రాజీనామా చేసి పోటీ పడదాం | - | Sakshi
Sakshi News home page

రాజీనామా చేసి పోటీ పడదాం

May 24 2025 12:45 AM | Updated on May 24 2025 12:45 AM

రాజీనామా చేసి పోటీ పడదాం

రాజీనామా చేసి పోటీ పడదాం

● మరోసారి గెలిచి చూపిస్తాం ● ఎమ్మెల్యే నానికి తిరుపతి రూరల్‌ ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల సవాల్‌

తిరుపతి రూరల్‌ : ‘‘అయ్యా.. నానీగారు మా పదవులకు మేం రాజీనామా చేస్తాం.. మీరు కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి.. నిజాయితీపరులైన మా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుల మద్దతుతో మేం ఎంపీపీగా, వైస్‌ ఎంపీపీలుగా గెలిచాం.. మీ దయతో కాదు.. మీరు గేట్లు తెరవండి.. మరోసారి మేమే గెలిచి చూపిస్తాం.. రాజీనామా తర్వాత ఎన్నికలకు పోదాం.. మీరు అన్నట్టు మీ పార్టీ వారు గెలిస్తే కీలకమైన మూడు పదవులు మీకు వస్తాయి.. మేమే గెలిచామా..? మీరు మీ ఎమ్మెల్యే పదవిని వదిలేయాలి.. మా సవాల్‌ను మీరు స్వీకరిస్తే తిరుపతి ప్రెస్‌క్లబ్‌ వేదికగా అందరం రాజీనామాలు చేద్దాం’’ అంటూ తిరుపతి రూరల్‌ ఎంపీపీ మూలం చంద్రమోహన్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీలు వేముల యశోద, విడుదల మాధవరెడ్డి సవాల్‌ విసిరారు.

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆగ్రహం

టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే పులివర్తి నాని గురువారం మాట్లాడుతూ తిరుపతి రూరల్‌ ఎంపీపీ ఎన్నికల్లో మేం గేట్లు తెరచుంటే వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులందరూ మా దగ్గరకు వచ్చేవారని వ్యాఖ్యానించడంపై ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలు మండిపడ్డారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ తాము నిజాయతీగా తమ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యుల మద్దతుతో విజయం సాధించామన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుంటే, ఎమ్మెల్యే పులివర్తి నాని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెల్లో అభివృద్ధి పనులకు పది రూపాయలు కూడా ఇవ్వలేదని, అయితే ఎమ్మెల్యే నాని మాత్రం చెవిరెడ్డి చేసిన అభివృద్ధి కనిపించకుండా రంగులు పూసి హంగామా చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి తీసుకువచ్చిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులనే ఇప్పుడు నాని ప్రారంభిస్తున్నారని వెల్లడించారు. మండల పరిషత్‌ కమిటీ దయతో జరిగే అభివృద్ధిని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేగా గ్రామాల్లోకి వెళుతున్నారని స్పష్టం చేశారు. మ సవాల్‌ను ఎమ్మెల్యే నాని స్వీకరించి రాజీనామాకు ముందుకు వస్తే తిరుపతి ప్రెస్‌క్లబ్‌ వేదికగా తమ పదవులు వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మునీశ్వరరెడ్డి, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు చిన్నియాదవ్‌, పేరూరు సర్పంచ్‌ దామినేటి కేశవులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement