
ఇండియా రోల్బాల్ టీం విజయంలో తణుకు క్రీడాకారులు
తణుకు అర్బన్: ఇంటర్నేషనల్ ఇన్విటేషనల్ రోల్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో ఇండియా రోల్బాల్ టీం విజయంలో తణుకు క్రీడాకారులు సత్తా చాటారు. ఈ పోటీల్లో తణుకు మునిసిపల్ స్కేటింగ్ రింక్ పశ్చిమ గోదావరి జిల్లా రోల్ బాల్ అసోసియేషన్ క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించినట్లు అసోసియేషన్ సెక్రటరీ లావణ్య, కోచ్ చందు తెలిపారు. శ్రీలంకలో గతనెల 29వ తేదీన నిర్వహించిన ఈ పోటీల్లో సీనియర్ కేటగిరీలో రెడ్డి పవన్ హర్షవర్థన్, జూనియర్ కేటగిరీలో నలమాటి షరత్రావు, గుల్లపూడి రంజిత్కుమార్, సబ్ జూనియర్ కేటగిరీలో రెడ్డి గగన్దీప్ స్వర్ణపతకాలు సాధించారని వివరించారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ క్రీడాకారులను అభినందించారు.