-
బియ్యపు గింజపై ‘ఓటు వేయండి’!
దేశంలో లోకసభ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జరుగున్నాయి. వివిధ పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారాలు సాగిస్తున్నారు. అయితే జనం చేతిలో ఓటు అనే అయుధం ఉంది. దీనితో వారు తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోగలుగుతారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ఎన్నికల సంఘం ఓటు హక్కు గురించి ప్రచారం చేస్తుంటుంది. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఒక హస్త కళాకారిణి వినూత్న రీతిలో ఓటు హక్కుకున్న ప్రాముఖ్యత తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. జైపూర్లోని సాంగనేర్ నివాసి నీరూ చాబ్రా ప్రజలకు ఓటుహక్కు ప్రాముఖ్యతను తెలియజేయాలని భావించారు. ఇందుకోసం ఆమె బియ్యపుగింజలపై ‘ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి’ అంటూ రాశారు. ఆమె బియ్యపు గింజపై భారత మ్యాప్ను సూక్ష్మ శైలిలో గీయడంతోపాటు ఎన్నికల స్లోగన్ కూడా రాశారు. ఈ సందర్భంగా నీరూ చాబ్రా మీడియాతో మాట్లాడుతూ 1984 నుంచి తాను బియ్యపు గింజపై సూక్ష్మ అక్షరాలు రాయడాన్ని కొనసాగిస్తున్నానని, కిచెన్లో వంట చేసేటప్పుడు తనకు ఈ ఐడియా వచ్చిందని తెలిపారు. మెల్లమెల్లగా ఈ కళలో ప్రావీణ్యం సంపాదించానని అన్నారు. కాగా నీరూ బియ్యపు గింజపై 108 అక్షరాలు రాసి రికార్డు సృష్టించారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు నీరూ చాబ్రా ప్రతిభను గతంలో మెచ్చుకున్నారు. -
సంజూ శాంసన్కు భారీ షాక్
IPL 2024 GT vs RR: ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్కు మరో భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ నిర్వాహకులు అతడికి రూ. 12 లక్షల మేర జరిమానా విధించారు. కాగా సొంత మైదానం జైపూర్లో రాజస్తాన్ బుధవారం గుజరాత్ టైటాన్స్తో తలపడిన విషయం తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆఖరి బంతికి గుజరాత్ టైటాన్స్ స్టార్ రషీద్ ఖాన్ ఫోర్ బాది తమ జట్టును గెలిపించాడు. ఫలితంగా ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసిన రాజస్తాన్ రాయల్స్ విజయపరంపరకు బ్రేక్ పడింది. అయితే, ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో రాజస్తాన్ చేజేతులా మ్యాచ్ను చేజార్చుకుంది. The elegance of the Prince 🤌#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EzGEcv6Pk9 — JioCinema (@JioCinema) April 10, 2024 ఓవర్ రేటు విషయంలో నిర్దిష్ట సమయానికి ఐదు నిమిషాలు వెనుకబడి ఉండటంతో చివరి ఓవర్లో సర్కిల్ బయట ఓ ఫీల్డర్ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది. ఫలితంగా స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలిగిన గుజరాత్ బ్యాటర్లు విజయానికి బాటలు వేసి.. పని పూర్తి చేశారు. 𝘾𝙧𝙞𝙨𝙞𝙨 𝙈𝙖𝙣 delivered yet again 😎 🎥 Relive the thrilling end to a thrilling @gujarat_titans win! Recap the match on @starsportsindia & @Jiocinema 💻 📱#TATAIPL | #RRvGT pic.twitter.com/eXDDvpToZ0 — IndianPremierLeague (@IPL) April 10, 2024 ఇక స్లో ఓవర్ రేటు కారణంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్కు పనిష్మెంట్ ఇచ్చారు ఐపీఎల్ నిర్వాహకులు. ‘‘ఐపీఎల్-2024లో జైపూర్లోని సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్కు జరినామా విధిస్తున్నాం’’ అంటూ రూ. 12 లక్షలు ఫైన్ వేసింది. ఇది మొదటి తప్పిదం కావున ఈ మొత్తంతో సరిపెడుతున్నట్లు వెల్లడించింది. కాగా ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ ఒకసారి(రూ. 12 లక్షలు), ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ రెండుసార్లు(24 లక్షలు, తుదిజట్టులోని ఆటగాళ్ల ఫీజులో 25 శాతం/ఆరు లక్షలు) జరిమానా బారిన పడ్డారు. చదవండి: #ShubmanGill: కొరకరాని కొయ్యలా సంజూ.. అంపైర్తో గొడవపడ్డ గిల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘ఖర్గే పొరపాటున మాట్లాడినా.. అది నిజమే!’: జైరాం రమేష్
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంలోని 371వ ఆర్టికల్ను మార్చాలన్న మోదీ-షా గేమ్ ప్లాన్ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అనుకోకుండా బయటపెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. అయితే ఖర్గే 370 ఆర్టికల్ అనాల్సింది.. పొరపాటున ఆర్టికల్ 371 అన్నారని తెలిపారు.అయినప్పటికీ మోదీ- షా అసలు గేమ్ ప్లాన్ బయటపడిందని జైరాం రమేష్ అన్నారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే విరుచుకుపడ్డారు. కానీ నిజం ఏమిటంటే.. నాగాలాండ్కు సంబంధించిన ఆర్టికల్ 371-ఎ, అస్సాంకు చెందిన ఆర్టికల్ 371-బి, మణిపూర్కు సంబంధించిన ఆర్టికల్ 371-సి, సిక్కింకు చెందిన ఆర్టికల్ 371-ఎఫ్, మిజోరామ్కు సంబంధించిన ఆర్టికల్ 371-జిని మోదీ-షా మార్చాలనుకుంటున్నారని ఆరోపణలు చేశారు. అదేవిధంగా ఆర్టికల్ 371-హెచ్ అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించిందని జైరాం రమేష్ అన్నారు. ఆర్టికల్ 371జే పూర్వపు హైరాబాద్-కర్ణాటక ప్రాంతానికి సంబంధించిందని ఆయన గుర్తు చేశారు. Today by a slip of the tongue in his speech in Jaipur, @INCIndia President Mallikarjun Kharge ji mistakenly said that Modi claims credit for abolishing Article 371. Kharge ji clearly meant Article 370. Amit Shah immediately pounced on the Congress President. But the truth is… — Jairam Ramesh (@Jairam_Ramesh) April 6, 2024 అనుకోకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 371పై మోదీ-షా ప్లాన్ను బయటపెట్టడంతో ఆయన వ్యాఖ్యలపై ఒక్కసారిగా అమిత్ షా ఆందోళన పడ్డారని అన్నారు. అందుకే అమిత్ షా.. ఖర్గే మాటలను ఆర్టికల్ 370కి ముడిపెడుతున్నారని జైరాం రమేష్ మండిపడ్డారు. It is shameful to hear that the Congress party is asking, "Kashmir se kya waasta hai?" I would like to remind the Congress party that J&K is an integral part of India, and every state and citizen has the right over J&K, just as the people of J&K have the right over the rest of… pic.twitter.com/cFeO80XBxl — Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) April 6, 2024 మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై హోం మంత్రి అమిత్ షా స్పందించి కౌంటర్ ఇచ్చారు. ‘కాంగ్రెస్ నేతలు చేస్తున్న పొరపాట్లు దశాబ్దాలుగా మన దేశాన్ని వెంటాడుతున్నాయి. ఇటాలియన్ సంస్కృతి కారణంగా ప్రతిపక్ష పార్టీ.. భరత దేశాన్ని సరిగా అర్థం చేసుకోలేదు’ అని అమిత్ షా మండిపడ్డారు. ఖర్గే ఏమన్నారంటే... మల్లికార్జున్ ఖర్గే రాజస్థాన్లోని జైపూర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించి సభలో మోదీ-షాపై విరుచుకుపడ్డారు. ‘బీజేపీ వాళ్లు రాజస్తాన్ వచ్చి ఆర్టికల్ 371ను రద్దు చేశామని చెబుతున్నారు. ఇక్కడి ప్రజలకు అసలు దానితో సంబంధం ఏమిటీ?. జమ్ము కశ్మీర్కు వెళ్లి అక్కడి ప్రజలకు దానికి గురించి మాట్లాడితే బాగుంటుంది’ అని ఖర్గే అన్నారు. -
Lok sabha elections 2024: దేశ గౌరవం ధ్వంసం: సోనియా
జైపూర్: దేశ గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఆరోపించారు. కుట్రలు కుతంత్రాలు, బెదిరింపులతో ప్రతిపక్ష నాయకులను బీజేపీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. శనివారం రాజస్తాన్లోని జైపూర్లో ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. గత పదేళ్ల ఎన్డీయే పాలనలో ఒరిగిందేమీ లేదని అన్నారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. నేడు దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో చిక్కుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు విధ్వంసానికి గురవుతున్నాయని తెలిపారు. ఎన్డీయే పాలనలో రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంకుశ పాలనలను సహించే ప్రసక్తే లేదని, తగిన బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ దేశం ఏ ఒక్కరి సొత్తు కాదని, ఇది ప్రజలందరికీ చెందుతుందని పేర్కొన్నారు. ‘గ్యారంటీ’ని దొంగిలించిన మోదీ: ఖర్గే అబద్ధాల నాయకుడు నరేంద్ర మోదీ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘గ్యారంటీ’ అనే పదాన్ని కాంగ్రెస్ నుంచి మోదీ దొంగిలించారని చెప్పారు. అవినీతిపరులు బీజేపీలో చేరగానే పరిశుద్ధులుగా మారిపోతున్నారని ప్రియాంకాగాంధీ వాద్రా ఎద్దేవా చేశారు. -
వైద్యుల నిర్లక్ష్యం : ఆసుపత్రి గేటు వద్దే ప్రసవం, చివరికి!
జైపూర్: నవమాసాలు నిండిన నిండు గర్భిణిని కుటుబ సభ్యులు కాన్పు కోసం ఆస్పత్రికి తీసుకొస్తే వైద్యులు పట్టించుకోలేదు. అడ్మిషన్కు నిరాకరించారు. దీంతో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆమె ఆసుపత్రి గేటువద్దే బిడ్డను ప్రసవించిన ఘటన ఆందోళన రేపింది. రాజస్థాన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గర్భిణీ స్త్రీకి అడ్మిషన్ నిరాకరించి,నిర్లక్ష్యంగా వ్యవహరించి వైద్యులపై రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముగ్గురు రెసిడెంట్ వైద్యులను సస్పెండ్ చేసినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిన వైద్యులు కుసుమ్ సైనీ, నేహా రాజావత్, మనోజ్ను సస్పెండ్ చేశామని వైద్య విద్య అదనపు ముఖ్య కార్యదర్శి శుభ్రా సింగ్ వెల్లడించారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే, తక్షణమే విచారణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. సరిగ్గా పర్యవేక్షించని కారణంగా కన్వాటియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. రాజేంద్ర సింగ్ తన్వర్కు షోకాజ్ నోటీసు కూడా జారీ చేశామన్నారు. -
ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె స్టయిలే వేరు; రూ. 50వేలనుంచి 35కోట్ల దాకా
పురుషులతో తామేమీ తక్కువ కాదంటూ చిన్నవయసులో మహిళా పారిశ్రామికవేత్తలుగా పలువురు యువతులు ముందుకు వస్తున్నారు. తమ అభిరుచికి తగ్గట్టు, ఆధునిక శైలిని అవగాహన చేసుకుంటూ వ్యాపారంలో రాణిస్తున్న వారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో దుస్తుల బ్రాండ్తో కోట్లు సంపాదిస్తున్న పరి పూనమ్ చౌదరి ఒకరు. ఆమె సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం! ఫ్యాషన్ పరిశ్రమ ఎప్పుడూ డైనమిక్గా ఉండాలి. వినియోగదారుల ప్రాధాన్యతలే మార్కెట్కు ప్రాణం. యుక్తవయసులో ఉన్నప్పటినుంచి పరికి మహిళలను ఆకట్టుకునే ఫ్యాషన్, అందమైన దుస్తులను తయారు చేయడం అంటే ఇష్టం. 13 ఏళ్లకు సొంతంగా తనకుంటూ ఒక బ్రాండ్ఉండాలనే ఆలోచన మొదలైంది. ఆ పట్టుదలే 23 ఏళ్లకే దేశంలోనే అత్యంత ప్రియమైన దుస్తుల బ్రాండ్ బునాయ్కు నాంది పలికింది. సొంత వ్యాపారాన్ని ప్రారంభించి, అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ రాణిస్తోంది. బునాయ్ ఏర్పాటు, సక్సెస్ సుమారు 5-6 సంవత్సరాలు ఇతర సంస్థలకు పనిచేసినఅనుభవంతో 2016లో పరి చౌదరి కేవలం ముగ్గురితో కలిసి బునాయ్ని లాంచ్ చేసింది. అప్పటినుంచి ఆ టీమ్ అలా పెరుగుతూ వందలాదిమందికి చేరింది. కేవలం 50 వేల పెట్టుబడితో కుర్తా సెట్లు, లెహంగాలు లాంటివాటితో వ్యాపారాన్ని మొదలు పెట్టింది. రాజస్థానీ, జైపూర్, డిజైన్స్, చందేరి నుండి ఎంబ్రాయిడరీ దాకా వివిధ రకాల ఫ్యాబ్రిక్లను అందిస్తూ, బునాయ్ నైట్వేర్, ఇతర యాక్సెసరీస్, జ్యెయల్లరీని జోడించింది. హ్యాండ్-బ్లాక్ ప్రింటెడ్, హ్యాండ్-డైడ్, హ్యాండ్పెయింటెడ్, ఆకర్షణీయంగా అందమైన డిజైన్లు, సిగ్నేచర్ స్టైల్ కలర్స్, కాటన్ ఫ్యాబ్రిక్ ఇలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఆదరణ పొందింది. ఆధునిక శైలి, సంప్రదాయకళను మిళితం చేస్తూ స్టైలిష్ ఫ్యాషన్ ప్రపంచంలో బునాయ్ను పరుగులు పెట్టిస్తోంది. అంతేనా క్లాసిక్ బట్టల నుండి హెయిర్, స్టైలిష్ హోమ్ డెకార్ దాకా మంచి నాణ్యత ,స్టైల్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ‘బునాయ్’ వినపడేలా చేసింది. 2021లో 12 కోట్టుగా ఉన్న బునాయ్ ఆదాయం కాస్త 2022లో 35 కోట్లకు పెరిగిందంటేనే ఈ బ్రాండ్కు లభించిన ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఇండోర్, జైపూర్లో రెండు స్టోర్లను కూడా ప్రారంభించారుబునాయ్ 800 విభిన్న ఉత్పత్తులతో దాదాపు 90K కస్టమర్ల బేస్తో రాణిస్తోంది. సోనాక్షి సిన్హా, భూమి పెడ్నేకర్, శివలీకా ఒబెరాయ్, రిధి డోగ్రా, దివ్యాంక త్రిపాఠి లాంటి ప్రముఖులు బునాయ్ స్టైల్స్ ఫ్యాన్స్. అంతేకాదు అనేక బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ , బిజినెస్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది పరి చైదరి. స్థానిక కళాకారులచేత,రాజస్థానీ సంస్కృతి మూలాలతో ముడిపడి ఉన్న ప్రాంతాల ద్వారా ఉత్తమంగా తయారు చేస్తాం. అన్నీ ఉత్పత్తులు ప్రేమతో చేతితో తయారు చేసినవే. మెటీరియల్ నాణ్యతలో కూడా రాజీలేదు. ఫెయిర్ట్రేడ్, హెరిటేజ్, మేడ్ ఇన్ ఇండియా,సుస్థిరత ,మహిళా సాధికారత ఇవే తమ కంపెనీ బలం - పరి పూనం చౌదరి పరి చౌదరి విద్య పరి జైపూర్లోని నీర్జా మోడీ స్కూల్లో తన పాఠశాల విద్యను, ఆ తరువాత, IIS విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందింది. ఫ్యాషన్/అప్పరల్ డిజైన్ చ విజువల్ ఆర్ట్స్ & స్టిల్ ఫోటోగ్రఫీలో నైపుణ్యం సాధించింది. 2019లో ఉన్నత చదువుల కోసం యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్ లండన్కు వెళ్లింది. ఇక్కడే ఈమె వ్యాపార ఆలోచనలకు మరింత పదును ఏర్పడింది. లగ్జరీ బ్రాండ్లకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, ఫ్యాషన్ మీడియా స్టైలింగ్ , ఫ్యాషన్ కొనుగోలు మరియు అమ్మకాలపై దృష్టి సారించింది. బునాయ్ ప్రారంభించే ముందు దాదాపు 3 సంవత్సరాలు అర్బన్ విమెన్ కంపెనీలో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా పనిచేసింది. ఫ్యాషన్ ప్రపంచంలో తన అనుభవం ఇతరులకు ఉపయోగపడాలని, ప్రతిభ , వాస్తవికత మధ్య అంతరాన్ని తగ్గించడంలో సహాయపడాలని కోరుకుంటోంది. -
‘జైపూర్ డైలాగ్స్’తో సంబంధం లేదు..సునీల్ శర్మ వివరణ
జైపూర్: లోక్సభ ఎన్నికలు సమీస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే గురువారం విడుదల చేసిన మూడో జాబితాలో రాజస్థాన్లోని జైపూర్ నియోజకవర్గంలో సునీల్ శర్మకు అవకాశం కల్పించింది కాంగ్రెస్. అయితే బీజేపీకి సంబంధించిన ఓ యూట్యూబ్ ఛానెల్తో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు ఉన్న సునీల్ శర్మకు కీలకమైన జైపూర్ స్థానాన్నికేటాయించటం చర్చనీయాంశం అయింది. తరచూ కాంగ్రెస్పై విమర్శలు చేసే.. బీజేపీ అనుకూలమైన వార్తలు ప్రసారం చేసే ‘జైపూర్ డైలాగ్స్ యూట్యూబ్ ఛానెల్ను ఆయన 2016లో మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంజయ్ దిక్షిత్తో కలిసి ప్రారంభించారని ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సునీల్ శర్మ జైపూర్ అభ్యర్థిత్వంపై పునరాలోచించాలని కోరుతున్నారు. I am in no way related to the Jaipur dialogues YouTube channel or Twitter handle. This is completely fake news and false propaganda being floated to diminish the prospects of the Congress Party. — Sunil Sharma (@I_SunilSharma) March 23, 2024 ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై సునీల్ శర్మ స్వయంగా స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ‘నాకు జైపూర్ డైలాగ్స్ యూట్యూబ్ ఛానెల్ లేదా ట్విటర్ హాండిల్తో ఎటువంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీని అపహాస్యం చేయడానికి వ్యాప్తి చేస్తున్న తప్పుడు వార్తలు, అసత్య ప్రచారం’ అని సునీల్ శర్మ ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చారు. ‘నాకు జైపూర్ డైలాగ్స్ యూట్యూబ్ ఛానెల్తో ఎటువంటి సంబంధాలు లేవు. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు, భావాలు తెలియజేయటం కోసం నేను టీవీ, యూట్యూట్ ఛానెల్స్ ఆహ్వానిస్తే వెళ్తుంటాను. అదే విధంగా జైపూర్ డైలాగ్స్ కూడా సామాజిక సమస్యలపై కాంగ్రెస్ పార్టీ విజన్ గురించి మాట్లాడటానికి నన్ను ఆహ్వానించింది. నేను మతం పేరుతో జరిగే ఉన్మాదాన్ని బలంగా వ్యతిరేకిస్తాను’ అని సునీల్ శర్మ అన్నారు. జైపూర్ డైలాగ్స్కు సునీల్ శర్మ డైరెక్టర్ అంటూ.. సోషల్ మీడియా ప్రచారం జరుగుతోందని అది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వదంతులు సృష్టిస్తున్నారని తెలిపారు. -
జైపూర్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు..
రాజస్థాన్లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై, విమానాశ్రయాన్నంతా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభ్యంకాలేదు. రెండు గంటల తనిఖీ అనంతరం విమానాశ్రయ ప్రాంగణంలో అభ్యంతరకర వస్తువేదీ కనిపించకపోవడంతో భద్రతా సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం జైపూర్ ఎయిర్పోర్ట్ అధికారిక ఐడీకి ‘డాన్ ఆఫ్ ఇండియా’ అనే ఐడీ నుండి శుక్రవారం ఈ-మెయిల్లో బెదిరింపు వచ్చింది. వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బందితో పాటు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్(బీడీఎస్) తనిఖీలు చేపట్టింది. ఈ బెదిరింపు మెయిల్ గురించి ఎయిర్పోర్ట్ ఎస్హెచ్ఓ మమతా మీనా మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులకు ఈ సమాచారం అందించామన్నారు. ఈ నేపధ్యంలో బీడీఎస్, సీఐఎస్ఎఫ్, డాగ్ స్క్వాడ్ బృందం విమానాశ్రయంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. సుమారు 2 గంటల పాటు జరిగిన సెర్చ్ ఆపరేషన్లో ఎయిర్పోర్టులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఇంతకు ముందు డిసెంబర్ 27న జైపూర్ సహా పలు విమానాశ్రయాలపై బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి. అయితే తనిఖీలలో ఎటువంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. -
Prime Minister Narendra Modi: విష వలయంలో కాంగ్రెస్
జైపూర్/రేవాడీ: కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ పార్టీ బంధుప్రీతి, వారసత్వ రాజకీయాల విష వలయంలో చిక్కుకుందని, అందుకే నాయకులంతా బయటకు వెళ్లిపోతున్నారని చెప్పారు. తనను వ్యతిరేకించడమే కాంగ్రెస్ ఏకైక అజెండాగా మారిపోయిందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్కు దశ, దిశ లేవు. భవిష్యత్తులో చేయాల్సిన అభివృద్ది పట్ల విజన్, రోడ్డు మ్యాప్ లేవు’’ అన్నారు. శుక్రవారం జైపూర్లో ‘వికసిత్ భారత్, వికసిత్ రాజస్తాన్’ సభనుద్దేశించి మోదీ వర్చువల్గా ప్రసంగించారు. రోడ్లు, రైల్వేలు, సౌర శక్తి, విద్యుత్ సరఫరా, తాగునీరు, పెట్రోలియం, సహజ వాయువు తదితర రంగాలకు చెందిన రూ.17,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వికసిత్ భారత్ అంటే... ప్రజలకు ఇచి్చన గ్యారంటీలను తాము అమలు చేస్తుంటే కొందరికి నిద్ర పట్టడం లేదని మోదీ అన్నారు. వికసిత్ భారత్, మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ వంటివి తాము ప్రారంభించిన పథకాలు కావడంతో వాటి గురించి కాంగ్రెస్ మాట్లాడడం లేదని ఆరోపించారు. మోదీ ఏం మాట్లాడినా, ఏం చేసినా కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని, దీనివల్ల దేశానికి భారీ నష్టం కలిగే అవకాశం ఉన్నా ఆ పార్టీ లెక్కచేయడం లేదని మండిపడ్డారు. ఇలాంటి ప్రతికూల రాజకీయాలు యువతకు ఏమాత్రం స్ఫూర్తిని ఇవ్వబోవని తేలి్చచెప్పారు. ఇటీవలే యూఏఈలో పర్యటించానని, భారత్ సాధిస్తున్న ప్రగతిని చూసి అక్కడి నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారని ప్రధాని మోదీ వెల్లడించారు. వికసిత్ భారత్ అంటే కేవలం కొన్ని పదాలు లేదా భావోద్వేగం కాదని వివరించారు. దేశంలో ప్రతి కుటుంబాన్ని సౌభాగ్యవంతంగా మార్చే, పేదరికాన్ని తొలగించే, ఉపాధి అవకాశాలు సృష్టించే, ఆధునిక వసతులు కలి్పంచే కార్యక్రమం అని తెలియజేశారు. తన దృష్టిలో యువత, మహిళలు, రైతులు, పేదలు అనే నాలుగు కులాలు మాత్రమే ఉన్నాయని ప్రధానమంత్రి మరోసారి వివరించారు. హరియాణాలోని రేవాడీలో ఎయిమ్స్కు మోదీ శంకుస్థాపన చేశారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. రాముడు కేవలం ఊహేనని, ఆయోధ్యలో ఆలయం అవసరం లేదని అన్న కాంగ్రెస్ ఇప్పుడు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తోందని ఎద్దేవా చేశారు. -
జైపూర్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు
జైపూర్: రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు శుక్రవారం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ పోలీస్ ఇన్స్పెక్టర్ ధృవీకరించారు. ఎయిర్పోర్టు అధికారిక మెయిల్కు బెదిరింపు రావడంతో అప్రమత్తమైనట్లు చెప్పారు. బెదిరింపు మెయిల్ వచ్చిన వెంటనే ఎయిర్పోర్టు మొత్తం సీఐఎస్ఎఫ్ బలగాలు బాంబు, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టాయని, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదని పోలీసులు తెలిపారు. మెయిల్ ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై సైబర్సెల్ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. ఇదీ చదవండి.. కేజ్రీవాల్కు గుజరాత్ హైకోర్టు షాక్ -
ఓ ఇంటివాడైన టాలీవుడ్ హీరో.. గ్రాండ్గా పెళ్లి వేడుక!
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు, టాలీవుడ్ హీరో ఆశిష్ రెడ్డి వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్లోని జైపూర్లో పెళ్లి ఘనంగా జరిగింది. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ వివాహా వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు, సినీ తారలు పాల్గొన్నారు. ఈ డెస్టినేషన్ గ్రాండ్ వెడ్డింగ్లో దిల్ రాజు సందడి చేశారు. డప్పు వాయిస్తూ ఫుల్ జోష్లో కనిపించారు. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుస్మిత కూడా హాజరయ్యారు. కాగా.. దిల్ రాజు మేనల్లుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్లోనే నిశ్చితార్థం చేసుకున్నారు.ఈ వేడుక ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. టాలీవుడ్లో రౌడీ బాయ్స్ అనే చిత్రం ద్వారా ఆశిష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. 2022 జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఆశిష్ రెడ్డి ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. -
RS: సోనియా గాంధీ నామినేషన్.. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
ఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ(77) రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఆ సమయంలో ఆమె వెంట కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తనయుడు రాహుల్ గాంధీ, తనయ ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. అదే సమయంలో.. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ విడుదల చేసింది. సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక బిహార్ నుంచి అఖిలేశ్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ హండోరె పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకొన్నట్లు కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. CPP चेयरपर्सन श्रीमती सोनिया गांधी जी ने जयपुर, राजस्थान में राज्यसभा के लिए नामांकन पत्र भरा। pic.twitter.com/aPpWNndFJ5 — Congress (@INCIndia) February 14, 2024 #WATCH | Sonia Gandhi, Rahul Gandhi and Priyanka Gandhi Vadra leave from Jaipur, Rajasthan. The Congress Parliamentary Party Chairperson filed her nomination for Rajya Sabha Election from Rajasthan today. pic.twitter.com/PxxeCC8hHr — ANI (@ANI) February 14, 2024 రాజస్థాన్ నుంచి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. అందులో ఒకటి కాంగ్రెస్కు దక్కనుంది. నెహ్రూ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే రెండో నేతగా సోనియా నిలవబోతున్నారు. 1964 ఆగస్టు నుంచి 1967 ఫిబ్రవరి వరకూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం సోనియా ఆమె రాయ్ బరేలీ లోక్సభ స్థానానికి ఎంపీగా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే.. మొత్తం లోక్సభకు ఐదుసార్లు సోనియా గాంధీ ఎన్నికయ్యారు. రాబోయే ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి ఆమె తనయ ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయబోతున్నారనే ప్రచారం నడుమ.. ఆమె రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకోవడం గమనార్హం. వయసురిత్యా.. అలాగే అనారోగ్య కారణాలతోనే ఆమె పార్టీ కార్యకలాపాలకు(ఎన్నికల ప్రచారంతో సహా) దూరంగా ఉంటూ వస్తున్నారు. -
దిల్ రాజు ఇంట పెళ్లి సందడి.. ఫ్యామిలీతో బయలుదేరిన నిర్మాత!
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. దిల్ రాజు తమ్ముడు కొడుకు, టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి వివాహా వేడుకకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానాలు అందించారు. ఈనెల 14న జైపూర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ గ్రాండ్గా జరగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. తాజాగా వివాహా వేడుక కోసం దిల్ రాజు ఫ్యామిలీ బయలుదేరి వెళ్లారు. జైపూర్ వెళ్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. దిల్ రాజు మేనల్లుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డితో ఆతనికి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుక ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. టాలీవుడ్లో రౌడీ బాయ్స్ అనే చిత్రం ద్వారా ఆశిష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. 2022 జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఆశిష్ రెడ్డి ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. #TFNExclusive: Ace Producer #DilRaju & Groom @AshishVOffl along with their family members get papped as they jet off to Jaipur for the grand wedding ceremony!! 📸🤩#Ashish #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/IQllj4yVCU — Telugu FilmNagar (@telugufilmnagar) February 12, 2024 -
సాహిత్యం వల్ల టూరిజం అభివృద్ధి
జైపూర్ నుంచి ప్రత్యేక ప్రతినిధి: జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ వల్ల రాజస్థాన్ టూరిజంకు గణనీయమైన మేలు జరగడమే కాకుండా జైపూర్కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి అన్నారు. జైపూర్లో గురువారం జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ను ప్రారంభిస్తూ ఈ సాహిత్య వేడుక వల్ల ఎంత మంది ప్రముఖులు వచ్చి వెళతారో మిగతా సంవత్సరమంతా అంతమంది ప్రముఖులు వచ్చి వెళతారని ఆమె అన్నారు. భారీ సాహిత్య ఉత్సవాల వల్ల ప్రాంతీయ నగరాలకు గుర్తింపు, టూరిజం కార్యకలాపాల పెరుగుదల జరుగుతుందని తెలిపారు. కాగా, జైపూర్లోని క్లార్క్ హోటల్లో విశేష సంఖ్యలో సాహితీ ప్రేమికుల మధ్య ఐదురోజుల లిటరేచర్ ఫెస్టివల్ ఘనంగా మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా 500 మంది సాహితీవేత్తలు ఈ వేడుక కోసం తరలి వచ్చారు. వీరిలో ముగ్గురు బుకర్ప్రైజ్ విజేతలు, ఐదుగురు పులిట్జర్ ప్రైజ్ విజేతలు ఉన్నారు. ఇతర భారతీయ భాషల సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. కాగా తెలుగు నుంచి కేవలం ఒకే ఒక స్పీకర్గా పరకాల ప్రభాకర్కు ఆహ్వానం అందింది. అది కూడా సాహిత్యాంశ కాకుండా రాజకీయాంశ మీద ఆయన మాట్లాడతారు. తెలుగులో మంచి సాహిత్యం ఉన్నా ఇంగ్లిష్ పాఠకులకు అనువాదాల ద్వారా తగినంతగా అందకపోవడం వల్లే ప్రతిసారీ ఈ ఉత్సవంలో చోటు దొరకడం లేదు. -
ఏక్ 'మసాలా చాయ్'తో భారత్ డెవలప్మెంట్ని చూపించిన ప్రదాని మోదీ!
జనవరి 26న ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రెండు రోజుల భారతదేశ పర్యటనలో ఉన్నారు. ముందుగా జైపూర్ రోడ్ షోలో పాల్గొని కొండపై ఉన్న అంబర్ ప్యాలెస్, జంతర్ మంతర్ అబ్జర్వేటరీ హవా మహల్లను కూడా సందర్శించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ గురువారం పింక్ సిటీ రోడ్షోలో నరేంద్రమో మోదీతో కలిసి ఓపెన్ టాప్ వాహనంలో వెళ్లారు. నగరం నడిబొడ్డున చిన్న మార్గం గుండా పయనమవ్వుతూ ..తొలుత జంతర్మంతర్ నుంచి పప్రారంభమయ్యి అలా 18వ శతాబ్దపు ఖగోళ అబ్జర్వేటరీ వరకు సాగింది. వారిద్దరూ వాహనంలో నిలబడి కబుర్లు చెప్పుకుంటూ..ఆ మార్గంలో కనిపించేవారికి అభివాదం చెబుతూ సాగిపోయారు. ఇక మోదీ కూడా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి భజన్లాల్ శర్మ ప్రమాణ స్వీకారం తదనంతరం జైపూర్లో చేసిన తొలి పర్యటన ఇది. ఇక ఆయ ప్రసిద్ధ ప్రదేశాలను సందరర్శించిన తదనంతరం ఇరువురు నాయకులు ఆ హవా మహల్ ముందు ఉన్న దుకాళంలో మసాల్ చాయ్ సిప్ చేస్తూ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ ఆ షాపు యజమానికి డిజటల్ చెల్లింపు చేసి భారత్లో ఇది ఎంత సర్వసాధారణం అన్న విషయాన్ని పరోక్షంగా తెలియజేశారు. అంతేగాదు ఇక్కడకు వచ్చే సందర్శకులు ఇలా డిజిటల్ చెల్లింపులే చేస్తారని ప్రధాని మోదీ మాక్రాన్కు తెలియజేశారు. అంతేగాదు మోదీ మాక్రాన్ కోసం అక్కడే ఉన్న ఒక దుకాణంలో అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఓ ప్రతిమను కూడా కొనుగోలు చేశారు. ఇక మోదీ గ్లోబల్ ఫోరమ్లలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థలో భారత్ అగ్రగామీగా ఉందని పదేపదే నొక్కి చెబుతుండేవారు. పైగా భారత్ డిజిటల్ పరివర్తన గురించి తన ప్రశంగంలో ప్రశంసిస్తుండేవారు కూడా. కాగా, మాక్రాస్ తిరుగు ప్రయాణంలో జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ కొండపై పర్యాటక ప్రదేశంగా అలరారుతున్న అంబర్ కోటను కూడా సందర్శించారు. అందుకు సంబంధించిన వీడియో తెగ నెట్టింట వైరల్ అవుతోంది. #WATCH | Rajasthan: Prime Minister Narendra Modi and French President Emmanuel Macron visited a tea stall and interacted with each other over a cup of tea, in Jaipur. French President Emmanuel Macron used UPI to make a payment. pic.twitter.com/KxBNiLPFdg — ANI (@ANI) January 25, 2024 (చదవండి: ఇలా రోటీలు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ టెక్నిక్ ఫాలో అయితే త్వరగా చేసేయొచ్చు!) -
Republic Day 2024: జైపూర్లో మోదీ, మేక్రాన్ రోడ్ షో
జైపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ గురువారం జైపూర్లో రోడ్ షోలో పాల్గొ న్నారు. మోదీ ఆయనకు అయోధ్య రామాల యం ప్రతిమను కానుకగా అందజేశా రు. ఇద్దరు నేతలు జైపూర్లో మసాలా చాయ్ రుచిని ఆస్వాదించారు. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ప్రధాన అతిథిగా హాజరు కానున్న ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ భారత్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం జైపూర్కు చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద గవర్నర్ కల్రాజ్ మిశ్రా, ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఫ్రాన్సు అధ్యక్షుడికి రెడ్ కార్పెట్ పరిచి, అందంగా అలంకరించిన గజరాజులతో స్వాగతం పలికారు. ఎయిర్పోర్టు నుంచి మేక్రాన్ అంబర్ కోటకు వెళ్లారు. జంతర్మంతర్ వద్ద ప్రధాని మోదీ ఆయన్ను కలిశారు. పరస్పర కరచా లనం, ఆత్మీయ ఆలింగనాల అనంతరం ఓపెన్ టాప్ కారులో జంతర్మంతర్ నుంచి రోడ్ షోకు బయలుదేరారు. ప్రజలకు అభివాదం తెలుపుతూ హవా మహల్కు చేరుకున్నారు. అక్కడి నుంచి తాజ్ రామ్బాగ్ ప్యాలెస్కు చేరుకుని, ద్వైపాక్షిక చర్చలు జరిపారు. -
జైపూర్లో మోదీ, మాక్రాన్ రోడ్ షో
జైపూర్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధాని నరేంద్ర మోదీ నేడు జైపూర్లో రోడ్ షో నిర్వహించారు. మాక్రాన్ రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా గురువారం జైపూర్ చేరుకున్నారు. జైపూర్ విమానాశ్రయంలో ఆయనకు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, గవర్నర్ కల్ రాజ్ మిశ్రా స్వాగతం పలికారు. అటు.. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా జైపూర్ చేరుకున్నారు. అనంతరం జైపూర్లో ఇద్దరూ రోడ్షో నిర్వహించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన 16వ శతాబ్దానికి చెందిన అమెర్ ఫోర్ట్ను సందర్శించారు. ఈ పర్యటన తర్వాత మాక్రాన్, మోదీ గురువారం రాత్రికి దేశరాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. జనవరి 26వ తేదన జరిగే రిపబ్లిక్ డే పరేడ్లో ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్కు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనేందుకు ఫ్రెంచ్ ఆర్మీకి చెందిన బృందం సిద్ధమైంది. ఈ పర్యటనలో ముఖ్యంగా రక్షణ, భద్రత, క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికత తదితర రంగాల్లో ఒప్పందాలు జరుగనున్నట్టు సమాచారం. ఇక, ఫ్రాన్స్.. భారత్కు ఆయుధాలను అందిస్తున్న రెండో అతిపెద్ద మిత్ర దేశంగా కొనసాగుతోంది. ఇదీ చదవండి: నేడు భారత్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. మోదీతో స్పెషల్ ప్రోగ్రామ్.. -
నేడు భారత్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. మోదీతో స్పెషల్ ప్రోగ్రామ్..
ఢిల్లీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మాక్రాన్ నేడు భారత్కు చేరుకుంటారు. మాక్రాన్ నేరుగా రాజస్థాన్లోని జైపూర్ విమానాశ్రయంలో గురువారం ల్యాండ్ అవుతారు. వివరాల ప్రకారం.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇందులో భాగంగా మాక్రాన్ గురువారం భారత్కు చేరుకుంటారు. జైపూర్ విమానాశ్రయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత మోదీతో కలిసి మాక్రాన్ జైపూర్లోని పలు పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు. అలాగే, రాంబాగ్ ప్యాలెస్లో మాక్రాన్ కోసం ప్రైవేటు డిన్నర్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. రోడ్ షో.. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన 16వ శతాబ్దానికి చెందిన అమెర్ ఫోర్ట్ను సందర్శించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఇద్దరు నేతలు ట్రిపోలియా గేట్కు కాలినడకన వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జైపూర్లో ఇద్దరు నేతలు రోడ్ షో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన తర్వాత మాక్రాన్ గురువారం రాత్రికి దేశరాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. జనవరి 26వ తేదన జరిగే రిపబ్లిక్ డే పరేడ్లో ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో పాల్గొంటారు. #WATCH | Rajasthan: Jaipur decked up with posters of PM Narendra Modi and French President Emmanuel Macron ahead of their visit today pic.twitter.com/2tOGZZmxVx — ANI (@ANI) January 24, 2024 ఈ రెండు రోజుల పర్యటనలో భారత్తో మాక్రాన్ పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. ముఖ్యంగా రక్షణ, భద్రత, క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికత తదితర రంగాల్లో ఒప్పందాలు జరుగనున్నట్టు సమాచారం. ఇక, ఫ్రాన్స్.. భారత్కు ఆయుధాలను అందిస్తున్న రెండో అతిపెద్ద మిత్ర దేశంగా కొనసాగుతోంది. -
Rajasthan Haunted Places: రాజస్థాన్లోని అత్యంత హాంటెడ్ ప్లేసెస్.. ఇవే! (ఫోటోలు)
-
ఎన్ఐఏ చేతికి కర్ణిసేన చీఫ్ హత్య కేసు
చంఢీగడ్: కర్ణిసేన అధినేత సుఖ్దేవ్ గోగమేడి హత్య కేసును ఎన్ఐఏ చేపట్టింది. హత్యలో ప్రముఖ గ్యాంగ్స్టర్ల ప్రమేయం ఉన్నందున హోం మంత్రిత్వ శాఖ ఎన్ఐఏకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. ఈ ఘటనపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. కర్ణిసేన అధినేతను డిసెంబర్ 5న రాజస్థాన్, జైపూర్లోని ఆయన నివాసంలో దుండగులు కాల్చి చంపారు. హత్య జరిగిన వెంటనే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో సంబంధం ఉన్న గ్యాంగ్స్టర్ రోహిత్ గోదారా హత్యకు బాధ్యత వహించాడు. ఇద్దరు నిందితులు రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీలను డిసెంబర్ 9న చండీగఢ్లో పోలీసులు అరెస్టు చేశారు. గోదారానే తమను సుఖ్దేవ్ గోగామేడి హత్యకు ఆదేశించారని పోలీసులకు సమాచారం అందించారు. పరారీలో ఉన్న షూటర్లు గోదార సన్నిహితులు వీరేంద్ర చాహన్, దనరామ్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కొందరు వ్యాపారవేత్తల నుంచి వసూళ్లకు సంబంధించి గోదార, గోగమేడి మధ్య విభేదాలు తలెత్తాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదే హత్యకు దారితీసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇదీ చదవండి: 'సిగ్గుచేటు..' రాజ్యసభ ఛైర్మన్పై విపక్ష ఎంపీ మిమిక్రి -
రాజస్థాన్ సీఎంగా భజన్లాల్ శర్మ
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి విషయంలోనూ బీజేపీ అనూహ్య నిర్ణయం వైపే మొగ్గు చూపించింది. ఓసీ సామాజిక వర్గానికి చెందిన భజన్లాల్ శర్మను సీఎంగా ప్రకటించింది. బీజేపీ శాసనసభాపక్షనేతగా భజన్లాల్ శర్మను మంగళవారం జరిగిన సీఎల్పీ భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. భజన్లాల్ తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గడం గమనార్హం. డిప్యూటీ సీఎంలుగా దియాకుమారి, ప్రేమచంద్ భైరవను బీజేపీ ప్రకటించింది. అదే విధంగా స్పీకర్ వాసుదేవ్ దేవ్నాని ఎంపిక చేసిదంది. కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్, బీజేపీ పరిశీలకులు రాజస్థాన్ సీఎం ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. బీజేపీ ఎల్పీ ముగిసిన అనంతరం భజన్లాల్ శర్మ పేరును రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అధికారికంగా ప్రకటించారు. ఇక రాజస్థాన్ ముఖ్యమంత్రి రేసులో వసుంధర రాజే, దియాకుమారి, అర్జున్రామ్, గజేంద్ర షెకావత్, అశ్విని వైష్ణవ్ లాంటి సీనియరల పేర్లు వినిపించాయి. తీవ్ర సస్పెన్స్ కొనసాగించిన అనంతరం బీజేపీ అధిష్టానం.. చివరి నిమిషంలో భజన్లాల్ పేరును తెరపైకి తెచ్చింది. చివరకు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తరహాలోనే రాజస్థాన్ విషయంలోనూ కొత్త ముఖాన్ని ఎంచుకుంది. 56 ఏళ్ల భజన్ లాల్ శర్మ.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు. భజన్ లాల్ రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల్లో సంగనేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్పై 48,081 ఓట్లతో విజయం సాధించారు. చదవండి: నెహ్రూపై అమిత్ షా వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ కౌంటర్ -
కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్య
జైపూర్: జైపూర్లో దారుణం జరిగింది. రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్యకు గురయ్యారు. బైక్పై వచ్చిన దుండగులు గోగమేడిని పిస్టల్తో కాల్చి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో గోగమేడి తన ఇంటి వరండాలో కూర్చోగా ఇద్దరు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో సంబంధం ఉన్న గ్యాంగ్స్టర్ రోహిత్ గోదారా ఫేస్బుక్ పోస్ట్లో గోగమేడి హత్యకు తానే కారణమని పేర్కొన్నాడు. తీవ్రంగా గాయపడిన గోగమేడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనలో గోగమేడితో పాటు ఉన్న అజిత్ సింగ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు -
పొగమంచు ఎఫెక్ట్తో పలు విమానాలు దారి మళ్లింపు
సాక్షి,న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో విమానాల రాకపోకలకు పొగ మంచు అడ్డం పడింది. ప్రతికూల వాతావరణం దృష్ట్యా విమానాలు ల్యాండ్ కాలేకపోతున్నాయి. దీంతో పలు విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే దారి మళ్లించిన విమానాల సమాచారాన్ని అధికారులు తెలియజేశారు. మరోవైపు హైదరాబాద్ నుంచి ఉదయం 6.15కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని(AI559) జైపూర్కు దారి మళ్లించారు. ఈ విమానంలోనే వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. దీంతో ఆయన 11 గంటలకు జరుగనున్న పార్లమెంటరీ పార్టీ మీటింగ్కు ఆలస్యంగా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు అఖిలపక్ష సమావేశం పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం. ఉదయం 11గం.లకు పార్లమెంటు లైబ్రరీ భవనంలో ఈ భేటీ జరగనుంది. వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు అవుతుండగా.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ఎజెండాగా ఈ భేటీ జరుతోంది. ఇదిలా ఉంటే.. డిసెంబర్ 4 నుంచి 22 వరకూ కొనసాగనున్నాయి పార్లమెంటు శీతాకాల సమావేశాలు. -
ప్రియుని కోసం పాక్ వెళ్లిన అంజూ తిరిగొచ్చింది!
జైపూర్: ప్రియుని కోసం పాకిస్థాన్ వెళ్లిన భారతీయ మహిళ అంజూ తిరిగి స్వదేశానికి వచ్చింది. వాఘా సరిహద్దు దాటి భారత్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం దర్యాప్తు బృందాల అదుపులో ఉంది. విచారణ అనంతరం ఆమెను ఢిల్లీకి తరలించనున్నారు. ప్రియుడు నస్రుల్లా కోసం గత జులైలో అంజూ పాకిస్థాన్కు వెళ్లింది. అంజూ రాజస్థాన్ బివాండీకి చెందిన మహిళ. భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఫేస్బుక్లో పరిచయమైన పాక్ వ్యక్తి నస్రుల్లాను ప్రేమించింది. అతని కోసం గత జులైలో భారత్ సరిహద్దు దాటి ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్కి వెళ్లింది. అయితే.. తన స్నేహితున్ని కలుసుకోవడానికి మాత్రమే వెళ్లానని తెలిపిన అంజూ.. ఆ మరుసటి రోజే అతనితో వివాహం చేసుకుంది. అంజూ నుంచి ఫాతిమాగా పేరు మార్చుకుని ఇస్లాం స్వీకరించింది. జైపూర్ మాత్రమే వెళ్తున్నట్లు, మరో రెండు రోజుల్లో వెచ్చేస్తానని అప్పట్లో తనతో చెప్పినట్లు అంజూ భర్త అరవింద్ తెలిపారు. అప్పటి నుంచి అంజూతో వాట్సాప్లో టచ్లోనే ఉన్నట్లు వెల్లడించారు. అంజూ, నస్రుల్లాల స్నేహం గురించి తనకు ముందే తెలుసని చెప్పారు. అంజూ ఎప్పటికైనా భారత్ తిరిగివస్తుందని తనకు ముందే తెలుసని అన్నారు. అరవింద్ను వివాహం చేసుకున్న తర్వాత ఇరువురు క్రిస్టియన్ స్వీకరించారు. ఇదీ చదవండి: కేంద్రంతో మణిపూర్ తిరుగుబాటు సంస్థ శాంతి ఒప్పందం.. అమిత్ షా కీలక ప్రకటన -
కోటీశ్వరుడిగా నకిలీ ప్రొఫైల్, డేటింగ్ వల: అదే కొంపముంచింది!
సోషల్ మీడియాలో ముక్కూ మోహం తెలియని వారితో పరిచయాలు, ప్రేమ, ఆన్లైన్ డేటింగ్ ఎంత ప్రమాదకరమో తెలిపే ఘటన ఇది. పాపులర్ డేటింగ్ టిండర్లో డేటింగ్ చేసిన మహిళ యువకుడిని కిడ్నాప్ చేసి మరీ కిరాతకంగా హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. 2018లో జైపూర్లో షాకింగ్ సంఘటన జరిగింది. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులకు జైపూర్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుష్యంత శర్మ(28)కు 27 ఏళ్ల ప్రియా సేథ్తో టిండర్ యాప్ ద్వారా పరిచయమైంది. దుష్యంత్ తను అసలు పేరు కాకుండా వివాన్ కోహ్లీ అనే పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. అంతేకాదు నెల కోటిరూపాయలు సంపాదిస్తానని, ఢిల్లీకి చెందిన గొప్ప బిజినెస్మేన్ అని గొప్పలు చెప్పుకున్నాడు. కోహ్లి ప్రొఫైల్ చూసిన ప్రియా పథకం ప్రకారమే మెల్లిగా అతనితో స్నేహం నటించింది. దీంతో దుష్యంత్ గాల్లో తేలిపోయాడు. ఇలా 3 నెలల పాటు కొనసాగింది. చివరికి కలవాలని ప్రతిపాదించింది. దీంతో ఎగిరి గంతేశాడు. కానీ అదే అతని ప్రాణాలు తీస్తుందని అసలు ఊహించలేదు. ఇక్కడే అతడిని కిడ్నాప్ చేసిన పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయాలన్న తన ప్లాన్ను ప్రియా అమలుకు పూనుకుంది.. అప్పటికే తనతో లివిన్ రిలేషన్ షిప్లో ఉన్న దీక్షంత్ కమ్రా,లక్ష్య వాలియా ప్రియ కలిసి అతడిని కిడ్నాప్ చే చేసి జైపూర్లోని అద్దె ఫ్లాట్కు తీసుకెళ్లారు. మాటల్లో అతనుతాము అనుకున్నంత ధనవంతుడి కాదని తెలిసిపోయింది. అయినా తమ ప్లాన్ను అమలు చేశారు. దుష్యంత్ తండ్రికి ఫోన్ చేసిన 10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దుష్యంత్ దగ్గరనున్న ఏటీఎం కార్డునుంచి రూ.20వేలు లాగేసుకున్నారు. ఇంకా డబ్బులు కావాలని ఒత్తిడి చేశారు.లేదంటే అత్యాచార కేసు పెడతామని బెదిరించారు. దీంతో తన దగ్గర అంత డబ్బు లేదని కానీ కొంత ఎరేంజ్ చేస్తానని బతిమాలుకున్నాడు. దీంతో అతని ఫోన్ ద్వారా తండ్రికి ఫోన్ చేసి డబ్బులు అడిగారు. కొడుకు ప్రాణాలు రక్షించుకోవాలనే ఆశతో ఆయన రూ. 3 లక్షలు జమ చేశారు. అయినా కూడా తమ నేరం వెలుగులోకి వస్తుందనే భయంతో ముగ్గురు నిందితులు దుష్యంత్ను హత్య చేశారు. గొంతుకోసి, ముక్కలు, ముక్కలుగా నరికి సూట్ కేసులో కుక్కి ఉన్న దుష్యంత్ మృతదేహాన్ని పోలీసులు అదే ఏడాది మే 4న గుర్తించారు. ఈ కేసులో తుది విచారణ తరువాత కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. తన కొడుకును హత్య చేసిన వారికి మరణ శిక్ష విధించి ఉంటే అతని ఆత్మ శాంతించేదని దుష్యంత్ శర్మ తండ్రి కన్నీంటి పర్యంతమయ్యారు. అంతేకాదు గతంలో డేటింగ్ ద్వారా ఇలా చాలామంది మోసం చేసిన ఆరోపణల కింద జైలుకెళ్లిందట ప్రియ.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవితవ్యం:
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి హేయమైన చర్య
విజయం వైఎస్సార్ సీపీదే
20న ఎడ్ల బండలాగుడు పోటీలు
No Headline
ఓటేసిన 15,89,412 మంది
Hyderabad: కాస్త పెరిగినా చివరి స్థానమే..
జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ఏడుగురు టీడీపీ నాయకులపై కేసు నమోదు
అదుపు తప్పిన కార్లు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement