
కోళ్ల వ్యర్థాలతో ఆక్వా సాగుపై ఆగ్రహం
స్పందన
కై కలూరు: కోళ్ల వ్యర్థాలతో ఫంగసిస్ చేపల సాగు చేస్తున్న చటాకాయి గ్రామానికి చెందిన రైతు ఘంటసాల సుబ్బరాజుకు మత్స్యశాఖ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ‘చేపల సాగులో కోడి వ్యర్థాలు’ అనే శీర్షికతో సాక్షిలో మంగళవారం వెలువడిన కథనంపై అధికారులు స్పందించారు. కై కలూరు మత్స్యశాఖ అధికారి చెలపురి గణపతి వెంటనే స్పందించారు. వ్యర్థాలతో సాగు చేస్తున్న 6.5 ఎకరాల చెరువును సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎఫ్డీవో మాట్లాడుతూ కోళ్ళ వ్యర్థాలతో సాగు చేయడం నేరమన్నారు. సదరు రైతుకు కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్వా సాగు అనుమతి పత్రాన్ని రద్దు చేస్తున్నామన్నారు. సాగును వెంటనే నిలుపుదల చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.

కోళ్ల వ్యర్థాలతో ఆక్వా సాగుపై ఆగ్రహం