- అమెరికా వాణిజ్య కార్యదర్శితో జైట్లీ మాటామంతి
- 5రోజుల పర్యటన నిమిత్తం యూఎస్ వెళ్లిన కేంద్ర ఆర్థిక మంత్రి
వాషింగ్టన్: భారత ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపేలా హెచ్1బీ వీసాల జారీని కఠిన తరంచేసిన అమెరికా నిర్ణయంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం వాషింగ్టన్లో అమెరికా వాణిజ్య కార్యదర్శి విల్బర్ రోస్ ను కలుసుకుని వీసాల అంశంపై చర్చించారు. అమెరికా అభివృద్ధికి భారత నిపుణులు ఎంతగానో తోడ్పాటును అందించారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికా అధికార యంత్రాంగం తదుపరి నిర్ణయాలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది..
దీనిపై రోజ్ స్పందిస్తూ.. హెచ్1బీ వీసాల విధానంపై సమీక్ష ప్రక్రియ మొదలైందని, వీటిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. చర్చల సందర్భంగా దేశంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల గురించి రోస్కు జైట్లీ వివరించారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు మొదలైన అంశాలను కూడా ప్రస్తావించారు. జీఎస్టీకి వాస్తవ రూపం ఇచ్చినందుకు జైట్లీని రోస్ అభినందించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచబ్యాంకు సమావేశాల్లో పాల్గొనే నిమిత్తం ఐదు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన జైట్లీ పలువురు అమెరికన్ ఉన్నతాధికారులను కలుసుకునే అవకాశం ఉంది.
హెచ్1బీ వీసాల దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు.. అత్యున్నత నైపుణ్యం కలిగిన వారికి, అత్యధిక వేతనం తీసుకునే వారికే హెచ్1బీ వీసాలను ఇవ్వాలని నిబంధనలను కఠినతరం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిరోజుల క్రితం అధికారిక ఉత్తర్వులపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం 150 బిలియన్ డాలర్ల భారత ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో అమెరికా చర్యలపై భారత ఐటీ పరిశ్రమ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది.
( భారత ఐటీకి ట్రంప్ షాక్)
( వీసాపై ట్రంపరితనం!)
అమెరికాలో అరుణ్: హెచ్1బీ వీసాలపై చర్చ
Published Fri, Apr 21 2017 8:27 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement