
‘రైతు భరోసా’కు వేళాయె..
హన్మకొండ : అన్నదాతలకు పంట పెట్టుబడి సాయం రైతు భరోసా ఎట్టకేలకు ప్రారంభమైంది. యాసంగి నుంచి ప్రభుత్వం ఒక పంటకు ఎకరాకు రూ.6వేల చొప్పున, రెండు పంటలకు రూ.12వేలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే సాగుకు యోగ్యం కానీ భూములకు రైతుబంధు ఇచ్చారని, సాగు భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని రేవంత్రెడ్డి ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలోని ప్రతి మండలంలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేశారు. జిల్లాలో 12 మండలాల పరిధి 12 గ్రామాల నుంచి 12,637 మంది రైతులను ఎంపిక చేయగా.. రూ.14,29,52,973 జమ కావాల్సి ఉంది. సోమవారం 12,470 మంది రైతులకు సంబంధించి రూ.14,24,20,961 అకౌంట్లలో జమయ్యాయి.
జిల్లాలో క్లియర్ ఖాతాలు..
జిల్లాలో బ్యాంకు ఖాతాలు క్లియర్గా ఉన్న రైతులు 1,42,009 మంది ఉండగా రూ.1,54,07,97,429 రైతు భరోసా సాయం పొందనున్నారు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు 7,217 మంది ఉన్నారు. వీరి బ్యాంక్ ఖాతాలను వ్యవసాయ అధికారులు అప్లోడ్ చేయనున్నారు. వీరి బ్యాంక్ ఖాతాలు అప్లో డ్ చేస్తే మొత్తం 1,49,226 అన్నదాతలు రైతు భరో సా పొందనున్నారు. జిల్లాలో సాగుకు యోగ్యం కాని భూములు 6,500 ఎకరాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు, రియల్ ఎస్టేట్ స్థలాలు, గుట్టలు, రాళ్లు రప్పలున్న భూములు ఉన్నాయి.
మొదటి విడతలో జిల్లాలోని ఆత్మకూర్ మండలం గుడెప్పాడ్, భీమదేవరపల్లి, దామెర, ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి, ఎల్కతుర్తి మండలం వీరనారాయణపురం, హసన్పర్తి మండలం పెంబర్తి, ఐనవోలు మండలం రాంనగర్, కమలాపూర్ మండలం దేశరాజుపల్లి, నడికూడ మండలం చౌటుపర్తి, పరకాల మండలం పైడిపల్లి, శాయంపేట మండలం గట్లకానిపర్తి, వేలేరు మండలం శాలపల్లి గ్రామ రైతులు పెట్టుబడి సాయాన్ని పొందారు.
మండలాల వారీగా రైతు భరోసా వివరాలు (రూ.లలో)..
(కొత్త పట్టాలు పొందిన వారిని మినహాయించి)
మండలం రైతులు సాయం(రూ.లు)
ఆత్మకూర్ 10,153 9,63,85,191
భీమదేవరపల్లి 10,905 14,26,06,781
దామెర 7,745 8,49,07,234
ధర్మసాగర్ 12,399 15,51,49,446
ఎల్కతుర్తి 11,798 13,10,27,231
హనుమకొండ 1,695 1,07,46,468
హసన్పర్తి 14,689 13,64,74,953
ఐనవోలు 13,208 16,05,73,866
కమలాపూర్ 15,558 16,07,85,194
కాజీపేట 6,906 6,59,61,848
నడికూడ 10,344 10,77,56,520
పరకాల 7,477 7,32,79,098
శాయంపేట 10,913 10,63,61,167
వేలేరు 8,219 10,87,82,432
మొత్తం 142,009 154,07,97,429
జిల్లాలో 1,42,009 మంది రైతులు
కొత్తగా పాస్పుస్తకాలు
పొందినవారు 7,217 మంది
మొదటి విడత 12 గ్రామాల్లో
12,637 మందికి అమలు