-
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
యువ హీరో ఆది సాయి కుమార్.. త్వరలో 'కృష్ణ ఫ్రమ్ బృందావనం' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. వీరభద్రమ్ చౌదరి దర్శకుడు. ఈ మధ్య లాంఛనంగా ప్రారంభమైంది. అన్ని కమర్షియల్ అంశాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.(ఇదీ చదవండి:పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'? )ఇందులో భాగంగా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ఆది సాయి కుమార్, దర్శకుడు వీరభద్రమ్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ గోవా వెళ్లారు. గతంలో ఆది సాయి కుమార్ లవ్ లీ, ప్రేమ కావాలి, సుకుమారుడు లాంటి హిట్ సినిమాలకు అనూప్ రుబెన్స్ సంగీతమందించారు. ఇప్పుడు 'కృష్ణ ఫ్రమ్ బృందావనం’ చిత్రానికి అలాంటి సాంగ్స్ రెడీ చేస్తున్నారు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దిగంగన సూర్యవంశీ హీరోయిన్గా చేస్తోంది.(ఇదీ చదవండి: హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?) -
ఆది సాయి కుమార్ కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
'రుధిరాక్ష' కోసం ఏకమైన ఆది సాయికుమార్, జేడీ చక్రవర్తి
ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు ఆది సాయికుమార్. తాజాగా ఈ యంగ్ హీరో మరో కొత్త సినిమా ‘రుధిరాక్ష’ను కూడా పట్టాలెక్కించాడు. ఇందులో వెర్సటైల్ యాక్టర్స్ జె.డి చక్రవర్తి, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివ శంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 9 స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై శివ శంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. డార్క్, థ్రిల్లర్ నేపధ్యంలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబధించిన పూజా కార్యక్రమం రామానాయడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సముద్రఖని క్లాప్ కొట్టగా రామ్ తాళ్లూరి కెమరా స్విచాన్ చేశారు. ఫస్ట్ షాట్ కు డైరెక్టర్ దేవ్ దర్శకత్వం వహించారు. హై బడ్జెట్, టాప్ టెక్నికల్ వాల్యూస్ తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. 'యానిమల్' ఫేం హర్షవర్షన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కిశోర్ బోయిదాపు డీవోపీ గా పని చేస్తున్న ఈ చిత్రానికి విజయ్ కృష్ణ ఆర్ట్ డైరెక్టర్. పవన్ హిమాన్షు, బాలు మహేంద్ర మాటలు అందిస్తున్నారు. -
ఓటీటీలో ఆకట్టుకుంటున్న ఆది సాయికుమార్ 'CSI సనాతన్'
హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు హీరో ఆది సాయికుమార్. ఏడాదికి సుమారు నాలుగు చిత్రాలతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. తాజాగా 'CSI సనాతన్' అంటూ ఆది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చదవండి: శ్రీజను టార్గెట్ చేస్తూ వీడియో షేర్ చేసిన కల్యాణ్దేవ్ ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ అలరించేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి ఓటీటీ యాప్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. ఆది సాయి కుమార్ యాక్షన్స్ ఈ సినిమాకు హైలెట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఓటీటీ ప్రేక్షకులను సైతం ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆదికి జోడీగా మిషా నారంగ్ హీరోయిన్గా నటించగా, నందిని రాయ్, ఖయ్యుం, రవి ప్రకాష్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. చదవండి: ఎంపీతో హీరోయిన్ పరిణీతి ఎంగేజ్మెంట్.. అతిథులకు ఆహ్వానం -
ఇలాంటి కథ తెలుగులో ఇదే మొదటిది: హీరో ఆది
‘‘ఏడాదిన్నర క్రితం దర్శకుడు దేవ్ ‘సీఎస్ఐ సనాతన్’ కథ చెప్పినప్పుడు ఎగ్జయిట్ అయ్యాను. సాధారణ పౌరులకు కనెక్ట్ అయ్యే కథ ఇది’’ అని ఆది సాయికుమార్ అన్నారు. శివశంకర్ దేవ్ దర్శకత్వంలో ఆది సాయికుమార్, మిషా నారంగ్ జంటగా నటించిన చిత్రం ‘సీఎస్ఐ సనాతన్’. సునిత సమర్పణలో అజయ్ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఆది మాట్లాడుతూ– ‘‘మామూలుగా ఇలాంటి కథలు మలయాళంలో చూస్తుంటాం. తెలుగులో మా ‘సీఎస్ఐ సనాతన్’ మొదటిది అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నాను. ఇప్పటికే మన దేశంలో ఈ కథలోని ఘటనల్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది’’ అన్నారు శివశంకర్ దేవ్. -
‘పులి మేక’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
సనాతన్ లక్ష్యం
ఆది సాయికుమార్ టైటిల్ రోల్లో రూపొందిన చిత్రం ‘సీఎస్ఐ సనాతన్’. మిషా నారంగ్ హీరోయిన్. శివశంకర్ దేవ్ దర్శకత్వంలో అజయ్ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 10న విడుదల కానుంది. ట్రైలర్ని శుక్రవారం విడుదల చేశారు. కార్పొరేట్ లీడర్ విక్రమ్ చక్రవర్తి హత్యను చేధించడమే లక్ష్యంగా సీఎస్ఐ (క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్) సనాతన్ ఐదుగురు నిందితులను విచారించడం ఈ ట్రైలర్లో కనబడుతుంది. ఐదుగురూ ఐదు రకాలుగా చెబుతారు. ‘నిజాన్ని అస్సలు ఊహించలేము’ అని సనాతన్ చెప్పే డైలాగ్తో ట్రైలర్ సాగుతుంది. ‘‘మర్డర్ మిస్టరీగా రూపొందించిన ఈ చిత్రం ఉత్కంఠభరింతగా ఉంటుంది’’ అని నిర్మాత అజయ్ శ్రీనివాస్ అన్నారు. -
'టాప్ గేర్' మూవీ రివ్యూ
టైటిల్: టాప్ గేర్ నటీనటులు: ఆది సాయికుమార్, రియా సుమన్, బ్రహ్మజీ, సత్యం రాజేశ్, మైమ్ గోపీ, శత్రు, బెనర్జీ, వంశీ, ఆర్జే హేమంత్, చమ్మక్ చంద్ర నిర్మాణ సంస్థలు:ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ , శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మాత: కేవీ శ్రీధర్ రెడ్డి దర్శకత్వం: కె.శశికాంత్ సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్ ఎడిటర్: ప్రవీణ్ పూడి విడుదల తేదీ: డిసెంబర్ 30,2022 యంగ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్, రియా సుమన్ జంటగా తెరకెక్కిన చిత్రం 'టాప్ గేర్'. ఈ చిత్రానికి కె.శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ సినిమాను రూపొందించారు. కేవీ శ్రీధర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. 'టాప్ గేర్'సినిమాతో మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చారు ఆది. డిసెంబర్ 30న ఈ సినిమా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే: ఆది సాయికుమార్(అర్జున్) ఓ క్యాబ్ డ్రైవర్. రియా సుమన్(ఆద్య)ను పెళ్లి చేసుకుని సంతోషంగా జీవనం సాగిస్తుంటాడు. కొత్తగా పెళ్లైన దంపతులు కావడంతో చాలా అన్యోన్యంగా ఉంటారు. మైమ్ గోపీ(సిద్ధార్థ్) డ్రగ్స్ సరఫరా చేస్తుంటాడు. పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతుంటాడు. ఇతని ముఠాలో బ్రహ్మజీ, సత్యం రాజేశ్ కూడా ఉంటారు. డ్యూటీకి వెళ్లిన అర్జున్ ఇంటికొస్తుండగా ఓ క్యాబ్ బుకింగ్ ఆర్డర్ వస్తుంది. అక్కడే అసలు కథ మొదలవుతుంది. అనుకోకుండా ఆరోజు అతని క్యాబ్లో ఇద్దరు వ్యక్తులు ఎక్కుతారు. ఆరోజు రాత్రి అర్జున్కు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. అతనికి ఓ గుడ్ న్యూస్ చెప్పాలని భార్య ఆద్య ఇంటి దగ్గర నిరీక్షిస్తూ ఉంటుంది. కానీ ఆరోజు రాత్రి అర్జున్ ఇంటికెళ్లాడా? ఆ గుడ్ న్యూస్ విన్నాడా? అసలు క్యాబ్లో ఎక్కిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఆ తర్వాత అర్జున్కు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? డ్రగ్స్ ముఠాకు, హీరోకు సంబంధం ఏంటీ? అర్జున్ను పోలీసులు ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నారు? అనేది తెరపై చూడాల్సిందే. కథ ఎలా సాగిందంటే.. డ్రగ్స్ ముఠా నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. విలన్ ఇంట్రడక్షన్తోనే కథ మొదలవుతుంది. ఆ తర్వాత ఆది, రియా సుమన్ పెళ్లి, దంపతుల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్లో ఎలాంటి పరిచయం లేకుండానే డైరెక్ట్గా పాత్రలను రంగంలోకి దించారు డైరెక్టర్. జీవనం సాఫీగా నడుస్తున్న క్యాబ్ డ్రైవర్ జీవితంలోకి డ్రగ్స్ ముఠా ఎంట్రీ కావడం, ఎలాంటి ట్విస్ట్లు లేకుండానే కథ సాగడం ప్రేక్షకుల కాస్త బోర్ కొట్టించింది. డ్రగ్స్ ముఠాను పట్టుకునేందుకు పోలీసుల ఆపరేషన్ చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. ఫస్టాఫ్ ఓ రొమాంటిక్ సాంగ్ మినహా ఎలాంటి యాక్షన్ సీన్స్, కామెడీ లేకుండానే ముగుస్తుంది. సెకండాఫ్కు వచ్చేసరికి కథలో వేగం పెంచారు. డ్రగ్స్ ముఠా, హీరో మధ్య సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కథలో డేవిడ్ అనే పాత్రే అసలు ట్విస్ట్. సెకండాఫ్ మొత్తం డ్రగ్స్ ఉన్న బ్యాగ్ చుట్టే కథ నడిపించారు. మధ్యలో అక్కడక్కడ కొత్త పాత్రల ఎంట్రీతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెంచారు. డ్రగ్స్ ముఠా, పోలీసులు, హీరో చుట్టే సెకండాఫ్ తిరుగుతుంది. మధ్యలో ఓ యాక్షన్ ఫైట్, డ్రగ్స్ బ్యాగ్ కోసం హీరో అర్జున్(ఆది) చేసే సాహసం హైలెట్. ఒకవైపు యాక్షన్ సన్నివేశాలు చూపిస్తూనే.. మరోవైపు భార్య, భర్తల ప్రేమానురాగాలను డైరెక్టర్ చక్కగా చూపించారు. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ నవ్వులు తెప్పించడం ఖాయం. సీరియస్ సీన్లలో కామెడీ పండించడం శశికాంత్కే సాధ్యమైంది. ఓవరాల్గా మనుషుల ఎమోషన్స్తో ఇతరులు ఎలా ఆడుకుంటారనే సందేశాన్నిచ్చారు డైరెక్టర్. అలాగే డ్రగ్స్ బారినపడి యువత జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారనే సందేశమిచ్చారు డైరెక్టర్. ఎవరెలా చేశారంటే.. ఆది సాయికుమార్ యాక్షన్ బాగుంది. క్యాబ్ డ్రైవర్ పాత్రలో ఆది సాయికుమార్ ఒదిగిపోయాడు. రియా సుమన్ నటనతో ఆకట్టుకుంది. రొమాంటిక్ సన్నివేశాల్లో అదరగొట్టింది. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. విలన్గా మైమ్ గోపీ(సిద్ధార్థ్) ఆకట్టుకున్నారు. శత్రు(ఏసీపీ విక్రం) పాత్రలో ఒదిగిపోయాడు. బ్రహ్మాజీ, సత్యం రాజేశ్, బెనర్జీ, వంశీ, ఆర్జే హేమంత్, చమ్మక్ చంద్ర తమ పాత్రలకు న్యాయం చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ బీజీఎం సినిమాకు ప్లస్. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పర్వాలేదు.ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి. -
ఆ ధైర్యం ఉంటేనే సినిమా తీయాలి: నిర్మాత శ్రీధర్ రెడ్డి
‘ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులను థియేటర్స్కి రప్పించడం చాలెంజింగ్ మారింది. సినిమాను ప్రారంభించడం, పూర్తి చేయడం, రిలీజ్ చేయడం అన్నీ నిర్మాతకు సవాళ్లే. వాటిని ఎదుర్కొగలను అనే ధైర్యం ఉంటేనే సినిమా నిర్మాణ రంగంలోకి దిగాలి’అని నిర్మాత కేవీ శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆది సాయి కుమార్, రియా జంటగా కె.శశికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టాప్ గేర్’. ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కేవీ శ్రీధర్రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► మనం కథ విన్నప్పుడు అది మనల్ని హాంట్ చేయాలి. శశికాంత్ ‘టాప్ గేర్’ కథ చెప్పిన తరువాత నాకు చాలా నచ్చింది. ఈ కథ విన్న తరువాత ఆది అయితే బాగుంటుందని మేం అనుకున్నాం. వెళ్లి కథ చెప్పాం. ఆయన ఓకే అన్నారు. ఈ సినిమాతో ఆదికి వచ్చే ఏడాది శుభారంభం కానుంది. ఆది మంచి డ్యాన్సర్. మంచి నటుడు. టాప్ గేర్ సినిమాతో వచ్చే ఏడాది ఆయన దశ మారుతుంది. ► టాప్ గేర్ సినిమాను డైరెక్టర్ అద్భుతంగా తీశారు. ఇందులో స్క్రీన్ ప్లే హైలెట్ అవుతుంది. నెక్ట్స్ సీన్ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తించేలా సినిమాను తీశారు. హర్షవర్దన్ మ్యూజిక్, ఆర్ఆర్ సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. ► ఈ సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ కన్నా కాస్త పెరిగింది. క్వాలిటీ కోసమే ఖర్చు పెట్టాం. సినిమాను చూశాక ఆడియెన్స్ కూడా అదే మాట చెబుతారు. కంటెంట్ మీదున్న నమ్మకంతోనే సినిమాను తీశాం. నాకున్న పరిచయాలతో సినిమాను సేఫ్ ప్రాజెక్ట్గా మార్చగలను. ► టాప్ గేర్ సినిమాను చూశాక సాయి కుమార్.. ‘ఆదికి 2023 చాలా బాగుండబోతోందని, టాప్ గేర్ సినిమాతో అది ప్రారంభం అవుతుంది’అని చెప్పారు. టాప్ గేర్ సినిమా పట్ల ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. -
ఆది సాయికుమార్ ‘టాప్గేర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అది అందరికీ అర్థం కాని పెద్ద పజిల్: ఆది సాయికుమార్
‘‘ప్రస్తుతం ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్ను ఇష్టపడుతున్నారన్న విషయం అంచనాలకు అందడంలేదన్న మాటలను నేనూ వింటున్నాను. ఓ సినిమా సెంట్రల్ ఐడియా కొత్తగా ఉందంటే సగం పాసైయినట్లే అని నమ్ముతాను’’ అని హీరో ఆది సాయికుమార్ అన్నారు. ఆది సాయికుమార్, రియా సుమన్ జంటగా కె. శశికాంత్ దర్శకత్వంలో కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మించిన ‘టాప్గేర్’ ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆది సాయికుమార్ చెప్పిన విశేషాలు. ► ఒక్కరోజులో జరిగే కథతో రూపొందిన చిత్రం ‘టాప్ గేర్’. ఏ మాత్రం తనకు సంబంధం లేని ఓ సమస్యలో ఇరుక్కునే ఓ క్యాబ్ డ్రైవర్ అందులో నుంచి ఎలా బయటపడతాడు? అనేది ఈ సినిమా కథనం. మేజర్ షూటింగ్ అంతా కారులోనే చేశాం. స్క్రీన్ప్లే రేసీగా సాగుతుంది. నా గత చిత్రాల మాదిరిగానే ‘టాప్ గేర్’ కూడా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఫిల్మ్. నా ప్రతి సినిమాకు నేను వంద శాతం కష్టపడుతూనే ఉన్నాను. నా సినిమా లను గమనిస్తే అందులోని ప్రధానాంశం కచ్చితంగా కొత్తగా ఉంటుంది. ‘టాప్గేర్’ కూడా అలాంటి కథాంశమే. ► ప్రస్తుతం మాస్ యాక్షన్ ఫిల్మ్ నిర్వచనం మారింది. ఇప్పుడు ఎక్కువగా ‘కేజీఎఫ్’లాంటి స్టయిలిష్ యాక్షన్ ఫిలింస్ని చూస్తున్నారు. భవిష్యత్లో నేనూ ఓ స్టైలిష్ యాక్షన్ ఫిలిం చేస్తాను. ► థియేటర్స్లో ఓ హిట్ సాధించడం అనేది అందరికీ ఓ సవాలుగా మారింది. రీసెంట్గా విడుదలైన నా ‘క్రేజీ ఫెలో’ చిత్రం మంచి బజ్ను క్రియేట్ చేసుకుంది. కానీ మా సినిమా విడుదలైన మర్నాడే కన్నడ ‘కాంతార’ తెలుగులో విడుదలైంది. ఆ సినిమా ఫ్లోలో మా సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు. బహుశా.. రాంగ్ రిలీజ్ డేట్ కావొచ్చు. ఇలాంటి ఎంటర్టైనింగ్ సినిమాలను ఆడియన్స్ ఓటీటీలోనే చూడాలని ఫిక్స్ అయ్యారో లేదా థియేట్రికల్ మూవీ అంటే ఏదో ఎక్స్ట్రార్డినరీ కంటెంట్ ఉండాలని ఫిక్స్ అయ్యారా? అన్నది ఇప్పుడు అందరికీ అర్థం కాని పెద్ద పజిల్. ► ప్రస్తుతానికి నెగటివ్ రోల్స్ చేయాలనుకోవడం లేదు. ఏదైనా అద్భుతమైన స్క్రిప్ట్ వస్తే అప్పుడు ఆలోచిస్తాను. ప్రస్తుతం లక్కీ మీడియాలో ఓ సినిమా చేస్తున్నాను. ‘పులిమేక’ వెబ్ సిరీస్ చేశాను. త్వరలో జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ► నాన్నగారు చేసిన ‘అసలేం గుర్తుకురాదు..’ (‘అంతఃపురం’) సినిమా పాటను రీమిక్స్ చేయా లని ఉంది. అయితే నా సినిమాలో ఆ పాటకు తగ్గ సందర్భం కుదరాలి. ఒకవేళ రీమిక్స్ చేస్తే దర్శకుడు కృష్ణవంశీగారే తీయాలి. -
హీరో ఆదికి 'టాప్ గేర్' టీమ్ బర్త్డే విషెస్
'ప్రేమ కావాలి' అంటూ కెమెరా ముందుకొచ్చి తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయి కుమార్. 2011లో ఇండస్ట్రీలో అడుగు పెట్టి వైవిధ్యభరితమైన కథలతో అలరిస్తున్నారు. రోల్ ఎలాంటిదైనా సరే అందులో లీనమవుతూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ క్లాస్, మాస్ ఆడియన్స్ మెప్పు పొందుతున్నారు. 2011 సంవత్సరంలో ప్రేమ కావాలి సినిమాకు గాను దక్షిణాది ఫిలిం ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నూతన నటుడిగా పురస్కారం అందుకున్నారు ఆది. ఈ ఏడాది కూడా ఎన్నో రకాల పాత్రలతో ప్రేక్షకులను థ్రిల్ చేశారాయన. ప్రస్తుతం ఆయన తెలుగులో టాప్ గేర్ సినిమా చేస్తున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 30న రిలీజ్ కానుంది. నేడు (డిసెంబర్ 23) ఆది సాయి కుమార్ పుట్టినరోజు కావడంతో 'టాప్ గేర్' టీమ్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతోంది. త్వరలో మరిన్ని మంచి సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నారు ఆది సాయి కుమార్. చదవండి: ఐదేళ్లుగా నటి సీక్రెట్ లవ్ చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన కైకాల సత్యనారాయణ -
'యుద్ధం గెలవాలంటే, మృత్యువుతో పోరాడే గెలవాలి'.. 'టాప్ గేర్'లో ట్రైలర్
యంగ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్, రియా సుమన్ జంటగా తెరకెక్కిన చిత్రం 'టాప్ గేర్'. ఈ చిత్రానికి కె.శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ సినిమాను రూపొందించారు. కేవీ శ్రీధర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను ముందుకొస్తున్నారు ఆది సాయి కుమార్. 'టాప్ గేర్'తో మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను మాస్ హీరో రవితేజ చేతులమీదుగా రిలీజ్ చేశారు. డిసెంబర్ 30న ఈ సినిమా విడుదల చేయనున్నారు. అసలు కథేంటంటే..: కథలోని పాత్రలందరూ డేవిడ్, అతడి ఆచూకీ గురించి అడుగుతూ కనిపించారు. మరి ఇంతకీ డేవిడ్ ఎవరు? హైదరాబాద్లో జరిగిన పలు హత్యలకు, డేవిడ్కూ సంబంధం ఏంటి? క్యాబ్ డ్రైవర్ అయిన ఆదిని ఎందుకు పోలీసులు వెంటాడారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆద్యంతం ఉత్కంఠభరిత కథ, కథనాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్లోని ప్రతి సన్నివేశం కూడా ఉత్కంఠ భరితంగా ఉంది. ఈ ట్రైలర్లో ఆది యాక్షన్ సీన్స్ అబ్బురపరుస్తున్నాయి. హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ ప్రేమలో ట్విస్టులు, విలన్స్ అటాక్, హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్గా నిలిచాయి. ఎవర్రా మీరు.. నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? అని హీరో ఆది చెప్పే డైలాగ్ సినిమాలో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలోబ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్రలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఆది సాయికుమార్ 'టాప్ గేర్' ట్రైలర్ విడుదల
ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం టాప్ గేర్. శశికాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్గా నటిస్తుంది. డిసెంబర్30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ను మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ట్రైలర్ను వదిలారు. మాస్ మహారాజ రవితేజ చేతుల మీదుగా ట్రైలర్ను లాంచ్ చేశారు. ‘‘యుద్ధం గెలవాలంటే మృత్యువుతో పోరాడే గెలవాలి’’ అంటూ సాగే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఎంతోకాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న ఆది సాయికుమార్కు ఈ సినిమా విజయాన్ని అందిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. -
ఆసక్తి రేపుతున్న ఆది సాయికుమార్ 'టాప్ గేర్' టీజర్
ఈ ఏడాది వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు యంగ్ హీరో ఆది సాయి కుమార్. విరామం లేకుండా సినిమాలు చేస్తున్న ఆయన ఇప్పుడు టాప్ గేర్ అంటూ మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి కె. శశికాంత్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో K. V. శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్ర ప్రమోషన్స్ చేపట్టిన మేకర్స్ తాజాగా సినిమా టీజర్ను వదిలారు. ప్రముఖ దర్శకుడు మారుతి ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ఒక నిమిషం 21 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లోని డైలాగ్స్, సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. కార్ గేరేసి కారులో ఆది సాయి కుమార్ దూసుకుపోవడం, ఆయన్ను వెంబడిస్తున్న పోలీసులు, మధ్యలో ఫోన్ కాల్స్ సినిమాలో ఉన్న వైవిధ్యాన్ని బయటపెడుతున్నాయి. విజువల్ ఎలిమెంట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. -
ఓటీటీలోకి వచ్చేస్తోన్న క్రేజీఫెలో, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆదిసాయికుమార్ హీరోగా, దిగంగనా సూర్యవంశీ, మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం క్రేజీ ఫెలో. ఈ సినిమా కోసం ఆది స్పెషల్ కేర్ తీసుకుని బరువు తగ్గాడు కూడా! ఫణికృష్ణ సిరికి దర్శకత్వం వహించిన ఈ సినిమాను లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిరర్మించారు. అక్టోబర్ 14న విడుదలైన ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో రేపటి(డిసెంబర్ 3) నుంచి స్ట్రీమింగ్ కానుంది. జీవితంలో చాలా ఆప్షన్స్ ఉంటాయండి. బెస్ట్ ఆప్షన్ పట్టుకుని వెళ్లిపోవడమే జీవితం.. మీ బెస్ట్ ఆప్షన్ ఈ వీకెండ్కి మా క్రేజీ ఫెలోని చూడటమే.. చూసేయండి మరి అంటూ ఆహా నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. “Life is full of options andi, best option pattukoni vellipovadame jeevitham”. 😛 🙂 Mee best option ee weekend ki ma “crazy fellow” ni chudatame. Chuseyandi mari 😉#CrazyFellowOnAHA Streaming from dec 3rd https://t.co/hw1zXxA9eE@iamaadisaikumar @DiganganaS @mirnaaofficial pic.twitter.com/6IR4toLPzx — ahavideoin (@ahavideoIN) December 2, 2022 చదవండి: ఓటీటీలోకి ఊర్వశివో రాక్షసివో స్ట్రీమింగ్ హిట్ 2 మూవీ రివ్యూ -
Top Gear: నువ్వు నా వెన్నెల...
‘వెన్నెల వెన్నెల.. నువ్వు నా వెన్నెల.. దైవమే ప్రేమగా పంపేనే నిన్నిలా...’ అంటూ సాగుతుంది ‘వెన్నెల వెన్నెల...’ పాట. ఆది సాయికుమార్, రియా సుమన్ జంటగా కె.శశికాంత్ డైరెక్షన్లో రూపొందిన ‘టాప్ గేర్’ చిత్రంలోని పాట ఇది. సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అదించగా, సిధ్ శ్రీరామ్ పాడారు. కేవీ శ్రీధర్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీలోని ‘వెన్నెల వెన్నెల’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి. -
సిద్ శ్రీరామ్ పాడిన వెన్నెల వెన్నెల సాంగ్ విన్నారా?
యంగ్ హీరో ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం టాప్ గేర్. కె శశికాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి వెన్నెల వెన్నెల పాటను రిలీజ్ చేశారు. సరస్వతీ పుత్రుడు రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ అందించగా ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఈ సినిమాను శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో కేవీ శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా రియా సుమన్ హీరోయిన్గా నటిస్తోంది. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర లు కీలక పాత్రల్లో నటిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబరు 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. చదవండి: రేవంత్కు బిగ్బాస్ షాక్ చివరి కెప్టెన్గా ఇనయ, నేరుగా సెమీ ఫైనల్స్లోకి -
ఆది సాయికుమార్ 'టాప్ గేర్' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఇప్పుడు మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే పలు యాక్షన్ సినిమాల ద్వారా మంచి విజయాలను అందుకోగా ఇప్పుడు ఈ సినిమా తో మరో విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి కె.శశికాంత్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో K. V. శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని పాట విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన 'వెన్నెల వెన్నెల' పాటను ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబరు 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. 1st single #VennelaVennela Will be out on 25th ! @rameemusic @sidsriram @IRiyaSuman #TOPGEAR pic.twitter.com/5hDXnXQ8zb — AadiSaikumar (@AadiSaikumar) November 21, 2022 -
వచ్చే నెల టాప్ గేర్
ఆది సాయికుమార్, రియా సుమన్ జంటగా శశికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టాప్ గేర్’. ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ఇందులో ఆది టాక్సీ డ్రైవర్గా నటించారు. అన్ని వర్గాల ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే డిఫరెంట్ పాయింట్ని మూవీలో టచ్ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి. -
ఆది సాయి కుమార్ 'టాప్ గేర్’ రిలీజ్ డేట్ ఫిక్స్
లవ్లీ హీరో ఆది సాయి కుమార్ 'టాప్ గేర్' అంటూ తన కెరీర్కు టాప్ గేర్ వేసేందుకు సిద్దంగా ఉన్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆది సాయికుమార్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో అంటూ ఆది సాయికుమార్ రీసెంట్గా అందరినీ మెప్పించారు. ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్తో రాబోతున్న టాప్ గేర్ సినిమాతో ఆది సాయి కుమార్ మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 30న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇక త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ను కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆదిత్య మూవీస్ &ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్పై అన్ని హంగులతో ఈ టాప్ గేర్ సినిమా రాబోతోంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్గా నటిస్తుండటం విశేషం. -
యాక్షనే కాదు రొమాన్స్లోనూ ‘టాప్ గేర్’ వేసిన ఆది
వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో ఆది సాయికుమార్. ఇటీవల ‘క్రేజీ ఫెలో’తో అలరించిన ఆది..త్వరలోనే ‘టాప్ గేర్’అనే డిఫరెంట కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆదిత్య మూవీస్ &ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ సినిమా రాబోతోంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్గా నటిస్తుండటం విశేషం. ఆయన పోషించిన ఈ రోల్ సినిమాలో కీలకం కానుందని, ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ అనుభూతినిస్తుందని అంటున్నారు మేకర్స్. ఈ సినిమాతో ఆది సాయి కుమార్ కెరీర్కి టాప్ గేర్ పడినట్లే అని చెబుతున్నారు. ఇప్పటికే ఈ టాప్ గేర్ సినిమా నుంచి విడుదలైన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్, 3డీ మోషన్ పోస్టర్కు మంచి స్పందన లభించింది. అయితే దీపావళి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సినిమాలోని ఇంకో యాంగిల్ను చూపిస్తోంది. యాక్షన్లోనే కాదు.. రొమాన్స్లోనూ టాప్ గేర్ వేస్తాను అన్నట్టుగా ఆది సాయి కుమార్ పోస్టర్ చెబుతోంది. ఈ పోస్టర్ చూస్తుంటే.. హీరోయిన్ రియా సుమన్, ఆది కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ సింగిల్ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. -
‘ఓరి దేవుడా’ దివాలీ దావత్, సందడి చేసిన యంగ్ హీరోలు
యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ఓరి దేవుడా. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్టరి వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్లుగా నటించారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్లో భాగంగా గురువారం రాత్రి ‘దివాలీ దావత్’ పేరుతో వేడుకను నిర్వహించారు. ఈ పార్టీకి పలువుకు టాలీవుడ్ యంగ్ హీరోలు హాజరై సందడి చేశారు. అల్లరి నరేశ్, టీజే టిల్లు ఫేం సద్ది జొన్నలగడ్డ, సందీప్ కిషన్, ఆది సాయి కుమార్, ఆకాశ్ పూరి, విశ్వక్ సేన్, హీరో కార్తికేయతో పాటు తదితరులు, చిత్ర బృందం పాల్గొంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు
‘‘క్రేజీ ఫెలో’ సినిమాకి అన్ని చోట్ల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. మౌత్ టాక్ చాలా బాగుంది’’ అని హీరో ఆది సాయికుమార్ అన్నారు. ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా, దిగంగనా సూర్యవన్షీ, మిర్నా మీనన్ కథానాయికలుగా నటించిన చిత్రం ‘క్రేజీ ఫెలో’. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో కేకే రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘క్రేజీ ఫెలో’ విజయం యూనిట్ అందరిది. మా బ్యానర్ ద్వారా ఆదికి మంచి సక్సెస్ ఇచ్చినందుకు హ్యాపీ’’ అన్నారు ‘‘మంచి సినిమా వస్తే థియేటర్కి వస్తామని ‘క్రేజీ ఫెలో’తో మరోసారి రుజువు చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు ఫణికృష్ణ. ‘‘మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు దిగంగనా సూర్యవన్షీ, మిర్నా మీనన్. ∙మిర్నా మీనన్, ఆది, దిగంగన, రాధామోహన్, ఫణికృష్ణ -
Crazy Fellow Review: ‘క్రేజీ ఫెలో’ మూవీ రివ్యూ
టైటిల్: క్రేజీ ఫెలో నటీనటులు: ఆది సాయికుమార్, దిగంగనా సూర్యవంశీ, మిర్నా మీనన్, అనీష్ కురువిల్లా, వినోదిని వైద్యనాథన్, నర్నా శ్రీనివాస్, సప్తగిరి తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీసత్యసాయి ఆర్ట్స్ నిర్మాత: కే.కే. రాధామోహన్ దర్శకుడు: ఫణికృష్ణ సిరికి సంగీతం: ఆర్.ఆర్. ధృవన్ సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల ఎడిటర్: సత్య గిడుతూరి విడుదల తేది: అక్టోబర్ 14, 2022 యంగ్ హీరో ఆది సాయికుమార్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఇటీవలె ‘తీస్మార్ ఖాన్’తో బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా.. ఇప్పుడు ‘క్రేజీ ఫెలో’అంటూ ఆడియన్స్ను అలరించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటకుల మంచి స్పందన లభించింది. ప్రమోషన్స్ కూడా గ్రాండ్ చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య ఈ శుక్రవారం(అక్టోబర్ 14) విడుదలైన ఈ ‘క్రేజీ ఫెల్లో’ప్రేక్షకులను ఏ మేరకు అలరించాడో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. అభిరామ్ అలియాస్ నాని ఓ క్రేజీ ఫెలో. చిన్నప్పుడు తల్లిదండ్రులు మరణించడంతో అన్నావదినలు(అనీష్, వినోదిని వైద్యనాథన్) గారాబంగా పెంచుతారు. ఫ్రెండ్స్, పబ్స్, పార్టీలు తప్ప అతనికి వేరే ఏ పని ఉండదు. పైగా ఏ విషయాన్ని పూర్తిగా వినకుండా కష్టాలను కొని తెచ్చుకుంటాడు. అభి అతి వల్ల స్నేహితుడి పెళ్లి కూడా ఆగిపోతుంది. ఇక తమ్ముడిని ఇలానే వదిలేస్తే.. పనికిరాకుండా పోతాడని స్నేహితుడి కంపెనీలో ఉద్యోగం పెట్టిస్తాడు అన్నయ్య. అక్కడ మధుమతి(దిగంగనా సూర్యవంశీ)ని చూస్తాడు అభి. వీరిద్దరికి ఒకరంటే ఒకరు పడదు. గతంలో అభి వేసిన వెధవ వేషాలు తెలిసి మధుమతి అతనికి దూరంగా ఉంటుంది. అయితే అనూహ్యంగా వీరిద్దరు ఓ డేటింగ్ యాప్ ద్వారా స్నేహితులు అవుతారు. అయితే ఆ యాప్లో వీరిద్దరు వేరు వేరు పేర్లు, ఫోటోలు అప్లోడ్ చేస్తారు. వారిద్దరు కాస్త క్లోజ్ అయ్యాక మధుమతికి చిన్ని అని ముద్దు పేరు పెడతాడు అభి. ఇలా చాటింగ్ ద్వారా క్లోజ్ అయ్యాక.. ఓ రోజు కలుద్దామని అనుకుంటారు. ఆ సమయంలో మరో అమ్మాయిని(మిర్నా మీనన్) చూసి చిన్ని అనుకొని ప్రపోజ్ చేస్తాడు. అనూహ్యంగా ఆమె పేరు కూడా చిన్ని కావడం.. అతను ప్రపోజ్ చేయడాన్ని ఆమె కుటుంబ సభ్యులు చూడడంతో గొడవలు జరుగుతాయి. కొన్ని కారణాల వల్ల అభి ప్రేమించిన చిన్నిని కాకుండా ప్రపోజ్ చేసిన చిన్నితో పెళ్లికి రెడీ అవుతాడు. మరి తాను చాటింగ్ చేసిన చిన్నియే మధుమతి అని అభికి ఎప్పుడు తెలిసింది? తెలిసిన తర్వాత ఏం జరిగింది? ఇన్నాళ్లు తాను గొడవపడిన అభిరామే తను ప్రేమించిన నాని అని తెలుసుకున్న మధుమతి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? చివరకు అభి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఇప్పుడు డేటింగ్ యాప్ ట్రెండ్ జోరుగా సాగుతుంది. అలాంటి ట్రెండింగ్ పాయింట్ని పట్టుకొని కథను సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు ఫణికృష్ణ సిరికి. కథలో కొత్తదనం లేదు కాని కామెడీ మిక్స్ చేసి కథనాన్ని నడిపించిన తీరు బాగుంది. డేటింగ్ యాప్ ద్వారా అభి, మధుమతి పరిచయం కావడం.. చూడకుండానే ప్రేమలో పడడం, చివరికి ఒకరికి బదులు మరొకరిని కలవడం..స్టోరీ వినడానికి ఇలా రొటీన్గా ఉన్న.. దానికి కామెడీ మిక్స్ చేసి కథనాన్ని నడపడం ‘క్రేజీ ఫెలో’కి ప్లస్ అయింది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్లో వచ్చే కామెడీ బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఆది, నర్రా శ్రీనివాస్ మధ్య సన్నివేశాలు నవ్విస్తాయి. కామెడీతో పాటు ఎమోషన్స్పై కూడా దర్శకుడు కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది. ఇద్దరి హీరోయిన్లతో చాలా చోట్ల భావోద్వేగాలను పండించోచ్చు. కానీ దర్శకుడు దానిపై పెద్దగా శ్రద్ద పెట్టలేదు. ప్రేమ విషయంలో కూడా అదే చేశాడు. ముఖ్యంగా రెండో హీరోయిన్ మిర్నా మీనన్, హీరోతో లవ్లో పడే సన్నివేశాలు మరింత బలంగా చూపిస్తే బాగుండేదేమో. క్లైమాక్స్ కూడా రొటీన్గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో ఆది సాయికుమార్. ఏడాదిలో ఆరేడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ప్రతి సినిమాలోనూ ఆది ఒకే లుక్లో కనిపించడంతో కొత్తదనం లోపించినట్లు అనిపించేది. కానీ ‘క్రేజీ ఫెలో’తో ఆది తనపై ఉన్న విమర్శకు చెక్ పెట్టాడు. తెరపై కొత్త లుక్లో కనిపించి అలరించాడు. గత సినిమాలతో పోలిస్తే నటన విషయంలోనూ మెరుగయ్యాడు. ఏ విషయాన్ని పూర్తిగా వినకుండా కష్టాలను కొని తెచ్చుకునే అభి పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన కామెడీతో నవ్వించడంతో పాటు యాక్షన్స్ సీన్స్, డ్యాన్స్ ఇరగదీశాడు. మధుమతి గా దిగంగనా సూర్యవంశీ ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది కానీ ప్రతి సన్నివేశానికి ఒకే ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. చిన్ని పాత్రలకు మిర్నా మీనన్ న్యాయం చేసింది. ఆఫీస్ అసిస్టెంట్ రమేశ్ పాత్రలో నర్రా శ్రీనివాస్ ఒదిగిపోయాడు. ఆది, నర్రా శ్రీనివాస్ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయింది. . హీరో వదినగా వినోదిని వైద్యనాథ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఆమె డబ్బింగ్ కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. హీరో బ్రదర్గా అనీష్ కురువిల్లా, స్నేహితులుగా సాయి, సాయితేజ్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం బాగుంది. సన్నివేశాలకు తగ్గట్టుగా పాటలు ఉన్నాయి. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ సత్య గిడుతూరి తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాత విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్డెస్క్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement