-
బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
న్యూఢిల్లీ: లిక్కర్స్కామ్లో జైలు పాలై మధ్యంతర బెయిల్పై బయటికి రాగానే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ అంతర్గత వ్యవహారాలపై సంచలన కామెంట్స్ చేశారు. శనివారం(మే11) ఢిల్లీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో కేజ్రీవాల్ ప్రసంగించారు. బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రాగానే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితాన్ని అంతం చేస్తారన్నారు. ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశానికి ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.మోదీ రాజకీయాల నుంచి రిటైర్ అవుతారన్నారు.గతంలో బీజేపీలో రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయిన ఎల్కే అద్వానీ, మురళి మనోహర్ జోషి, సుమిత్ర మహాజన్, యశ్వంత్ సిన్హాల పేర్లను కేజ్రీవాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం మోదీ ఓట్లడుగుతన్నది అమిత్ షా కోసమేనని మోదీ ఇస్తున్న గ్యారెంటీని అమిత్ షా నెరవేరుస్తారా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. -
కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
లక్నో: కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) రెండు రామ ద్రోహులని, వారి డీఎన్ఏలోనే రామ ద్రోహముందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. అయోధ్య రాముడిని దర్శించుకున్నందుకు సొంత పార్టీ నేత రాధికా కేరాను కాంగ్రెస్ అవమానించిందన్నారు.అవమానం భరించలేకే ఆమె కాంగ్రెస్కు రాజీనామా చేసిందన్నారు. ‘కాంగ్రెస్ నిజస్వరూపం దేశ ప్రజలందిరికీ తెలుసు. ఎన్నికలప్పుడు వాళ్లు చేసేదేది నిజం కాదు. కేవలం ప్రజలను మోసం చేయడానికి వాళ్లు ఏదైనా చేస్తారు.ప్రజలు వాళ్ల నాటకాల పట్ల జాగ్రత్తగా ఉంటారు’అని యోగి వార్తా సంస్థతో అన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ రామునికి, సనాతన ధర్మానికి వ్యతిరేకమని, అయోధ్య వెళ్లినందుకే పార్టీ తనను అవమానించిందని ప్రకటించి రాజీనామా చేశారు. -
శత్రువులతో కాంగ్రెస్ కుమ్మక్కయింది: యోగి ఆదిత్యనాథ్
లక్నో: దేశంలో రెండు దశల లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా ఐదు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ రాయ్బరేలీ, అమేథీ అభ్యర్థులుగా రాహుల్ గాంధీ, కెఎల్ శర్మలను ప్రకటించింది. అయితే కాంగ్రెస్ మీద 'యోగి ఆదిత్యనాథ్' కీలక వ్యాఖ్యలు చేశారు.రాహుల్ గాంధీకి మద్దతుగా.. మాజీ మంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) నాయకుడు ఫవాద్ చౌదరి చేసిన వైరల్ పోస్ట్ను ప్రేరేపిస్తూ, దేశ బద్ధ శత్రువులతో కాంగ్రెస్ కుమ్మక్కయ్యిందనడానికి ఈ పోస్ట్ నిదర్శనమని యోగి అన్నారు. ప్రధానమంత్రి మోదీ సృష్టించిన పురోగతి, సానుకూల వాతావరణాన్ని నాశనం చేయడానికి మన శత్రువులు ఎంతటికైనా తెగించడానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.దేశం మొత్తం ప్రధాని మోదీకి అండగా నిలుస్తున్న తరుణంలో.. మన బద్ద శత్రువులు రాహుల్గాంధీకి మద్దతుగా నిలిచేందుకు ఎంతటి కఠోరమైన ప్రయత్నాలు చేస్తున్నారో చూడవచ్చు. భారత శత్రువులతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ప్రజలను మతాల వారీగా విభజించడానికి కూడా ప్రయత్నిస్తోందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బుజ్జగింపు రాజకీయాలే దేశ భద్రతకు ముప్పు కలిగిస్తాయని యోగి అన్నారు.గత 10 ఏళ్లలో తీవ్రవాదం, నక్సలిజాన్ని అరికట్టడానికి ప్రధాని మోదీ కృషి చేశారు. ప్రజలు ప్రధాని వెంట ఉన్నారు. జరగనున్న ఎన్నికల్లో అమేథీ, రాయ్బరేలీ, కన్నౌజ్లలో కూడా బీజేపీ గెలుస్తుందని అన్నారు. తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందని యోగి పేర్కొన్నారు.Pakistani leader - someone who has spewed venom against Bharat is promoting Rahul & CongressEarlier Hafiz Saeed had said Congress is his favourite party.. Mani Aiyer went to Pakistan for support to depose PM Modi! We remember Pakistan Zindabad slogans were raised recently by… pic.twitter.com/VeXgm7CwTj— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) May 1, 2024 -
కుటుంబ రాజకీయాలకు స్వస్తి చెప్పండి: యోగి ఆదిత్యనాథ్
ఔరంగాబాద్: దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ పార్టీల కీలక నేతలు సైతం రంగంలోకి దిగి ప్రచారం మొదలు పెట్టేసారు. ఇందులో భాగంగానే బీహార్లోని ఔరంగాబాద్లో జరిగిన ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 'యోగి ఆదిత్యనాథ్' కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గూండా రాజకీయం పెరిగిపోయిందని, వంశపారంపర్య రాజకీయాలకు ముగింపు పలకడానికి ఎన్డీయేకి ఓటు వేయాలని యోగి ఆదిత్యనాథ్ ప్రజలను కోరారు. జరగబోయే ఎన్నికలు ఒక కుటుంబానికి.. దేశానికి మధ్య జరుగుతోందని అన్నారు. వంశపారంపర్య రాజకీయం దేశాన్ని ఉగ్రవాదం, అవినీతి వైపు నెడుతోందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారత్ ప్రధాని మోదీ కల. గత పదేళ్లుగా మారుతున్న భారత్ను మోదీజీ నాయకత్వంలో చూసారు. ఇప్పటికే భారతదేశ ప్రతిష్ట ప్రపంచమంతటా తెలిసింది. రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి చేరుతుందని అన్నారు. నేడు యూపీలో కర్ఫ్యూ లేదు, అల్లర్లు లేవు.. బీజేపీ ప్రభుత్వం తమ వాగ్దానాలకు కట్టుబడి ఉంది. మాఫియా, నేరస్థులు జైలులో మగ్గుతున్నారు. మహిళలను బెదిరించడానికి సాహసించాలంటే నేడు అందరూ జంకుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వికసిత్ భారత్, వికసిత్ బీహార్ను సాధ్యం చేస్తుందని.. అది మోదీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్ దాని మిత్రపక్షమైన ఆర్జేడీ.. రాముడి ఉనికిని ప్రశ్నించేవి, కానీ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో రామ్ లల్లా విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత, వారు ట్రాక్ మార్చి.. రాముడు అందరికీ చెందినవారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి ఎన్డీఏ కూటమిని గెలిపించండని యోగి ఆదిత్యనాథ్ కోరారు. -
UP: మాఫియాపై సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
లక్నో: ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతలపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భరోసా ఇచ్చారు. ముజఫర్నగర్లో బుధవారం(ఏప్రిల్ 10) జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో యోగి మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం మాఫియా దుస్థితి ఎలా ఉందో చూడొచ్చు. ఎవరి పేరు చెబితే ఒకప్పుడు కర్ఫ్యూ వాతావరణం ఏర్పడేదో వాళ్ల పరిస్థితి మీరే చూస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నపుడు మాఫియా లీడర్ కాన్వాయ్కి ఏకంగా సీఎం కాన్వాయ్ దారి ఇచ్చే పరిస్థితి ఉండేది. మేం అధికారంలోకి వచ్చి చర్యలు తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత మాఫియా ప్యాంట్లు తడుస్తున్నాయి’అని యోగి అన్నారు. ఇదీ చదవండి.. రూ.200 కోట్ల హవాలా గుట్టురట్టు -
‘కాంగ్రెస్ డీఎన్ఏలోనే కర్ఫ్యూ’.. యోగి తీవ్ర విమర్శలు
జైపూర్: కాంగ్రెస్ పార్టీపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రమైన విమర్శలు చేశారు. రాజస్థాన్లో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ‘దేశానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద సమస్య. కర్ఫ్యూలు విధించటం కాంగ్రెస్ డీఎన్ఏలో ఉంది. దేశంలో పేదలు ఆకలితో అలమతిస్తే.. కాంగ్రెస్ ఉగ్రవాదులకు జైలులో బిర్యానీ పెట్టింది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లలో ఒకరైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ అభ్యర్థులను ప్రటించిన తర్వాత మొదటిసారి రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ‘రామమందిరం నిర్మాణం పక్కనపెడితే.. ముందు శ్రీరాముడు, కృష్ణుడిని కాంగ్రెస్ ఊహాజనిత వ్యక్తులుగా భావించింది. కాంగ్రెస్ పాలనలో పేదల హక్కులు హరించారు. ప్రస్తుతం దేశం మొత్తం మరోసారి మోదీ ప్రభుత్వం రావాలని నినాదం చేస్తుంది. గత పదేళ్లలో ప్రధాని మోదీ పరిపాలనలో దేశ సరిహద్దులు భద్రంగా ఉన్నాయి. గతంలో ఉగ్రవాదుల కార్యకలాపాలు జరిగేవి. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ భారత్కు వ్యతిరేకంగా మాట్లాడటానికి సహసం చేయటం లేదు. ఎందుకుంటే వారికి వైమానిక దాడి భయం ఉంది. ప్రస్తుతం ఏ దేశం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటం లేదు. దేవం నక్సలిజం, ఉగ్రవాదం, కశ్మీర్లో రాళ్లు విసిరే ఘటనలు తగ్గించాం’ అని యోగి అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రజలు ఆకలితో ఉంటే ఉగ్రవాదులకు బిర్యానీ పెట్టారు. అదే ప్రధాని మోదీ గత నాలుగేళ్లుగా దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సిద్దాతం, బలమైన నేత లేరు. కాంగ్రెస్లోనే చాలా సమస్యలు ఉన్నాయి. మీరు వేసే ఓటు రామ మందిర నిర్మాణానికి మద్దతు మాత్రమే కాదు. మన దేశ సరిహద్దులకు కచ్చితమైన రక్షణ’అని యోగి తెలిపారు. -
అభివృద్ధి చెందిన భారత్ కోసం.. యోగి ఆదిత్యనాథ్ సూచనలు
2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్.. ప్రధాని నరేంద్ర మోదీ కల. భారతదేశం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ దేశాన్ని మోదీ చేతికి అప్పగించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 'యోగి ఆదిత్యనాథ్' అన్నారు. ప్రజల ప్రతి ఓటు చాలా ముఖ్యమైందని, దేశాభివృద్ధికి కీలకమని అన్నారు. 2014 నుంచే దేశాభివృద్ధికి పునాది పడిందని.. తప్పకుండా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, అది కేవలం బీజేపీకి మాత్రమే సాధ్యమని ఆదిత్యనాథ్ అన్నారు. కులం, మతం, బుజ్జగింపులు, ఇతర ఎజెండాలకు ఓటు వేయకూడదు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం.. ఉజ్వల్ భవిష్యత్తు కోసం ఓటు వేయాలని ఆదిత్యనాథ్ సూచించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భాగంగా 'ఫిర్ ఏక్ బార్, మోదీ సర్కార్' అనే నినాదాన్ని ఆదిత్యనాథ్ హైలెట్ చేశారు. 400 సీట్లను సొంతం చేసుకోవడమే లక్ష్యమని, దీనికోసం అందరూ ఏకం కావాలని కోరారు. పోలింగ్ బూత్లో ఓటు వేయడం ద్వారా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు. -
ప్రధాని మోదీ వాటర్ గన్లకు ఆదరణ!
రంగుల పండుగ హోలీకి దేశవ్యాప్తంగా సన్నాహాలు ఊపందుకున్నాయి. కొన్ని చోట్ల మార్కెట్లలో పండుగ కొనుగోళ్లు జరుగుతుండగా, మరోవైపు పూలతో ఇళ్లను అలంకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు మార్కెట్లలో కొనుగోలుదారుల రద్దీ పెరిగింది. ఈ హోలీ సందర్భంగా ప్రధాని మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్లకు డిమాండ్ మరింతగా పెరిగింది. యూపీ, ఎంపీలతో సహా అనేక రాష్ట్రాల మార్కెట్లలో జనం మోదీ మాస్క్లను, వాటర్ గన్లను కొనుగోలు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల వాతావరణానికి ఈ హోలీ వేడుకలు తోడై ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి, ప్రధాని మోదీ చిత్రాలతో కూడిన వాటర్గన్ను జనం విరివిగా కొనుగోలు చేస్తున్నారు. దేశంలోని ఈశాన్య ప్రాంతం నుంచి దక్షిణాది వరకు అంతటా హోలీ సందడి కనిపిస్తోంది. అసోంలోని గౌహతిలో జనం ఉత్సాహంగా షాపింగ్ చేస్తున్నారు. కేరళలోని తిరువనంతపురంలో హోలీ సందర్భంగా పలువురు నృత్యాలు చేస్తూ కనిపిస్తున్నారు. హర్యానాలోని గురుగ్రామ్లో వివిధ దేశాల రాయబారులు పూలతో హోలీ వేడుకలు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో దివ్యాంగుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వారణాసిలోని ప్రసిద్ధ అస్సీ ఘాట్లో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
యూపీ సీఎంతో మెగా కోడలి భేటీ!
మెగా కోడలు ఉపాసన కొణిదెల నేడు అయోధ్య బాలరామున్ని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆమె తన తాతగారు అయిన అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డితో పాటుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలుసుకున్నారు. అనంతరం తన తాత ప్రతాప్ రెడ్డి లెగసీని తెలియజేసే ‘ది అపోలో స్టోరీ’ బుక్ ని కూడా యోగి ఆదిత్యనాథ్కు ఆమె అందజేశారు. ఆపోలో హాస్పిటల్స్ నిర్వహణతో పాటు పలు ప్రాంతాల్లో విస్తరించడంలో ఉపాసన పాత్ర కీలకంగా ఉంటారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలుసుకున్న తర్వాత అయోధ్యలో ఆపోలో ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు వారు ప్రకటించారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థయాత్రలో అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ అత్యవసర వైద్య కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ సెంటర్లోని అధునాతన సేవల గురించి అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి మాట్లాడుతూ.. ఈ సెంటర్లో విస్తృత స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇవి ప్రాథమిక ప్రథమ చికిత్స నుంచి గుండెపోటు,స్ట్రోక్తో సహా వైద్య అత్యవసర సేవల వరకు ఉన్నాయని ఆసుపత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దలు,పిల్లలకు 24x7 క్రిటికల్ కేర్ సపోర్ట్తో పాటు ICU బ్యాకప్ కూడా ఉంటుందని వారు చెప్పారు.ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని వారు ప్రకటించారు. దాదాపు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్ను నిర్మించనున్నారు. ఈ ప్రకటన ప్రకారం, శ్రీరామ్ లల్లా దర్శనానికి వచ్చే యాత్రికులకు కేంద్రంలో వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అయోధ్యను సందర్శించే యాత్రికుల ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల అపోలో హాస్పిటల్స్ అచంచలమైన నిబద్ధతకు ఈ చొరవ నిదర్శనమని అపోలో హాస్పిటల్స్ లక్నో ఎండి, సిఇఒ డాక్టర్ మయాంక్ సోమాని అన్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
డీప్ఫేక్ బారినపడ్డ యోగి ఆదిత్యనాథ్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో డీప్ఫేక్ (Deepfake) మహమ్మారిలా వ్యాపిస్తోంది. చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటికే ఈ డీప్ఫేక్ బారిన పడ్డారు. డీప్ఫేక్ బారినపడ్డ ప్రముఖుల జాబితాలోకి తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 'యోగి ఆదిత్యనాథ్' కూడా చేరారు. డయాబెటిస్ మెడిసిన్ను 'ఆదిత్యనాథ్' ప్రచారం చేస్తున్నట్లు డీప్ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో వైరల్ అయిన తర్వాత, ఈ వీడియోకు కారణమైన ఫేస్బుక్ ఖాతాపై ఐపీసీ 419, 420, 511 సెక్షన్స్ కింద సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రముఖులకు సంబంధించిన డీప్ఫేక్ వీడియోలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సినీ యాక్టర్స్ రష్మిక మందన్న, కత్రినా కైఫ్, కాజోల్, అలియా భట్లకు సంబంధించిన డీప్ఫేక్ వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. -
భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది: యూపీ సీఎం
ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' మళ్ళీ అధికారంలోకి వస్తే.. భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లో నారీ శక్తి వందన్ కార్యక్రమంలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తే.. దేశంలోని ప్రతి వ్యక్తి ఆదాయం పెరుగుతుంది. ప్రజల జీవితాల్లో సుసంపన్నత పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రూ.679 కోట్లతో చేపట్టిన 673 అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మరోసారి మోదీ సర్కార్ వస్తే.. వికసిత భారత్ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే 400 వందలకు పైగా సీట్లు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మన పూర్వీకులు ఎంతో భక్తి ప్రపత్తులతో ఆరాధించిన అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాలు పూర్తి చేయలేకపోయాయి. కానీ మహా మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి 'రామ్ లల్లా' ప్రతిష్టాపన కల కూడా మోదీ వల్ల సాధ్యమైందని ఆదిత్యనాథ్ అన్నారు. ఒకప్పుడు దేశంలో షుగర్ బౌల్గా పేరుగాంచిన దేవరియా గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నష్టపోయింది. దీంతో డియోరియా, ఖుషీనగర్లు వెనుకబడిపోయాయి. దీని వల్ల ఈ ప్రాంతాలలో పేదరికం మరింత పెరిగిపోయిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం (బీజేపీ) అధికారంలోకి వచ్చిన తరువాత చక్కర కర్మాగారాల పునరుద్ధరణ జరిగిందని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. డియోరియాలో పేద కుటుంబాలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు మంజూరు చేసినట్లు ఆదిత్యనాథ్ వెల్లడించారు. అంతే కాకుండా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఇంటి తాళాలు, అప్రూవల్ లెటర్స్, ఆయుష్మాన్ కార్డులు, స్మార్ట్ఫోన్లను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. 'विकसित भारत' की परिकल्पना को साकार करने के लिए जन-जन से एक आवाज आ रही है... pic.twitter.com/Jm0bSMRTvf — Yogi Adityanath (मोदी का परिवार) (@myogiadityanath) March 10, 2024 -
‘400 లోక్సభ స్థానాల్లో గెలుపు మాదే’.. బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు
లక్నో : ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాల్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తాను రెండోసారి ఎంపీగా పోటీ చేస్తున్న లోక్సభ స్థానం గోరఖ్పూర్ చరిత్ర సృష్టిస్తుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. రికార్డ్ స్థాయిలో 195 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వారిలో ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఒకరు. 2019 నుంచి ఉత్తర్ప్రదేశ్ గోరఖ్పూర్ ఎంపీగా రవికిషన్ కొనసాగుతున్నారు. అయితే రానున్న లోక్సభ ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసేందుకు బీజేపీ అధిష్టానం ఆయనకు మరోసారి అవకాశం ఇచ్చింది. #WATCH | Gorakhpur: BJP leader Ravi Kishan says, "I want to thank the top leadership wholeheartedly... The organization gave me a second chance from the hottest seat after Kashi. I would like to express my heartfelt gratitude to the entire organization and Prime Minister Modi. I… https://t.co/SFXrQnf6Zi pic.twitter.com/ewqZS5olQN — ANI (@ANI) March 2, 2024 బీజేపీకి 400 సీట్లు పక్కా ఈ సందర్భంగా ‘కాశీ తర్వాత అత్యంత హాటెస్ట్ సీటు గోరఖ్పూర్. ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు బీజేపీ పెద్దలు నాకు రెండోసారి అవకాశం కల్పించారు. పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి నా కృతజ్ఞతలు. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తుంది. గోరఖ్పూర్ సీటు చరిత్ర సృష్టిస్తుంది’ అని బీజేపీ ఎంపీ రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి కంచుకోట ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు గోరఖ్పూర్ కంచుకోట. గోరఖ్పూర్ లోక్ సభ స్థానం నుంచి యోగి ఆదిత్యనాథ్ వరుసగా ఐదు పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 1998లో ప్రారంభమై 2017లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు కొనసాగింది. ఇక్కడి నుంచి నటుడు రవి కిషన్ రెండో సారి బరిలోకి దిగనున్నారు. కాగా తొలిసారి ఇదే స్థానం నుంచి ఎంపీగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగిన రవికిషన్ సమాజ్వాద్ పార్టీ అభ్యర్థి రాంభూల్ నిషాద్పై 3 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. -
యోగి బాటలో థామీ సర్కార్.. డ్యామేజ్ రికవరీ బిల్లు అమలు?
ఉత్తరప్రదేశ్లో అల్లర్లకు, హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు అవలంబిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్తల్లో నిలిచారు. ఆందోళనకారుల కారణంగా ప్రభుత్వానికి వాటిల్లే నష్టాలను రికవరీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తాజాగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా సీఎం యోగిని అనుసరించనున్నారని సమాచారం. హల్ద్వానీ హింసాకాండలో ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన నష్టాలను నిందితుల నుంచి వసూలు చేసేందుకు థామీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిరసనల సమయంలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు ఏదైనా నష్టం జరిగితే ఆ మొత్తాన్ని ఆందోళనకారుల నుండి రికవరీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం పుష్కర్ సింగ్ ధామి దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఉత్తరాఖండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ బిల్లును సోమవారం నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సెషన్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. నిరసనల కారణంగా సంభవించే ఆస్తి నష్టాల పరిహారంపై నిర్ణయం తీసుకునేందుకు రిటైర్డ్ జిల్లా జడ్జి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఫిబ్రవరి 8న నైనిటాల్ జిల్లా హల్ద్వానీలో అక్రమాస్తుల వ్యతిరేక ప్రచారంలో హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో బంబుల్పురా ప్రాంతంలో ఒక మసీదు, మదర్సాను కూల్చివేశారు. అంతటితో ఆగక స్థానిక పోలీస్ స్టేషన్కు కూడా నిప్పంటించారు. ఈ ఘటనలో ధ్వంసమైన ఆస్తుల విలువ మొత్తాన్ని నిందితుల నుంచి రికవరీ చేస్తామని, దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ టేబుల్పైకి తీసుకురానున్నామని ముఖ్యమంత్రి పుష్కర్ ధామి గతంలోనే ప్రకటించారు. కాగా ఈ హింసాకాండలో పాల్గొన్నవారి సమాచారం అందించాలని మీడియాను జిల్లా యంత్రాంగం కోరింది. హల్ద్వానీ హింసాకాండలో ప్రధాన నిందితుడైన అబ్దుల్ మాలిక్ను ఇటీవల ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. -
PM Narendra Modi: ఐదేళ్లలో అభివృద్ధికి నమూనాగా భారత్
వారణాసి: భారత్ వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికి నమూనా(మోడల్)గా మారడం ఖాయమని, ఇది ‘మోదీ గ్యారంటీ’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆయన గురువారం రాత్రి ఉత్తరప్రదేశ్లోని తన సొంత నియోజకవర్గం వారణాసికి చేరుకున్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో ‘సంసద్ సంస్కృత్ ప్రతియోగితా’ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా వారసత్వం, అభివృద్ధికి కాశీ నగరం ఒక మోడల్గా కనిపిస్తోందని, సంస్కృతి, సంప్రదాయం చుట్టూ ఆధునిక అభివృద్ధిని ప్రపంచం వీక్షిస్తోందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో మన దేశం అభివృద్ధికి మోడల్గా మారుతుందని చెప్పారు. భారతీయ సుసంపన్న ప్రాచీన వారసత్వం గురించి ప్రపంచమంతటా చర్చించుకుంటున్నారని తెలిపారు. కాశీ సంసద్ జ్ఞాన్ ప్రతియోగితా, కాశీ సంసద్ ఫొటోగ్రఫీ ప్రతియోగితా, కాశీ సంసద్ సంస్కృత్ ప్రతియోగితా అవార్డులను నరేంద్ర మోదీ విజేతలకు అందజేశారు. అనంతరం రూ.13,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాను గత పదేళ్లుగా ఇక్కడి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నానని, వారణాసి తనను బనారసిగా మార్చిందని అన్నారు. వారణాసి యువతను కొందరు కాంగ్రెస్ నేతలు నషేరీ(మత్తులో మునిగిపోయినవారు) అని దూషిస్తున్నారని పరోక్షంగా రాహుల్ గాం«దీపై మోదీ మండిపడ్డారు. నిజంగా స్పృహలో ఉన్నవారు అలా మాట్లాడరని చెప్పారు. గత 20 ఏళ్ల పాటు తనను తిట్టారని, ఇప్పుడు యువతపై ఆక్రోశం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. అయోధ్య, కాశీని అభివృద్ధి చేయడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదన్నారు. అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట జరిగినప్పుడు వారు ఏం మాట్లాడారో గుర్తుచేసుకోవాలని ప్రజలను కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి వారణాసి రోడ్లపై నడుస్తూ తనిఖీ చేశారు. ప్రజలను విపక్షాలు కులాల పేరిట రెచ్చగొడుతున్నాయ్ విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. విపక్షాలు కులాల పేరిట ప్రజలను రెచ్చగొడుతున్నాయని, గొడవలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. దళితులు, గిరిజనులు ఉన్నత పదవులు చేపడితే విపక్ష నాయకులు సహించలేకపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి పదవికి గిరిజన మహిళ ద్రౌపది ముర్మును తాము పోటీకి దింపితే ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వలేదని, ఆమెను ఓడించేందుకు ప్రయతి్నంచాయని గుర్తుచేశారు. దళితులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకొచి్చన పథకాలను విపక్షాలు వ్యతిరేకించాయని చెప్పారు. వారణాసిలో శుక్రవారం సంత్ రవిదాస్ 647వ జయంతి వేడుకల్లో మోదీ మాట్లాడారు. ప్రతి శకంలో యోగులు ప్రజలకు దారి చూపారని, తప్పుడు మార్గంలో నడవకుండా అప్రమత్తం చేశారని చెప్పారు. కులం పేరిట ఎవరైనా వివక్ష చూపితే అది మానవత్వంపై చేసిన దాడి అవుతుందని పేర్కొన్నారు. -
అత్యంత ప్రజాదారణ కలిగిన సీఎం ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రజాదారణ(పాపులారిటీ) కలిగిన ముఖ్యమంత్రిగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచినట్లు ఓ మీడియా సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వే నివేదికలో పేర్కొంది. సుమారు రెండు దశాబ్దాలకు పైగా సీఎంగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్.. దేశంలోనే అత్యంత ప్రజాధారణ కలిగిన ముఖ్యమంత్రిగా నిలవటం విశేషం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలిచారు. అనూహ్యంగా త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ప్రజాదరణలో ఐదో స్థానంలో నిలిచారు. నవీన్ పట్నాయక్: 2000 సంవత్సరం నుంచి అధికారంలో ఉన్న 77 ఏళ్ల నవీన్ పట్నాయన్ సర్వే నివేదికలో మొదటి స్థానంలో నిలిచారు. సర్వే ప్రకారం 52.7 శాతం ప్రజాదరణతో టాప్లో ఉన్నారు. బిజూ జనతా దళ్ పార్టీ చీఫ్ అయిన నవీన్ పట్నాయక్.. దేశంలో ఎక్కువ కాలం సీఎం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో ఒకరు. యోగి అదిత్యనాథ్: 2017 నుంచి అధికారంలో ఉన్న ఉత్తప్రదేశ్ 21వ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్వేలో అత్యంత ప్రజాదారణ పొందిన సీఎంలలో రెండో స్థానంతో నిలిచారు. యోగి 51.3 శాతం పాపులారిటిని కలిగి ఉన్నారు. సుమారు ఆయన ఏడేళ్లగా సీఎం సేవలు అందిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్లో ఎక్కవ కాలం సీఎంగా ఉన్న పేరు యోగికి ఉండటం విశేషం. హిమంత బిశ్వ శర్వ : అస్సాం(అసోం) సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రజాదరణ పొందిన మూడో సీఎంగా నిలిచారు. 48. 6 శాతం ప్రజాదారణ కలిగి ఉన్నారు. గతంలో కాంగ్రెస్ నేతగా ఉన్న హిమంత.. 2015తో బీజేపీలో చేరారు. 2021 నుంచి ఆయన అస్సాంకు 15వ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. భూపేంద్ర పటేల్: గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రజాదారణలో నాలుగో స్థానంలో నిలిచారు. 42. 6 శాతం పజాదారణను భూపేంద్ర పటేల్ కలిగి ఉండటం గమనార్హం. సెప్టెంబర్, 2021 నుంచి భూపేంద్ర పటేల్ సీఎం కొనసాగుతున్నారు. గుజరాత్ 17 వ సీఎం భూపేంద్ర పటేల్. మాణిక్ సాహా: ఈశాన్య రాష్ట్రమైన మాణిక్ సాహా అత్యంత ప్రజాదాన విషయంలో టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. 41.4 శాతం ప్రజాదారణను మాణిక్ షా కలిగి ఉన్నారు. గతంలో కాంగ్రెస్ నేతగా ఉన్న మాణిక్ షా... 2016లో బీజేపీలో చేరారు. మే, 2022లో మాణిక్ షా.. రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. -
కాశీ, అయోధ్య.. ఇక మథుర: యోగి
లఖ్నో: మథురలో చాలాకాలంగా వివాదాల్లో నలుగుతున్న మందిర్–మసీద్ వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అక్కడ షాహీ ఈద్గా స్థానంలో కృష్ణునికి ఆలయం నిర్మించడంపై గట్టిగా దృష్టి సారిస్తామని సంకేతాలిచ్చారు. ‘‘కాశీ, అయోధ్య అనంతరం ఇప్పుడిక మథుర వంతు. అక్కడ మందిరం రూపుదిద్దుకోకుంటే కృష్ణుడు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ ఇందుకు వేదికైంది. ‘‘కాశీ, అయోధ్య, మథుర విషయంలో మొండితనం, రాజకీయాలు కలగలిసి ఓటు బ్యాంకు రాజకీయాలుగా మారి పరిస్థితిని సంక్లిష్టంగా మార్చేశాయి’’ అంటూ కాంగ్రెస్, సమాజ్వాదీ పారీ్టలపై విమర్శలు గుప్పించారు. మథురలో కృష్ణుని పురాతన ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారన్న వివాదం ప్రస్తుతం కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. -
10 రోజుల్లో రూ. 12 కోట్లు.. బాలరాముని ఆదాయం!
అయోధ్యలోని రామాలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. రామభక్తులు బాలరామునికి విరాళాలు, కానుకలు విరివిగా అందజేస్తున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ మాధ్యమాలలో భక్తులు నూతన రామాలయానికి విరాళాలు అందజేస్తున్నారు. జనవరి 23 నుంచి సామాన్య భక్తులను రామాలయ సందర్శనకు అనుమతించినది మొదలు భక్తులు బారులు తీరుతున్నారు. గడచిన పది రోజుల్లో బాలరామునికి దాదాపు రూ.12 కోట్ల మేరకు విరాళాలు అందాయి. జనవరి 22న రామ్లల్లాకు పట్టాభిషేకం జరిగిన రోజున వేడుకకు హాజరైన ఎనిమిది వేల మంది అతిథులు భారీగా విరాళాలు సమర్పించారు. జనవరి 22న ఒక్కరోజునే రామ్లల్లా రూ.3.17 కోట్ల విరాళాన్ని అందుకున్నాడు. ముఖ్యమంత్రి యోగితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలంతా ఫిబ్రవరి 11న రామ్లల్లాను దర్శించుకోనున్నారు. అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానాతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఆరోజున శ్రీరాముని దర్శించుకోనున్నారు. మరోవైపు రామాలయంలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవాల జాబితాను సిద్ధం చేశారు. ఫిబ్రవరి 14న జరిగే వసంత పంచమి నూతన రామాలయంలో నిర్వహించే మొదటి ఉత్సవం కానుంది. ఆరోజు ఆలయంలో సరస్వతీ మాతను పూజించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. రామాలయంలో ఏడాది పొడవునా 12 ప్రధాన పండుగలు, ఉత్సవాలు జరగనున్నాయి. -
దీప్తీ శర్మకు అరుదైన గౌరవం.. ఇక డీఎస్పీ హోదాలో
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆల్రౌండర్ దీప్తీ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఆమెను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) హోదాతో సత్కరించింది. భారత క్రికెట్ జట్టు తరపున గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తుండంతో దీప్తీకు గౌరవం లభించింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ చేతిల మీదగా దీప్తి తన నియామక పత్రాన్ని అందుకుంది. అదే విధంగా దీప్తికి డీఎస్పీ పోస్ట్తో పాటు రూ.3 కోట్ల రూపాయల నగదు బహుమతిని కూడా యూపీ ప్రభుత్వం అందజేసింది. ఇక డీఎస్పీ హోదాతో తనను సత్కరించినందుకు శర్మ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది. యూపీతో పాటు భారత దేశ వ్యాప్తంగా మహిళల క్రికెట్ అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని ఇండియా టూడేతో శర్మ పేర్కొంది. మరోవైపు పారా ఏషియన్ గేమ్స్లో భాగమైన అథ్లెట్లు జతిన్ కుష్వాహా, యశ్ కుమార్లకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు క్యాష్ ఫ్రైజ్ను యోగి అందజేశారు. అదే విధంగా నేషనల్ గేమ్స్లో పతకాలు సాధించిన స్నూకర్ ఛాంపియన్ పరాస్ గుప్తా, రైఫిల్ షూటర్ ఆయుషి గుప్తాలకు కూడా రూ. 5 లక్షల నగదు బహుమతి లభించింది. చదవండి: Ind vs Eng: రోహిత్ కూడా చెప్పాడు..! తుదిజట్టులో సిరాజ్ అవసరమా? -
Ayodhya Ram Mandir: 500 ఏళ్ల కల నెరవేరింది: యోగి ఆదిత్యనాథ్
అయోధ్య: 500 ఏళ్ల కల నెరవేరిందన్నారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఈ క్షణం కోసం 500 ఏళ్లుగా భారతీయులు ఎదురు చూశారన్నారు. దేశమంతా రామ నామమే మార్మోగుతోందని.. రాంనగరికి వచ్చిన వారందరికీ స్వాగతం చెప్పారు. అన్న్ని దారులూ రామ మందిరానికే దారి తీస్తున్నాయన్నారు. ప్రాణ ప్రతిష్టకు హాజరైన వారి జీవితం ధన్యమైందన్న యోగి.. మనమంతా త్రేతా యుగంలోకి వచ్చినట్లుందని తెలిపారు. బాలరాముడి రూపాన్ని చెక్కిన శిల్పి జీవితం ధన్యమైందని అన్నారు.. ఈ రోజు ప్రతి రామ భక్తుడు సంతోషం, గర్వం, సంతృప్తితో ఉన్నాడని అన్నారు యోగి ఆదిత్యనాథ్. తన ఆలయం కోసం సాక్ష్యాత్తూ శ్రీరాముడే పోరాడాల్సి వచ్చిందన్నారు. అనుకున్న చోటే రామాలయం నిర్మించామని తెలిపారు. కాగా అయోధ్య భవ్య మందిరంలో దివ్య రామయ్య విగ్రహం ఆవిష్కృతం. వైభవంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగింది. అభిజిత్ ముహూర్తంలో రాముడు తొలి దర్శనం ఇచ్చారు. పసిడి కిరీటం, పట్టువస్త్రం, ముత్యాల కంఠాభరణంతో రాముడిని సుందరంగా అలంకరించారు. రమణీయంగా రామయ్య ప్రాణ ప్రతిష్ట మహోజ్వల ఘట్టం జరిగింది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి రామ్లల్లాలకు ప్రధాని మోదీ తొలి హారతి ఇచ్చారు. అయోధ్య రామాలయంపై హెలికాప్టర్తో పూల వర్షం కురిపించారు. సామాన్య భక్తులకు రేపటి నుంచి దర్శనం ఖరారైంది. ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు బాలరాముడి దర్శించుకోవచ్చు. మళ్లీ మధ్యాహ్నం 2 నుంచిరాత్రి 7 గంటల వరకు దర్శన అవకాశం కల్పించారు. చదవండి: అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ట వేడుక.. అప్డేట్స్ -
Ayodhya Ram Mandir: అయోధ్యలో దీపోత్సవం
Ram mandir pran pratishtha Live Updates సాయంత్రం 5.30:.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో దీపోత్సవం సరయూ నది ఒడ్డున 14 లక్షల దీపాలు వెలిగించిన భక్తులు దీప కాంతులతో వెలిగిపోతున్న సరయూ తీరం దేశ వ్యాప్తంగా ఇంటింటా రామజ్యోతి రామ్ కీ పైడీ, కనక్ భవన్, గుప్తర్ ఘాట్, సరయూ ఘాట్, లతా మంగేష్కర్ చౌక్, మనిరామ్ దాస్ చావ్నీ దీపాలతో అలంకరణ रामज्योति! #RamJyoti pic.twitter.com/DTxg2QquTT — Narendra Modi (@narendramodi) January 22, 2024 సాయంత్రం 4గం.. సోమవారం, జనవరి 22 బాల రాముడి విగ్రహ ప్రతిష్టతో చారిత్రక ఘట్టం పూర్తి రేపటి నుంచి సామాన్య భక్తులకు భగవాన్ రామ్ లల్లా దర్శనం వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ ద్వారా రామ దర్శనం మొదటి స్లాట్ ఉదయం 7 నుండి 11:30 వరకు రెండో స్లాట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉదయం 6:30కు ఆలయంలో జాగ్రన్ , శృంగార్ హరతి హరతికి ఒక రోజు ముందుగానే బుకింగ్. రాత్రి 7 గంటలకు సాయంత్రం హారతి సమయం ఒకరోజు ముందుగానే బుకింగ్ చేసుకోవాలి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రస్ట్ వెబ్సైట్లో బుకింగ్ 3గం:10ని.. సోమవారం, జనవరి 22 రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకున్నవారికి ప్రధాని మోదీ సన్మానం పూలు జల్లి కృతజ్ఞతలు తెలిపిన మోదీ. 2గం:12ని.. సోమవారం, జనవరి 22 ఈరోజు మన రాముడు వచ్చేశాడు: ప్రధాని నరేంద్ర మోదీ జై శ్రీరామచంద్రమూర్తి జై అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ రామ భక్తులందరికీ నా ప్రణామాలు ఈరోజు మన రాముడు వచ్చేశాడు ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న మన రాముడు వచ్చేశాడు ఈ క్షణం ఎంతో ప్రత్యేకమైనది ఇది సామాన్యమైన సమయం కాదు రాముడు భారతదేశ ఆత్మ రాముడు భారతదేశానికి ఆధారం ఎక్కడ రాముడు కార్యక్రమం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు ఎంతో చెప్పాలని ఉన్నా.. నా గొంతు గద్గదంగా ఉంది నా శరీరం ఇంకా స్పందించే స్థితిలో లేదు ఎంతో అలౌకిక ఆనందంలో ఉన్నాను అన్ని భాషల్లోనూ రామాయణాన్ని విన్నాను గర్భగుడిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట నా చేతులు మీదుగా జరగడం నా అదృష్టం జనవరి 22వ తేదీ చరిత్రలో నిలిచిపోతుంది మన రాముడు టెంట్లో ఉండే పరిస్థితులు ఇక లేవు మన రాముడు ఇకపై దివ్యమైన మందిరంలో ఉంటారు రాముడి దయవల్ల మనమందరం ఈ క్షణానికి సాక్షులమయ్యాం ఈ నేల, గాలి ప్రతీది దివ్యత్వంతో నిండిపోయింది ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్న సరికొత్త అధ్యాయం ఇంత ఆలస్యం జరిగినందుకు మమ్మల్ని క్షమించమని శ్రీరాముడిని వేడుకుంటున్నా త్రేతాయుగంలో శ్రీరాముడు కేవలం 14 ఏళ్ల వనవాసానికి వెళ్లాడు కలియుగంలో రాముడు వందలయేళ్లపాటు వనవాసం చేశాడు భారత న్యాయవ్యవస్థకు ఈరోజు నేను నమస్కరిస్తున్నా న్యాయబద్ధంగానే శ్రీరాముడి మందిర నిర్మాణం జరిగింది ఈరోజు దేశ వ్యాప్తంగా దేవాలయాల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి దేశ ప్రజలందరూ ఇవాళ దీపావళి జరుపుకుంటున్నారు ఇంటింటా రాముడి దీపజ్యోతి వెలిగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈ రోజు మనకు శ్రీరాముడి మందిరం దొరికింది బానిస సంకెళ్లను తెంచుకున్న కొత్త రాజ్యం ఆవిర్భించింది ఈ అనుభూతిని ప్రతి రామ భక్తుడు అనుభవిస్తున్నాడు రాముడు వివాదం కాదు.. ఒక సమాధానం రాముడు వర్తమానమే కాదు.. అనంతం రాముడు అందరివాడు రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారిని అయోధ్యకు ఆహ్వానిస్తున్నా ఇవాళ్టి ఈ చరిత్ర వేలయేళ్లపాటు నిలిచిపోతుంది రాబోయే వెయ్యేళ్ల కోసం నేడు పునాదిరాయి వేస్తున్నాం సేవా, చింతన భక్తిని.. హనుమంతుడి నుంచి ప్రేరణ పొందాలి రాముడు తప్పక వస్తాడన్న శబరి ఎదురుచూపులు ఫలించాయి దేవుడి నుంచి దేశం.. రాముడి నుంచి రాజ్యం ఇది మన నినాదం నేను సామాన్యుడిని, బలహీనుడినని భావిస్తే.. ఉడత నుంచి ప్రేరణ పొందండి 2గం:10ని.. సోమవారం, జనవరి 22 మోదీ గొప్ప తపస్వి: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ ఆనందం మాటల్లో చెప్పలేనిది. అయోధ్యలో బాలరాముడితోపాటు భారత కీర్తి తిరిగొచ్చింది. మోదీ గొప్ప తపస్వి ప్రధాని మోదీ కఠిన నియమాలు పాటించారు. ఈ కార్యక్రమాన్ని వర్ణించేందుకు మాటలు చాలడం లేదు కష్టకాలలంలో ప్రపంచశాంతికి ఇది దిక్సూచిలాంటింది ఎందరో త్యాగాల ఫలితం ఇవాళ్టి సువర్ణ ఆధ్యాయం 1గం:58ని.. సోమవారం, జనవరి 22 యోగి భావోద్వేగ ప్రసంగం 50ం ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది ఎన్నో తరాలు ఈ క్షణం కోసం నిరీక్షించాయి ఈ అద్భుత ఘట్టాన్ని వర్ణించేందుకు నాకు మాటలు రావడం లేదు దేశంలోని ప్రతీ పట్టణం, గ్రామం అయోధ్యగా మారింది ప్రతీ ఒక్కరూ ఆనంద భాష్పాలతో అయోధ్య వైపు చూశారు కలియుగం నుంచి త్రేతాయుగంలోకి వచ్చామ్మా? అనే భావన నెలకొంది ప్రతీ రామ భక్తుడు సంతృప్తి.. గర్వంతో ఉన్నాడు తన ఆలయం కోసం సాక్షాత్తూ శ్రీరాముడే పోరాడాల్సి వచ్చింది ఆ మహాసంకల్పం మోదీ చేతుల మీదుగా పూర్తయ్యాయింది బాలరాముడి రూపాన్ని చెక్కిన శిల్పి జీవితం ధన్యమైంది #WATCH | Uttar Pradesh CM Yogi Adityanath says, "The entire country has become 'Rammay'. It seems that we have entered Treta Yug..."#RamMandirPranPrathistha pic.twitter.com/6Sd7lJrOy8 — ANI (@ANI) January 22, 2024 1గం:55ని.. సోమవారం, జనవరి 22 మోదీ కఠోర దీక్ష విరమణ అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కోసం నరేంద్ర మోదీ కఠోర ఉపవాసం ప్రధాని మోదీ 11 రోజుల కఠోర దీక్ష దీక్ష విరమింపజేసిన గోవింద్ దేవ్ గిరి మహారాజ్ మోదీకి వెండి ఆలయ నమునా ఇచ్చిన.. బంగారు ఉంగం ఇచ్చిన ట్రస్ట్ 11 రోజులపాటు మోదీ కఠోర దీక్ష చేశారు: గోవింద్ దేవ్ గిరి మహారాజ్ దేశవ్యాప్తంగా ఆయన అన్ని ఆలయాలు తిరిగారు: గోవింద్ దేవ్ గిరి మహారాజ్ కొబ్బరి నీళ్లు తాగి నేల మీద పడుకున్నారు: గోవింద్ దేవ్ గిరి మహారాజ్ ఇలాంటి సంకల్ప బలం ఉన్న వ్యక్తి దేశ నాయకుడు కావడం గర్వకారణం: గోవింద్ దేవ్ గిరి మహారాజ్ #WATCH | PM Narendra Modi breaks his fast after the ‘Pran Pratishtha’ ceremony at the Shri Ram Janmaboomi Temple in Ayodhya. #RamMandirPranPrathistha pic.twitter.com/Zng1IHJ2FJ — ANI (@ANI) January 22, 2024 1గం:33ని.. సోమవారం, జనవరి 22 అయోధ్య రాముడి దర్శన వేళలు ఇవే అయోధ్యలో శాస్త్రోక్తంగా జరిగిన ప్రాణ ప్రతిష్ట మహోత్సవం రేపటి నుంచి సామాన్యుల సందర్శనకు అనుమతి రెండు స్లాట్ల కేటాయింపు ఉదయం 7 నుంచి 11గం.30ని వరకు.. మధ్యాహ్నాం 2గం. నుంచి 7 గం. వరకు అనుమతి 1గం:28ని.. సోమవారం, జనవరి 22 ఎటు చూసినా భావోద్వేగమే! అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో దేశమంతటా భావోద్వేగ సన్నివేశాలుఔ దేశమంతటా రామ నామ స్మరణం కాషాయ వర్ణంతో మురిసిపోతున్న హిందూ శ్రేణులు ఆలింగనంతో కంటతడిపెట్టిన బీజేపీ నేత ఉమాభారతి, సాధ్వీ రీతాంభరలు రామ మందిర ఉద్యమంలో కీలకంగా వ్యహరించిన ఈ ఇద్దరూ 1గం:16ని.. సోమవారం, జనవరి 22 రామ్ లల్లాకు తొలి హారతి అయోధ్య రామ మందిరంలో కొలువు దీరిన శ్రీరామ చంద్రుడు రమణీయంగా సాగిన ప్రాణప్రతిష్ట క్రతువు కర్తగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ బాలరాముడి అవతారంలో కొలువు దీరిన వైనం పసిడి కిరీటం, పట్టు వస్త్రం సమర్పణ దేశమంతటా రామ భక్తుల సందడి రామ్ లల్లాకు తొలి హారతి ఇచ్చిన ప్రధాని మోదీ రామయ్యకు మోదీ సాష్టాంగ నమస్కారం #WATCH | PM Modi performs 'Dandavat Pranam' at the Shri Ram Janmaboomi Temple in Ayodhya. #RamMandirPranPrathistha pic.twitter.com/kAw0eNjXRb — ANI (@ANI) January 22, 2024 12గం:54ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో అపూర్వ ఘట్టం.. తొలి దర్శనం అయోధ్య రామ మందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ట మహోత్సవం రామ్ లల్లా తొలి దర్శనం రామనామస్మరణతో ఉప్పొంగిపోతున్న హిందూ హృదయాలు గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో మహాగంభీరంగా జరిగిన ప్రాణప్రతిష్ట క్రతువు పద్మపీఠంపై ధనుర్ధారియై బాలరాముడి తొలి దర్శనం మెడలో రత్నాల కాసుల మాల స్వర్ణాభరణాలతో బాలరాముడు తలపై వజ్రవైడ్యూరాల్యతో పొదిగిన కిరీటం పాదాల వద్ద స్వర్ణ కమలాలు సకలాభరణాలతో బాలరాముడి నుదుట వజ్రనామం 84 సెకన్ల దివ్య ముహూర్తంలో సాగిన ప్రాణ ప్రతిష్ట క్రతువు ఆ సమయంలో అయోధ్య ఆలయంపై హెలికాఫ్టర్లతో పూల వర్షం Prime Minister Narendra Modi performs 'aarti' of Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya.#RamMandirPranPrathistha pic.twitter.com/EDjYa3yw7V — ANI (@ANI) January 22, 2024 12గం:30ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం అయోధ్యలో నూతన రామ మందిరంలో కొలువుదీరనున్న బాలరాముడు రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కర్తగా ప్రధాని నరేంద్ర మోదీ జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగుతున్న దేశం మరికొద్ది నిమిషాల్లో బాలరాముడికి ప్రాణప్రతిష్ట 12గం:26ని.. సోమవారం, జనవరి 22 గర్భాలయంలోకి ప్రధాని మోదీ ప్రత్యేక పూజల అనంతరం గర్భగుడిలోకి మోదీ గర్భాలయంలో ప్రాణప్రతిష్ట పూజల్లో ప్రధాని మోదీ మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, గవర్నర్ ఆనందీ బెన్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా వేదమంత్రాల నడుమ కొనసాగుతున్న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట క్రతువు 12గం:20ని.. సోమవారం, జనవరి 22 ప్రారంభమైన ప్రాణప్రతిష్ట మహోత్సవం అయోధ్య రామ మందిరంలోకి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు బాలరాముడి కోసం పట్టు పీతాంబరాలు, ఛత్రం, పాదుకలు తీసుకొచ్చిన మోదీ వెంట ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ #WATCH | Prime Minister Narendra Modi arrives at Shri Ram Janmaboomi Temple in Ayodhya to participate in the Ram Temple Pran Pratishtha ceremony pic.twitter.com/XkLf1aV1hh — ANI (@ANI) January 22, 2024 12గం:00ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో అపురూప క్షణాలు అయోధ్యలో రామయ్య కొలువుదీరే అపురూప క్షణాలు ఆసన్నం మరికాసేపట్లో రామ మందిరంలో రామయ్య విగ్రహాన్ని ప్రతిష్టించనున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మధ్యాహ్నం 12.20 నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్ లగ్నంలో ఈ వేడుక ప్రాణప్రతిష్ఠను 84 సెకన్ల దివ్య ముహూర్తంలో నిర్వహణ మధ్యాహ్నం 12.29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు దివ్యముహూర్తం ముందుగా రామ్లల్లా విగ్రహ కళ్లకు ఆచ్ఛాదనగా ఉన్న వస్త్రాన్ని తొలగింపు బంగారంతో చేసిన చిన్న కడ్డీతో శ్రీరాముడికి కాటుక దిద్దడం ఆపై రామ్లల్లాకు చిన్న అద్దాన్ని చూపిస్తారు ఆ తర్వాత 108 దీపాలతో ‘మహా హారతి’ ఇవ్వడంతో ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగుస్తుంది 11గం:43ని.. సోమవారం, జనవరి 22 ఆలయంపై పుష్పవర్షం.. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఆలయంపై హెలికాప్టర్లతో పుష్పవర్షం 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు రెండు గంటల పాటు మంగళ వాయిద్యాలు మోగిస్తారు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు.. కర్తలుగా వ్యవహరిస్తాయి ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7 వేల మంది పాల్గొననున్నారు వారిద్దరు రామలక్ష్మణుల్లా రామమందిరాన్ని నిర్మించారు: సినీ నటుడు సుమన్ సినీనటుడు సుమన్ అయోధ్య రామ మందిరానికి చేరుకున్నారు ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు అభినందనలు: సుమన్ వారిద్దరు రామలక్ష్మణుల మాదిరిగా కష్టపడి రామాలయాన్ని నిర్మించారు రామాలయ నిర్మాణానికి భగవంతుడు వారికి సహకరించారు శ్రీరాముడు మతానికి అతీతుడు: ఆనంద్ మహీంద్రా శ్రీరాముడు మతానికి అతీతుడు: ఆనంద్ మహీంద్రా మన విశ్వాసాలు ఏవైనా.. గౌరవం, బలమైన విలువలతో జీవించడానికి అంకితమైన మహావ్యక్తి రాముడు అనే భావనకు ఆకర్షితులవుతాం ఆయన బాణాలు చెడు, అన్యాయాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి ‘రామరాజ్యం’ అనే ఆదర్శ పాలన భావన నేడు అన్ని సమాజాల ఆకాంక్ష ఇప్పుడు ‘రామ్’ అనే పదం యావత్ ప్రపంచానికి చెందింది: ఆనంద్ మహీంద్రా 11గం:29ని.. సోమవారం, జనవరి 22 సాయంత్రం దాకా మోదీ ఇక్కడే ఉదయం 11 గంటల ప్రాంతంలో రామజన్మభూమికి చేరుకున్న ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ క్రతువు పూర్తయిన తర్వాత భక్తులనుద్దేశించి ప్రసంగం ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో అయోధ్యలోని కుబర్ తిలాలో ఉన్న శివ మందిర్ను సందర్శన సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఢిల్లీకి పయనం అయోధ్య ప్రాణప్రతిష్ట.. అంతటా ఇలా.. New York Celebrates Arrival of "Shree Ram"#RamMandirPranPrathistha #RamMandirAyodhya #AyodhyaRamMandir #AyodhyaSriRamTemple #AyodhyaJanmBhoomi #RamMandirInauguration pic.twitter.com/5kJGjUEMEr — One World News (@Oneworldnews_) January 22, 2024 At Eiffel tower Paris. 🥳 Jai Shri Ram 🚩#JaiShriRam #RamLallaVirajman #RamMandirPranPratishta #AyodhaRamMandir #Ayodhya #AyodhyaRamMandir pic.twitter.com/mOZVCBZJF1 — Secular Chad (@SachabhartiyaRW) January 22, 2024 New York Celebrates Arrival of "Shree Ram"#RamMandirPranPrathistha #RamMandirAyodhya #AyodhyaRamMandir #AyodhyaSriRamTemple #AyodhyaJanmBhoomi #RamMandirInauguration pic.twitter.com/5kJGjUEMEr — One World News (@Oneworldnews_) January 22, 2024 San Francisco 🇺🇸 turned into Ayodhya 🇮🇳 for a night to celebrate the RamMandir Inauguration 🚩 Jai Shree Ram 🙏#RamMandirPranPrathistha pic.twitter.com/M3eQQMFym1 — SaNaTaNi ~ 𝕏𝐎𝐍𝐄 🚩 (@xonesanatani) January 22, 2024 श्री राम के दर्शन करने पहुंचे भारतीय क्रिकेटर।।।#जयश्रीराम #अयोध्या #JaiSriRam #AyodhyaRamMandir pic.twitter.com/DedGNBdMs6 — Hriday Singh (@hridaysingh16) January 22, 2024 11గం:22ని.. సోమవారం, జనవరి 22 కాసేపట్లో ప్రాణప్రతిష్ట అయోధ్యలో ప్రధాని మోదీ దేశమంతటా రామనామస్మరణ సర్వోన్నతంగా నిర్మించిన రామ మందిరం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం జాబితాలో చోటు ఐదేళ్ల బాలరాముడి అవతారంలో రామ్ లల్లా కాసేపట్లో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఇప్పటికే రామజన్మ భూమికి భారీగా భక్తజనం 11గం:00ని.. సోమవారం, జనవరి 22 మరో దీపావళిలా.. దేశ వ్యాప్తంగానే కాదు.. విదేశాలలో అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుకలు అన్ని ఆలయాల్లో.. ప్రత్యేకించి రామాలయం, హనుమాన్ గుడిలలో ప్రత్యేక పూజలు జై శ్రీరామ్ నినాదాలతో.. భక్తి శ్రద్ధలతో వివిధ కార్యక్రమాల నిర్వహణ ఆలయాల్లోనే కాదు.. ప్రతీ ఇంటా దీపం రావణుడిపై జయం తర్వాత శ్రీరాముడు రాక సందర్భంగా దీపావళి ఇప్పుడు అయోధ్య మందిర నేపథ్యంలో దీపాలంకరణలతో.. మరో దీపావళిలా దివ్యోత్సవం 10గం:45ని.. సోమవారం, జనవరి 22 భారీగా ప్రముఖులు.. భద్రత కాసేపట్లో అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట పాల్గొననున్న ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్న అన్ని రంగాల ప్రముఖులు అన్ని రాష్ట్రాల నుంచి సినీ రంగాల ప్రముఖులు పలువురు రాజకీయ ప్రముఖులు 12 గంటల నుంచి ప్రాణ ప్రతిష్ట క్రతువు ప్రారంభం 10గం:40ని.. సోమవారం, జనవరి 22 తెలంగాణ అంతటా.. ఆధ్యాత్మిక శోభ అయోధ్య రామ మందిర బాలరాముడి ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో తెలంగాణలో కోలాహలం పలు ఆలయాలు సుందరంగా ముస్తాబు అర్ధరాత్రి నుంచి మైక్ సెట్లతో హడావిడి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో శ్రీరామచంద్రుడి పల్లకి ఊరేగింపు లొ పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ 10గం:35ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ బాలరాముడి ప్రాణప్రతిష్టలో పాల్గొననున్న ప్రధాని మోదీ కాసేపట్లో అయోధ్య రామజన్మభూమికి మోదీ మ.1.15ని. విశిష్ట సభలో ప్రధాని మోదీ ప్రసంగం ఇదీ చదవండి: అయోధ్యకు వ్యాపారవేత్తల క్యూ.. జై శ్రీరామ్ నినాదాలతో.. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం దేశం నలుమూలల నుంచి అయోధ్యకు చేరుకుంటున్న రామ భక్తులు వేలాది మంది సాధువులు దేశం నుంచి అయోధ్యకు వెయ్యి రైళ్లు ఇప్పటికే అయోధ్యలో హోటళ్లు ఫుల్లు పవిత్రోత్సవం తర్వాత దేదీప్యమానంగా అయోధ్య సాయంత్రం 10 లక్షల దీపాలతో శ్రీరామ జ్యోతి 10గం:10ని.. సోమవారం, జనవరి 22 భక్తితో పురిటి నొప్పులు ఓర్చుకుంటూ..?! దేశమంతా రామమయం అయోధ్యలో నేడు రాముడి విగ్రహ ప్రతిష్ట ఆ శుభముహూర్తం కోసం గర్బిణీల ఎదురు చూపులు పుత్రుడు జన్మిస్తే రాముడు.. ఆడపిల్ల జన్మిస్తే సీత పేరు పెడతారట మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో పదుల సంఖ్యలో ఆ శుభ గడియ కోసం గర్భిణీలు ఇక్కడే కాదు.. దేశమంతా శుభముహూర్తం కోసం ఎదురు చూపులు పురిటి నొప్పులు వస్తున్నా.. ఓపిక పడుతున్న గర్బిణీలు 10గం:10ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో టైట్ సెక్యూరిటీ ఏడెంచెల భద్రతా వలయం నడుమ అయోధ్య రామ మందిరం వేల మంది యూపీ పోలీసులు వందల సంఖ్యలో కేంద్ర బలగాల సిబ్బంది ప్రధాని రాక నేపథ్యంలో ప్రత్యేక సిబ్బంది మోహరింపు ప్రతీ ఒక్కరిపై కన్నేసేలా ఏఐ టెక్నాలజీ 10వేలకు పైగా సీసీ కెమెరాలు.. డ్రోన్ల నిఘా 10గం:02ని.. సోమవారం, జనవరి 22 బాలరాముడ్ని అద్దంలో చూపిస్తూ.. కాసేపట్లో అయోధ్యకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిన్నంతా రామేశ్వరంలో మోదీ ప్రత్యేక పూజలు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో కఠిన ఉపవాస.. కఠోర నియమాలు పాటిస్తున్న మోదీ గత 74 ఏళ్లుగా అయోధ్యలో తాత్కాలిక విగ్రహానికి పూజలు ఉత్తరాది నాగర స్టయిలో కొత్త రామ మందిర ఆలయ నిర్మాణం 392 పిల్లర్లు.. ఆలయానికి 44 తలుపులు నేడు ప్రాణప్రతిష్ట జరుపుకోనున్న బాలరాముడి విగ్రహం ముందుగా దశ దర్శనాలు తొలుత అద్దంలో బాలరాముడ్ని.. బాలరాముడికే చూపించనున్న ప్రధాని మోదీ 84 సెకన్లపాటు సాగనున్న ప్రాణప్రతిష్ట క్రతువు థాయ్లాండ్లో ఇలా.. Thailand pic.twitter.com/ZqaIxPW8gh — Megh Updates 🚨™ (@MeghUpdates) January 21, 2024 09గం:49ని.. సోమవారం, జనవరి 22 ఏపీలో ఇలా.. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట వేళ.. ఏపీలో ఆధ్యాత్మిక శోభతో ఉట్టి పడుతున్న రామ మందిరాలు, ఆలయాలు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ నేడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అన్న సమారాధనలు జిల్లా వ్యాప్తంగా శోభాయాత్రలు చేస్తున్న రామభక్తులు.. తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో యల్.ఇ.డి స్క్రీన్ లు ఏర్పాటు ఏలూరు ధర్మభేరి ప్రాంగణంలో శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని పురవీధుల్లో శ్రీరాముని చిత్రపటం ఊరేగింపు శ్రీరామ నామస్మరణం చేస్తూ పాల్గొన్న భక్తాదులు 09గం:45ని.. సోమవారం, జనవరి 22 అయోధ్య చేరుకున్న చిరంజీవి, రామ్ చరణ్ రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు అయోధ్య చేరుకున్న చిరంజీవి దంపతులు.. తనయుడు రామ్ చరణ్ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను: చిరంజీవి నా ఆరాధ్య దైవం హనుమంతుడు నన్ను వ్యక్తిగతంగా ఆహ్వానించాడుఅని భావిస్తున్నా: చిరంజీవి అయోధ్యలో రామ మందిరం కోట్లమంది చిరకాల స్వప్నం.. ఎంతో ఉద్వేగభరితంగా ఉంది: రామ్చరణ్ #WATCH | Uttar Pradesh: Telegu superstars Chiranjeevi and Ram Charan arrive in Ayodhya. Ayodhya Ram Temple Pran Pratishtha ceremony is taking place today. pic.twitter.com/wT0gvlLPiS — ANI (@ANI) January 22, 2024 #WATCH | Telangana | Actor Chiranjeevi leaves from Hyderabad for Ayodhya in Uttar Pradesh as Ayodhya Ram Temple pranpratishtha ceremony to take place today. He says, "That is really great. Overwhelming. We feel it's a rare opportunity. I feel Lord Hanuman who is my deity, has… pic.twitter.com/FjKoA7BBkQ — ANI (@ANI) January 22, 2024 08గం:47ని.. సోమవారం, జనవరి 22 అద్వానీ రావట్లేదు బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ అయోధ్య వేడుకకు గైర్హాజరు 96 ఏళ్ల వయసురిత్యా తొలుత దూరంగా ఉండాలని నిర్ణయం ఆ వెంటనే మనుసు మార్చుకుని హాజరవుతానని ప్రకటించిన అద్వానీ తీవ్ర చలి ప్రభావంతోనే హాజరు కావట్లేదని తాజా ప్రకటన అద్వానీకి ఆహ్వానం అందకపోవడంపైనా రాజకీయ విమర్శలు ఆహ్వానం స్వయంగా అందించినట్లు వెల్లడించిన ట్రస్ట్ సభ్యులు 08గం:47ని.. సోమవారం, జనవరి 22 అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. అమృత్సర్లో శోభాయాత్ర #WATCH | Punjab: 'Shobha yatra' being taken out in Amritsar, ahead of Pran Pratishtha ceremony of the Ram Temple in Ayodhya today. pic.twitter.com/6EfSbJhNDQ — ANI (@ANI) January 22, 2024 08గం:35ని.. సోమవారం, జనవరి 22 ప్రముఖ నటుడి ప్రత్యేక పూజలు సీనియర్ నటుడు, బీజేపీ నేత అనుపమ్ ఖేర్ ప్రత్యేక పూజలు హనుమంతుడికి పూజలు చేసిన అనుపమ్ ఖేర్ మరో దీపావళి పండుగలా ఉందంటూ వ్యాఖ్య #WATCH | Ayodhya | Actor Anupam Kher says, "Before going to Lord Ram, it is very important to have the darshan of Lord Hanuman...The atmosphere in Ayodhya is so graceful. There is slogan of Jai Sri Ram in the air everywhere...Diwali has come again, this is the real Diwali." pic.twitter.com/GCskErgi1Z — ANI (@ANI) January 22, 2024 08గం:31ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో ఇవాళ.. కాసేపట్లో.. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన 16 ఆచారాలు ప్రారంభం దేవకినందన్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీరామ కథా పారాయణం అయోధ్యలో వంద చోట్ల ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంస్కృతిక ఊరేగింపు యూపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1500 మంది జానపద నృత్య కళాకారుల ప్రదర్శన రామకథా పార్కులో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు రాంలీలా ప్రదర్శన సాయంత్రం 6.30 నుండి 7 గంటల వరకు శ్రీరామునికి సరయూ హారతి. రాత్రి 7 నుంచి 7.30 వరకు రామ్ కి పైడిపై ప్రొజెక్షన్ షో. రామకథా పార్కులో రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాటేకర్ సిస్టర్స్ సారధ్యంలో రామకథా గానం. తులసీ ఉద్యానవనంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శర్మ బంధుచే భజన కార్యక్రమం రాత్రి 7.45 నుండి 7.55 వరకు రామ్ కీ పైడి వద్ద బాణసంచా కాల్చి సందడి కన్హయ్య మిట్టల్ సారధ్యంలో రామకథా పార్క్ వద్ద రాత్రి 8 నుండి 9 గంటల వరకు భక్తి సాంస్కృతిక కార్యక్రమం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు తులసి ఉద్యానవనంలో రఘువీర పద్మశ్రీ మాలినీ అవస్థి సారధ్యంలో ప్రత్యేక కార్యక్రమం 08గం:18ని.. సోమవారం, జనవరి 22 ఎటు చూసినా డ్రోన్లే మరోవైపు అయోధ్యలో ఏడంచెల భద్రతా వలయం ప్రధాని సహా వీవీఐపీలు, వీఐపీల రాక నేపథ్యంలో.. ఎస్పీజీ, ఎన్ఎస్జీ కమాండోల మోహరింపు వేల మంది యూపీ పోలీసుల మోహరింపు కేంద్ర బలగాల పహారా నడుమ అయోధ్యాపురి డ్రోన్ నిఘా నీడలో అయోధ్య 08గం:00ని.. సోమవారం, జనవరి 22 ప్రాణప్రతిష్ట క్రతువు కొన్ని సెకన్లే.. మేషలగ్నం అభిజిత్ ముహూర్తంలో అయోధ్య రాముడికి ప్రాణప్రతిష్ట మధ్యాహ్నాం 12గం.29ని.. నుంచి 12గం.30ని.. మధ్య ప్రాణప్రతిష్ట ముహూర్తం నూతన రామాలయంలో 84 సెకన్ల కాలంలో గర్భగుడిలో బాలరాముడి ప్రాణప్రతిష్ట రామ్లల్లా విగ్రహానికి జరగనున్న ప్రాణ ప్రతిష్ట నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట చేయించనున్న వారణాసి అర్చకులు అయోధ్యలో విశిష్ట సభలో 1గం. నుంచి 2గం. మధ్య ప్రధాని మోదీ సహా ప్రముఖుల ప్రసంగాలు హాజరు కానున్న అన్ని రాష్ట్రాల రామ భక్తులు 7 వేలమందికి ఆహ్వానం.. భారీగా ప్రముఖుల రాక కట్టుదిట్టమైన భద్రతా వలయంలో అయోధ్య అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఓర్చాలో 5100 మట్టి దీపాలను వెలిగించారు 07గం:55ని.. సోమవారం, జనవరి 22 ‘రామ’కు వెలుగులు దేశవ్యాప్తంగా రామ నామంతో ఉన్న రైల్వే స్టేషన్లకు ప్రత్యేక ముస్తాబు రామన్నపేట్ (తెలంగాణ). రామచంద్రపురం (ఆంధ్రప్రదేశ్). రామగిరి (కర్ణాటక). ఇవన్నీ రాముని పేరుతో ఉన్న రైల్వేస్టేషన్లు. దేశవ్యాప్తంగా ఇలా మొత్తం 343 రైల్వేస్టేషన్లకు హంగులు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్న స్టేషన్లు రైల్వే శాఖ నిర్ణయంపై సర్వత్రా హర్షం రాముని పేరిట ఉన్న రైల్వేస్టేషన్లలో అత్యధికంగా 55 ఏపీలో ఉండటం విశేషం! 07గం:48ని.. సోమవారం, జనవరి 22 500 ఏళ్ల హిందువుల కల నెరవేరుతున్న వేళ.. మరికొద్ది గంటల్లో అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మ.12 నుంచి ప్రాణ ప్రతిష్ట క్రతువుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ట అనంతరం కుబేర్ తిలక్లో భగవాన్ శివుని పురాతన మందిరాన్ని సందర్శించనున్న మోదీ ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొననున్న దేశంలోని అన్ని ప్రధాన ఆధ్యాత్మిక, ధార్మిక శాఖల ప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు ప్రాణ ప్రతిష్ట అనంతరం విశిష్ట సభను ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణంలో పాల్గొన్న కార్మికులతోనూ ప్రధాని మోదీ ముచ్చట్లు విదేశాల్లోనూ శ్రీరామం అయోధ్య ప్రాణప్రతిష్ట వేళ.. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా వేడుకలు పలు దేశాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు 50కి పైగా దేశాల్లో అయోధ్య రామ మందిర బాలరాముడి ప్రాణప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పలు చోట్ల కార్ల ర్యాలీలు టైమ్స్ స్క్వేర్ సహా పలు చోట్ల లైవ్ టెలికాస్టింగ్కు ఏర్పాట్లు ఫ్రాన్స్లో రథయాత్ర.. ఈఫిల్ టవర్ వద్ద ప్రత్యక్ష ప్రసారం US: 'Overseas Friends of Ram Mandir' distributes laddoos at Times Square ahead of Pran Pratishtha Read @ANI Story | https://t.co/tJPnNvaKt2#TimesSquare #PranPratishthaRamMandir #NewYork pic.twitter.com/IWAMSJWAYy — ANI Digital (@ani_digital) January 22, 2024 #WATCH | Indian diaspora in the United States offer prayers at Shree Siddhi Vinayak temple in New Jersey ahead of the Pran Pratishtha ceremony at Ram Temple in Ayodhya. pic.twitter.com/gCt2EZL7qL — ANI (@ANI) January 22, 2024 07గం:35ని.. సోమవారం, జనవరి 22 ఈ ఉదయం రామజన్మభూమి ఇలా.. #WATCH | Ayodhya, Uttar Pradesh: Visuals from Ram Janmabhoomi premises ahead of the Pran Pratishtha ceremony of Ram Temple, today. pic.twitter.com/O1Iuay8Dd7 — ANI (@ANI) January 22, 2024 07గం:28ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యకు బిగ్బీ అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం అయోధ్యకు అమితాబ్ బచ్చన్ రామమందిర వేడుక కోసం భారీగా తరలిన వీవీఐపీలు #WATCH | Mumbai: Superstar Amitabh Bachchan leaves for Ayodhya. Pran Pratishtha ceremony of Ayodhya's Ram Temple will take place today. pic.twitter.com/pOecsD92XQ — ANI (@ANI) January 22, 2024 07గం:15ని.. సోమవారం, జనవరి 22 50 వాయిద్యాలతో మంగళ ధ్వని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మంగళ ధ్వని మధ్య నిర్వహించేందుకు సిద్ధమైన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళ ధ్వని కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన 50 సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం, కర్ణాటక నుంచి వీణ, తమిళనాడు నుంచి నాదస్వరం, మృదంగం మొత్తం 2 గంటల పాటు మంగళ ధ్వని కార్యక్రమం 06గం:55ని.. సోమవారం, జనవరి 22 వైద్య సేవలతో సహా.. రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం సర్వాంగ సుందరంగా అయోధ్య అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బహుళ అంచెల భద్రత కోసం వేల మంది పోలీసుల మోహరింపు ప్రతి వీధిలో బారికేడ్ల ఏర్పాటు రసాయన, బయో, రేడియోధార్మిక, అణు దాడులను ఎదుర్కొనేలా ఎన్డీఆర్ఎఫ్ బృందాల మోహరించింది భూకంప సహాయక బృందాల నియామకం ఎటువంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలు చలికాలం కావడంతో భక్తులకు, ఆహ్వానితులకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే చికిత్స అందించేలా బెడ్ల ఏర్పాటు ఎయిమ్స్ నుంచీ ప్రత్యేక వైద్య బృందాలు అయోధ్యలో ప్రధాని అయోధ్య షెడ్యూల్: 10గం:25ని అయోధ్య విమానాశ్రయానికి చేరిక 10గం:45ని అయోధ్య హెలిప్యాడ్కు చేరుకోవడం 10గం:55ని. శ్రీరామ జన్మభూమికి రాక.. ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు: రిజర్వ్ మధ్యాహ్నం 12:05 నుండి 12:55 వరకు: ప్రతిష్ఠాపన కార్యక్రమం.. మధ్యాహ్నం 12:55: పూజా స్థలం నుండి బయటకు మధ్యాహ్నం 1:00: బహిరంగ వేదిక వద్దకు చేరిక మధ్యాహ్నం 1:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు.. అయోధ్యలో పబ్లిక్ ఫంక్షన్కు హాజరు విశిష్ట సభను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ.. పలువురు మధ్యాహ్నం 2:10: కుబేర్ తిల దర్శనం 06గం:49ని.. సోమవారం, జనవరి 22 దేదీప్యమానంగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో.. సర్వాంగ సుందరంగా అయోధ్య రకరకాల పూలతో.. రంగు రంగుల విద్యుద్దీపాలతో రామమందిర అలంకరణ శ్రీరాముడి చిత్రాలతో పై వంతెనల వీధి దీపాల ఏర్పాటు విల్లంబుల కటౌట్ల ఏర్పాటు సంప్రదాయ రామానంది తిలక్ డిజైన్లతో దీపాలు మంచి ఘడియలు వచ్చాయి (శుభ్ ఘడీ ఆయీ), అయోధ్య ధామం తయారైంది (తయ్యార్ హై అయోధ్య ధామ్), శ్రీరాముడు ఆసీనులవుతారు (విరాజేంగే శ్రీరామ్), రాముడు మళ్లీ తిరిగొస్తారు (రామ్ ఫిర్ లౌటేంగే), అయోధ్యలో రామరాజ్యం వచ్చింది (అయోధ్యమే రామ్ రాజ్య) అనే స్లోగన్లు, నినాదాల పోస్టర్లు రామాయణంలోని పలు ఘట్టాలను పోస్టర్లపై చిత్రీకరణ రామ్ మార్గ్, సరయూ నది తీరం, లతా మంగేష్కర్ చౌక్లలో కటౌట్ల ఏర్పాటు అయోధ్య నగరమంతా రామ్ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు సరయూ తీరంలో ప్రతి రోజూ హారతి ఇచ్చే ఏర్పాట్లు What a goosebumps view from Mundra (Kutch, Gujarat)... No sanathan will pass without liking this ♥️ Jai shree ram 🛐#JaiShriRam #RamMandirPranPrathistha #ShriRam #AyodhyaRamMandir#RamLallaVirajman#RamMandir #RamLallaVirajman#WorldInAyodhya pic.twitter.com/48WssugiGv pic.twitter.com/DZhGfFXNWf — BRAKING NEWS 🤯 (@Jamesneeesham) January 22, 2024 06గం:45ని.. సోమవారం, జనవరి 22 పలు చోట్ల సెలవు అయోధ్య ఉత్సవం నేపథ్యంలో.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నేడు సెలవు ఒడిశాలోనూ సెలవు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు బ్యాంకులు, ఇన్సూరెన్సు కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకూ ఒక పూట సెలవు స్టాక్ మార్కెట్లు బంద్ పలు బీజేపీ యేతర రాష్ట్రాల్లోనూ స్కూళ్ల స్వచ్ఛంద సెలవు 06గం:42ని.. సోమవారం, జనవరి 22 నలుమూలల నుంచి భారీ కానుకలు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి కన్నౌజ్ నుంచి పరిమళాలు అమరావతి నుంచి 5 క్వింటాళ్ల కుంకుమ, ఢిల్లీ నుంచి నవ ధాన్యాలు, భోపాల్ నుంచి పూలు చింధ్వారా నుంచి 4.31 కోట్ల రామ నామాల ప్రతి అయోధ్యకు చేరిక సీతాదేవి కోసం ప్రత్యేకంగా గాజులు 108 అడుగుల అగర్బత్తి, 2,100 కిలోల గంట, 1,100 కిలోల దీపం, బంగారు పాదరక్షలు, 10 అడుగుల ఎత్తైన తాళం, ఒకేసారి 8 దేశాల సమయాలను సూచించే గడియారం రామ మందిరానికి బహుమతులు నేపాల్లోని సీతాదేవి జన్మ స్థలి నుంచి 3,000 బహుమతులు 06గం:40ని.. సోమవారం, జనవరి 22 భారీగా వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు అయోధ్య ఈవెంట్ కోసం 22,825 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం అయోధ్యలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసుల ఏర్పాట్లు 51 ప్రాంతాల్లో వాహనాలు నిలిపేందుకు ఏర్పాట్లు పూర్తి డ్రోన్లతో గస్తీ నిర్వహణ 06గం:34ని.. సోమవారం, జనవరి 22 ఏడు వేల మంది అతిథులు మతాలకతీతకంగా అయోధ్య వేల మంది గడ్డకట్టే చలిలోనూ దేశం నలుమూలల నుంచి పాదయాత్ర, సైకిళ్లపై, వాహనాలపై అయోధ్యకు చేరిక రామ మందిర ప్రారంభోత్సవానికి 7,000 మంది అతిథులకు ఆహ్వానం ఆహ్వానితుల్లో 506 మంది అత్యంత ప్రముఖులు రామ జన్మభూమి కోసం పోరాటం చేసిన వాళ్లకు ప్రత్యేక ఆహ్వానం సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులకూ ఆహ్వానం.. ఇప్పటికే చాలామంది అయోధ్యకు చేరిక ప్రతిపక్ష నేతలనూ ఆహ్వానించినా.. గైర్హాజరుకే మొగ్గు 06గం:28ని.. సోమవారం, జనవరి 22 రామ మందిర విశేషాలు.. రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ శుక్రవారం కళ్లకు వస్త్రంతో ఉన్న విగ్రహం బాహ్య ప్రపంచానికి దర్శనం ఆలయంలోకి తూర్పు ద్వారం నుంచి ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటకు రావాల్సి ఉంటుంది మూడు అంతస్థుల్లో ఆలయ నిర్మాణం ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి భక్తులు తూర్పువైపు నుంచి 32 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. ఆలయాన్ని సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు ఉంటుంది. 161 అడుగుల ఎత్తు ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తు.. మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు 06గం:22ని.. సోమవారం, జనవరి 22 ముహూర్తం ఎప్పుడంటే.. అభిజిల్లగ్నంలో బాలరాముడిని ప్రతిష్టించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగింపు ప్రాణ ప్రతిష్ఠకు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా పూజాది కార్యక్రమాలు 16వ తేదీన ప్రారంభం.. ఆదివారంతో ముగింపు 06గం:15ని.. సోమవారం, జనవరి 22 అంతా రామమయం రామ నామ స్మరణతో మారుమోగుతున్న భారత్ దేశ, విదేశాల్లోని ఆలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను వీక్షణ పవిత్రోత్సవం అనంతరం దేదీప్యోమానంగా అయోధ్య వాషింగ్టన్ డీసీ, పారిస్ నుంచి సిడ్నీదాకా అనేక ఆలయాల్లో ఓ పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ. దాదాపు 60 దేశాల్లో అయోధ్య ప్రాణప్రతిష్ట వేడుక కార్యక్రమాలు 06గం:12ని.. సోమవారం, జనవరి 22 అల అయోధ్యాపురములో.. అపురూప మందిరం నేడే ఆవిష్కృతం ఉత్తర ప్రదేశ్ అయోధ్య నగరంలో కొలువుదీరనున్న రామయ్య మధ్యాహ్నం 12.20 నుంచి 1 గంట మధ్య ముహూర్తం సర్వాంగ సుందరంగా నగరం ముస్తాబు ప్రాణ ప్రతిష్ఠ చేయనున్న ప్రధాని ఇప్పటికే చేరుకున్న ప్రముఖులు భారీ భద్రతా ఏర్పాట్లు రామ నామ స్మరణతో మార్మోగుతున్న ఊరూవాడా 06:00.. సోమవారం, జనవరి 22 తెలుగు రాష్ట్రాల నుంచి.. అయోధ్య రాముడికి తెలుగు రాష్ట్రాల నుంచి కానుకలు తిరుమల శ్రీవారి తరఫున లక్ష లడ్డూలు సిరిసిల్ల నుంచి సీతమమ్మకు చీర కానుక హైదరాబాద్ నుంచి 1265 కేజీల లడ్డూ హైదరాబాద్ నుంచి అయోధ్య రామయ్యకు ఎనిమిదడుగుల ముత్యాల గజమాల.. అందించనున్న చినజీయర్స్వామి -
అయోధ్యలో నూతనోదయం: యోగి ఆదిత్యానాథ్
జాసు బిరహ సోచహు దిన రాతీ! రటహు నిరంతర గున్ గన్ పాంతి!! రఘుకుల తిలక సుజన్ సుఖదాత! ఆయౌ కుసల్ దేవ ముని త్రాతా!! శతాబ్దాల నిరీక్షణకు, తరాల పోరాటానికి, మన పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞకు ముగింపు పలికే రోజు ఎట్టకేలకు వచ్చింది. సనాతన సంస్కృతికి ఆత్మ అయిన ‘రఘునందన్ రాఘవ్ రామ్లల్లా’ తన జన్మస్థలమైన అవధ్పురిలోని గొప్ప దైవిక ఆలయంలో ప్రతిష్ఠితమవుతున్నారు. 500 సంవత్సరాల విరామం తర్వాత జరుగు తున్న ఈ చరిత్రాత్మకమైన, పవిత్రమైన సందర్భం... భారతదేశాన్ని మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని ‘మోక్షదాయని’ అయోధ్యపై చూపు నిలిపేలా చేసింది. నేడు ప్రతి రహదారీ శ్రీరామ జన్మభూమికి దారి తీస్తుంది. ప్రతి కన్ను ఆనందబాష్పాలతో తడిసిపోతుంది. అందరూ ‘రామ్–రామ్’ అని జపిస్తారు. తరతరాలుగా విశ్వాసులు, లోకాన్ని విడిచిపెట్టిన రామభక్తులు ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూశారు. 2024 జనవరి 22 ప్రాముఖ్యత బాలరూప రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు మించినది. ఇది ప్రజల విశ్వాస పునఃస్థాపనను సూచిస్తుంది. అయోధ్య ఇప్పుడు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. సత్య న్యాయాల ఉమ్మడి విజయం చేదు జ్ఞాపకాలను చెరిపివేస్తుంది. కొత్త కథలను సృష్టిస్తుంది. సమాజంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది. ‘శ్రీరామ జన్మభూమి ముక్తి మహాయజ్ఞం’ అనేది కేవలం సనాతన విశ్వాసానికి పరీక్ష కాదు; ఇది విజయవంతంగా దేశ సామూహిక చైతన్యాన్ని మేల్కొల్పింది. భారత దేశాన్ని ఐక్యతా సూత్రంతో కలిపింది. రాముడి జన్మస్థలంలో ఆలయ నిర్మాణం కోసం జరిగిన పోరాటంలో ప్రదర్శించిన ప్రత్యేక ఐక్యత అసమానమైనది. సాధువులు, సన్యాసులు, మేధావులు, రాజకీయ నాయకులు మరియు అన్ని వర్గాల ప్రజలు విభేదాలకు అతీతంగా ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ఏకమయ్యారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ వంటి సామాజిక సాంస్కృతిక సంస్థలు రోడ్మ్యాప్ను రూపొందించి ప్రజలను ఏకం చేశాయి. ఆ తీర్మానం ఎట్టకేలకు నెర వేరింది. భారతదేశంలో కొత్త ఉషస్సు వెల్లివిరుస్తోంది. ఒకప్పుడు ‘అవని అమరావతి’ అనీ, ‘భూలోక వైకుంఠం’ అనీ పిలి చిన అయోధ్య శతాబ్దాల పాటు శాప గ్రస్తంగా ఉండిపోయింది. ‘రామ రాజ్యం’ ఒక ఆదర్శ భావనగా ఉన్న దేశంలోనే రాముడు తన ఉనికిని నిరూపించుకోవాల్సిన అగత్యం వచ్చింది. అతని జన్మస్థలానికి ఆధారాలు కావాల్సి వచ్చింది. కానీ శ్రీరాముని జీవితం మర్యాదగా ప్రవర్తించడం, స్వీయ నిగ్రహాన్ని పాటించడం నేర్పుతుంది. రాముని భక్తులు ఓర్పు, పట్టుదలను ప్రదర్శించారు. నేడు అయోధ్య తాను కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందడంతో యావత్ జాతి సంతోషిస్తోంది. ఈ సంకల్పాన్ని నెరవేర్చడానికి మార్గనిర్దేశం చేసినందుకు గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీకి హృదయపూర్వక అభినందనలు! 2024 జనవరి 22 వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషకరమైన సందర్భం. నేను ఈ ప్రయాణం గురించి తలపోస్తున్నప్పుడు, రామ జన్మభూమిని విముక్తం చేయాలన్న అచంచలమైన సంకల్ప క్షణాలు నా మనస్సును ముంచెత్తుతున్నాయి. ఈ సంకల్పమే నన్ను గౌరవనీయులైన గురుదేవ్ మహంత్ వైద్యనాథ్ జీ మహారాజ్ సద్గుణ సాంగత్యంలోకి నడిపించింది. విగ్రహ ప్రతిష్ఠాపన శుభ సందర్భంలో మా తాత బ్రహ్మలీన్ మహంత్ శ్రీ దిగ్విజయ్నాథ్ జీ మహారాజ్, గౌరవనీయులైన గురుదేవ్ బ్రహ్మలీన్ మహంత్ శ్రీ వైద్యనాథ్ జీ మహారాజ్తో పాటు ఇతర గౌరవనీయులైన సాధువులు భౌతికంగా లేరని నాకు తెలుసు. కానీ వారి ఆత్మలు కచ్చితంగా అపారమైన సంతృప్తిని అనుభవిస్తాయి. గౌరవనీయులైన నా గురువులు జీవితాంతం అంకితభావంతో చేసిన తీర్మానం నెరవేరడానికి సాక్షిగా నిలవడం నా అదృష్టం. శ్రీ రామ జన్మభూమి ఆలయంలో శ్రీరామ్లల్లా ప్రతిష్ఠాపన గురించి ప్రకటించినప్పటి నుండి, ప్రతి సనాతన విశ్వాసిలో నిరీక్షణ స్పష్టంగా కనిపించింది. ఇటీవలి శతాబ్దాలలోనే అసమానమైన సామూహిక ఆనంద వాతావరణం దేశమంతటా వ్యాపించింది. శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య, సిక్కు, బౌద్ధ, జైన, దశనామీ శంకర్, రామానంద, రామానుజ, నింబార్క, మధ్వ, విష్ణునామి, రామసనేహి, ఘీసాపంథ్, గరీబ్దాసి, అకాలీ, నిరంకారీ, గౌడీయ, కబీర్పంథ్ వంటి విభిన్న ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చెందిన వారు... అనేక సంఖ్యలో ఉన్న శాఖలు, ఆరాధన పద్ధతుల వారు... 150కి పైగా సంప్రదాయాలకు చెందిన సాధువులు... అటవీ – గిరి నివాసులు, గిరిజన సమూహాలు, వివిధ రంగాలకు చెందిన ప్రము ఖులు... రాజకీయాలు, సైన్స్, పరిశ్రమలు, క్రీడలు, కళలు, సంస్కృతి, సాహిత్య రంగాలవారు అందరూ ఒకే గొడుగు కిందకు చేరడం నిజంగా అపూర్వమైనది, అరుదైనది. ఈ మహత్తరమైన సందర్భం ఎంతో గర్వకారణం. ఉత్తరప్రదేశ్లోని 25 కోట్ల మంది ప్రజల తరఫున పవిత్ర అయోధ్యధామంలో ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం తరువాత, అయోధ్యధామం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు, పర్యా టకులకు, పరిశోధకులకు, జిజ్ఞాసువులకు సాదర స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. ప్రధాన మంత్రి దూరదృష్టితో కూడిన ప్రణాళికలకు అనుగుణంగా అయో«ధ్యాపురి కచ్చితమైన సన్నాహాలు చేస్తోంది. నగరం ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం, విస్తరించిన రైల్వే స్టేషన్, అన్ని దిశల నుండి కలుస్తున్న 4–6 లేన్ రోడ్లతో బాగా అనుసంధానించబడిన నెట్వర్క్ను కలిగి ఉంది. అదనంగా హెలిపోర్ట్ సేవ, సందర్శకుల విభిన్న అవసరాలను తీర్చడానికి అనుకూలమైన హోటళ్లు, అతిథి గృహాల శ్రేణి ఏర్పాటైనాయి. కొత్త అయోధ్యలో, పురాతన సంస్కృతి, నాగరికత పరిరక్షణ జరుగుతూనే అత్యాధునిక నగర సౌక ర్యాలు అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి తగినట్టుగా నిర్మాణం జరుగుతోంది. ఈ చొరవలో భాగంగా అయోధ్యలోని పంచకోసి, 14 కోసి, 84 కోసి పరిక్రమ పరిధిలోని మతపరమైన, పౌరాణిక. చారిత్రక ప్రదేశాలకు వేగవంతమైన పునరుజ్జీవనం కలిగించడం జరిగింది. ఈ సమష్టి ప్రయత్నాలు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు దోహదపడటమే కాకుండా పర్యాటకాన్ని పెంచడానికీ, ఈ ప్రాంతంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడానికీ ఉపయోగపడతాయి. శ్రీరామ జన్మభూమి ఆలయ స్థాపన ఒక లోతైన ఆధ్యాత్మిక వేడుకగా నిలుస్తుంది. ఇది భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి సూచిక. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది జాతీయ దేవాలయం. శ్రీరామ్లలా పవిత్రోత్సవం యావత్ జాతి జనుల హృదయాన్ని గర్వంతో ఉప్పొంగించే ఒక ముఖ్యమైన సందర్భం. రాముడి దయతో, అయోధ్య సంప్రదాయ పరిక్రమ పవిత్రత ఇప్పుడు సురక్షితంగా ఉంటుంది. ఎటువంటి ఆటంకాలూ దాని పవిత్ర మార్గాన్ని నాశనం చేయలేవు. అయోధ్య వీధులలో ఇక బుల్లెట్లు ప్రతి ధ్వనించవు, సరయూ నది రక్తపు మరకను భరించదు, కర్ఫ్యూ విధ్వంసం జరగదు. బదులుగా ఆనందో త్సవ వేడుకలు జరుపుకొంటూ, రామనామ సంకీర్తనలతో ప్రతిధ్వనిస్తుంది. అవధ్పురిలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ భారతదేశంలో రామరాజ్య స్థాపన తాలూకు ప్రకటనను తెలియజేస్తుంది. ఇది ఆదర్శానికి స్వరూపం. ఇక్కడ ‘సబ్ నర్ కరహీ పరస్పర ప్రీతి చలహీ స్వధర్మం నిరత శుతి నీతి’ అవుతుంది. శ్రీ రామ జన్మభూమి ఆలయంలో ప్రతిష్ఠించనున్న బాలరూప రాముని విగ్రహం మార్గదర్శక కాంతిగా పనిచేస్తుంది. ప్రతి సనాతన విశ్వాసి తన మతపరమైన సూత్రాలను అనుసరించడానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ శుభ సందర్భంగా 140 కోట్ల మంది తోటి పౌరులకు అభినందనలు! మన పూర్వీకులు నెలకొల్పుతామని గంభీరంగా ప్రమాణం చేసిన ఆలయాన్ని నిర్మించాలనే నిబద్ధత నెరవేరడం చూసి మనం ఎనలేని సంతృప్తిని పొందుదాం. భగవంతుడు శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలి. శ్రీ రామః శరణం మమ జయ–జయ శ్రీసీతారామ్! యోగి ఆదిత్యనాథ్ వ్యాసకర్త ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి -
అయోధ్యకు యూపీ ప్రభుత్వ విరాళమెంత?
22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపధ్యంలో దేశమంతటా రామనామం మారుమోగిపోతోంది. ఇదే సమయంలో రామాలయానికి యూపీ ప్రభుత్వం ఇచ్చిన విరాళంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యూపీ ప్రభుత్వ విరాళాలకు సంబంధించి ఒక వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో యోగి ఆదిత్యనాథ్.. ‘కరసేవకులు ఎన్నో త్యాగాలు చేశారు. దీనికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మార్గదర్శకత్వం, విశ్వ హిందూ పరిషత్ నాయకత్వం, సాధువుల నుండి ఆశీర్వాదాలు తోడుగా నిలిచాయి. కరసేవకుల ఉద్యమం కారణంగానే రామజన్మభూమిలో రామాలయ నిర్మాణం జరుగుతోంది. దీనికి యూపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు అందించలేదు. నిర్మాణం కోసం వెచ్చిస్తున్న సొమ్ము దేశంతో పాటు ప్రపంచం నలుమూలల ఉన్న రామభక్తులు అందించారు’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనానికి ఏం చేయాలి? అయితే యూపీ ప్రభుత్వం ఏయే పనులకు నిధులు వెచ్చిస్తున్నదో సీఎం యోగి తెలిపారు. రామ మందిరం వెలుపల రైల్వే స్టేషన్, విమానాశ్రయ నిర్మాణం, గెస్ట్ హౌస్ నిర్మాణం, క్రూయిజ్ సర్వీస్, రోడ్డు విస్తరణ, పార్కింగ్ సౌకర్యాల కోసం ప్రభుత్వం నిధులు అందిస్తున్నదని పేర్కొన్నారు. ఈ పనులన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. దేశం నలుమూలల నుండి రామాలయానికి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. ఆలయానికి కానుకలు కూడా భారీగానే వస్తున్నాయి. రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు విరాళంగా భక్తులు అందజేస్తున్నారు. నెల మొత్తం మీద చూసుకుంటే రూ.1.5 నుంచి రూ.2 కోట్ల వరకూ నిధులు అందుతున్నాయి. అయితే ఆన్లైన్ విరాళాల విరాళాల లెక్కింపు ఇంకా జరగలేదని సమాచారం. एक पाई सरकार ने नहीं दी है, न केंद्र की सरकार ने, न राज्य की सरकार ने, मंदिर के किसी काम में नहीं! ये सारा पैसा रामभक्तों ने देश भर से दिया है, दुनिया भर से दिया है... pic.twitter.com/m6DOFSdI4t — Yogi Adityanath (@myogiadityanath) January 17, 2024 -
విమానమెక్కి.. శ్రీరాముణ్ణి మొక్కి!
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంబోత్సవానికి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో గర్భగుడిలో రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా రామ భక్తులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఆహ్వానాలు వెళ్లాయి. దీంతో అయోధ్యకు వెళ్లే హెలికాప్టర్, చార్టర్డ్ విమానాలకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ఈనెల 22న అయోధ్య విమానాశ్రయంలో 100 చార్టర్డ్ విమానాలు దిగుతాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తెలిపారు. లక్షమందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా. ఇప్పటికే క్యాబ్లు, రైళ్లు ఫుల్ ఇప్పటికే జనవరి 22 నాటికి రైల్వే టికెట్ బుకింగ్లు 60 శాతం మేర పెరిగాయి. అలాగే అయోధ్యలో క్యాబ్ ఆపరేటర్ల బుకింగ్లు 50 శాతం పెరుగుతాయని ట్రావెల్ పోర్టళ్ల అంచనా. ఇండిగో, స్పైస్జెట్, ఎయిర్ ఇండియా విమానయాన సంస్థలు డిసెంబర్ 30 నుంచి దేశంలోని ప్రధాన మెట్రో నగరాల నుంచి అయోధ్యకు సాధారణ విమాన సేవలను ప్రారంభించాయి. ప్రస్తుతం అయోధ్యకు రోజుకు నాలుగు విమాన సర్విస్లు నడుస్తున్నాయని, రాబోయే రోజుల్లో ఇది 20–24కు పెరుగుతుందని అయోధ్య విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే చార్టర్డ్ ఫ్లయిట్ ఆపరేటర్ల నుంచి 42 ఎంక్వయిరీలు వచ్చినట్లు చెప్పాయి. అయోధ్య విమానాశ్రయంలో విమానాల కోసం తగినంత పార్కింగ్ స్థలం లేకపోవడంతో ఈనెల 22న ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్ సంస్థలు ప్రయాణికులను పికప్, డ్రాప్ మాత్రమే చేయాలని, విమానాలను లక్నో, వారణాసి, ఖుషీనగర్, పాటా్న, ఢిల్లీ వంటి పొరుగు విమానాశ్రయాల్లో పార్కింగ్ చేయాలని సూచించారు. మెట్రో నగరాల నుంచి డిమాండ్ మిలియన్ ఎయిర్, క్లబ్ వన్ ఎయిర్, ఎంఏబీ ఏవియేషన్, జెట్సెట్గో వంటి ప్రైవేట్ చార్టర్డ్ విమాన సంస్థలు అయోధ్యకు విమాన సేవలను అందిస్తున్నాయి. ఈ ఏడాది చార్టర్డ్ ఫ్లయిట్లు, హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగిందని ఎయిర్ చార్టర్డ్ సంస్థ క్లబ్ వన్ ఎయిర్ సీఈఓ రాజన్ మెహ్రా తెలిపారు. తెలంగాణ, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు, అహ్మదాబాద్లో వైబ్రంట్ గుజరాత్ ఇన్వెస్టర్ సమిట్లతో ప్రైవేట్ చార్టర్డ్ ఆపరేటర్లకు గిరాకీ పెరిగిందని తెలిపారు. తాజాగా రామమందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యకమంతో చార్టర్డ్ ఫ్లయిట్ల కోసం ఎంక్వయిరీలు వస్తున్నాయన్నారు. ఇప్పటికే 12 సీట్ల జెట్ ఫాల్కన్ 2000 బుక్ అయిందని చెప్పారు. ఆలయ ప్రారంభోత్సవం రోజున చార్టర్డ్ విమానాల కోసం 25 ఎంక్వయిరీలు వచ్చాయని మరో ఎయిర్క్రాఫ్ట్ సంస్థ ప్రతినిధి తెలిపారు. హైదరాబాద్తోపాటు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, పుణే, నాగ్పూర్ వంటి మెట్రో నగరాల నుంచి అభ్యర్థనలు వచ్చాయని చెప్పారు. సీటింగ్ను బట్టి చార్జీలు విమానం సైజు, సీటింగ్ సామర్థ్యాన్ని బట్టి ఈ మార్గంలో ధర రూ.10–20 లక్షలు ఉంటుందని ప్రైవేట్ ఎయిర్క్రాప్ట్ కంపెనీలు తెలిపాయి. అయితే చలికాలం నేపథ్యంలో పొగమంచు, తక్కువ విజిబిలిటీ కారణంగా అయోధ్యకు విమాన సర్విసులు సవాలేనని, దీంతో అయోధ్యకు ప్రైవేట్ చార్టర్డ్ ఎయిర్క్రాఫ్ట్ల అనుమతులపై విమానాశ్రయ వర్గాల నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉందని తెలిపాయి. ప్రస్తుతం అయోధ్య విమానాశ్రయం రోజుకు 6 గంటలు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈనెల 22న ఆలయ ప్రారంబోత్సవం రోజున మాత్రం 24 గంటలు తెరిచి ఉండేలా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాట్లు చేస్తోంది. -
జనవరి 22న ఉత్తర ప్రదేశ్లో విద్యాసంస్థలకు సెలవు
లక్నో: జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెలవు ప్రకటించారు. ఈనెల 22నన అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం దృష్టా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రామజన్మభూమి ఆలయంలో శ్రీరామ్లల్లా 'ప్రాణ-ప్రతిష్ఠ' కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను సీఎం ఆదిత్యనాథ్ పరిశీలించారు. అదే విధంగా జనవరి 22న రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని సీఎం తెలిపారు. ఆ రోజు అన్ని ప్రభుత్వ భవనాలను సుందరంగా అలంకరించాలని, బాణాసంచా కాల్చి వేడుకలు జరుపుకోవాలని సీఎం ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. కాగా అయోధ్యలో జనవరి 22న నూతన రామాలయ ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఘనమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి నాలుగు వేల మంది సాధువులను, 2,200 మంది ఇతర అతిథులను ఆహ్వానించారు. కాశీ విశ్వనాథుని ఆలయం, మాతా వైష్ణో దేవి ఆలయ ప్రతినిధులు, ఇస్రో శాస్త్రవేత్తల పేర్లు ఆహ్వానితుల జాబితాలో ఉన్నాయి. సినీ పరిశ్రమ, వ్యాపార, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపారు. చదవండి: మాల్దీవుల వివాదం.. ప్రధాని మోదీకి మద్దతుగా శరద్ పవార్ -
యోగి ఆదిత్యనాథ్కు బాంబు బెదిరింపులు .. ఇద్దరి అరెస్టు
లక్నో: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అయోధ్య రామాలయంలపై బాంబు బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బాంబులు వేసి యోగి ఆదిత్యనాథ్, అయోధ్యలోని రామాలయాన్ని పేల్చివేస్తామని బెదిరిస్తూ సోషల్ మీడియాలో నిందితులు పోస్ట్ చేశారని అధికారులు తెలిపారు. నిందితులను తాహర్ సింగ్, ఓంప్రకాష్ మిశ్రాలుగా యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) బృందం గుర్తించింది. నిందితులు లక్నోలో విభూతి ఖండ్ ప్రాంతానికి చెందినవారని వెల్లడించారు. ఆదిత్యనాథ్, ఎస్టీఎఫ్ చీఫ్ అమితాబ్ యాష్, అయోధ్యలోని రామమందిరాన్ని పేల్చేస్తామని బెదిరించారని పోలీసులు గుర్తించారు. బెదిరింపు పోస్టుల్లో నిందితులకు సంబంధించిన ఈమెయిల్ ఐడీలు ఉన్నట్లు తేలింది. ఈమెయిల్ ఐడీల సాంకేతిక విశ్లేషణ తర్వాత తాహర్ సింగ్ ఈమెయిల్ ఖాతాలను సృష్టించారని, ఓంప్రకాశ్ మిశ్రా బెదిరింపు సందేశాలు పంపారని తేలింది. నిందితులు ఇద్దరూ గోండా నివాసితులు. పారామెడికల్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ కేసును ఎస్టీఎఫ్ మరింత లోతుగా విచారిస్తోంది. నిందితులే ఈ చర్యకు పాల్పడ్డారా? లేక దీని వెనక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇదీ చదవండి: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్? ఆప్ నేతలు అలర్ట్!
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement