ఈ ముగ్గురికీ విషెస్‌ చెప్పిన మహేశ్‌బాబు

Mahesh Babu Wishes Three Women On International Womens Day - Sakshi

మహిళ విజయం వెనుక పురుషుడు ఉండకపోవచ్చేమో కానీ, ప్రతి మగాడి విజయం వెనక స్త్రీ ఉంటుందంటారు. అంతేకాదు.. జయాపజయాలకు అతీతంగా అన్నివేళలా అతని వెన్నంటే నిలుస్తుంది. అతనికి తోడూనీడగా, చేదోడువాదోడుగా ఉంటూ అంతా తానై చూసుకుంటుంది. ఇది కేవలం సామాన్యుల విషయంలోనే జరుగుతుందనుకుంటే పొరపాటే. సెలబ్రిటీలు ఇందుకు మినహాయింపు కాదంటున్నాడు టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన జీవితాన్ని ప్రభావితం చేసిన ముగ్గురు వ్యక్తులకు నేడు శుభాకాంక్షలు తెలియజేశాడు. (‘ఆకాశంలో సగం’ కాదు ఆమే ఆకాశం)


తనకు జన్మనిచ్చిన ఇందిరా, అర్ధాంగి నమ్రతా శిరోద్కర్‌, చిరునవ్వులు చిందించే కూతురు సితార ఫొటోలను పంచుకున్నాడు. ‘ఈ ముగ్గురు నా ఉనికిని ప్రభావితం చేశారు. వీళ్లతో పాటు మహిళామణులందరూ మరింత శక్తిమంతంగా ఎదుగుతూ మరింత ముందుకు సాగాలి’ అని ట్వీట్‌ చేశాడు. నమ్రత సైతం తన తల్లి ఫొటోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాగా మహేశ్‌ సినిమాల విషయానికొస్తే.. ‘గీతాగోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌తో ఓ సినిమా చేయనున్నాడు. మరోవైపు చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో రానున్న ‘ఆచార్య’ సినిమాలో ఓ కీలక పాత్రను పోషించేందుకు ఓకే చెప్పారు. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా దక్షిణాదిలో 90 లక్షల  మంది ఫాలోవర్లను సంపాదించుకున్న తొలి నటుడిగా నిలిచాడీ హీరో.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top