వర్షం కోసం చూసే రోజులు పోతాయి: హరీష్రావు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ ప్రభుత్వంలో మత్య్సకారులకు మంచి రోజులు రాబోతున్నాయని నీటి పారుదల శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దసరా పండుగలోపు జిల్లాలోని అన్ని చెరువులను నింపుతామని హామీ ఇచ్చారు. ఇకపై కాళేశ్వరం జలాలతో ప్రతి ఏటా చెరువులు, కాలువలు నిండుతాయని అన్నారు. నింగికి ముఖం పెట్టి వర్షం కోసం ఎదురు చూసే రోజులు త్వరలోనే పోతాయని ఆయన పేర్కొన్నారు. మత్య్సకారుల పెదవులపై చిరునవ్వు చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.