దరఖాస్తుల స్వీకరణలో నిర్లక్ష్యం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల స్వీకరణలో నిర్లక్ష్యం చేయొద్దు

Jun 4 2025 1:08 AM | Updated on Jun 4 2025 1:08 AM

దరఖాస్తుల స్వీకరణలో నిర్లక్ష్యం చేయొద్దు

దరఖాస్తుల స్వీకరణలో నిర్లక్ష్యం చేయొద్దు

అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి

ఖానాపురం: రైతులు సమర్పించే భూభారతి దరఖాస్తు ల స్వీకరణలో నిర్లక్ష్యం చేయొద్దని అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి అన్నారు. మండలంలోని రంగాపురం, మాటువీరారం పరిధిలో మంగళవారం నిర్వహించిన భూభారతి రైతు సదస్సులను అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి సందర్శించారు. అధికారులకు దరఖాస్తుల స్వీకరణపై సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు భూ సమస్యలకు సంబంధించిన ప్రతీ సమస్యను దరఖాస్తుల రూపంలో సమర్పించాలన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పరిశీలించి దశలవారీగా పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. అధికారులు దరఖాస్తులు స్వీకరించే క్రమంలో అలసత్వం ప్రదర్శించినా, దురుసుగా ప్రవర్తించినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌, డీటీ రాజారేణుక, ఏఓ శ్రీనివాస్‌, ఎస్‌ఓ సుగుణ, ఏఆర్‌ఐ స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.

భూ భారతితో రైతులకు మేలు

నెక్కొండ: భూ భారతితో రైతులకు మేలు జరుగుతుందని అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి అన్నారు. భూ భారతి చట్టంపై అవగాహన కల్పించడంతోపాటు భూ సమస్యల సత్వర పరిష్కారానికి మండలంలోని పనికర, బొల్లికొండ గ్రామాల్లో మంగళవారం జరిగిన రెవెన్యూ సదస్సులకు ఆమె హాజరై, మాట్లాడారు. సదస్సులు విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పనికరలో 44,బొల్లికొండలో 75 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు.ఈసదస్సులో నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి,తహసీల్దార్‌ రా జ్‌కుమార్‌,డిప్యూటీ తహసీల్దార్‌ రవి,ఆర్‌ఐ నరేందర్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement