కాలువ పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

కాలువ పనుల పరిశీలన

Jun 7 2025 1:14 AM | Updated on Jun 7 2025 1:16 AM

ఉండి: గత నెలలో ప్రారంభమై లోపభూయిష్టంగా జరుగుతున్న ఉండి కాలువ పూడికతీత పనులపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించగా అధికారులు ఎట్టకేలకు స్పందించారు. కలిసిపూడి రెగ్యులేటర్‌ నుంచి కాలువ శివారు వరకు పనులు ఇష్టానుసారం జరగ్గా రైతులు ఆందోళన చెందారు. పూడికతీత పనుల్లో భాగంగా కుంగిన కాలువ గట్లను మరోసారి మరమ్మతులు చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. శుక్రవారం చెరుకువాడ, కలిసిపూడి ప్రాంతాల్లో కుంగిన కాలువ గట్లను ఇరిగేషన్‌ ఏఈ ఫణిశంకర్‌ ఆధ్వర్యంలో పరిశీలించారు. కుంగిన గట్లను త్వరలోనే బాగుచేసి సాగునీటి ప్రవాహనికి అడ్డులేకుండా చేస్తామని ఏఈ తెలిపారు.

ప్రశాంతంగా పీజీ ఈసెట్‌

భీమవరం: ఎంటెక్‌, ఎం ఫార్మసీలో ప్రవేశాలకు పీజీ ఈసెట్‌ పరీక్షలు భీమవరంలోని డీఎన్నార్‌ అటానమస్‌ కళాశాలలో శుక్రవారం నిర్వహించారు. ఉద యం 152 మందికి 139 మంది, మధ్యాహ్నం 146కి 128 మంది అభ్యర్థులు హాజ రైనట్లు పర్యవేక్షకులు తెలిపారు. విష్ణు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఉదయం 80కి 80 మంది, మధ్యాహ్నం 80కి 63 మంది హాజరయ్యారు.

కాలువ పనుల పరిశీలన 1
1/1

కాలువ పనుల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement