‘రైతు భరోసా’కు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

‘రైతు భరోసా’కు వేళాయె..

Jan 28 2025 1:13 AM | Updated on Jan 28 2025 1:13 AM

‘రైతు భరోసా’కు వేళాయె..

‘రైతు భరోసా’కు వేళాయె..

హన్మకొండ : అన్నదాతలకు పంట పెట్టుబడి సాయం రైతు భరోసా ఎట్టకేలకు ప్రారంభమైంది. యాసంగి నుంచి ప్రభుత్వం ఒక పంటకు ఎకరాకు రూ.6వేల చొప్పున, రెండు పంటలకు రూ.12వేలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే సాగుకు యోగ్యం కానీ భూములకు రైతుబంధు ఇచ్చారని, సాగు భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలోని ప్రతి మండలంలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేశారు. జిల్లాలో 12 మండలాల పరిధి 12 గ్రామాల నుంచి 12,637 మంది రైతులను ఎంపిక చేయగా.. రూ.14,29,52,973 జమ కావాల్సి ఉంది. సోమవారం 12,470 మంది రైతులకు సంబంధించి రూ.14,24,20,961 అకౌంట్లలో జమయ్యాయి.

జిల్లాలో క్లియర్‌ ఖాతాలు..

జిల్లాలో బ్యాంకు ఖాతాలు క్లియర్‌గా ఉన్న రైతులు 1,42,009 మంది ఉండగా రూ.1,54,07,97,429 రైతు భరోసా సాయం పొందనున్నారు. కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన రైతులు 7,217 మంది ఉన్నారు. వీరి బ్యాంక్‌ ఖాతాలను వ్యవసాయ అధికారులు అప్‌లోడ్‌ చేయనున్నారు. వీరి బ్యాంక్‌ ఖాతాలు అప్‌లో డ్‌ చేస్తే మొత్తం 1,49,226 అన్నదాతలు రైతు భరో సా పొందనున్నారు. జిల్లాలో సాగుకు యోగ్యం కాని భూములు 6,500 ఎకరాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే రోడ్డు, రియల్‌ ఎస్టేట్‌ స్థలాలు, గుట్టలు, రాళ్లు రప్పలున్న భూములు ఉన్నాయి.

మొదటి విడతలో జిల్లాలోని ఆత్మకూర్‌ మండలం గుడెప్పాడ్‌, భీమదేవరపల్లి, దామెర, ధర్మసాగర్‌ మండలం క్యాతంపల్లి, ఎల్కతుర్తి మండలం వీరనారాయణపురం, హసన్‌పర్తి మండలం పెంబర్తి, ఐనవోలు మండలం రాంనగర్‌, కమలాపూర్‌ మండలం దేశరాజుపల్లి, నడికూడ మండలం చౌటుపర్తి, పరకాల మండలం పైడిపల్లి, శాయంపేట మండలం గట్లకానిపర్తి, వేలేరు మండలం శాలపల్లి గ్రామ రైతులు పెట్టుబడి సాయాన్ని పొందారు.

మండలాల వారీగా రైతు భరోసా వివరాలు (రూ.లలో)..

(కొత్త పట్టాలు పొందిన వారిని మినహాయించి)

మండలం రైతులు సాయం(రూ.లు)

ఆత్మకూర్‌ 10,153 9,63,85,191

భీమదేవరపల్లి 10,905 14,26,06,781

దామెర 7,745 8,49,07,234

ధర్మసాగర్‌ 12,399 15,51,49,446

ఎల్కతుర్తి 11,798 13,10,27,231

హనుమకొండ 1,695 1,07,46,468

హసన్‌పర్తి 14,689 13,64,74,953

ఐనవోలు 13,208 16,05,73,866

కమలాపూర్‌ 15,558 16,07,85,194

కాజీపేట 6,906 6,59,61,848

నడికూడ 10,344 10,77,56,520

పరకాల 7,477 7,32,79,098

శాయంపేట 10,913 10,63,61,167

వేలేరు 8,219 10,87,82,432

మొత్తం 142,009 154,07,97,429

జిల్లాలో 1,42,009 మంది రైతులు

కొత్తగా పాస్‌పుస్తకాలు

పొందినవారు 7,217 మంది

మొదటి విడత 12 గ్రామాల్లో

12,637 మందికి అమలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement