
కోడికత్తి తగిలి ముగ్గురికి గాయాలు
నూజివీడు: మండలంలోని దేవరగుంటలో నిర్వహిస్తున్న కోడిపందేలపై దాడి చేసేందుకు పోలీసులు వెళ్లగా కత్తికట్టిన కోడిపుంజులు వదిలి ఒక్కసారిగా అందరూ పరిగెత్తడంతో కోడికత్తులు తగిలి ముగ్గురికి గాయాలయ్యాయి. గ్రామంలో ఆదివారం సాయంత్రం కోడిపందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు రూరల్ పోలీస్స్టేషన్కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు పందేలు ఆపేందుకు సాయంత్రం ఐదు గంటల సమయంలో వెళ్లారు. కోడిపుంజులకు కత్తులు కట్టి పందేం వేసేందుకు బరిలోకి దించుతుండగా పోలీసులు వెళ్లడంతో అక్కడి వాళ్లు పుంజులను వదిలేసి పారిపోతుండగా పుంజులు బెదిరి జనంపైకి పడ్డాయి. దీంతో దేవరగుంటకు చెందిన పల్నాటి ప్రసాద్కు మోకాలి వద్ద, నూజివీడు పట్టణంలోని రామాయమ్మరావుపేటకు చెందిన మాళావతు అశోక్కు చేతిమీద, కానిస్టేబుల్కు కాలుపైన కోడికత్తి తెగింది. ప్రసాద్కు దాదాపు 14కుట్లు పడ్డాయి. అశోక్కు నరం తెగడంతో విజయవాడ రిఫర్ చేశారు. అధికార పార్టీ అండ చూసుకొని గ్రామంలో ప్రతిరోజూ కోడిపందేలు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. కోడిపందేలు నిర్వహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.