సీహెచ్‌ఓల నిరసన గళం | - | Sakshi
Sakshi News home page

సీహెచ్‌ఓల నిరసన గళం

Apr 29 2025 10:04 AM | Updated on Apr 29 2025 10:04 AM

సీహెచ్‌ఓల నిరసన గళం

సీహెచ్‌ఓల నిరసన గళం

భీమవరం(ప్రకాశం చౌక్‌): గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న విలేజ్‌ క్లినిక్‌ సీహెచ్‌ఓలు సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు జిల్లాలోని 364 మంది సీహెచ్‌ఓలు కలెక్టరేట్‌ ముందు టెంట్‌ వేసి ప్లకార్డులతో నిరసన తెలిపారు. వారి సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గత 6 ఏళ్లుగా పనిచేస్తున్నా జీతాలు పెంచడం లేదని, ఉద్యోగ భద్రత లేదని, పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీహెచ్‌ఓలు ప్రమాదవశాత్తు మరణిస్తే ఎక్స్‌గ్రేషియా కూడా చెల్లించడం ఆవేదన వెలిబుచ్చారు. ఆరేళ్లు పూర్తి చేసుకున్న సీహెచ్‌ఓలను రెగ్యులర్‌ చేయాలని, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ చేయాలని, పని ఆధారిత ప్రోత్సాకహాలు ఇవ్వాలని, ఈపీఎఫ్‌ పుననుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. క్లినిక్‌ అద్దె బకాయిలు చెల్లించాలని, ఇంక్రిమెంట్‌, ట్రాన్స్‌ఫర్‌, ఎక్స్‌గ్రేషియా, పితృత్వ సెలవులు అమలు చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement