
గౌతమి మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు అటానమస్ హోదా
ప్రొద్దుటూరు కల్చరల్ : విద్యార్థులకు అందిస్తున్న విద్యాప్రమాణాలను గుర్తించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తమ కళాశాలకు అటానమస్ హోదా కల్పించిందని గౌతమి మహిళా ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ నాగూర్ తెలిపారు. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే 29 నుంచి ఐదేళ్లపాటు అటానమస్ హోదా తమ కళాశాలకు ఉంటుందన్నారు. గత 16 ఏళ్లుగా తమ కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థినులకు ఉద్యోగాలు రావడానికి, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కళాశాలకు స్వయంప్రతిపత్తి కల్పించడం వల్ల విద్యార్థులకు స్కాలర్షిప్లు, రీసెర్చ్ ఓరియెంటెడ్ కార్యక్రమాలకు దోహపడుతుందన్నారు. క్యాంపస్ సెలక్షన్స్, ఉద్యోగాల ఎంపికలో ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. కళాశాలకు అటానమస్ హోదా రావడానికి కృషి చేసిన అధ్యాపకులు, సిబ్బందిని అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామసుబ్బమ్మ మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థినులకు అందుతున్న నాణ్యమైన బోధన వల్ల 2023లో న్యాక్ బీ ప్లస్ లభించిందని తెలిపారు. ఈ ఏడాది అటానమస్ హోదా లభించిందన్నారు. మొదటి, ద్వితీయ సంవత్సరాల నుంచి విద్యార్థులకు పరిశ్రమల్లో ఇంటర్న్షిప్ చేయిస్తామని తెలిపారు.