
విజయవంతానికి చర్యలు తీసుకోవాలి
నేతలకు మంత్రుల దిశానిర్దేశం
కడప రూరల్: మహానాడు విజయవంతానికి అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు తెలిపారు. కడప నగర శివారులోని మహానాడు ప్రాంగణంలో జరుగుతున్న సన్నాహాక కార్యక్రమాలను వారు పరిశీలించారు. అనంతరం ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో నిర్వహించిన సమావేశంలో అచ్చెన్నాయుడు, నారాయణ, గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు కలిసికట్టుగా పని చేయాలన్నారు. భద్రత, వసతి, వేదికలు, రవాణాతోపాటు ఇతర అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పరిశీలకులు పత్తిపాటి కుసుమకుమారి, నిమ్మల రామానాయుడు, ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా నేతలు పాల్గొన్నారు.