-
ఆమైపె కక్ష గట్టి..
భావన, కమిషనర్, నగరపాలక సంస్థ సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఒక మహిళా ఐఏఎస్పై కూటమి నేతలు కక్ష కట్టారు. ఆమెను సాగనంపేందుకు తమ మధ్య ఉన్న విభేదాలన్నింటినీ పక్కన పెట్టి ఒక్కటయ్యారు. బిల్లుల కోసం వచ్చి, గద్దించి మాట్లాడిన టీడీపీ నేత కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే ఆమె చేసిన పెద్ద నేరమైంది. ఆమెను కొనసాగించవద్దని అందరూ పట్టుబడుతున్నారు. దీనికోసం జిల్లా టీడీపీలో సీనియర్ నాయకులందరూ అంతర్గతంగా ప్రత్యేక అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన బదిలీ కోసం కూటమి కట్టిన నేతల తీరు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. టీడీపీ నేత పుత్రరత్రం దుందుడుకు వ్యవహారం ప్రజాసంబంధాలతో ముడిపడి ఉన్న ఐఏఎస్ అధికారులు.. ఏ హోదాలో ఉన్నా ఏ విషయంౖపైనెనా సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిందే. అందునా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాఫిర్యాదుల వేదికలో మరింత జాగరూకతగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. నాలుగున్నర లక్షల పైచిలుకు జనాభా కలిగిన కాకినాడ నగర పాలక సంస్థకు మహిళా ఐఏఎస్ భావన కమిషనర్గా పని చేస్తున్నారు. ఆమె కాకినాడ వచ్చి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. ప్రతి వారం మాదిరిగానే గత సోమవారం ఆమె ప్రజా ఫిర్యాదుల వేదికలో అర్జీలు స్వీకరిస్తున్నారు. ఆ క్రమంలో కమిషనర్ వద్దకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు తనయుడు, కాంట్రాక్టర్ అయిన గంగాధర రమేష్ వచ్చారు. అధికార పార్టీకి చెందిన కీలక నాయకుడి తనయుడిని కావడంతో తన మాటకు ఎదురుండదనుకున్నారో ఏమో కానీ.. పెండింగ్ బిల్లుల కోసం దుందుకుడుగా ప్రశ్నించారు. తాము చెప్పినట్టే అధికారులు, సిబ్బంది నడచుకోవాలనే మనస్తత్వాన్ని చంద్రబాబు దగ్గర నుంచి క్షేత్ర స్థాయిలో నేతల వరకూ అందరూ ఒంట పట్టించుకున్నట్టు ఈ సంఘటనతో అర్థమవుతోంది. బిల్లులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని గంగాధర రమేష్ గద్దించి మాట్లాడంతో మనస్తాపం చెందిన కమిషనర్ భావన.. దీనిపై అదనపు ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్కు ఎంహెచ్ఓ ద్వారా మొబైల్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కాస్త శ్రుతి మించి వ్యవహరించారనే విమర్శలున్నాయి. బిల్లుల విషయం పక్కన పెట్టి.. బదిలీపై పట్టుబట్టి.. తమ పార్టీ నాయకుడి తనయుడి పైనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీడీపీ నాయకుల అహం దెబ్బ తిన్నట్టుంది. ఈ నేపథ్యంలో వారు బిల్లుల విషయాన్ని పక్కన పెట్టేసి, కమిషనర్ భావనను తక్షణం బదిలీ చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ విషయంపై తాడోపేడో తేల్చేస్తామంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. ఎంహెచ్ఓ ద్వారా పోలీసులకు కమిషనర్ ఫిర్యాదు చేయడంపై కూటమి ఎమ్మెల్యేలు కాకినాడలో అంతర్గతంగా భేటీ అయ్యారు. ఇది చర్చనీయాంశమైంది. మెట్ట ప్రాంతానికి చెందిన ఒక కీలక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగిన ఈ భేటీలో కమిషనర్ భావనను కాకినాడ నుంచి సాగనంపాల్సిందేనని ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులకు అల్టిమేటం ఇచ్చారని సమాచారం. దీనికి వారం రోజులు డెడ్లైన్ పెట్టినట్లు తెలిసింది. మెట్ట ప్రాంత నేతలకు కాకినాడ సిటీ, రూరల్ నేతలు కూడా తోడయ్యారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అడ్డగోలు పనులకు అడ్డమని... వాస్తవానికి కమిషనర్ భావన, కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మధ్య ఆరు నెలల క్రితమే పలు అంశాల్లో విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచీ నగరంలో ఏ అధికారిక కార్యక్రమంలోనూ ఇద్దరూ కలిసి పాల్గొన్న దాఖలాలు లేవు. కాకినాడ దుమ్ములపేటలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపనకు ఎమ్మెల్యే కొండబాబు చివరి నిమిషంలో డుమ్మా కొట్టేశారు. వీరిద్దరి మధ్య విభేదాల విషయం తెలియక రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వచ్చినప్పటికీ.. కొండబాబు రాలేదని తెలిసి తిరిగి వెళ్లిపోయారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్కు మాత్రమే కుర్చీ వేసి, ఎమ్మెల్యేని విస్మరించారంటూ అప్పట్లో కొండబాబు వర్గీయులు బయట రచ్చరచ్చ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయినప్పటికీ ఇప్పటి వరకూ ఎమ్మెల్యే, కమిషనర్ కలసి అధికారులతో ఒక్క సమావేశం కూడా నిర్వహించిన దాఖలాలు లేవు. కార్పొరేషన్ కమిషనర్గా వచ్చిన తరువాత అధికార పార్టీ నేతలు చెప్పే అడ్డగోలు పనులకు భావన అడ్డు తగులుతూండటం టీడీపీ నేతలకు కంటగింపుగా మారింది. అయితే, అప్పట్లో ఆమైపె చర్యలకు సిఫారసు చేసేందుకు ధైర్యం చాలక కాకినాడ సిటీ టీడీపీ నేతలు కిమ్మనకుండా ఉండిపోయారు. ఇటీవల మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ కాకినాడ వచ్చిన సందర్భంలో సైతం టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కమిషనర్ భావనను మార్చాల్సిందేనని పట్టుబట్టారని ప్రచారం జరిగింది. తాజా ఘటనతో జిల్లాలోని టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులందరూ కూటమి కట్టి, కమిషనర్ బదిలీకి పావులు కదుపుతున్నారు. పట్టుమని పది నెలలు కూడా కాకుండానే ఆమెను సాగనంపేందుకు చేస్తున్న ప్రయత్నాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.నగరపాలక సంస్థ కార్యాలయం మహిళా ఐఏఎస్కు వ్యతిరేకంగా నేతల ‘కూటమి’ కాకినాడ కార్పొరేషన్ కమిషన్ బదిలీకి యత్నం అంతా ఒక్కటై.. బదిలీకి వారం డెడ్లైన్ అధిష్టానానికి అల్టిమేటం ఇదేం పద్ధతి? వాస్తవానికి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు అనేది ప్రభుత్వం వద్దనే పెండింగ్లో ఉంది. ఈ చెల్లింపులు సీఎంఎఫ్ పరిధిలో ఉన్నాయి. అధికారం గుప్పిట్లో ఉందని జబ్బలు చరుచుకునే అధికార పార్టీ నేతలు ఉన్నత స్థాయిలో బిల్లులు మంజూరయ్యేలా ప్రయత్నించుకోకుండా కమిషనర్పై దుందుడుకుగా మాట్లాడితే ప్రయోజనమేమిటని, ఫిర్యాదు చేయడానికి వచ్చి, ఒక మహిళా ఐఏఎస్పై అంత దురుసుగా మాట్లాడటం సమంజసమా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అధికారం చేతిలో ఉందనే అహంకారంతో ఏం చేసినా చెల్లుతుందనే తెగింపుతోనే ఇలా వ్యవహరించారని అంటున్నారు. ఈ ఉదంతంలో కమిషనర్ భావన అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేయడంలో తప్పేముందని ఉద్యోగ సంఘాలు నిలదీస్తున్నాయి. బిల్లుల మంజూరులో కమిషనర్ వైఫల్యం ఏమైనా ఉంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, అయినప్పటికీ దుందుడుకుగా మాట్లాడాల్సిన పనేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. తమ బంధానికి అడ్డుగా ఉన్నారన్న కారణంతో ఏకంగా హత్యలదాకా వ్యవహారం వెళ్తోంది. ఇలాంటి ఘటనల్లో ఎక్కువగా బాధితుల బిడ్డలు అనాథలుగా మారుతుండటం అందరినీ కలవరపెడుతోంది. జిల్లా పరిధిలో తరచూ ఇలాంటి ఘటనలు తరచూ వెల
● ధర్మవరం మండలం పోతుకుంట గ్రామానికి చెందిన ఓ వివాహితకు రొద్దం మండలానికి చెందిన పురుషుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అనుమానం వచ్చిన భర్త మంజునాథ్ నిత్యం వేధించసాగాడు. మధ్యలో అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి భార్య పన్నాగం పన్నింది. మద్యం మత్తులో ఉన్న భర్తను కిరాయి ఇచ్చి హత్య చేయించింది. గతేడాది జరిగిన ఈ ఘటనకు కారణాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఏడాది తర్వాత మృతదేహాన్ని రీపోస్టుమార్టం చేయడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. ● నల్లమాడ మండలం కుటాలపల్లిలో గతేడాది ఎన్నికల సమయంలో ఓ దారుణ హత్య వెలుగు చూసింది. ఇద్దరు వ్యక్తులు ఒకే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడమే దీనికి కారణంగా తేలింది. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో అమర్నాథ్రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఒకరికి తెలియకుండా మరొకరు వివాహేతర సంబంధం కొనసాగించారు. అయితే ఆర్థిక లావాదేవీల్లో తేడా రావడంతో శ్రీనివాసరెడ్డి మరికొందరితో కలిసి అమర్నాథ్రెడ్డిని హతమార్చాడు. గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. సాక్షి, పుట్టపర్తి రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులతో ముడిపడిందే భార్యాభర్తల బంధం. జీవితాంతం ప్రేమ, ఆప్యాయతలతో పాటు కష్టసుఖాలు, కుటుంబ బాధ్యతలను మోసుకుంటూ ముందుకు సాగేదే సంసారం. ఈ పవిత్ర బంధం.. మనస్పర్థలు, అనుమానాలు, కుటుంబ కలహాలతో విచ్ఛిన్నం అవుతోంది. చిన్నపాటి మనస్పర్థల కారణంగా పరాయి వ్యక్తులతో చనువుగా పెరిగి.. సాన్నిహిత్యం ఏర్పడుతోంది. అదే వివాహేతర సంబంధాలకు దారి తీస్తోంది. అలాంటి సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది అడ్డు తొలగించుకునే క్రమంలో భర్తలను, ప్రియులను చంపేస్తున్నారు. ఫలితంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. హత్య చేసి పరారీ అవుతుండటంతో చిన్నారులు ఎవరి దగ్గర ఉండాలో అర్థం కాక బాల్యంలోనే కార్మికులుగా మారి అష్టకష్టాలు పడుతున్నారు. అఘాయిత్యాలకు దారి తీస్తూ.. వివాహేతర సంబంధాలతో భార్యభర్తల మధ్య మనస్ఫర్థలు పెరిగి అఘాయిత్యాలకు దారి తీస్తున్నాయి. ఇద్దరి మధ్యలోకి మరొకరు రావడంతో పరిస్థితులు నిమిషాల్లో మారిపోతున్నాయి. క్షణికావేశంతో హత్యలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. దంపతుల్లో ఎవరో ఒకరు జైలుకు వెళ్లినా.. కనీసం బెయిల్ ఇప్పించేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో అలాంటి దంపతుల పిల్లలు అనాథలుగా మారుతున్నారు. అంతేకాదు వివాహేతర సంబంధాలతో ఎలాంటి పరిణామాలు జరిగినా.. వారి కుటుంబ సభ్యులు సమాజంలో తలెత్తుకొని తిరగలేని పరిస్థితి నెలకొంది. కారణాలు ఎన్నెన్నో.. భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో అనర్థాలు చిచ్చు రేపుతోన్న సోషల్ మీడియా పరిచయాలు ఇద్దరి మధ్యకు మూడో వ్యక్తి రావడంతో హత్యలకు దారి బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారుతున్న పిల్లలు పని ఒత్తిడితో జీవిత భాగస్వామికి సరైన సమయం కేటాయించకపోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. చిన్న సమస్యలను పెద్దవిగా చూస్తూ.. పదే పదే చర్చించి.. తల్లిదండ్రుల వరకూ వెళ్లడం.. ఆ తర్వాత పోలీస్స్టేషన్ల మెట్లు ఎక్కుతున్నారు. జీవిత భాగస్వాములు తాము చెప్పినట్లు వినలేదంటూ ఇద్దరిలో ఎవరో ఒకరు దారి తప్పి సమస్యల ఊబిలో కూరుకుపోతున్నారు. స్మార్ట్ఫోన్లను అతిగా వినియోగించి సోషల్ మీడియా పరిచయాలతో ప్రాణాల మీదికి తెచ్చుకోవడం. మద్యానికి బానిసై ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని .. కుటుంబ పోషణ గురించి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటం కూడా కారణమవుతోంది. సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి దంపతుల మధ్య మనస్పర్థలు రావడం సహజమే. అయితే క్షణికావేశాలకు వెళ్లకుండా.. సామరస్యంగా ఇద్దరూ పరిష్కార మార్గం ఎంచుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. వివాహం జరిగిన కొత్తలో మనస్ఫర్థలు వచ్చినా.. వెంటనే సరిదిద్దుకోవాలి. అయితే ఇరవై ఏళ్ల దాంపత్య జీవితంలో కూడా ఇంకా సమస్యలు వెలుగు చూస్తుండటం అవగాహన లోపమే. దంపతులిద్దరూ పిల్లలు, కుటుంబ బాధ్యతల గురించి తెలుసుకుంటే ఎలాంటి మనస్పర్థలు రావు. క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలతో కుటుంబం రోడ్డున పడుతుంది. అంతేకాకుండా చిన్నారులు అనాథలుగా మారాల్సి వస్తోంది. – వి.రత్న, ఎస్పీ -
ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ రాయచోటి: కేంద్ర ప్రభుత్వ నోడల్ అధికారుల సూచనలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శనివారం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో చేపడుతున్న జల జీవన్ మిషన్ పథకంపై కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులైన మీను శుక్ల పాఠక్, చీఫ్ ఇంజినీర్ ఎస్పీ శెట్టిలు గ్రామీణ నీటి సరఫరా శాఖ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల, డ్వామా, డీఆర్డీఏ పీడీలు, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జలజీవన్ మిషన్ ప్రాజెక్టులో భాగంగా 3709 పనులు మంజూరయ్యాయని, ఇందులో 2225 పనులు పూర్తయ్యాయని, మిగిలినవి వివిధదశల్లో ఉన్నాయని జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారి ప్రసన్న కుమార్ వివరించారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 44 మండలాల్లో 6967 నివాసాల్లో నివసిస్తున్న 31 లక్షల, 87వేల, 66 మందికి రెండు ఫేసులలో గండికోట, వెలిగల్లు రిజర్వాయర్ల ద్వారా కరువు ప్రాంతాలకు తాగునీటిని అందించడం కోసం 2370 కోట్ల రూపాయలతో ఏప్రిల్ 2025లో ప్రారంభించిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు అక్టోబర్ 2027 కల్లా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ ప్రాజెక్టు మొదటి ఫేసులో పీలేరు, తంబళ్లపల్లి, రాయచోటిలోని 18 మండలాల్లో 241 గ్రామ పంచాయతీలకు నీటి సరఫరా అందిస్తామన్నారు. మొదటి ఫేసులో గండికోట రిజర్వాయర్ ద్వారా 1.683 టీఎంసీల నీటిని, వెలిగల్లు రిజర్వాయర్ ద్వారా 0.175 టీఎంసీ నీటిని కరువు ప్రాంతాలకు అందించేలా ప్రణాళికలు సిద్దం చేసినట్లు ప్రసన్న కుమార్ కేంద్ర బృందానికి తెలియపరిచారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా భౌగోళిక స్వరూపం వల్ల వర్షపాతం తక్కువగా ఉంటుందన్నారు. భూగర్భజలాలు ప్రజలకు అందుబాటులో లేవని, జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి నీటి సరఫరా అత్యంత అవసరమని కేంద్ర ప్రభుత్వ బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, పాల్గొన్నారు. -
స్థానిక ఎమ్మెల్యే దృష్టికి సమస్యలు
68 వార్డ్డులో సమస్యలను కార్పొరేటర్ గుడివాడ అనూష లతీష్ కౌన్సిల్కు వివరిస్తూ.. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకొచ్చారు. అక్కిరెడ్డిపాలెం హైస్కూల్ నుంచి పంచవటి వరకు ప్రధాన రహదారి విస్తరణ, విశాఖ డెయిరీ కాలుష్యం, మింది, అక్కిరెడ్డిపాలెం గ్రామాల నుంచి పోర్టు రోడ్డు డ్రెయిన్కు కనెక్టయిన కాలువలు నిర్మించాలని, మింది తాగునీటి ట్యాంక్ నిల్వ సామర్థ్యం పెంచాలని, రామ్నగర్, కాళికానగర్లో కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. గుడివాడ అప్పన్న కాలనీలో రోడ్డు విస్తరణ పూర్తి చేయాలని కోరారు. -
రాత్రి దోపిడీలు
పగలు బొమ్మల వ్యాపారం.. ● హైవేల్లో ఆగి ఉన్న వాహనదారులపై దోపిడీ ● చీకటిలో దోపిడీ దొంగల వీరంగం ● పోలీసులకు చిక్కిన నలుగురు దొంగలు, ఒకరు పరారీ ● రోడ్డు పక్కన గుడారాల్లో నివాసాలు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్వర రెడ్డి శ్రీకాకుళం క్రైమ్ : హైవే పక్కన గుడారాల్లో నివాసం.. పగలు బొమ్మల వ్యాపారం.. రాత్రయితే దోపిడీ.. విశాఖ జిల్లా తగరపువలస నుంచి మన జిల్లా ఇ చ్ఛాపురం వరకు అంతా వీరి రాజ్యమే. జాతీయ రహదారి వెంబడి ఎక్కడైనా వాహనం ఆగి ఉంటే చాలు నగదు, మొబైళ్లు, పార్క్ చేసిన బైక్లు కూడా ఎత్తుకుపోతారు. జిల్లాలోనూ వీరి హస్తకళ చూపించారు. తాజాగా వీరిలో నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ మహేశ్వర రెడ్డి ఈ రాజస్థానీ దొంగల వివరాలను శుక్రవారం వెల్లడించారు. ఆదాయం చాలక.. జిల్లాలోని రణస్థలం మండలం కోష్ట ప్రాంతంలో గత మూడేళ్లు నుంచి రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కు చెందిన ఆదిత్య పవార్ అలియాస్ వర్షమ్ (22), అతని సోదరులు, మరికొందరు కుటుంబీకులు రోడ్డు ప క్క న గుడారాల్లో నివసిస్తున్నారు. పగటి పూట బొమ్మ లు, దుప్పట్లు అమ్ముకోవడమే వీరి జీవనాధారం. ఆ ఆదాయం సరిపోకపోవడం, ఇంటిల్లిపాదీ చెడు అలవాట్లకు బానిసలు కావడంతో రాత్రిపూట రోడ్డుపక్కన దొంగతనాలకు ఒడిగడుతున్నారు. ఆదిత్యనే ఈ గ్యాంగ్కు లీడర్. అతని సోద రులు బంగారం పవార్ (21), సుధీర్ పవార్ (19)లే కాక బావమరుదులు సంజు షిండే అలియాస్ పటేల్, మరో బాలుడు కూడా ఇదే పనిలో ఉన్నారు. మూడేళ్లుగా ఎవరికీ చిక్కక.. అర్ధరాత్రి వేళల్లో ఆగి ఉన్న లారీలు, వ్యాన్లలో నిద్రిస్తున్న వ్యక్తుల వద్దకు వెళ్లి వారికి తెలియకుండానే నగదు, ఫోన్లను తస్కరించి అక్కడి నుంచి పరారయ్యేవారు. గత ఆరు నెలల నుంచి ఆగి ఉన్న వాహనదారుల వద్దకు వెళ్లి కత్తులతో బెదిరించి.. వారిని కొట్టి డబ్బు, మొబైళ్లు లాక్కోవడం మొదలుపెట్టారు. అదే వారిని పట్టించింది. ఆమదాలవలసకు చెందిన బొడ్డేపల్లి సతీష్కుమార్, అతని స్నేహితుడు సేపీన బెనర్జీలు తమ బైక్పై గత నెల 18న నంది గాం మండలం కణితూరు గ్రామంలో జరిగే వివా హ వేడుకకు హాజరయ్యారు. తిరిగి అదే రోజు అర్ధరాత్రి పయనమవ్వగా మార్గం మధ్యలో వర్షం కురవడంతో సరిగ్గా 12:50 గంటలకు టెక్కలి మండలం విక్రంపురం గ్రామం జేఎన్ బస్టాప్ (ఎన్హెచ్–16 సమీప) వద్ద ఆగి కాసేపు ఆగారు. పైన పేర్కొన్న నిందితుల్లో నలుగురు ఒక్క ఉదుటున వారివద్దనున్న కత్తులను తీసి సతీష్, బెనర్జీల గొంతుపై పెట్టారు. అంతటితో ఆగక పిడిగుద్దుల వర్షం కురిపించి ఏమేం ఉన్నాయో తీయండంటూ బెదిరించడంతో రూ. 6 వేల నగదు, రెండు మొబైళ్లు ఇచ్చేశారు. వెంటనే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితులు టెక్కలి పోలీసులను ఆశ్రయించారు. అప్పటికే కొన్ని చోట్ల ఇలాంటి దొంగతనాలు జరుగుతుండటంతో ఎస్పీ కేవీ మహేశ్వరెడ్డి ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ (క్రైమ్) పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ ఎస్ఎస్ చంద్రమౌళి, టెక్కలి సీఐ విజయ్కుమార్ రెండు పోలీసు బృందాలుగా ఏర్పడి తీగ లాగారు. ఎలా పట్టుబడ్డారంటే.. ఈ నెల 5న సాయంత్రం 6 గంటల సమయంలో టెక్కలి మండలం శ్యామసుందరాపురం గ్రామం జగదిమెట్ట ఫ్లై ఓవర్ సమీపంలో కొంతమంది అనుమానంగా రెండు ద్విచక్రవాహనాలపై సంచరిస్తున్న విషయం టెక్కలి ఎస్ఐ కె.మధుసూధనరావుకు తెలియడంతో సిబ్బందితో వెళ్లి నిందితులను పట్టుకున్నారు. వారిలో సంజు షిండే పరారయ్యాడు. వారి వద్ద నుంచి రూ.1,12,000 నగదు, రెండు ద్విచక్రవాహనాలు, ఎనిమిది మొబైళ్లు, ఆరు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్టేషన్కు తీసుకెళ్లి విచారించడం, జిల్లాలో పలుచోట్ల వారు చేసిన నేరాలు బయటపడ్డాయి. ఎక్కడెక్కడ అంటే.. టెక్కలి, లావేరుల్లో ఒక్కొక్కటి చొప్పున, నందిగాం, నరసన్నపేట పీఎస్ల పరిధిలో రెండేసి చొప్పున వీరిపై కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా బాలుడిని జువైనల్ హోంకు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీసీఎస్, టెక్కలి పోలీసులను ఎస్పీ అభినందించారు. -
గాలివాన బీభత్సం
ఏటూరునాగారం : మండలంలోని ఎలిశెట్టిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్ వైర్లు తెగిపడగా, ఇంటి కప్పులు, రేకులు ఎగిరిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. కొన్ని చోట్ల మామిడికాయలు రాలిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్డు సౌకర్యం లేక వర్షాకాలంలో జంపన్నవాగు నుంచి ఈదుకుంటూ పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల సమయంలో పడవలను నడుపుతున్నారని వాపోయారు. హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పాఠశాలల్లో పరిశుభ్రత పాటించాలి ● జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని గోవిందరావుపేట: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి.పాణిని అన్నారు. మండల పరిధిలోని చల్వాయి గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో క్లీనింగ్, హైజీన్ అండ్ సానిటేషన్ వన్ డే వర్క్షాప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా విద్యా శాఖ అధికారి జి.పాణిని, జీసీడీఓ రమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాణిని మాట్లాడుతూ పాఠశాలల్లో మాస్కులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. పాఠశాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 9 మండలాల కేజీబీవీ, టీఎస్ఎంఎస్ గర్ల్స్ హాస్టల్స్, టీఎస్ఆర్ఈఐఎస్ బండారుపల్లికి చెందిన స్కావెంజర్స్, ఏఎన్ఎంఎస్లు పాల్గొన్నారు. -
వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేయకపోతే ఉద్యమమే
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో ఎస్జీటీలకు మాన్యువల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలుపుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. తొలిత షెడ్యూల్లో ప్రకటించిన వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని ప్రకటించింది. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లోని డీఈవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ ఉన్నతాధికారులు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీల నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పిందని ఈ రోజు లీప్ యాప్లో వెబ్ కౌన్సెలింగ్ మోడల్ వీడియోను విడుదల చేశారని అన్నారు. వెబ్ కౌన్సెలింగ్ విధానంలో రెండు వేలకు పైగా ఆప్షన్స్ నమోదు చేయడం తప్పనిసరి బదిలీ ఉపాధ్యాయులకు కష్టతరమని అన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడిలో ఉన్నారని, ఇచ్చిన మాట ప్రకారం ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని డీఈవో మాణిక్యంనాయుడుకు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు డి.శ్రీనివాస్, వి.రవీంధ్రనాయుడు, జోగారావు, కేఎస్ శ్రీనివాసరావు, సూరిబాబు, బంకపల్లి శివప్రసాద్, డి.రాము, డి.ఈశ్వరరావు, జేవీఆర్కే ఈశ్వరరావు, పైడిరాజు, పి.శ్రీనివాసరావు, ఎన్.రమణ, కంది రామారావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. మాటిచ్చారు... నిలుపుకోండి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డీఈవో కార్యాలయం ఎదుట నిరసనలు -
సత్తా చాటిన తెలంగాణ ఎడ్లు
సీఎస్పురం(పామూరు): మండల కేంద్రమైన సీఎస్పురంలో రాచూరి పెద్దమ్మతల్లి తిరునాళ్ల సందర్భంగా గురువారం కాపునాయుళ్ల సంఘం ఆధ్వర్యంలో ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం హుజూర్నగర్కు చెందిన ఎడ్ల జత ప్రథమ స్థానంలో నిలిచింది. పోటీలను వైఎస్సార్ సీపీ నాయకుడు కదిరి ప్రకాశరావు, కాపు సంఘ నాయకులు ఆమంచి స్వాములు ప్రారంభించారు. పోటీల్లో మొత్తం 10 జతల ఎడ్లు పాల్గొనగా హుజూర్నగర్కు చెందిన కేశవరెడ్డి, సురేందర్రెడ్డిల ఎడ్ల జత ప్రథమ స్థానం, వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరుకు చెందిన వెంకటేష్యాదవ్ ఎడ్ల జత ద్వితీయ స్థానం, అదేజిల్లా రంగసాయపల్లెకు చెందిన వెంకటసుబ్బారెడ్డి ఎడ్ల జత తృతీయ స్థాఽనం, నంద్యాల జిల్లా రామసుబ్బారెడ్డి ఎడ్ల జత నాలుగో స్థానం, బాపట్ల జిల్లా పావులూరి వీరాస్వామి ఎడ్ల జత ఐదో స్థానం, నంద్యాల జిల్లా దినేష్రెడ్డి ఎడ్ల జత ఆరో స్థానం, అనంతపురం జిల్లా రామాంజనేయులు ఎడ్ల జత ఏడో స్థానంలో నిలిచాయి. ప్రథమ బహుమతి రూ.1,00,116 తులబందుల చలమయ్య నాయుడు, ద్వితీయ బహుమతి రూ.75,116ను మరాసుల రోశయ్య, తృతీయ బహుమతి రూ.50,116ను తిరుమలశెట్టి కిరణ్కుమార్, నాలుగో బహుమతి రూ.30,116ను ఆకుపాటి రమణయ్య, 5వ బహుమతి రూ.20,116ను మన్నేపల్లి వెంకటనరసయ్య, ఆరో బహుమతి రూ.15 వేలు బోయిన మాలకొండయ్య, ఏడో బహుమతి రూ.10 వేలను తోట అశోక్నాయుడు అందజేశారు. -
ధర కోసం మొర
మద్దతు ధర కల్పించాలని పొగాకు రైతులు గొంతు చించుకుంటున్నా వ్యాపారుల పంథాలో ఎలాంటి మార్పు కానరావడం లేదు. నాణ్యమైన పొగాకును సైతం తిరస్కరిస్తుండటంతో రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. గురువారం ఒంగోలులోని త్రోవగుంట వేలం కేంద్రంలో ఎఫ్–3 రకం బేళ్లకు వ్యాపారులు సరైన ధర ఇవ్వకపోవడంతో కొనుగోళ్ల ప్రక్రియను అడ్డుకుని రైతులు నిరసన తెలిపారు. పలువురు రైతులు చేసేదేమీ లేక బేళ్లను ట్రాక్టర్లలో ఎత్తుకుని ఇంటిబాట పట్టారు. – సాక్షి ఒంగోలు -
‘పాలమూరు’కు మరో అమాత్యగిరి
కర్ణాటక సరిహద్దులో ఉన్న మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీహరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారనే పేరు శ్రీహరికి ఉంది. సర్పంచ్గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉండగా.. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సైతం బాధ్యతలు చేపట్టారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. రాష్ట్రంలో బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటికి మంత్రి పదవి.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు మేలు చేస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇవన్నీ శ్రీహరికి కలిసి రాగా.. ఆయన పేరు ఖరారైనట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎలాంటి అవరోధాలు లేకుంటే ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి అయిన ఘనత శ్రీహరికి దక్కనుంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరుకు మరో అమాత్యగిరి దక్కనుంది. నారాయణపేట జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వాకిటి శ్రీహరిని మంత్రి పదవి వరించనుంది. కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసిన జాబితాలో ఆయన పేరున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. బీసీ కోటాలో వాకిటితో పాటు రాష్ట్రంలో పలు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు లేదా నలుగురికి సీఎం రేవంత్రెడ్డి కేబినెట్లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఆదివారం మధ్యాహ్నం తర్వాత ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్లో ఒకే ఒక్క ముదిరాజ్ ఎమ్మెల్యే.. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్లకు మొదటి విడతలో మంత్రి పదవి లభించలేదు. దీంతో ముదిరాజ్ల నుంచి విమర్శలు వెల్లువెత్తగా.. రెండో విడతలో చేపట్టే మంత్రి వర్గ విస్తరణలో ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఖాయమని కాంగ్రెస్ పెద్దలు సంకేతాలు ఇచ్చారు. గతేడాది లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుమార్లు ఉమ్మడి జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్రెడ్డి.. ముదిరాజ్ల విజ్ఞప్తి మేరకు వారిని బీసీ–డీ నుంచి ఏ కేటగిరికి మారుస్తామని.. దీంతోపాటు ఈసారి మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్లకు స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆ సామాజిక వర్గానికి చెంది.. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో వాకిటి శ్రీహరి మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ కూర్పులో ఆయనకు బెర్త్ ఖరారైంది. కాగా.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, కొల్లాపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉండగా ఇప్పుడు శ్రీహరికి బెర్త్ దక్కడంతో.. రాష్ట్ర కేబినెట్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్దపీట వేసినట్లయింది. ఖర్గేతో సాన్నిహిత్యం.. రాహుల్తో ప్రశంసలు.. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి కేబినెట్ బెర్త్ ఖరారు ఫైనల్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. నేడు ప్రమాణస్వీకారం చేసే అవకాశం