
చేపలు పడుతూ.. ఎర్రకాలువలో పడి వ్యక్తి మృతి
జంగారెడ్డిగూడెం: ప్రమాదవశాత్తు లక్కవరం సమీపంలోని ఎర్రకాలువలో పడి వ్యక్తి మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలివి. మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన దల్లి రామాంజనేయులు (49) అలియాస్ రామాంజి కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాడు. ఖాళీ సమయంలో గేలం వేసుకుని చేపలు పడుతుంటాడు. మంగళవారం లక్కవరం పరిధిలో ఉన్న ఎర్ర కాలువలో గట్టుమీద కూర్చొని చేపలు పడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడు. కాలువ లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయి రామాంజనేయులు మృతి చెందాడు. లక్కవరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.