
ఇన్చార్జ్ డీటీసీగా నిరంజన్ రెడ్డి
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఇన్చార్జ్ జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్గా నిరంజన్ నియమితులయ్యారు. ఆయన చిత్తూరు జిల్లా డీటీసీగా పని చేస్తున్నారు. ఇక్కడ ఇన్చార్జ్ డీటీసీగా పని చేస్తున్న ప్రసాద్ వ్యక్తి గత పనులపై నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో ఇన్చార్జ్ డీటీసీగా నిరంజన్రెడ్డిని నియమించారు.
జైళ్ల శాఖ డీఐజీగా రవికిరణ్
కడప అర్బన్: కడప నగర శివార్లలో కేంద్ర కారాగారం పక్కనే వున్న జైళ్ల శాఖ రాయలసీమ డీఐజీగా ఎం.ఆర్ రవికిరణ్ను నియమించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నేడో, రేపో అధికారికంగా రానున్నట్లు సమాచారం. ఈయన గతంలో కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్గా విధులను నిర్వహించారు. ప్రస్తుతం కోస్తాంధ్ర ప్రాంతంలో జైళ్లశాఖ డీఐజీగా పనిచేస్తున్నారు.
ఖైదీలకు మెరుగైన
సదుపాయాలు కల్పించాలి
కడప అర్బన్: కడప కేంద్ర కారాగారంలో ఉన్న ఖైదీలకు మెరుగైన సదుపాయాలు అందించాలని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ అంజనీ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం జైళ్ల శాఖ అధికారులతో కలిసి ఆయన కడప కేంద్రకారాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలకు అందించే సదుపాయాలు వసతులపై ఆరా తీశారు. కేంద్రకారాగారం పరిసరాలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కోరారు. రీమాండ్ ఖైదీ వివరాలు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో కడప కేంద్రకారాగారం సూపరింటెండెంట్ రాజేశ్వరరావు, జైలు అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం చేయండి
కడప అర్బన్: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చిన ఫిర్యాదు దారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ‘ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక‘ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి విచ్చేసిన ప్రజలతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి సదరు ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్బాబు, డి.టి.సి డిఎస్పీ అబ్దుల్కరీం, మహిళా పీఎస్ డిఎస్పీ బాలస్వామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నిత్యపూజ స్వామి హుండీ ఆదాయం రూ. 1,08,353
సిద్దవటం: సిద్దవటం మండలంలోని లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్యపూజ స్వామి ఆలయానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. రూ. 1,08,353 వచ్చినట్లు ఆలయం ఈఓ శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 28 మార్చి 2025 నుంచి 2 జూన్ 2025 వరకు స్వామి వారి హుండీలో భక్తులు వేసిన కానుకల ద్వారా ఈ ఆదాయం వచ్చిందన్నారు.కార్యక్రమంలో దేవదాయ శాఖ కొండ గంగమ్మ దేవస్థానం నందిమండల కార్యనిర్వహణాధికారి మారుతిప్రసాద్, సిద్దవటం పోలీసులు శివప్రసాద్రెడ్డి, ఆలయ సిబ్బంది చంద్రా, అర్చకులు సుబ్రమణ్యం శర్మ, స్థానికులు వెంకటసుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇన్చార్జ్ డీటీసీగా నిరంజన్ రెడ్డి

ఇన్చార్జ్ డీటీసీగా నిరంజన్ రెడ్డి