-
రెండో లిస్ట్లో అయినా గడ్కరీ పేరు ఉంటుందా?
Nitin Gadkari : మహారాష్ట్రలో అధికార కూటమి లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకం ఒప్పందం కుదిరిన తర్వాత బీజేపీ అభ్యర్థుల జాబితాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు మొదటి స్థానంలో ఉంటుందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల మొదటి జాబితాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు లేకపోవడం తెలిసిందే. నాగ్పూర్లో ఫడ్నవీస్ విలేకరులతో మాట్లాడుతూ.. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే ప్రతిపక్షాల మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) నుండి గడ్కరీకి లోక్సభ టిక్కెట్ను ఆఫర్ చేయడంపై విరుచుకుపడ్డారు. "గడ్కరీ మా ప్రముఖ నాయకుడు. ఆయన నాగ్పూర్ నుండి పోటీ చేస్తారు. అభ్యర్థుల (బీజేపీ) మొదటి జాబితా విడుదలైనప్పుడు మహాయుతి భాగస్వాముల మధ్య (బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ) చర్చలు జరగలేదు. ఈ చర్చలు పూర్తవ్వగానే గడ్కరీ పేరే ముందుగా (అభ్యర్థుల జాబితాలో) వస్తుంది" అని ఫడ్నవీస్ పేర్కొన్నారు. "ఉద్ధవ్ థాకరే సొంత పార్టీనే చితికిపోయింది. గడ్కరీ వంటి జాతీయ స్థాయి నాయకుడికి అటువంటి పార్టీ అధినేత ఆఫర్ ఇవ్వడం అనేది స్థాయిలేని వ్యక్తి అమెరికా అధ్యక్ష పదవిని ఆఫర్ చేయడం లాంటిది" అన్నారు. కాగా గురువారం జరిగిన ర్యాలీలో ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ నితిన్ గడ్కరీ మహారాష్ట్ర పౌరుషాన్ని చూపించాలని, ఢిల్లీ ముందు తల వంచేందుకు బదులుగా రాజీనామా చేయాలని అన్నారు. తాము ఆయన్ను ఎంవీఏ తరఫున అభ్యర్థిగా ఎన్నుకుంటామని థాకరే చెప్పారు. -
రూ.150 ఖర్చుతో 300 కిమీ ప్రయాణం.. కొత్త కారుతో సత్తా చాటిన రైతుబిడ్డ!
గత ఏడాది మహారాష్ట్రలోని చంద్రపూర్కు చెందిన రైతు బిడ్డ 'హర్షల్ నక్షనేని' (Harshal Nakshane) హైడ్రోజన్తో నడిచే కారును రూపొందించి అందరి చేత ప్రశంసలందుకున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి 'దేవేంద్ర ఫడ్నవిస్' (Devendra Fadnavis) ఈ కారుని వీక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ అందించే ఈ కారు ప్రత్యేకమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. ఇంత గొప్ప కారుని తయారు చేసిన నక్షనేనిని 'దేవేంద్ర ఫడ్నవిస్' కలిసి అభినందించారు. అంతే కాకుండా అతన్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. గ్రీన్ కలర్లో కనిపించే ఈ కారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేస్తూ 'సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్' పొందినట్లు హర్షల్ వివరించారు. ఇది ఇంకా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో కారు తనకు తానుగానే ముందుకు వెళ్లడం చూడవచ్చు. ఈ హైడ్రోజన్ కారుని తయారు చేయడానికి హర్షల్ నక్షనేనికి సుమారు రూ. 25 లక్షలు ఖర్చు అయినట్లు వెల్లడించాడు. ఈ కారు కేవలం రూ.150 హైడ్రోజన్తో ఏకంగా 300 కిమీ పరిధిని అందిస్తుందని తెలిపాడు. ఫెరారీ కారుని తలపించే డోర్స్, సన్రూఫ్ వంటివి ఇందులో మరింత ప్రత్యేకంగా కనిపిస్తాయి. గ్రీన్ కలర్ హోమ్మేడ్ హైడ్రోజన్ కారు ఇంకా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండటం వల్ల ఖచ్చితమైన లాంచ్ గురించి వివరించలేదు. అంతే కాకుండా ఈ కారుకు సంబంధించిన మరిన్ని స్పెసిఫికేషన్లను వెల్లడించాల్సి ఉంది. దీనికోసం Aicars.in వెబ్సైట్లో బుకింగ్ చేసుకోవచ్చని వారు వెల్లడించారు. ఇలాంటి వాహనాలు భారతదేశంలో చట్టవిరుద్ధం హర్షల్ నక్షనేని అద్భుతమైన సృష్టి అందరి ఆకట్టుకుంటున్నప్పటికీ.. భారతదేశంలో అమలులో ఉన్న మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద ఇలాంటివి పబ్లిక్ రోడ్డుమీద ఉపయోగించడానికి ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే ఇండియాలో ఒక వాహనం రోడ్డు మీదికి రావాలంటే ఖచ్చితంగా 'ఏఆర్ఏఐ' (Automotive Research Association of India) దృవీకరించాలి. మన దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలను ప్రవేశపెడుతున్నాయి. కాబట్టి ఒక వాహనం పబ్లిక్ రోడ్ల మీదికి రావాలంటే సంబంధిత వివిధ అధికారుల నుంచి ఆమోదం పొందాలి. లేకుంటే ఇవి ప్రాజెక్ట్ కార్లుగా పరిగణించి, రేసింగ్ ట్రాక్లు లేదా ఫామ్హౌస్ల వంటి ప్రైవేట్ ప్రాపర్టీలకు మాత్రమే పరిమితం చేస్తారు. పబ్లిక్ రోడ్లలో ఇలాంటి వాహనాలు కనిపిస్తే వాటిని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇదీ చదవండి: ఆగని యుద్ధం.. పోయిన లక్షల ఉద్యోగాలు - ఐఎల్ఓ సంచలన రిపోర్ట్ ప్రస్తుతం మన దేశంలో హైడ్రోజన్ కార్ల వినియోగానికి కావాల్సిన కనీస సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. కానీ ఫ్యూయెల్ కార్ల కంటే ఎక్కువ పరిధిని, తక్కువ కాలుష్యం కలిగించే ఇలాంటి వాహనాలను వినియోగించాలని గతంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రస్తావించారు. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో హైడ్రోజన్ కార్ల వినియోగం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. Blazing a trail from Chandrapur, Maharashtra, this AI-powered hydrogen car is a game-changer! It was great meeting Maharashtra's Innovative Genius, Harshal Nakshane, a farmer's son from Chandrapur, yesterday in Mumbai. He cracked a groundbreaking innovation - an AI-controlled… pic.twitter.com/tdANS9YNIp — Devendra Fadnavis (@Dev_Fadnavis) October 29, 2023 -
ఈ పదవి రేపు ఉంటుందో లేదో నాకు తెలియదు: అజిత్ పవార్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న వేళ ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ గైరుహాజరవ్వడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. పూణేలోని బారామతిలో ఇదే రోజున సహకార రంగానికి సంబంధించిన ఓ కార్యక్రమానికి హాజరైన అజిత్ పవార్ మాట్లాడుతూ.. ఈ రంగానికి సంబంధించిన సంస్థలు షుగర్ మిల్లులు ఆర్ధికంగా బలపడాలని చెబుతూనే.. ఈరోజు నేను ఆర్ధికశాఖ మంత్రిగా ఉన్నాను. రేపు ఈ పదవి ఉంటుందో లేదో నాకు తెలియదని వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేయాంతో అధికార బీజేపీ-శివసేన ప్రభుత్వాలతో ఏమైనా చెడిందా ఏంటనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. పూణే కార్యక్రమంలో తన పదవిపై అనిశ్చితిని వ్యక్తం చేసిన ఆయన అమిత్ షా కార్యక్రమానికి గైర్హాజరవడంపైన కూడా స్పందించారు. ఈ రోజు నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయని అమిత్ షా కార్యాలయానికి ముందుగానే తెలిపానని అన్నారు. ఇదిలా ఉండగా ఈరోజు రాష్ట్రానికి విచ్చేసిన అమిత్ షా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ గృహాలకు వెళ్లి గణేషుడిని దర్శించుకున్నారు. ఇటీవల అజిత్ పవార్ విద్యాసంస్థల్లో ముస్లిం మైనారిటీ విద్యార్థులకు ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార భాగస్వాములు బీజేపీ, శివసేన సుముఖంగా లేరనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో కానీ మరో విషయంలో కానీ అధికార పార్టీతో అజిత్ పవార్కు సత్సంబంధాలు ఉన్నంతవరకే ఉనికి ఉంటుందని.. అదే గనుక బెడిసికొడితే అజిత్ పవార్ బృందం పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా మారే ప్రమాదముందని అభిప్రాయపడుతున్నాయి రాజకీయ వర్గాలు. “आपल्या संस्था मजबूत झाल्या पाहिजेत त्या टिकल्या पाहिजेत. आज आपल्याकडे अर्थखातं आहे ते पुढे टिकेल ना टिकेल हे सांगता येत नाही” उपमुख्यमंत्री अजित पवार यांचं बारामतीत बोलताना विधान! #AjitPawar #MaharashtraPolitics pic.twitter.com/n6K4sKPFdV — Abhijit Karande (@AbhijitKaran25) September 25, 2023 ఇది కూడా చదవండి: ఈ ఎన్నికల్లో హామీలకు 'మోదీ గ్యారెంటీ' -
ఖలునికి నిలువెల్లా విషము గదరా సుమతీ!
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత సోషల్ మీడియాలో పాపులర్. ఆమెకు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. జంతుప్రేమికురాలైన అమృత పాము, ఒకరకం బల్లితో దిగిన ఫొటోలు ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలకు... ‘అత్యంత ప్రమాదకరమైన, విషతుల్యమైన జంతువు మనిషి మాత్రమే’ అనే కాప్షన్ ఇచ్చింది అమృత. ‘ఫోటోల కంటే మీ కాప్షన్ అద్భుతంగా ఉంది’ ‘సాటిజీవుల పట్ల మనకు ఉండాల్సిన ప్రేమను అందంగా అద్దం పట్టిన ఫొటోలు ఇవి’... అంటూ నెటిజనులు స్పందించారు. తన ట్విట్టర్ ప్రొఫైల్ బయోలో బ్యాంకర్, ప్లేబ్యాక్ సింగర్, సోషల్ వర్కర్ అని రాసుకుంది అమృత. -
ఆర్థిక శాఖ.. ఫడ్నవీస్ చేతి నుంచి అజిత్ పవార్కు
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ నుంచి ఆర్థిక శాఖ.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) రెబల్ నేత, అజిత్ పవార్ చేతికి వెళ్లింది. మహారాష్ట్ర మంత్రివర్గంలో జూలై 2న చేరిన (ఎన్నీపీ) ఎమ్మెల్యేలకు శుక్రవారం నాడు శాఖల కేటాయింపు జరిగింది. ఎన్సీపీ రెబల్ నేత అజిత్ పవార్ కీలకమైన ఆర్థిక శాఖను సొంతం చేసుకున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు ఇప్పటివరకూ ఆర్థికశాఖ బాధ్యతలు కూడా ఫడ్నవీస్ వద్దనే ఉంది. అయితే ఆర్థికశాఖపై కన్నేసిన అజిత్ పవార్ పంతం పట్టీ మరీ ఈ శాఖను దక్కించుకున్నారు. ఈ బాధ్యతల్ని వెంటనే ఆయన స్వీకరించారు. బీజేపీ ఎత్తులను ముందుగానే అంచనా వేసిన అజిత్ పవార్.. తన వర్గానికి మంత్రివర్గంలో సుమచిత స్థానం కోసం జరిపిన లాబీయింగ్లో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. కీలక శాఖలు రెండింటిని ఆయన వర్గమే దక్కించుకున్నారు. తాజాగా శాఖల కేటాయింపుల్లో, ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్బల్కు ఆహార, పౌర సరఫరాల శాఖ అప్పగించారు. అనిల్ పటేల్కు రిలీఫ్ అండ్ రిహాబిలేషన్, డిజాస్టర్ మేనేజిమెంట్ శాఖ కేటాయించారు. అదితి సునీల్ టట్కరేకు మహిళ, శిశు అభివృద్ధి శాఖ కేటాయించగా, ధనంజయ్ ముడేకు వ్యవసాయం, దిలీప్ వాల్సే పాటిల్కు రెవెన్యూ, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి శాఖ కేటాయించారు. ముఖ్యమైన పోర్ట్పోలియోలు దక్కించుకోవడంలో సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్తో ఎన్సీపీ రెబల్ వర్గం జరిపిన చర్చలు ఫలవంతంగా ముగిశాయి. అదే సమయంలో ఎన్సీపీ(రెబల్)కి మంత్రి వర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలనుకోవడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న బీజేపీ-షిండే వర్గ ఎమ్మెల్యేలను ఆయా అధిష్టానాలు బుజ్జగించాయి. చదవండి: సుఖేష్ సంచలన ఆరోపణలపై కేటీఆర్ రియాక్షన్.. వాడెవడో కూడా తెలీదంటూ.. -
మహా కిరికిరి.. ఫడ్నవిస్ సీటుకే ఎసరు పెట్టి..
ముంబై: సంక్షోభ రాజకీయాలకు నెలవైన మహారాష్ట్రలో ముక్కోణపు పార్టీ అధికార కూటమి.. చీలికలకు గురికాకుండా జాగ్రత్త పడుతోంది. అదే సమయంలో బీజేపీ ఎత్తులను ముందుగానే అంచనా వేసిన ఎన్సీపీ(రెబల్) నేత అజిత్ పవార్.. తన వర్గానికి మంత్రివర్గంలో సుమచిత స్థానం కోసం జరిపిన లాబీయింగ్లో గ్రాండ్ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. కీలక శాఖలు రెండింటిని ఆయన వర్గమే దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ ఆసక్తికరంగా మారుతున్నాయి. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ నుంచి ఆర్థిక శాఖ.. ఎన్సీపీ నేత, మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేతికి వెళ్లనుంది. ముఖ్యమైన పోర్ట్పోలియోలు దక్కించుకోవడంలో సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్తో ఎన్సీపీ రెబల్ వర్గం జరిపిన చర్చలు ఫలవంతంగా ముగిశాయి. అదే సమయంలో ఎన్సీపీ(రెబల్)కి మంత్రి వర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలనుకోవడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న బీజేపీ-షిండే వర్గ ఎమ్మెల్యేలను ఆయా అధిష్టానాలు చల్లార్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ ఎమ్మెల్యేలతో షిండే కూటమి(శివసేన)-బీజేపీ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్.. పోర్టుపోలియోల కేటాయింపులో బెట్టు ప్రదర్శిస్తూ వచ్చారు. కీలకమైన ఆర్థికంతో పాటు ప్రణాళిక మంత్రిత్వ శాఖల్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ను బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు బహిరంగంగా వ్యతిరేకించారు కూడా. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానాన్ని నేరుగా కలవకుండా.. ఎన్సీపీ(రెబల్) వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ ద్వారా హస్తిన నేతలతో చర్చలు నడిపించారు అజిత్ పవార్. ఫలితంగా.. మంత్రివర్గ విస్తరణ ఆసల్యం అవుతూ వచ్చింది. అయితే మంగళవారం అర్ధరాత్రి దాటాక కూడా సాగిన చర్చల్లో ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు బుధవారం ప్రఫుల్ పటేల్ సమస్య పరిష్కారం అయ్యిందంటూ ప్రకటించడం గమనార్హం. ఒకటి రెండు రోజుల్లో పోర్ట్పోలియోల కేటాయింపు జరగవచ్చని తెలుస్తోంది. ఇక జులై 18వ తేదీన ప్రధాని మోదీని తాము కలవబోతున్నామని.. ఎన్డీయే సమావేశానికి తమకూ ఆహ్వానం అందిందని ప్రఫుల్ పటేల్ తెలిపారు. జులై 17 నుంచి ఆగస్టు 4వ తేదీల నడుమ మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈసారి సమావేశాలు ఎన్సీపీ సంక్షోభంపైనా హీటెక్కే అవకాశం లేకపోలేదు. అంచేత సమావేశాల కంటే ముందే కేబినెట్ విస్తరణ కోసం ప్రయత్నాలు నడుస్తున్నాయి. -
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు: డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. తాజాగా ఈ కేసుపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్లు తెలిపారు. తాజాగా ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై సీబీఐ మూడేళ్లుగా జరుపుతున్న దర్యాప్తు గురించి స్పందిస్తూ.. 'మొదట్లో ఈ కేసులో వాళ్లూవీళ్లు చెప్పిన సమాచారం మాత్రమే ఉంది. ఆ తర్వాత కొందరు తమ వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. వారి వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సమర్పించాలని కోరాము. ప్రాథమిక సాక్ష్యాలను సేకరించాం. వాటి విశ్వసనీయతను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నందున ప్రస్తుతం ఈ కేసు గురించి ఇంతకంటే ఏం చెప్పలేను' అన్నారు. కాగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ 2020 జూన్లో ముంబైలోని తన అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించారు. మొదట ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అంతా అనుకున్నారు. కానీ ఇందులో కుట్ర కోణం ఉందని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించడంతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. మరోవైపు సుశాంత్ చనిపోవడానికి వారం రోజుల ముందు ఆయన మాజీ మేనేజర్ దిశా సాలియన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చదవండి: లగ్జరీ కారు కొనుగోలు చేసిన నాగార్జున -
నవీ ముంబైలో శ్రీవారి ఆలయానికి భూమి పూజా
ముంబై: నవీ ముంబైలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆలయానికి అర్చకులు భూమి పూజా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, రేమాండ్స్ అధినేత సింఘానియా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. తిరుమల తరహలో నవీ ముంబాయిలో శ్రీవారి ఆలయాని నిర్మించడానికి టీటీడీ ముందుకు రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఆలయ నిర్మాణంతో నవీ ముంబాయి ఆర్థికంగా ముందుకు వెళ్తుందని భావిస్తున్నామన్నారు. ఆలయానికి సమీపంలోని తీర ప్రాంతం నుంచి నిర్మింస్తున్న అతి పెద్ద బ్రిడ్జితో కోల్హాపూర్ లక్ష్మి అమ్మవారి ఆలయానికి అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు.తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేని భక్తులకు.. నవీ ముంబైలో నిర్మిస్తున్న ఆలయంలో స్వామివారిని దర్శించుకునే అదృష్టం లభిస్తుందన్నారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఏకరాల స్థలం కేటాయించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయ తరహలోనే నవీ ముంబైలో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రెండేళ్లలో ఆలయ నిర్మాణంపూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామని చెప్పారు. -
అహ్మద్నగర్ కాదు.. అహల్యానగర్
ముంబై: దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలు నగరాలు, వీధులకు పేర్లను మారుస్తున్న పరిణామాలు చూస్తున్నాం. తాజాగా మహారాష్ట్రలో షిండే శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం కూడా అలాంటి చర్యకే దిగింది. అహ్మద్నగర్ జిల్లా పేరును అహల్యా నగర్గా మార్చేసింది. బుధవారం చౌండీలో జరిగిన అహల్యాదేవి జయంతోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్వయంగా ఈ ప్రకటన చేశారు. 18వ శతాబ్దంలో ఇండోర్ స్టేట్ను పాలించిన వీరవనితే అహల్యాదేవి హోల్కర్. ఆమె జన్మస్థలంలోనే.. అదీ 298 జయంతి ఉత్సవాల సందర్భంగా సీఎం షిండే ఈ ప్రకటన చేయడం విశేషం. అహ్మద్నగర్, పూణేకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 15వ శతాబ్ధంలో ఈ ప్రాంతాన్ని అహ్మద్ నిజాం షా పాలించారు. ఆయన పేరు మీద ఈ ప్రాంతానికి అహ్మద్నగర్ పేరొచ్చిందని చెబుతుంటారు. ఛత్రపతి శివాజీ, అహల్యాదేవి హోల్కర్ లాంటి వాళ్లను ఆరాధ్యులుగా భావించి మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అహల్యాదేవి హోల్కర్కు సముచిత గౌరవం అందించాలనే ప్రజలందరి అభిష్టం మేరకు ఈ జిల్లా పేరును అహల్యా నగర్గా మార్చాం అని షిండే ప్రకటించారు. ఇక డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.. ‘‘మా కూటమిది పక్కా హిందుత్వ ప్రభుత్వమని, అహల్యాదేవి లాంటి వాళ్లు లేకపోతే కాశీ లాంటి సుప్రసిద్ధ క్షేత్రాలు ఉండేవే కావ’’ని చెప్పుకొచ్చారు. అంతకు ముందు షిండే ప్రభుత్వం ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీనగర్గా, ఒస్మానాబాద్ను ధారాశివ్గా మార్చిన విషయాన్ని సైతం ఫడ్నవిస్ ప్రస్తావించారు. ఇదీ చదవండి: తన వేలితో తన కన్నే పొడుచుకున్న రాహుల్! -
థాక్రేకు ఫడ్నవీస్ కౌంటర్.. మీకు ఆ పదాలు సూట్ కావు అంటూ..
ముంబై: మహారాష్ట్రలో శివసేన సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర గవర్నర్ బలపరీక్ష నిర్ణయాన్ని తప్పు పట్టింది. చీలిక వర్గానికి శివసేన అని చెప్పుకునే అధికారం లేదు. బలపరీక్ష ప్రాతిపదికన పార్టీ గుర్తు కేటాయించడం సరికాదు. మహారాష్ట్ర గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం. పార్టీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం రాజ్యాంగ సమ్మతం కాదు. ఉద్ధవ్ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారు. బలపరీక్ష ఎదుర్కోలేదు. కాబట్టి స్టేటస్కోను పునరుద్ధరించడం సాధ్యం కాదు. తిరిగి ఆయనను సీఎంగా నియమించలేం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. ఉద్దవ్ థాక్రేకు పొలిటికల్ కౌంటర్ ఇచ్చారు. కాగా, ఫడ్నవీస్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్దవ్ థాక్రే వర్గానికి నైతికత గురించి మాట్లాడే హక్కులేదు. వారు బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ, తర్వాత కాంగ్రెస్తో జట్టుకట్టారు. నైతిక విలువలు వంటి పదాలు ఉద్ధవ్కు సరిపోవు. నేను ఆయన్ను ఓ విషయం అడగాలనుకుంటున్నా. సీఎం పదవి కోసం ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసినప్పుడు ఆ విలువలను మర్చిపోయారా? అని ప్రశ్నించారు. గతంలో ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయలేదు. అంతకాలం తనతో ఉన్నవ్యక్తులు వెళ్లిపోవడంతో భయపడి రాజీనామా చేశారు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇదే క్రమంలో ఉద్దవ్ వర్గంపై విరుచుకుపడ్డారు. మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కుట్రలు ఓడిపోయాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చట్టబద్ధతపై ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇది పూర్తిగా చట్టబద్ధమైంది అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: థాక్రే రాజీనామా చేయకపోయి ఉంటే.. ప్రభుత్వాన్ని పునరుద్దరించి ఉండేవాళ్లం -
సుప్రీం కోర్టులో స్వాగతించిన ఫడ్నవీస్
-
షిండేకు ఊహించని షాకిచ్చిన బీజేపీ.. సీఎంగా తప్పుకోవాలని హుకుం..?
ముంబై: మహారాష్ట్రకు త్వరలో కొత్త సీఎం రాబోతున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్యాస్ట్రో చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని కమలం పార్టీ షిండేకు హుకుం జారీ చేసిందని, దీంతో ఆయన మనస్తాపంతో మూడు రోజులు సెలవులు పెట్టి వెళ్లారని క్యాస్ట్రో అన్నారు. మీడియా వర్గాలు తనకు ఈ విషయపై కచ్చితమైన సమాచారం అందించాయని పేర్కొన్నారు. సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్లు తమ బాధ్యతలు మార్చుకోవాలని బీజేపీ చెప్పిందని క్యాస్ట్రో తెలిపారు. త్వరతో ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు చేపడతారని, షిండే డిప్యూటీ సీఎం పదవికి పరిమితం అవుతారని చెప్పుకొచ్చారు. 'ఇది నిజమేనా? షిండే, ఫడ్నవీస్ తమ పదవులు మార్చుకోబోతున్నారని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం గురించి ఢిల్లీలో మీటింగ్ కూడా జరిగిందట. బీజేపీ పదవి మార్చుకోమని తనకు చెప్పడం ఇష్టం లేకే షిండే మూడు రోజులు సెలవు పెట్టి వెళ్లారా?' అని క్యాస్ట్రో ట్వీట్ చేశారు. Is this true too??? There is news that Mr.@mieknathshinde has taken 3 days' leave from work. Sources in the media say that he has taken leave as he is upset because @BJP4India wants him to 'switch roles' in the incumbent Maharashtra government with Mr. @Dev_Fadnavis. — Clyde Crasto - क्लाईड क्रास्टो (@Clyde_Crasto) April 25, 2023 మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి మరణశాసనం సిద్ధమైందని శివసేన్(ఉద్ధవ్ వర్గం)నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరో 15–20 రోజుల్లో ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, మరణశాసనంపై సంతకం చేసేదెవరో ఇప్పుడు తేలాల్సి ఉందని రౌత్ జోస్యం చెప్పారు. ఇప్పుడు ఎన్సీపీ కూడా సీఎం మార్పుపై కీలక వ్యాఖ్యలు చేయడం మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. కాగా.. రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి గతేడాది ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబావుటా ఎగురవేసి బీజేపీతో చేతులు కలిపారు షిండే. ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే షిండేను బీజేపీ బెదిరించిందని, తమతో చేతులు కలపకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలతో అరెస్టు చేయిస్తామని బ్లాక్ మెయిల్ చేసిందని ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఇటీవలే చెప్పారు. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి వెళ్లడానికి ముందు షిండే తమ ఇంటికి వచ్చి ఏడ్చారని పేర్కొన్నారు. చదవండి: బీఆర్ఎస్ దేశంలోనే నంబర్-1.. సెకండ్ ప్లేస్లో ఆప్..! -
మహారాష్ట్రలో బీజేపీకి ఊహించని షాక్.. గడ్కరీ, ఫడ్నవీస్కు భంగపాటు!
ముంబై: మహారాష్ట్రలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. నాగపూర్ డివిజన్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ భారీ ఓటమిని చవిచూసింది. ఈ ఎన్నికల్లో మహావికాస్ అగాడీ (ఎంవీఏ) కూటమి మద్దతు అభ్యర్థి సుధాకర్ అద్బాలే ఘన విజయం సాధించారు. వివరాల ప్రకారం.. నాగపూర్ డివిజన్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నాగో గనార్పై మహావికాస్ అగాడీ కూటమి అభ్యర్థి సుధాకర్ అద్బాలే గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 34,360 ఓట్ల పోల్ అవగా.. సుధాకర్ అద్బాలే 16,700 ఓట్లు సాధించగా, నాగో గనార్కు 8,211 ఓట్లు మాత్రమే పడ్డాయి. కాగా, నాగపూర్ బీజేపీ కీలక నేతలైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు సొంత ప్రాంతం కావడం గమనార్హం. అంతేకాకుండా ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం కూడా నాగ్పుర్లోనే ఉండటం విశేషం. అయినప్పటికీ బీజేపీ అభ్యర్థి ఓడిపోవడం పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. మరోవైపు.. ప్రస్తుతం నాగపూర్ ఎంపీగా గడ్కరీ ఉండగా, నాగపూర్ (సౌత్ వెస్ట్) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫడ్నవీస్ గత 3 దఫాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ నాగ్పుర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో నాలుగింటిలో బీజేపీ ఎమ్మెల్యేలే ఉండటం గమనార్హం. కాగా, జనవరి 30న మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇక, ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం జరిగింది. -
బీజేపీ నేతపై మిత్రపక్ష వర్గీయుల దాడి
ముంబై: బీజేపీ మద్దతుతో శివసేన చీలిక వర్గం ఏక్నాథ్ షిండే నేతృత్వంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సంగతి విదితమే. అయితే.. ప్రత్యర్థి పక్షంగా ఉన్న రోజుల నుంచి ఈ రెండు వర్గాల నడుమ కొనసాగుతున్న వైరం.. మంత్రి వర్గ విస్తరణ సమయంలో ఉవ్వెత్తున పైకి లేచి.. ఇప్పుడు తారాస్థాయిలో కొనసాగుతోంది. అదీ నియోజకవర్గాల వారీగా కావడం గమనార్హం. తాజాగా షిండే వర్గం మిత్రపక్ష నేతపైనే దాడికి పాల్పడింది. మిత్ర పక్షాల నడుమ పోరు మంచిది కాదని, ఐక్యతతో ముందుకు సాగాలని ఇటు సీఎం షిండే, అటు డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ ఇస్తున్న పిలుపు ఆయా పార్టీల నేతలకు, కార్యకర్తలకు చెవికెక్కడం లేదు. థానేలో బీజేపీ ఆఫీస్ బేరర్గా వ్యవహరిస్తున్న ప్రశాంత్ జాదవ్కు, షిండే వర్గీయులకు గొడవ జరిగింది. గురువారం వాగ్లే ఎస్టేట్లోని పరబ్వాడీ దగ్గర బ్యానర్లు, ఫ్లకార్డులు ఏర్పాటు విషయంలో వివాదం మొదలైంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. ఇరు వర్గాలను హెచ్చరించి పంపించారు. అయితే శుక్రవారం సాయంత్రం ప్రశాంత్ జాదవ్ను లక్ష్యంగా చేసుకుని షిండే వర్గీయులకు దాడికి దిగారు. పదిహేను నుంచి ఇరవై మంది దాకా ఆయన్ని చితకబాదారు. ఈ దాడిలో తల పగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం!. ఆపై ఈ గొడవపై ఆ పంచాయితీ పోలీస్ స్టేషన్కి చేరింది. ఇరు పక్షాలు ఎవరికి వాళ్లు అవతలి వాళ్ల మీదే నిందలు వేయడం ప్రారంభించారు. हल्लेखोरांवर तात्काळ कारवाई करा @ThaneCityPolice असले नीच कृत्य करणाऱ्यांचा तिव्र निषेध@CMOMaharashtra @Dev_Fadnavis https://t.co/JfciHraaem — Chitra Kishor Wagh (@ChitraKWagh) December 30, 2022 మరోవైపు పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోలేదని స్టేషన్ బయట బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. దీంతో మరోసారి గొడవ జరుగుతుందేమోనన్న పరిస్థితులు కొనసాగుతున్నాయి అక్కడ. ఇక ఈ ఘర్షణలపై బీజేపీ మహిళా మోర్చా పరోక్షంగా ఓ ట్వీట్ చేసింది. దోస్తీకి దోస్తీ.. దెబ్బకు దెబ్బ.. రక్తానికి రక్తం అంటూ ట్వీట్లో పేర్కొంది. పరిస్థితి చల్లార్చేందుకు ఇరు పార్టీలు కీలక నేతలను థానేకు పంపనున్నట్లు సమాచారం. -
‘50 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లింది మరిచారా?’
ముంబై: శివసేన నేత ఆదిత్య ఠాక్రే, ఆయన తండ్రి, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేలపై తీవ్ర విమర్శలు గుప్పించారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. మీ ఇద్దరిని చూసి బీజేపీ భయపడదన్నారు. 32 ఏళ్ల వ్యక్తికి ఈ ప్రభుత్వం భయపడుతోందంటూ ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన తర్వాత మీడియాతో శుక్రవారం మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి. ‘కనీసం అతడి తండ్రిని చూసి కూడా ఇక్కడ ఎవరూ భయపడరు. మీ పార్టీ నుంచి అంతా చూస్తుండగానే 50 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అప్పుడు ముంబయి అట్టుడుకుతుందని, కాలిపోతుందన్నారు. కానీ అగ్గిపుల్ల కూడా మండలేదు.’ అని దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతకు ముందు అసెంబ్లీ వేదికగా.. శ్రీ సిద్ధివినాయక ఆలయ ట్రస్టులో అవకతవకలపై విచారణను నెలరోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: 'నన్నెవరు కొట్టలేదు.. అదో పెద్ద స్కామ్': నటి ఆవేదన -
‘ముంబై మహారాష్ట్రదే.. ఎవడబ్బ సొత్తు కాదు’
సాక్షి, ముంబై: ముంబై ఎవడబ్బ సొమ్ము కాదని, మహారాష్ట్రదేనని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉద్ఘాటించారు. కర్ణాటక న్యాయ శాఖ మంత్రి మధు స్వామి, ఎమ్మెల్యే లక్ష్మణ్ సౌదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో... అసెంబ్లీలో ఫడ్నవీస్ కర్ణాటక ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. కర్ణాటక ఎమ్మెల్యేలు, మంత్రులు నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. దీటుగా సమాధానమివ్వకపోవడం వల్లే: పవార్ సరిహద్దు వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు సరిహద్దు వివాదాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చాయి. చర్చించాల్సిందేనని పట్టుబట్టాయి. కర్ణాటక మంత్రి మధు స్వామి, లక్ష్మణ్ సౌదీ చేసిన వ్యాఖ్యలపై చర్చించాలని ప్రతిపక్ష నేత అజిత్ పవార్ పట్టుబట్టారు. వ్యాఖ్యలను ఖండిస్తూ కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ‘కేంద్ర మంత్రి అమిత్షాతో కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సంయుక్త సమావేశంలో సరిహద్దుపై ఎవరూ కొత్తగా దావా వేయవద్దని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దావా వేయలేదు. కానీ కర్ణాటక నేతలు, మంత్రులు మహారాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ పుండు మీద కారం చల్లినట్లుగా వ్యవహరిస్తున్నారు’ అని పవార్ ధ్వజమెత్తారు. కర్ణాటక నేతల వ్యాఖ్యలపై పవార్ ఘాటుగా స్పందించారు. వారికి దీటుగా సమాధానమివ్వపోవడం వల్లే కొవ్వెక్కి ఇష్టమున్నట్లు వ్యాఖ్యా నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవార్ డిమాండ్ను ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమరి్ధంచారు. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతింటాయని, దీనిపై వెంటనే కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాస్తామని ఆయన స్పష్టం చేశారు. చదవండి: ఉజ్బెకిస్తాన్లో 18 మంది చిన్నారులు మృతి.. ‘భారత్ కంపెనీల సిరప్లే కారణం’ భూకుంభకోణంపై గందరగోళం.. వాకౌట్ వాషీం జిల్లాలోని గాయ్రన్లో జరిగిన భూ కుంభకోణంపై చర్చించాలని ప్రతిపక్ష నేతలు సభలో గందరగోళం సృష్టించారు. దీనికి వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్ సమాధానమిస్తూ గాయ్రన్ భూ పంపిణీలో ఎలాంటి అవినీతి జరగలేదని తెలిపారు. నియమ, నిబంధనల ప్రకారమే స్థలాన్ని పంపిణీ చేశామన్నారు. ఒకవేళ నేరం రుజువైతే కోర్టు ఏ శిక్ష విధించినా తాను సిద్ధమేనన్నారు. అయినా ప్రతిపక్షాలు పట్టు వీడలేదు. అబ్దుల్ సత్తార్ వెంటనే మంత్రి పదవికి రాజీనామ చేయాలని డిమాండ్ చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తరువాత సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే స్థానిక సంస్థల పాఠశాలల్లో మౌలికసదుపాయాల కోసం పంపిణీ చేస్తున్న నిధులు ఎటూ సరిపోవడం లేదని ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నకు విద్యా శాఖ మంత్రి దీపక్ కేసర్కర్ సమాధానమిచ్చారు. నిధుల కోసం విద్యాశాఖ త్వరలో ఓ కమిటీ ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియను 2023 మార్చి వరకు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. విదర్భకు న్యాయం చేయండి: అజిత్పవార్ కరోనా కారణంగా రెండేళ్లుగా నాగ్పూర్లో అసెంబ్లీ సమావేశాలు జరగకపోవడంతో విదర్భ ప్రాంతానికి అన్యాయం జరిగిందని అజిత్పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. విదర్భ, మరఠ్వాడ, రైతులు ఇతర అంశాలపై విస్తృతంగా చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను మరో వారం రోజులు పొడగించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం ఇవ్వలేకపోయారని, అది మహిళలను అవమానించడమేనని పవార్ అన్నారు. ఫడ్నవీస్ వద్ద ఏడు శాఖలున్నాయని, ఏ పనిమీద వెళ్లినా ఫడ్నవీస్ను అడగాలని చెబుతున్నారని ఆరోపించారు. సాధ్యమైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ చేపట్టి, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని పవార్ సూచించారు. ఎన్సీపీ ప్రదేశ్ అధ్యక్షుడు జయంత్ పాటిల్ మాట్లాడుతూ... నందుర్బార్ జిల్లా ఆదివాసీ పాడలకు, కుగ్రామాలకు, నర్మద నదీ తీరంలోని 33 పల్లెకు వైద్య సేవలందడం లేదని ఫడ్నవీస్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఫడ్నవీస్ స్పందిస్తూ ఆశ వర్కర్లను అవసరమైతే వైద్యులను, ఇతర వైద్య సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. -
మన దేశానికి ఇద్దరు పితామహులు: డిప్యూటీ సీఎం భార్య కీలక వ్యాఖ్యలు
నాగ్పూర్: మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవిస్ ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర పితామహులుగా అభివర్ణించారు. మన దేశానికి ఇద్దరు పితామహులు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కాలానికి జాతి పితా మహాత్మా గాంధీ అయితే నేటీ సరికొత్త భారతావనికి పితామహులు నరేంద్ర మోదీ అంటూ ప్రధానిపై పొగడ్తలు జల్లు కురిపించారు అమృతా ఫడ్నవిస్. ఈ మేరకు అమృతా ఫడ్నవిస్ నాగ్పూర్ రచయితల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె నరేంద్ర మోదీని రాష్ట్ర పితాగా వ్యవహరించారు. దీంతో మరి మహాత్మా గాంధీ ఏమవుతారంటూ విలేకరులు ప్రశ్నించారు. దీంతో ఆమె సమర్థించుకుంటూ ఆ కాలంలో మహాత్మా గాంధీ జాతి పితా, ప్రస్తుతం నరేంద్ర మోదీ అంటూ కవర్ చేశారు. ఆమె ఇలా మోదీని పొగడ్తలతో ముంచెత్తడం మొదటి సారి కాదు. 2019లో ప్రధానికి పంపిన ట్విట్టర్ సందేశంలో కూడా మన దేశ పితామహుడు నరేంద్ర మోదీజీకి జన్మదిన శుభాకాంక్షలు. సమాజ అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పనిచేయడంలో మాకు స్ఫూర్తి మీరే అని పోస్ట్ చేశారు. ఆమె తరుచు ఇలా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూ వార్తలో నిలుస్తుంటారు. అంతకు మునుపు ఉద్ధవ్ థాక్రేపై విరుచుపడి వార్తల్లో నిలిచారు. కాగా, శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ షిండే సీఎం కాగానే ఆమె భర్త దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యిన సంగతి తెలిసిందే. (చదవండి: ముంబైలో దారుణం..అందరూ చూస్తుండగా కత్తితో దాడి చేసి..) -
Cabinet Expansion: ఎమ్మెల్యేల్లో అసంతృప్తి సెగలు
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయినప్పటికీ మంత్రివర్గ విస్తరణపై ఒక స్పష్టత రాలేకపోయింది. దీంతో మంత్రివర్గ విస్తరణ సందిగ్ధంలో పడిపోయింది. శిందే, ఫడ్నవీస్, అమిత్షా మధ్య రాష్ట్రానికి చెందిన అంశాలపై 30 నిమిషాలపాటు కీలక సమావేశం జరిగినప్పటికీ కనీసం మంత్రివర్గ విస్తరణ తేదీ కూడా నిర్ణయించలేక పోయారు. దీంతో మంత్రివర్గ విస్తరణ వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశముందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు గడిచింది. మొదటి దశ మంత్రివర్గ విస్తరణ చేపట్టి నాలుగు నెలలు కావస్తోంది. ప్రభుత్వంలో శిందే, ఫడ్నవీస్సహా 20 మంది మంత్రులు కొనసాగుతున్నారు. అప్పట్లో మిగతా వాటిలో 13 శాఖలు శిందే తమ వద్దే ఉంచుకున్నారు. క్యాబినెట్లో తమకు స్ధానం లభించకపోవడంతో మిగతావారు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అసంతృప్తులను సంతృప్తి పరిచేందుకు త్వరలో రెండో దశ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అప్పట్లో ప్రకటించారు. కాని నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడంతో ఇటు శిందే వర్గం, అటు ఫడ్నవీస్ వర్గం ఎమ్మెల్యేలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మంత్రివర్గంలో తమకు ఎప్పుడు స్ధానం లభిస్తుందా..? అని ఇరువర్గాల ఎమ్మెల్యేలు కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. కానీ వారి ఆశలు అడియాశలవుతున్నాయి. చివరకు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే రెండో దశ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని నెల రోజుల కిందట శిందే ప్రకటించారు. ప్రస్తుతం మంత్రులపై ఉన్న అదనపు శాఖల భారం తగ్గుందని తెలిపారు. దీంతో ఇరువర్గాల ఎమ్మెల్యేలలో కొంత ఆశలు చిగురించాయి. కానీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గరపడుతోనప్పటికీ మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. శీతాకాల సమావేశాల్లో తన వద్ద ఉన్న 13 శాఖలకు సంబంధించి ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ఒక్కరే సమాధానమివ్వడం సాధ్యం కాదని శిందే ముందే తెలుసుకున్నారు. దీంతో శిందే తన వద్ద ఉన్న 13 శాఖల బాధ్యతలు ఇతర మంత్రులకు అప్పగించారు. దీన్నిబట్టి మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని ఇరు వర్గాల ఎమ్మెల్యేలకు పరోక్షంగా తెలిసిపోయింది. కాని త్వరలో అమిత్ షాతో భేటీ అయి మంత్రి వర్గ విస్తరణపై చర్చించి ఒక స్పష్టత తీసుకొస్తామని శిందే, ఫడ్నవీస్ ఇటీవల ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యేలలో మళ్లీ ఆశలు చిగురించాయి. ఆ ప్రకారం బుధవారం ఢిల్లీలో అమిత్షాతో శిందే, ఫడ్నవీస్, కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై భేటీ అయ్యారు. సమావేశం అనంతరం శిందే, ఫడ్నవీస్ రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన సమస్యలపై సుమారు 30 నిమిషాలు కేంద్ర హోంమంత్రితో చర్చించారు. కానీ ఈ సమావేశంలో నాగ్పూర్లో ఈ నెల 19వ తేదీ నుంచి జరగనున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందు చేపట్టాల్సిన మంత్రివర్గ విస్తరణపై ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దీంతో పరిస్ధితి మళ్లీ మొదటికే వచ్చింది. దీంతో ఇరు వర్గాల ఎమ్మెల్యేలలో ముఖ్యంగా శిందే వర్గం ఎమ్మెల్యేలలో అసంతృప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. శాసనసభ శీతాకాల సమావేశాలకు ముందు మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. శీతాకాల సమావేశాల తర్వాత చేయవచ్చనే మీడియా కథనాన్ని ఉటంకిస్తూ వార్తలు వస్తున్నాయి. శీతాకాల సమావేశాల తరువాతే! నిజానికి శీతాకాల సమావేశాల తర్వాత చేయొచ్చని మీడియా కథనాలను ఉటంకిస్తూ వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో అమిత్ షాతో అర్థరాత్రి జరిగిన సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. ఈ సమావేశం తర్వాత మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాన్ని ఖరారు చేశారు. ఈ సమావేశానికి ఫడ్నవీస్, షిండే ఇద్దరూ హాజరయ్యారు. నిజానికి శీతాకాల సమావేశాలకు ముందే షిండే–ఫడ్నవీస్ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ముందుగా భావించారు. కానీ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇప్పుడు శీతాకాల సమావేశాల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఖరారయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం భయపడుతోంది... ప్రస్తుతం, మంత్రివర్గంలో ముఖ్యమంత్రి శిందే, ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో సహా 20 మంది కేబినెట్ ర్యాంక్ మంత్రులు ఉన్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో జాప్యంపై విపక్షాలు దూకుడు పెంచాయి. శిందే, ఫడ్నవీస్లు ప్రతి ఎమ్మెల్యేకు మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అందుకే ఇప్పుడు తమకు మంత్రి పదవులు ఇవ్వకపోతే అసంతృప్త ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారని బీజేపీ భయపడుతోందని వారు వ్యాఖ్యానించారు. -
Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ మళ్లీ వాయిదా!
సాక్షి, ముంబై: మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా అని కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్న ఎమ్మెల్యేలకు మళ్లీ నిరాశే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 19వ తేదీ నుంచి నాగ్పూర్లో జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని గత నెలలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో అసెంబ్లీ కార్యకలాపాల నిర్వాహణ కమిటీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసి తేదీ ప్రకటిస్తుందని ఆయన వెల్లడించారు. అంతేగాకుండా డిసెంబరు 5–9 తేదీల మధ్య ఏదో ఒకరోజు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని శిందే, ఫడ్నవీస్ సంకేతాలిచ్చారు. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గం, ఫడ్నవీస్ వర్గం ఎమ్మెల్యేలలో ఆనందం వెల్లివిరిసింది. కానీ ప్రత్యక్షంగా ఈ ముహూర్తం కూడా దాటిపోయే అవకాశం ఏర్పడింది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ మంత్రివర్గ విస్తరణపై ఇంతవరకు శిందే, ఫడ్నవీస్ మధ్య సాధారణ చర్చగాని, సమావేశంగాని జరగలేదు. దీంతో ఇరువర్గాల ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో తిరుగుబాటు లేదా దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏక్నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నెలరోజులకు మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో శిందే, ఫడ్నవీస్ వర్గానికి చెందిన తొమ్మిది మంది చొప్పున ఇలా 18 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా వారికి ఆవకాశం దొరకకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఈ మంత్రివర్గ విస్తరణలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడంపై ఇటు మహిళా వర్గం నుంచి, అటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో రెండో దశ మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉంటుందని అందులో మహిళలకు చోటు కల్పిస్తామని అప్పట్లో అందరినీ బుజ్జగించే ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా అప్పట్లో ఏక్నాథ్ శిందేతోపాటు శివసేన నుంచి బయటపడిన ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వంలోని మంత్రివర్గంలో తమకు చోటు లభిస్తుందని ఎంతో ఆశపడ్డారు. ఆ విధంగా తనతో వచ్చిన ఎమ్మెల్యేలందరికీ శిందే హామీ కూడా ఇచ్చారు. కానీ ఆ ఆశ నిరాశకు గురిచేసింది. శిందే వర్గం ఎమ్మెల్యేలలో నెలకొన్న అసంతృప్తి రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. ఫలితంగా శిందేపై తిరుగుబాటుచేసి మళ్లీ సొంత గూటి (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) లోకి చేరే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే శిందే, ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సంక్షో¿భంలో చిక్కుకోవడం ఖాయం. ఆ పరిస్ధితి రాకముందే శిందే, ఫడ్నవీస్ జాగ్రత్త తీసుకున్నారు. చివరకు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతామని శిందే, ఫడ్నవీస్ ప్రకటించి అసంతృప్తులందరినీ సంతృప్తి పరిచే ప్రయత్నం జరిగింది. కానీ అసంతృప్తులకు హామీ ఇచ్చి దాదాపు ఐదు నెలలు కావస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు సమయం కూడా దగ్గరపడుతోంది. ఈ నాలుగైదు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలి. కానీ ఇంతవరకు దాని ఊసే ఎత్తడం లేదు. కనీసం శిందే, ఫడ్నవీస్ మధ్య చర్చ కూడా జరగడం లేదు. శిందే, ఫడ్నవీస్ ఆదివారం నాగ్పూర్–షిర్డీ హై స్పీడ్ కారిడార్పై ట్రయల్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఫడ్నవీస్ ఢిల్లీ వెళతారని తెలిసింది. ఈ నెల 11వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నాగ్పూర్ పర్యటనకు వస్తున్నారు. ఆ సమయంలో నాగ్పూర్లో మెట్రో రైలు మార్గం, దివంగత బాల్ ఠాక్రే సమృద్ధి మహామార్గ్ నాగ్పూర్–షిర్డీ మొదటి దశ 520 కిలోమీటర్ల మేర మార్గాన్ని మోడీ ప్రారంభిస్తారు. దీంతో మోడీ పర్యటన నేపధ్యంలో శిందే, ఫడ్నవీస్ ఏర్పాట్ల పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తరువాత వారం రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతాయి. దీన్ని బట్టి ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్లేనని స్పష్టమవుతోంది. కేబినెట్ హోదాతో రాష్ట్ర బోర్డులు... అసెంబ్లీ శీతాకాల సమావేశానికి ముందు, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయాలని, రాష్ట్ర బోర్డులు, కార్పొరేషన్ల కేటాయింపులను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులేతో శిందే సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణ కోసం కేంద్రం అనుమతి కోసం వేచి ఉండకుండా, కూటమి భాగస్వాములు ఇద్దరూ కలిసి కేబినెట్ హోదాతో రాష్ట్ర బోర్డులు, కార్పొరేషన్ల కేటాయింపులను ప్రారంభించవచ్చని నిర్ణయించారు. ‘శిందే తిరుగుబాటులో ఆయనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం తహతహలాడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ చేయకుంటే.. విస్తరణలో తమ పేర్లు చేర్చకుంటే ఆందోళనకు దిగుతామని కొందరు హెచ్చరించారు. అసంతృప్త ఎమ్మెల్యేలను కేటాయింపుల ద్వారా శాంతింపజేయడమే సీఎం శిందే ముందున్న తక్షణ సమస్య’’ అని పేరు వెల్లడించని ఒక బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఐదు నెలల క్రితమే తొలి మంత్రివర్గ విస్తరణ జరిగినా, మెజారిటీ మంత్రిత్వ శాఖలు ఇంకా కేటాయించలేదు. ముఖ్యమంత్రి, ఆయన డిప్యూటీలపై గరిష్ట శాఖల భారం ఉంది. అంతేకాకుండా, ఇది ప్రభుత్వ విధానాలపై, పరిపాలన అమలుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. శిందే, ప్రముఖ మంత్రులతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఒకవేళ ప్రతికూల ఫలితం వస్తే ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది. అందువల్లనే విస్తరణలను ఆలస్యం చేయడంపై వారు చాలా ఆలోచిస్తున్నారు’’ అని ఆ సీనియర్ బీజేపీ నాయకుడు అన్నారు. కేబినెట్ హోదాతో రాష్ట్ర బోర్డులను కేటాయిస్తే ఒకే దెబ్బకు రెండు పిట్టలు పడ్డట్టేనని శిందే సన్నిహితుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ‘ఇంతకుముందు క్రీమ్ పోర్ట్ఫోలియోలను డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు నిరాశలో ఉన్నారు. మంత్రి పదవి లభించని పక్షంలో బోర్డులతో సరిపెట్టుకోవడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. దీనివల్ల పోటీ తగ్గుతుంది. కాబట్టి తర్వాత, పోర్ట్ఫోలియోలను పంపిణీ చేయడం, మంత్రివర్గాన్ని విస్తరించడం మాకు సమస్య కాదు. ఇది పక్కా ప్రణాళికతో కూడిన వ్యూహం’ ఆయన అన్నారు. -
ఫడణవీస్ 'ప్రతీకారం' వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సంజయ్ రౌత్
ముంబై: తనకు వెన్నుపోటు పొడిచిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకున్నానని మంగళవారం ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే శివసేన(ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్ దీనిపై స్పందించారు. ఫడణవీస్ మాటలు మహారాష్ట్ర సంస్కృతికి పూర్తి విరుద్ధమని కౌంటర్ ఇచ్చారు. కొత్త ఒరవడి, సంప్రదాయాలకు శ్రీకారం చుడుతున్న ప్రస్తుత రాజకీయాల్లో ప్రతీకారానికి తావు లేదని పేర్కొన్నారు. ఫడణవీస్ మాటలు ఆయన స్థాయిని తగ్గించేలా ఉన్నాయని చెప్పారు. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సహజమేనని, కానీ మహారాష్ట్రలో ఇప్పటివరకు ప్రతీకారం అనే పదాన్ని ఏ రాజకీయ నాయకుడు ఉపయోగించలేదని రౌత్ అన్నారు. ఫడణవీస్ వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొన్నారు. ఓ మరాఠీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు నమ్మకద్రోహం చేసిన వారిపై ప్రతీకారం తీర్చేసుకున్నానని ఫడణవీస్ అన్నారు. రాజకీయాల్లో తమ పక్కనే ఉండి, అధికారం పంచుకొని ఆ తర్వాత పదవుల కోసం వెన్నుపోటు పొడిచేవాళ్లు కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని వ్యాఖ్యానించారు. తనకు వెన్నుపోటు పొడిచిన వాళ్లపై తాను ఇప్పటికే ప్రతీకారం తీర్చుకున్నానని స్పష్టం చేశారు. ఆయన ఉద్ధవ్ థాక్రేను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారు. థాక్రే.. కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపి తన కాలిని తానే షూట్ చేసుకున్నాడని ఫడణవీస్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో శివసేనను చీల్చి ఏక్నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దేవేంద్ర ఫడణవీస్ డిప్యూటీ సీఎం అయ్యారు. సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగురవేసినా.. ఉద్ధవ్ థాక్రే ఏమీ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఫడణవీస్ ప్రతీకారం తీర్చుకున్నానని వ్యాఖ్యానించారు. శివసేనను చీల్చి, థాక్రేను సీఎం పదవి నుంచి తప్పించి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నానని చెప్పకనే చెప్పారు. చదవండి: కాంగ్రెస్కు మరో షాక్.. రాజస్థాన్ ఇన్ఛార్జ్ రాజీనామా -
ఫడ్నవీస్పై సంజయ్ రౌత్ ప్రశంసల వర్షం.. జైలు నుంచి వచ్చిన మరునాడే..
ముంబై: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాత్రాచల్ కుంభకోణం కేసులో అరెస్టై విడుదలైన మరుసటి రోజే మహారాష్ట్ర ప్రభుత్వం, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్పై ప్రశంసలు కురిపించారు. మహారాష్ట్రలోని కొత్త ప్రభుత్వం కొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటోందని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన పనులను వ్యతిరేకించాలి కాబట్టి తాము వ్యతిరేకించమని.. అలా ఎప్పుడూ చేయలేదని తెలిపారు. ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నడుపుతున్నారని నేను భావిస్తున్నాను. ఫడ్నవిస్ కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు. నేను జైలులో వీలైనప్పుడల్లా న్యూస్పేపర్ చదివాను. పేదలకు గృహనిర్మాణం వంటి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని నేను స్వాగతిస్తాను’ అంటూ కొనియాడారు. కాగా మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టిన శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేతో కలిసి బీజేపీ గత జూన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను కలిసే ముందు గురువారం తన ఇంటి వద్ద సంజయ్ రౌత్ పలు విషయాలపై మీడియాతో మాట్లాడారు. ‘మూడు నెలల్లో ప్రజలు నన్ను మర్చిపోతారని అనుకున్నాను. కానీ విడుదలైనప్పటి నుంచి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే నాతో క్రమం తప్పకుండా టచ్లో డేవారు. శరద్ పవార్ కూడా నాతో ఫోన్లో మాట్లాడారు. ప్రజలకు సంబంధించిన కొన్ని పనుల కోసం ఫడ్నవీస్ను కలవనున్నాను. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలవబోతున్నాను. వారిని కలిసి నాకు జరుగుతున్న పరిణామాల గురించి వివరించాలి. రాష్ట్రంలో రాజకీయ దుమారం తగ్గించాలంటూ ఫడ్నవీస్ చెప్పిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాను’ అని తెలిపారు. అదే విధంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను సైతం కలుస్తానని సంజయ్ రౌత్ చెప్పారు. చదవండి: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ తన అరెస్ట్ చట్టవిరుద్దమంటూ కోర్టు ఇచ్చిన తీర్పుపై సంజయ్ రౌత్ మాట్లాడారు.. ఎవరి పేరు ప్రస్తావించకుండా తన అరెస్ట్ వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. నేను జైలులో ఉండగా నా కుటుంబం ఎన్నో కష్టాలు పడింది. జైలులో నా ఆరోగ్యం దెబ్బతింది. జైలు జీవితం అంత సులువేమీ కాదు. అక్కడ ఎత్తయిన గోడలు ఉంటాయి. వాటితోనే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి హిందూత్వ దిగ్గజం సావర్కర్ పదేళ్ళపాటు జైలు జీవితం గడిపారు. బాలగంగాధర్ తిలక్, అటల్ బిహారీ వాజ్పాయి వంటి నాయకులు జైలులో గడిపారు. వీరంతా ఎలా గడిపారోనని తరచూ అనుకునేవాడిని. కానీ రాజకీయాల్లో ఎవరున్నా ఏదో ఒక సమయంలో జైలుకు వెళ్లాల్సిందేనని నాకు నేనే చెప్పుకున్నాను. నేను వ్యవస్థను తప్పుపట్టడం లేదు. కోర్టు తీర్పు, ఈడీపై ఎలాంటి కామెంట్ చేయను. నా మౌనం వారికి సంతోషాన్ని కలిగిస్తే.. సంతోషపడనివ్వండి. నా మనసులో ఎవరిపై పగ లేదు. ఏ కేంద్ర దర్యాప్తు సంస్థను నిందించడం లేదు.’ అని వ్యాఖ్యానించారు. కాగా పాత్రాచల్ రీడెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఈడీ గత ఆగస్టు నెలలో సంజయ్ రౌత్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తొలుత ఈడీ ఆయనను కస్టడీలోకి తీసుకోగా తర్వాత కోర్టు జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించింది. దాదాపు మూడు నెలలు జైల్లో గడిపారు. ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి సంజయ్ రౌత్ బుధవారం విడుదలయ్యారు. అయితే జైలు నుంచి విడుదలైన మరునాడే సంజయ్ బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: లాలూ కుమార్తె గొప్ప మనసు.. తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు.. -
పదవి ఏదైనా అధికారం నాదే!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు, డిప్యూటీ సీఎం పదవి చేపట్టటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్. పదవి అనేది రాజకీయ సామర్థ్యాన్ని నిర్ధారించదని పేర్కొన్నారు. శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పినప్పుటికీ అధికారం ఫడ్నవీస్ చేతిలోనే ఉందనే వాదనలు వినిపిస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేయటం మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. మరోవైపు.. ఆయన చేతిలోనే ఆరు పోర్ట్ఫోలియోలు ఉండటమూ గమనార్హం. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టకపోవటంపై మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వంలో పలు పోర్ట్ఫోలియోలు నిర్వహించటంపై ప్రశ్నించగా.. గతంలో ముఖ్యమంత్రిగా ఆ బాధ్యతలు నిర్వర్తించినట్లు గుర్తు చేశారు దేవేంద్ర ఫడ్నవీస్. ‘మంత్రివర్గ విస్తరణ పెండింగ్లో ఉన్నందున ఆ శాఖలు నా అధీనంలోనే ఉన్నాయి. విస్తరణ తర్వాత అందులో కొన్ని ఇతరుల చేతికి వెళ్తాయి. తమ ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలు ఎవరికైనా ఇవ్వొచ్చు. వారిని ఆ బాధ్యతల్లో విజయవంతం చేయటమే మా బాధ్యతగా విశ్వసిస్తాం. పోర్ట్ఫోలియో ఏదనేది పట్టింపులు లేవు.. సుపరిపాలన అందించటమనేదానిపైనే సమష్టి కృషి ఉంటుంది. రాజకీయంలో పోస్టును బట్టి శక్తిసామర్థ్యాలు నిర్ణయం కావు, నీవు ఎవరనేదే ముఖ్యం. నేను రాజకీయంగా బలపడ్డానా లేదా నష్టపోయానా? అనే అంశాన్ని మహారాష్ట్రలోని ఎవరినైనా అడగవచ్చు.’ అని పేర్కొన్నారు దేవేంద్ర ఫడ్నవీస్. థాక్రే వెన్నుపోటుకు ప్రతీకారం.. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయి.. బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపైనా స్పందించారు దేవేంద్ర ఫడ్నవీస్. శివసేన నేత ఉద్ధవ్ థాక్రే బీజేపీకి వెన్నుపోటు పొడిచారని, అందుకే కాషాయ పార్టీ ప్రతీకారం తీర్చుకోవాలనుకుందని అసలు విషయం వెల్లడించారు. ముందుగా ప్రభుత్వంలో ప్రాతినిథ్యం వహించకూడదని నిర్ణయించుకున్నానని, అయితే, వెలుపల ఉండి ప్రభుత్వాన్ని నడిపించలేమని, నా అనుభవం అవసరమని పార్టీ నేతలు ఒప్పించినట్లు చెప్పారు. వారి కోరిక మేరకే ప్రభుత్వంలో భాగమయ్యాయని వెల్లడించారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉండాలని బీజేపీ సూచించినప్పుడు షాక్కి గురయ్యానని, అయితే, తనను ఎప్పుడూ డిప్యూటీ అనే ఆలోచన రాకుండా షిండే చూసుకుంటున్నారని ప్రశంసించారు. ఇదీ చదవండి: ఢిల్లీలో డీజిల్ కార్లపై నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.20వేల జరిమానా -
విషాదం: భవనం కుప్పకూలి సజీవ సమాధైన కుటుంబం
ముంబై: మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఆదివారం సాయంత్రం విషాద ఘటన జరిగింది. ఓ భవనం కుప్పకూలి ఒకే కుటుంబంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. అమరావతిలోని ప్రభాత్ సినిమా ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. శిథిలాలను తొలగించే సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ విషాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. భవనం కూలిపోయిన ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని డివిజనల్ కమిషనర్ను ఆదేశించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు. ఇదీ చదవండి: తుపాకులతో బెదిరించి రూ.30లక్షల కారు ఎత్తుకెళ్లిన దుండగులు -
సీఎం, డిప్యూటీ సీఎంలపై ట్విట్టర్లో అసభ్య వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్లపై గుర్తు తెలియని వ్యక్తి ట్విట్టర్లో అభ్యంతరకర వ్యాఖలు చేశాడు. ఈ మేరకు అధికారులు అక్టోబర్ 14న ఒక గుర్తు తెలియని వ్యక్తి ట్విట్టర్ సీఎం, డిప్యూటీ సీఎంలపై అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేసినట్లు ఫిర్యాదు అందినట్లు చెప్పారు. ఆ నిందితులు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ని ఉపయోగించి తాము ముంబై నుంచి కంటెంట్ని పోస్ట్ చేస్తున్నట్లుగా అధికారులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. సైబర్ వింగ్ దర్యాప్తులో నిందితులు అహ్మద్నగర్ జిల్లాలోని రాహురిలో ఉన్న మహాత్మా ఫూలే వ్యవసాయం విశ్వవిద్యాలయం నుంచి వాటిని పోస్ట్ చేస్తున్నట్లు కనుగొన్నారు. దీంతో సైబర్ బృందం శనివారం ఆ విశ్వవిద్యాలయంలో దాడులు నిర్వహించగా... ఇద్దరు అనుమానితులను అదుపులోక తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించింది. వారివద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పీహెచ్డీ విద్యార్థిని యూనివర్సిటీ నుంచి అదుపులోకి తీసుక్నుట్లు తెలిపారు. ఐతే ట్విట్టర్లో ఇలాంటి కంటెంట్లను రూపొందించడానికి ఎవరి సాయమైనా తీసుకున్నారేమో అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: డీవీడి రైటర్లో రూ. 40 లక్షలు ఖరీదు చేసే బంగారం) -
ఎమ్మెల్యేలకు దేవేంద్ర ఫడ్నవీస్ తీపి కబురు
సాక్షి, ముంబై: మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందోనని కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శుభవార్త ఆందించారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని నాగ్పూర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఫడ్నవీస్ ప్రకటించారు. త్వరలో అసెంబ్లీ కార్యకలాపాల నిర్వాహణ కమిటీ ముహూర్తం ఖరారుచేసి తేదీ ప్రకటిస్తుందని ఆయన అన్నారు. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గం, ఫడ్నవీస్ వర్గం ఎమ్మెల్యేలలో ఆనందం వెల్లివిరిసింది. ముఖ్యంగా గత మూడు నెలలుగా అసంతృప్తితో బీజేపీ ప్రభుత్వంలో కొనసాగుతున్న శిందే వర్గం ఎమ్మెల్యేల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా నాగ్పూర్లో జరగాల్సిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ముంబైలో చాలా తక్కువ రోజులు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి నాగ్పూర్లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రెండు వారాలపాటు కచ్చితంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలకు అభ్యంతరం లేకుంటే నూతన సంవత్సర వేడుకలు నాగ్పూర్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఉద్ధవ్తో కలవం.. రాజ్ ఠాక్రే సత్సంబంధాలు ఇదిలాఉండగా భవిష్యత్తులో ఉద్ధవ్ ఠాక్రేతో చేతులు కలిపే సమస్యే లేదని విలేకరులడిగిన ఓ ప్రశ్నకు ఫడ్నవీస్ సమాధానమిస్తూ స్పష్టం చేశారు. ఉద్ధవ్ తన మనసుకు చాలా బాధ కల్గించారని, ఆయనతో ఇకపై చేతులు కలిపే ప్రసక్తేలేదని అన్నారు. ఎమ్మెన్నెస్తో పొత్తు పెట్టుకుంటారా? అని విలేకరులడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పార్టీలు వేరైన అనేక ఏళ్లుగా రాజ్ ఠాక్రేతో తమకు సత్సంబంధాలున్నాయి. ఆయన తనకు మంచి మిత్రుడని, రాజకీయంగా కాకపోయిన మంచి మిత్రులుగా కలిసే ఉంటామని ఫడ్నవీస్ వెల్లడించారు. మూడునెలలుగా పెండింగ్లోనూ.. ఏక్నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నెల రోజులకు మంత్రి వర్గ విస్తరణ జరిగింది. మొదటి దశ మంత్రివర్గ విస్తరణ జరిగి దాదాపు మూడు నెలలు కావస్తోంది. అయినప్పటికీ రెండో దశ విస్తరణకు ఇంకా ముహూర్తం లభించకపోవడంపై ఎమ్మెల్యేలలో అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా శిందే వర్గం ఎమ్మెల్యేలలో అసంతృప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. దీంతో వారిని సంతృప్తి పరిచేందుకు త్వరలో రెండో దశ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అప్పట్లో ప్రకటించారు. కాని ఇంతవరకు దాని ఊసు ఎత్తడం లేదు. మహిళలకు దక్కని ప్రాధాన్యం అప్పట్లో ఏక్నాథ్ శిందే తిరుగుబాటుతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం రద్దయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు నెల రోజులకు మొదటి దశ మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో శిందే, ఫడ్నవీస్ వర్గానికి చెందిన తొమ్మిది మంది చొప్పున ఇలా 18 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగతావారికి ఆవకాశం దొరక్కపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఈ మంత్రివర్గ విస్తరణలో ఒక్క మహిళకు కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఇటు మహిళా వర్గం నుంచి, అటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చింది. దీంతో రెండో దశ మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉంటుందని అందులో మహిళలకు చోటు కల్పిస్తామని అప్పట్లో అందరినీ బుజ్జగించే ప్రయత్నం జరిగింది. రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తి ముఖ్యంగా అప్పట్లో ఏక్నాథ్ శిందేతోపాటు శివసేన నుంచి బయటపడిన ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వంలోని మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఎంతో ఆశపడ్డారు. కానీ ఆశ నిరాశకు గురిచేసింది. శిందే వర్గం ఎమ్మెల్యేలలో నెలకొన్న అసంతృప్తి రోజురోజుకు తీవ్రరూపం దాల్చసాగింది. ఫలితంగా శిందేపై తిరుగుబాటుచేసి సొంత గూటిలోకి (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) చేరే ప్రమాదం ఏర్పడింది. ఒకవేళ అదే జరిగితే బీజేపీ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయం. ఆ పరిస్ధితి రాకముందే శిందే, ఫడ్నవీస్ జాగ్రత్త తీసుకున్నారు. చివరకు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతామని ఫడ్నవీస్ ప్రకటించి ఈ అంశానికితెరదించారు. (క్లిక్ చేయండి: మరో ‘మహా’కూటమి?.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు పావులు)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement