హిందుజా లేలాండ్ ఫైనాన్స్ ఐపీఓకు సెబీ ఓకే | Sakshi
Sakshi News home page

హిందుజా లేలాండ్ ఫైనాన్స్ ఐపీఓకు సెబీ ఓకే

Published Tue, Jun 28 2016 1:34 AM

హిందుజా లేలాండ్ ఫైనాన్స్ ఐపీఓకు సెబీ ఓకే

సీఎల్ ఎడ్యుకేట్ ఐపీఓకు కూడా గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన హిందుజా లేలాండ్ ఫైనాన్స్ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబి ఆమోదం లభించింది. ఈ కంపెనీతో పాటు విద్యా రంగానికి చెందిన సీఎల్ ఎడ్యుకేట్ ఐపీఓకు కూడా సెబీ పచ్చజెండా ఊపింది. ఈ రెండు కంపెనీలు ఐపీఓ ముసాయిదా పత్రాలను ఈ ఏడాది మార్చి 30న సెబీకి సమర్పించాయి. హిందుజా లేలాండ్ ఫైనాన్స్ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది.

వీటితో పాటు ప్రస్తుత వాటాదారుల 2.66 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో జారీ చేయనున్నారు. ఈ ఐపీఓకు యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్, యస్ సెక్యూరిటీస్ సంస్థలు మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించనున్నాయి. ఇక సీఎల్ ఎడ్యుకేట్ సంస్థ ఐపీఓ ద్వారా 20 లక్షల తాజా ఈక్విటీ షేర్లను 26 లక్షల ప్రమోటర్ల షేర్లను జారీ చేయనున్నది. ఐపీఓకు లీడ్ మేనేజర్‌గా కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ వ్యవహరించనున్నది.

Advertisement
Advertisement