
17న ‘ప్రజా పరిపాలన’ వేడుక
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఈనెల 17వ తేదీన తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఆ రోజు ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాలను ఆవిష్కరించి వేడుకలు జరపాలని బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. జాతీయ జెండా ఆవిష్కరించేందుకు అతిథులను కూడా నామినేట్ చేశారు. జాబితా ప్రకారం హనుమకొండలో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ములుగులో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క), జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మహబూబాబాద్లో ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య ముఖ్య అతిథులుగా పతాకావిష్కరణ చేయనున్నారు.
ఉమ్మడి జిల్లాల్లో ఉత్సవాలు..
జాతీయ పతాకావిష్కరణ
హనుమకొండకు మంత్రి కొండా సురేఖ, వరంగల్కు పొంగులేటి..

17న ‘ప్రజా పరిపాలన’ వేడుక