వైరస్‌లపై ఐఐటీ పరిశోధన! | - | Sakshi
Sakshi News home page

వైరస్‌లపై ఐఐటీ పరిశోధన!

Jun 3 2025 2:16 PM | Updated on Jun 3 2025 2:16 PM

వైరస్‌లపై ఐఐటీ పరిశోధన!

వైరస్‌లపై ఐఐటీ పరిశోధన!

సాక్షి, చైన్నె : వ్యాఽధి కారక బ్యాక్టీరియాను చంపే సామర్థ్యం ఉన్న వైరస్‌లను ఐఐటీ మద్రాసు, యూఎస్‌ పరిశోధకులు సంయుక్తంగా అధ్యయనం చేస్తున్నారు. ఈ వివరాలను సోమవారం ఐఐటీ మద్రాసు ప్రకటించింది. ప్రతిష్టాత్మక నేచర్‌ మైక్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రపంచ వ్యాప్తంగా మంచినీటి సరస్సుల్లో 1.3 మిలియన్‌ వైరస్‌ జన్యువులను పునర్నిర్మించినట్టు పేర్కొన్నారు. వైరస్‌లను ఓ ట్రాక్‌ చేయడం, అవి ఎలా ఉద్భవిస్తాయి, పరిణామం చెందుతాయి. వాతావరణ పరిస్థితుల్లో ఎలా సంఘర్షణ చెందుతాయో? అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో? అన్నది కోవిడ్‌–19 స్పష్టం చేసినట్టు తెలిపారు. ఈ పరిశోధన భూమిపై సహజ పర్యావరణం, అతి పొడవైన డీఎన్‌ఏ ఆధారిత పర్యవేక్షణ సూచిస్తుందని పేర్కొన్నారు. ఒక ఉత్తేజకరమైన ఉదాహరణగా ‘ఫేజ్‌ థెరపీ’. ఇది వ్యాధి కారక బ్యాక్టీరియాను లక్ష్యంగా చేసుకుని చంపడానికి ఫేజెస్‌ అని పిలువబడే నిర్దిష్ట వైరస్‌లను ఉపయోగిస్తుందని తెలిపారు. ఈ విధానం భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న యాంటీ బయాటిక్‌–నిరోధక బాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌లను ఎదుర్కోవడానికి, వైద్యశాస్త్రంలో విప్లవాత్మక మార్పులు చేసే సామర్థ్యం కలిగి ఉంటుందని తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలు వైరస్‌లు పర్యావరణ వ్యవస్థలలో కీలకపాత్ర పోషిస్తాయని, పర్యావరణాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఇతర జీవులకు మద్దతు ఇవ్వడంతో అవి పోషిస్తాయని వెల్లడించారు. సహజ వ్యవస్థల ఆరోగ్యం, స్థిరత్వానికి వైరస్‌లు ఎలా ప్రయోజనకరంగా ఉంటాయో ఈ అధ్యయనం హైలైట్‌ చేస్తుందన్నారు. ఈ పరిశోధనకు ఐఐటీ మద్రాస్‌లోని వాధ్వానీ స్కూల్‌ ఆఫ్‌ డేటా సైన్స్‌ అండ్‌ ఏఐ విజిటింగ్‌ ప్రొఫెసర్‌, అలోని విస్కాన్సిన్‌, మాడిసన్‌ విశ్వవిద్యాలయంలో మైక్రోబియల్‌ అండ్‌ వైరల్‌ ఎకాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కార్తీక్‌ అనంతరామన్‌ నాయకత్వం వహించినట్టు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement