
పడకేసిన పారిశుద్ధ్యం
రుయా ఆస్పత్రిలో ఉన్నవే రెండు ఆర్ఓ ప్లాంట్లు. వాటి పరిసరాలను చూస్తే దాహం తీర్చుకోవాలనే ఆలోచనే విరమించుకోవాల్సి వస్తోంది. ఆ ప్లాంట్ల వద్ద పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. అసలు ప్లాంట్లను శుభ్రం చేస్తారో.. లేదో తెలియదు కానీ, అక్కడి వాతావరణం చూస్తే మాత్రం దారుణంగా ఉంటుంది. కొన్ని కొళాయిలు విరిగిపోయాయి. మరికొన్ని మరమ్మతులకు గురయ్యాయి. నీరు పట్టుకునే ప్రాంతంలో పాచిపట్టి దుర్వాసన వెదజల్లుతోంది. ప్లాంట్ చుట్టుపక్కల చెత్తాచెదారం పేరుకుపోయింది. పేరుకేమో పరిశుద్ధ జలం.. పరిసరాలు మాత్రం అధ్వాన్నంగా తయారయ్యాయి. అలాంటి నీటిని తాగితే రోగాలను నయం చేసుకునేందకు వచ్చిన వారు సైతం సరికొత్త వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. దీంతో పలువురు బయట నుంచి వాటర్ బ్యాటిళ్లను కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు.