి బాబు, అడపాదడపా హీరోగానూ ఆకట్టుకున్నే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల పటేల్ సర్ సినిమాలో హీరోగా నటించిన జగ్గుభాయ్ త్వరలో ఓ బహుభాషా చిత్రంలో హీరోగా నటించనున్నాడట. కొత్త దర్శకుడు అన్బరసన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్, జాకీష్రాఫ్లు కూడా హీరోలుగా నటిస్తున్నారట. మరో కీలక పాత్రలో ఓ స్టార్ హీరో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్పై వినాయకచవితి రోజు అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 13 సినిమాల్లో నటిస్తున్నారు ఫుల్ బిజీగా ఉన్నారు జగపతిబాబు. -
భారీ మల్టీస్టారర్.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఇటీవల ఒక్క ‘ఓకె బంగారం’ సినిమా తప్ప మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. తాజాగా చెలియా సినిమాతో నిరాశపరిచిన ఆయన తన తదుపరి చిత్రం ‘చెక్క చివంత వానం’ షూటింగ్ను శరవేగంగా ముగించేస్తున్నారు. భారీ మల్టీ స్టారర్గా రూపొందుతున్న ఈ సినిమాను మణి చాలా వేగంగా కంప్లీట్ చేస్తున్నారు. మణి సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకిస్, లైకా ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఇటీవల మణి ఆరోగ్య సమస్యల కారణంగా కొద్ది రోజులు నిర్మాణాంతర కార్యక్రమాలు బ్రేక్ ఇచ్చిన చిత్రయూనిట్, తిరిగి పనులు ప్రారంభించారు. పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శింబు, అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్లు అన్నదమ్ములుగా కనిపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీత మందిస్తున్న ఈ సినిమాకు సంతోష్శివన్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో నవాబ్ పేరుతో రిలీజ్ చేయనున్నారు. -
మరో మల్టీ స్టారర్ మొదలైంది!
జై లవ కుశ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాబీ(కె.యస్. రవీంద్ర) కొంత గ్యాప్ తరువాత తన కొత్త సినిమాను ప్రారంభించారు. మల్టీ స్టారర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్, తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో వెంకీ, చైతూలు మామ అల్లుళ్లుగానే నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ రోజు (బుధవారం) ఉదయం రామానాయుడు స్టూడియోలో లాంచనంగా ప్రారంభమైంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్సింగ్ ఒక హీరోయిన్గా నటిస్తున్నారు. మరో హీరోయిన్ను ఫైనల్ చేయాల్సి ఉంది. ఈసినిమాకు వెంకీ మామ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ తో కలిసి నటిస్తుండగా, చైతూ సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. -
టాలీవుడ్లో మరో ‘దేవదాసు’?
నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగార్జునకు సరసన ఆకాంక్షా సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా నానికి జోడీగా రష్మికా మందన యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 65 శాతానికి పైగా పూర్తయ్యింది. నాగార్జున డాన్గా, నాని డాక్టర్గా కనిపించనున్న ఈ సినిమాకు దేవదాసు అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. ఇప్పటికే టాలీవుడ్లో దేవదాసు పేరుతో మూడు సినిమాలు వచ్చాయి. దేవదాస్ నవల ఆధారంగా ఏఎన్నార్, కృష్ణలుదేవదాసు పేరుతో సినిమాలు చేశారు. ఈ జనరేషన్లో రామ్ హీరోగా వైవీయస్ చౌదరి దర్శకత్వంలో దేవదాసు సినిమా రూపొందింది. ఇప్పుడు మరోసారి నాగార్జున, నానిల మల్టీస్టారర్కు దేవదాసు టైటిల్ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే చిత్రయూనిట్ టైటిల్ పై అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు.ఈ సినిమాను సెప్టెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
రాజమౌళి మల్టీ స్టారర్పై మరో అప్డేట్
బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రం తరువాత దర్శకధీరుడు రాజమౌళి ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఆర్ఆర్ఆర్ అంటూ ఓ చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. అయితే షూటింగ్ ఎప్పుడూ మొదలవుతుంది అన్న విషయంపై మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాను అక్టోబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ నుంచి రాజమౌళి సినిమా పనుల్లో బిజీ కానున్నాడు జూనియర్. రామ్ చరణ్ కూడా డిసెంబర్ కల్లా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాను ముంగిచేందుకు ప్లాన్ చేస్తున్నాడు. డిసెంబర్ నెలాఖరు కల్లా చరణ్ కూడా రాజమౌళి టీంతో జాయిన్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఆర్ట్ వర్క్ అల్యూమినియం ఫ్యాక్టరీతో పాటు రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్పై త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. -
చెర్రీ విత్ సీనియర్ ఎన్టీఆర్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ గత రాత్రి తన ట్విటర్లో ఆసక్తికర ఫోటో ఒకదానిని ట్వీట్ చేశాడు. నట దిగ్గజం స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటో కింద రామ్ చరణ్ కూర్చుని ఉన్న స్టిల్ అది. ఎన్టీఆర్ ఫోటో వైపు చూస్తూ ఫోజు ఇచ్చిన చెర్రీ ఫోటోను పోస్ట్ చేసిన తారక్ ‘మహానుభావుల ఆలోచనల నుంచి ప్రేరణ’ అంటూ ఓ కాప్షన్ ఉంచాడు. వీరిద్దరూ రాజమౌళి డైరెక్షన్లో మల్టీస్టారర్లో నటించబోతున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టు అనౌన్స్ ముందు నుంచే వీరిద్దరి మధ్య స్నేహం మరింత బలపడుతూ వస్తోంది. అప్పటి నుంచి తరచూ పార్టీలు, ఫోటోలతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు తమ తమ చిత్రాల షూటింగ్లలో బిజీగా ఉన్నారు. అవి పూర్తయ్యాక #RRR మొదలయ్యే అవకాశం ఉంది. Provoked by LEGENDARY thoughts pic.twitter.com/GvUj6XC4Ra — Jr NTR (@tarak9999) 8 June 2018 -
రాజమౌళి మొదలెట్టేశారు..!
బాహుబలి సిరీస్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాజమౌళి తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ల కాంబినేషన్లో ఓ భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు జక్కన్న. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పనులు రాజమౌళి ప్రారంభించినట్టుగా వార్తలు వస్తున్నాయి. బాహుబలి సినిమాకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసిన సాబు సిరిల్ ఈ చిత్రానికి కూడా పని చేయనున్నారు. ఆయన సారధ్యంలో హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ సెట్ను నిర్మిస్తున్నారు. ఈ సెట్లో యాక్షన్ సీన్స్తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. గత ఆరేడు నెలలుగా స్క్రిప్ట్ వర్క్లో బిజీగా ఉన్న రాజమౌళి ఇటీవల ఎన్టీఆర్, చెర్రీలకు పూర్తి స్క్రిప్ట్ వినిపించారు. ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అరవింద సమేత, రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రాలు పూర్తయిన వెంటనే రాజమౌళి మల్టీస్టారర్ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ భారీ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. -
ఇంట్రెస్టింగ్ టైటిల్తో వెంకీ-చైతూ
వరుసగా రెండు మల్టీస్టారర్ చిత్రాలకు సిద్ధమై టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు అగ్ర హీరో వెంకటేశ్ దగ్గుబాటి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎఫ్ 2 చిత్రంలో వరుణ్తేజ్తో, మరోవైపు పవర్ ఫేమ్ బాబీ(కె.యస్. రవీంద్ర) డైరెక్షన్లో మేనల్లుడు నాగచైతన్యతో కలిసి మరో ప్రాజెక్టులో నటించబోతున్నాడు. చైతూ చేయబోతున్న చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ను మేకర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకీ, చైతూలు మామ అల్లుళ్లుగా నటిస్తుండటంతో ‘వెంకీ మామ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారంట. పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రం ఉండబోతుందని, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా బాబీ రూపొందించబోతున్నాడంట. అందుకే టైటిల్ అదే అయితే బాగుంటుందన్న ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో వెంకీకి జోడిగా బాలీవుడ్బ్యూటీ హుమా ఖురేషీ, చైతూకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు వెంకీ-వరుణ్ తేజ్ల ఎఫ్ 2 ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. -
టాప్ హీరోతో పూరీ మల్టీస్టారర్?
సాక్షి, హైదరాబాద్: మెహబూబా చిత్ర ఫలితంతో ఢీలా పడిపోకుండా తన తర్వాతి ప్రాజెక్టు పనిలో దర్శకుడు పూరీ జగన్నాథ్ మునిగిపోయారు. తనయుడు ఆకాశ్తోనే తర్వాతి చిత్రం తీసేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ మధ్యలో ఓ స్టార్ హీరోకు ఓ కథను వినిపించి ప్రాజెక్టును ఖరారు చేసుకున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది. మెహబూబా చిత్ర విడుదలకు ముందే నాగార్జున అక్కినేనికి ఓ కథను వినిపించారంట. ఎమోషనల్ కంటెంట్తో ఉన్న ఆ కథ నచ్చటంతో నాగ్ ఓకే చేశాడని, పైగా నాగ చైతన్యతో అది మల్టీస్టారర్గా తెరకెక్కించబోతున్నాడని ఆ కథనం సారాంశం. మెహబూబా ఫలితంతో సంబంధం లేకుండా మరీ ఆ ప్రాజెక్టును నాగ్ కమిట్ అయినట్లు ఆ వార్త ఉటంకించింది. అయితే నానితో చేస్తున్న మల్టీస్టారర్, బంగార్రాజు ప్రాజెక్టు పూర్తయ్యాక పూరీతో మల్టీస్టారర్ ప్రారంభిస్తారంట. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడాల్సి ఉంది. గతంలో పూరీ-నాగ్ కాంబోలో శివమణి, సూపర్ చిత్రాలు వచ్చాయి. దాదాపు దశాబ్దం గ్యాప్ తర్వాత వీళ్లు మళ్లీ జత కడుతున్నారని, ముఖ్యంగా వరుస ఫెయిల్యూర్స్తో ఉన్న పూరీకి నాగ్ ఛాన్స్ ఇవ్వబోతున్నాడన్న వార్త ఆసక్తికరంగా మారింది. -
రాజమౌళి కథపై క్లారిటీ ఇచ్చిన చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రకరకాల వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుందన్న వార్త హాట్ టాపిక్గా మారింది. ఈ వార్తలపై రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందటం లేదని తేల్చేశాడు. రాజమౌళి ఇప్పటి వరకు కాన్సెప్ట్ మాత్రమే చెప్పారన్న చరణ్, త్వరలో పూర్తి స్క్రిప్ట్ వినిపించనున్నారని తెలిపారు. -
నాగ్-నానీకు హీరోయిన్లు ఫైనల్..
నాచురల్ స్టార్ నానీ, కింగ్ అక్కినేని నాగార్జునలు కలిసి మల్టీ స్టారర్ మూవీ చిత్రాన్ని చేస్తున్న విషయం విదితమే. ఇదివరకే సినిమా షూటింగ్ ప్రారంభమై చిన్నపాటి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. శమంతకమణి, భలే మంచి రోజు సినిమాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. ఈ మల్టీ స్టారర్ మూవీకి కూడా శ్రీరామ్ ఆదిత్యనే డైరెక్టర్. ఈ చిత్రంలో నాని, నాగ్లకు జోడిగా ఎవరు నటిస్తారనే దానిపై పలువురి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే చివరకు హీరోయిన్లు రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్లను సెలక్ట్ చేశారు దర్శక నిర్మాతలు. వీరిలో రష్మిక మందన్న నానితో జతకడితే.. కింగ నాగ్ సరసన ఆకాంక్ష సింగ్ నటిస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
రాజమౌళి మల్టీ స్టారర్లో మరో ‘ఆర్’
దర్శకధీరుడు రాజమౌళి, బాహుబలి లాంటి విజువల్ వండర్ తరువాత ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా అధికారిక ప్రకటనను వినూత్నం చేశారు. దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ల పేర్లలోని ‘ఆర్ ఆర్ ఆర్’ అనే లోగోను రివీల్ చేశారు. తాజాగా ఈసినిమాలో మరో ఆర్ వచ్చిన చేరిందన్న టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్గా ప్రముఖ హీరో రాజశేఖర్ నటించనున్నారట. గతంలో రామ్చరణ్ హీరోగా తెరకెక్కిన ధృవ సినిమాలోనే రాజశేఖర్ విలన్ గా నటించాల్సి ఉంది. కానీ అప్పట్లో ఈ కాంబినేషన్ కుదరలేదు. ఇటీవల గరుడవేగ సినిమాతో హీరోగా సూపర్ హిట్ సాధించిన రాజశేఖర్, రాజమౌళి దర్శకత్వంలో విలన్గా నటించేందుకు అంగీకరించారట. ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
ఆర్ ఆర్ ఆర్ : జక్కన్న మల్టీ స్టారర్
-
జక్కన్న మల్టీ స్టారర్ : ఆర్ ఆర్ ఆర్
బాహుబలి సినిమా తరువాత లాంగ్గ్యాప్ తీసుకున్న రాజమౌళి ఇంత వరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించేందుకు చాలా సమయం తీసుకున్నాడు. కొద్ది రోజులు రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపించినా.. అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఇటీవల ఈ సినిమా కోసమే ఎన్టీఆర్, రామ్ చరణ్లు విదేశాలకు కూడా వెళ్లొచ్చారు. అన్ని ఒకే అవ్వటంతో సినిమాను అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాతలు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో టీజర్ ను రిలీజ్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ అనే లోగో తో రిలీజ్ అయిన ఈ టీజర్ లోని మూడు ఆర్లు రాజమౌళి, రామ్చరణ్, రామారావు (ఎన్టీఆర్)ల పేర్లు ప్రతిబింభించేలా డిజైన్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ అనేది టైటిల్ కాదు కేవలం ఈ మెగా కలయికకు ప్రతీకగా ఈ లోగోను రిలీజ్ చేసినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. ఏదీ ఏమైన భారీ మల్టీ స్టారర్ సినిమాపై అధికారిక ప్రకటన రావటంతో మెగా, ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. -
ఎన్టీఆర్, చరణ్ల అమెరికా టూర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్లో ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. ఇంతవరకు అధికారిక ప్రకటన రాకపోయినా సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్, చరణ్ ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్లో కనిపించారు. వీరిద్దరూ రాజమౌళి సినిమా పనిమీదే అమెరికా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ తో ఎన్టీఆర్, బోయపాటితో చరణ్ చేయాల్సిన సినిమాలు ప్రారంభమయ్యాయి. ఈ సినిమాల షూటింగ్తో పాటు రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనూ భాగం పంచుకుంటున్నారు చరణ్, తారక్లు. ప్రస్తుతం రామ్ చరణ్, తారక్ ల అమెరికా ప్రయాణానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రంగస్థలం షూటింగ్ ముగించుకున్న చరణ్ ఇంకా అదే లుక్లో కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ మాత్రం త్రివిక్రమ్ సినిమా కోసం స్లిమ్ అండ్ ఫిట్గా రెడీ అయిపోయాడు. ఈ రోజు ఉదయమే చరణ్, తారక్లు అమెరికా బయలుదేరి వెళ్లారు. -
భారీ మల్టీస్టారర్.. మొదలవుతోంది
సాక్షి, చెన్నై : పుకార్లకు పుల్ స్టాప్ పడిపోయింది. క్లాసిక్ చిత్రాల దర్శకుడు మణిరత్నం భారీ మల్టీస్టారర్ను అధికారికంగా ప్రకటించేశారు. చిత్ర తారాగణంతోపాటు వారి టైటిల్ లోగోను కూడా విడుదల చేసేశారు. తమిళ్లో ‘చెక్క చివంత వానమ్’ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులో ‘నవాబ్’ గా రానుంది. ఇక కాస్టింగ్ విషయానికొస్తే... శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి పేర్లను ఇది వరకే ప్రకటించగా... ఇప్పుడు అదనంగా అరుణ్ విజయ్(బ్రూస్ లీ ఫేమ్) జత కలిశాడు. ముందుగా మళయాళ నటుడు పహద్ ఫజిల్ పేరు అనుకున్నప్పటికీ.. డేట్లు అడ్జస్ట్ కాకపోవటంతో ఆ ప్లేస్లో అరుణ్ విజయ్ను తీసుకున్నారు. జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అదితి రావ్ హైదరి, డయానా హీరోయిన్లుగా.. ప్రకాశ్ రాజ్, త్యాగరాజన్, మన్సూర్ అలీఖాన్, జయ సుధ తదితరులు కీలకపాత్రలు పోషించబోతున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ హౌజ్ వారు సంయుక్తంగా ఈ భారీ మల్టీస్టారర్ను తెరకెక్కించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రం ఫిబ్రవరి 12 నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. #NAWAB @LycaProductions @arrahman @santoshsivan @sreekar_prasad #SeetharamaSastry @thearvindswami #STR #VijaySethupathi @arunvijayno1 @prakashraaj @salamsir21 #Jyotika @aditiraohydari @aishu_dil @DayanaErappa @dhilipaction @ekalakhani @onlynikil pic.twitter.com/uDk420IwgC — Lyca Productions (@LycaProductions) February 9, 2018 #CCV #ManiRatnam @LycaProductions @arrahman @santoshsivan @sreekar_prasad @vairamuthu @thearvindswami #STR #VijaySethupathi @arunvijayno1 @prakashraaj @salamsir21 #Jyotika @aditiraohydari @aishu_dil @DayanaErappa @dhilipaction @ekalakhani @onlynikil pic.twitter.com/VaIk6EUxPc — Lyca Productions (@LycaProductions) February 9, 2018 -
అంతా తూచ్..! : వరుణ్ తేజ్
ఫిదా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నట్టుగా కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఎఫ్ 2 సినిమాలో నటిస్తున్నాడన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో రానా హీరోగా తెరకెక్కుతున్న హథీ మేరీ సాథీలోనూ సినిమాలోనూ నటిస్తున్నాడన్న వార్తలు ప్రముఖంగా వినిపించాయి. అయితే తాజాగా ఈ వార్తలపై ట్విస్ట్ ఇచ్చాడు వరుణ్. ప్రస్తుతం తొలిప్రేమ సినిమాలో నటిస్తున్న ఈ మెగా హీరో ఇంతవరకు తన తదుపరి చిత్రాలను ఫైనల్ చేయలేదని.. ఏ సినిమాకు కమిట్ అవ్వలేదని తెలిపాడు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న తొలిప్రేమ సినిమాతో వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. Guys haven't confirmed on any new projects yet... if I do you will hear it from me first... Thanks✌🏽️ — Varun Tej (@IAmVarunTej) 5 January 2018 -
రోహిత్ హీరోగా మరో యాక్షన్ మూవీ
బాణం సినిమాత సాఫ్ట్ ఇమేజ్ తో హీరోగా పరిచయం అయిన నారా రోహిత్, ప్రయోగాత్మక చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న రోహిత్ ప్రస్తుతం మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న బాలకృష్ణుడు సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో యాక్షన్ హీరోగా దర్శనమివ్వనున్నాడు రోహిత్. ఈ సినిమా తరువాత కూడా మరోసారి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటించేందుకు అంగీకరించాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ సినిమాకు అంగీకరించాడు. సీనియర్ స్టార్ జగపతిబాబుతో కలిసి రోహిత్ నటించనున్న ఈ సినిమా బుధవారం ప్రారంభం కానుంది. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. -
ప్రభాస్... సల్మాన్... ఓ హిందీ సినిమా?
ప్రేక్షకులను ఎవరూ ఫూల్స్ చేయలేరు! కథ లేకుండా గ్లామర్, గాల్లో ఎగిరే ఖరీదైన కార్లు, మోడ్రన్ యాక్షన్ సీక్వెన్స్లతో ప్రేక్షకులను ఫూల్స్ చేయలేమంటున్నారు సల్మాన్ ఖాన్. ఈ స్టేట్మెంట్లో స్పెషల్గా ఎవరి పేరూ లేకున్నా... షారూక్ ఖాన్ ‘దిల్ వాలే’పై సల్మాన్ సెటైర్స్ వేశాడని ముంబయ్ జనాలు చెప్పుకుంటున్నారు. దర్శకుడు రోహిత్ శెట్టి తీసిన ‘దిల్ వాలే’ ఆశించినంత హిట్టవ్వలేదు. అందులో సల్మాన్ సెటైర్స్ వేసినవన్నీ ఉన్నాయి. ఆ మాటకొస్తే ఈ దర్శకుడి ప్రతి సినిమాలోనూ గ్లామర్, గాల్లో ఎగిరే కార్లు, యాక్షన్ కంపల్సరీ. అలాంటి రోహిత్ శెట్టి దర్శకత్వంలో ప్రభాస్, సల్మాన్ ఖాన్ హీరోలుగా మల్టీస్టారర్ సినిమా ప్లానింగ్లో ఉందని ముంబయ్లో ఓ వార్త షికారు చేస్తోంది. అదీ సల్మాన్ పైన స్టేట్మెంట్ ఇచ్చిన టైమ్లోనే! నిజం చెప్పాలంటే... భారీ మల్టీస్టారర్స్ తీయడంలో రోహిత్ శెట్టి స్పెషలిస్ట్. ‘దిల్ వాలే’ ఆశించినంత హిట్టవ్వలేదు గానీ... ‘బోల్ బచ్చన్’, ‘చెన్నై ఎక్స్ప్రెస్’, ‘గోల్మాల్’ సిరీస్ నిర్మాతలకు లాభాలు తెచ్చాయి. రోహిత్ ట్రాక్ రికార్డు చూస్తే... ప్రభాస్, సల్మాన్లు సినిమా చేయొచ్చు. ఏం జరుగుతుందో మరి!! వెయిట్ అండ్ సీ!! -
మరో మల్టీ స్టారర్లో మహేష్...?
ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ తరువాత చేయబోయే సినిమాలను కూడా లైన్లో పెట్టాడు. మురుగదాస్ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' అనే పొలిటికల్ థ్రిల్లర్లో నటించనున్నాడు. ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమాకు అంగీకరించాడు. అశ్వనిదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించనున్న సినిమా మల్టీ స్టారర్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సీనియర్ హీరో వెంకటేష్తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించాడు మహేష్. ఈ సారి ఓ యంగ్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడట. వంశీ డైరెక్ట్ చేయబోయే సినిమాలో మహేష్ బాబుతో పాటు కామెడీ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ఇంకా చాలా సమయం ఉండటంతో ఇప్పుడే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను చిత్రయూనిట్ అఫీషియల్ గా ప్రకటించటం లేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement