
బాబు మోసం ప్రజలకు అర్థమవుతోంది
తాడేపల్లిగూడెం అర్బన్: చంద్రబాబు ఎన్నికల సందర్భంగా చెప్పిన మోసపు మాటలు, అబద్ధపు హామీలు ప్రజలకు క్రమేపీ అవగతమవుతున్నాయని, ఏడాది పాలనలో ఒక్క హామీని కూడా అమలు చేయని తీరును గమనించి మరోసారి బాబు మోసపు మాటలకు బలయ్యామని భావిస్తున్నారని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. సోమవారం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 4న నిర్వహించనున్న బాబు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆర్థిక లబ్ధిని పొందిందన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. తల్లికి వందనం, నిరుద్యోగభృతి, సీ్త్రశక్తి పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఢిల్లీ నుంచి అప్పులు తె చ్చేందుకు అధికారం చేపట్టినట్టు ఉందన్నారు. తీసుకువచ్చిన అప్పులు ఏమి చేశారో తెలియడం లేదన్నారు. ఉద్యోగులకు ఈనెల జీతాలు ఇచ్చేందుకు మరో రూ.7 వేల కోట్లు అప్పు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ రోజుకో ధోరిణితో డైలాగులు చెప్పడమే కాని ఆయన వల్ల ప్రజలకు ఉపయోగం ఏమీ లేదన్నారు.
ప్రజలు విసిగిపోయారు
నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదు నూరి మురళీకృష్ణంరాజు, నియోజకవర్గ పరిశీలకు డు పప్పుల రామారావు మాట్లాడుతూ చంద్రబాబు ఏడాది పాలనకు ప్రజలు విసిగిపోయారన్నారు. హామీలను గాలికి వదిలేసిన చంద్రబాబు చేసిన అ రాచకాలు, అన్యాయాలపై ఈనెల 4న బాబు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని చెప్పారు. అనంతరం వెన్నుపోటు దినం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు పెండ్ర వీరన్న, నాయకులు కర్రి భాస్కరరావు, కొలుకులూరి ధర్మరాజు, జడ్డు హరిబాబు, ముప్పిడి సంపత్కుమార్, ఎంపీపీ దాసరి హైమావతి, బోణం విజయనిర్మల, పత్సమట్ల సావిత్రి, కై కాల శ్రీనివాస్, తగరం పూడి మరళీ, సిర్రాపు శాంతకుమార్, సగరం ప్రసాద్, అరామిల్లి రవి, కొవ్వూరి విజయభాస్కరరెడ్డి, తాడేపల్లిగూడెం పట్టణ, పెంటపాడు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ
4న వెన్నుపోటు దినం నిరసన జయప్రదానికి పిలుపు