సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : కరువు ప్రాంతంగా పేరొందిన పాలమూరుపై వరుణుడు తన కరుణ చూపుతున్నాడు. జిల్లా వ్యాప్తంగా జోరు వానలు ముంచెత్తుతున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా వారం రోజులుగా చెదురు మదురుగా కురుస్తున్న వానలు ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు భారీగా కురిశాయి. సోమవారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా సరాసరి 27.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాయంత్రం 3గంటల తర్వాత దాదాపు గంటకు పైగా కుండపోతగా కురిసింది. ప్రతీరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాతావరణం సాయంత్రం 3గంటల సమయంలో ఒక్కసారిగా చల్లబడుతోంది. ఆకాశమంతా మేఘావృతమై ఒక్కసారిగా వర్షం జోరందుకుంటోంది.
రికార్డు స్థాయిలో..
వారం రోజులుగా జోరు వానలు కురుస్తుండటంతో మహబూబ్నగర్ జిల్లాలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. కేవలం ఆరు రోజుల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా సరాసరిగా 98 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంత భారీ స్థాయిలో వర్షం కురవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీంతో చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ముఖ్యం గా నారాయణపేట డివిజన్ పరిధిలోని చాలా చెరువులు అలుగు పోస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా ఆశించిన స్థాయిలో వానలు కురవకపోవడంతో రైతాంగం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. కానీ ఈశాన్య రుతుపవనాల కొత్త ఊపు కారణంగా చెరువులు కుంటలు నిండుతుండటంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
పదేళ్లలో ఇదే గరిష్టం...
జిల్లాలో వారం రోజులుగా ప్రతీ రోజు వానలు కురుస్తున్నాయి. గత పదేళ్లలో అక్టోబర్ నెలలో ఇంత ఉధృతంగా వర్షాలు కురవడం ఇదే మొదటి సారని వాతావరణ విభాగం పేర్కొంటుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో సరాసరిగా 454 మి.మీటర్ల వర్షం కురవాల్సి ఉంది. కానీ సాధారణం కంటే తక్కువగా కేవలం 440 మి.మీ. మాత్రమే కురిసింది. అయితే ఈశాన్య రుతుపవనాల సీజన్లో మాత్రం వారం రోజుల వ్యవధిలో 98 మి.మీ. వర్షం కురిసింది. ఇలా ఈశాన్య రుతుపవనాలు విజృభించడం గత పదేళ్లలో ఎన్నడూ జరగలేదు. ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమయ్యే సెప్టెంబర్ 17నుంచి డిసెంబర్ 17 వరకు ఉండే ఈ సీజన్ మొత్తం కేవలం 111.3 మి.మీ మాత్రమే వర్షం కురిసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఈసారి కేవలం సీజన్ ప్రారంభమైన 15 రోజుల్లోనే 110 మి.మీ వర్షం కురిసింది. అంటే 3నెలల వాన కేవలం 15 రోజుల్లోనే కురిసి కొత్త రికార్డు సృష్టించాయి.
13 మండలాల్లో అధిక వర్షం..
తీవ్ర వర్షలోటుతో సతమతమవుతున్న పాలమూరు జిల్లాలో పది రోజు ల్లో పరిస్థితి తారుమారైంది. జిల్లాలోని 26 మండలాలలో దాదాపు 20 మండలాలు తీవ్ర వర్షలోటు ఉండేది. కానీ ప్రస్తుతం .. దాదాపు 13 మం డలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా నారాయణపేట డివిజన్లోని ఊట్కూరు మండలం మినహా 10 మండలాల్లో అధిక వర్షపా తం నమోదైంది. జిల్లాలో ఈసారి ధన్వాడ మండలంలో సాధారణం కం టే అధికంగా రికార్డు స్థాయిలో 89.5శాతం అధిక వర్షం కురిసింది. ధన్వా డలో సాధారణంగా 404.2 మి.మీ కురవాల్సి ఉండగా.. 766 మి. మీ కురిసింది. అలాగే దామరగిద్దలో 73.6శాతం, మాగనూరులో 72.6 శాతం అధికంగా కురిసింది. ఎనిమిది మండలాలలో సాధారణ వర్షపాతం నమోదైంది. కేవలం నాలుగు మండలాల్లో వర్షలోటు ఉంది.
దేవరకద్రలో..
దేవరకద్ర రూరల్: దేవరకద్ర మండలంలో సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. వర్షాకాలం ప్రారంభం అయినప్పటి నుండి ఇంత పెద్ద వర్షం కురవడం ఇదే మొదటిసారి. దీంతో చెరువులు, కుంటల్లోకి నీళ్లు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నాయి. ఈ వర్షానికి బండర్పల్లివాగు పొంగిపొర్లుతుంది. మండలంలోని వెంకటాయపల్లి, గద్దెగూడెం, బస్వాయపల్లి, గోపన్పల్లి, లక్ష్మిపల్లి, రేకులంపల్లి, కౌకుంట్ల తదితర గ్రామాల చెరువులు, కుంటల్లోకి కూడా నీరు చేరుతోంది. ఇక దేవరకద్ర మండలం డోకూర్ చెరువుకు ఆదివారం రాత్రి కృష్ణాజలాలు వచ్చి చేరాయి. రెండు రోజుల్లో చెరువు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంది.
నాలుగేళ్ల తర్వాత...
జడ్చర్ల: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగేళ్ల తర్వాత దుందుబీ నదిలోకి సోమవారం కురిసిన కుండపోత వర్షానికి భారీగా నీరు చేరింది. దందుబీ వాగు ప్రవహిస్తే తమ బోర్లు రీచార్జ్ అవుతాయని ఈ సందర్బంగా రైతులు తెలిపారు.
ఉధృతంగా పెద్దవాగు
మద్దూరు: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు మండలంలోని పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కోస్గి, దౌల్తాబాద్, గండీడ్ మండలాల్లో ని వాగుల నీరంతా పెద్దవాగుకు రావడంతో ఉధృతి మరింత పెరిగింది. లింగల్చేడ్ దగ్గర ఉన్న రోడ్డు వంతెనను ఆనుకుని వాగు పారింది.
నీట మునిగిన మందిపల్లి తండా
ధన్వాడ: కేఎస్పీ కాలువ నీటికి తోడు సోమవారం ఉదయం కురిసిన వర్షపు నీటితో ధన్వాడ మండలంలోని మందిపల్లి తండా నీట మునిగింది. నీరు మొత్తం ఇళ్లలోకి రావడంతో సరుకులు మునిగి పోయాయని తండావాసులు వాపోయారు. అలాగే, పలువురు రైతుల వరి పొలాలు సైతం నీట మునిగాయి.
జోరు వాన
Published Tue, Oct 3 2017 2:03 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ప్రముఖ ఫైనాన్స్ కంపెనీపై ఆర్బీఐ చర్యలు
ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇండియా కూటమి 272 సీట్లలో గెలిచేసింది: జైరామ్రమేశ్
అనిల్ అంబానీకి మరో దెబ్బ.. రూ.397 కోట్లు నష్టం
చరిత్ర సృష్టించిన బట్లర్.. తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా
వర్షం వల్ల ఫైనల్ రద్దు అయితే.. ఐపీఎల్ విజేత ఎవరంటే?
స్కూల్ పిల్లల చేతుల మీదుగా 'సంకెళ్లు' పాట విడుదల
ఆలౌట్ తాగిన చిన్నారి.. అరుదైన చికిత్సతో కాపాడిన కిమ్స్ కడల్స్ డాక్టర్లు
Deepika Padukone: ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న స్టార్ హీరోయిన్ (ఫోటోలు)
Kavya Maran: అవధుల్లేని ఆనందం.. యెస్.. ఫైనల్లో సన్రైజర్స్ (ఫొటోలు)
తప్పక చదవండి
- ఆరో విడత పోలింగ్.. బీజేపీ అభ్యర్థిపై రాళ్ల దాడి
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
- బిస్కెట్ ప్యాకెట్ల బరువు తగ్గింది.. భారీ జరిమానా పడింది!
- సన్రైజర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్దే: ఆసీస్ లెజెండ్
- రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్ భర్త సక్సెస్ స్టోరీ
- Mangalagiri: రెండోసారి ఓటమికి సిద్ధమైన లోకేష్!
- Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ
- డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
- చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
- TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
Advertisement