
తడిసిన ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
పెనుగొండ: అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం కురిసిన వర్షం కారణంగా తడిసిన ధాన్యం రాశులను, బస్తాలను ఆచంట, పెనుగొండ మండలం ములపర్రులో ఆయన పర్యటించి పరిశీలించారు. తడిసిన ధా న్యాన్ని వేరే రైసు మిల్లులకు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. అలాగే గోనె సంచులు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సంబంధిత అధికారులు రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆర్డీఓ దాసి రాజు, తహసీల్దార్ కనకరాజు, ఏఓలు పి.స్పందన, బి.నాగరాజు, వీఆర్వో సీతారామ్, కోట వెంకటేశ్వరరావు ఆయన వెంట ఉన్నారు.
జాయింట్ కలెక్టర్ రాహుల్కుమార్ రెడ్డి