
వైరస్లపై ఐఐటీ పరిశోధన!
సాక్షి, చైన్నె : వ్యాఽధి కారక బ్యాక్టీరియాను చంపే సామర్థ్యం ఉన్న వైరస్లను ఐఐటీ మద్రాసు, యూఎస్ పరిశోధకులు సంయుక్తంగా అధ్యయనం చేస్తున్నారు. ఈ వివరాలను సోమవారం ఐఐటీ మద్రాసు ప్రకటించింది. ప్రతిష్టాత్మక నేచర్ మైక్రోబయాలజీ జర్నల్లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రపంచ వ్యాప్తంగా మంచినీటి సరస్సుల్లో 1.3 మిలియన్ వైరస్ జన్యువులను పునర్నిర్మించినట్టు పేర్కొన్నారు. వైరస్లను ఓ ట్రాక్ చేయడం, అవి ఎలా ఉద్భవిస్తాయి, పరిణామం చెందుతాయి. వాతావరణ పరిస్థితుల్లో ఎలా సంఘర్షణ చెందుతాయో? అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో? అన్నది కోవిడ్–19 స్పష్టం చేసినట్టు తెలిపారు. ఈ పరిశోధన భూమిపై సహజ పర్యావరణం, అతి పొడవైన డీఎన్ఏ ఆధారిత పర్యవేక్షణ సూచిస్తుందని పేర్కొన్నారు. ఒక ఉత్తేజకరమైన ఉదాహరణగా ‘ఫేజ్ థెరపీ’. ఇది వ్యాధి కారక బ్యాక్టీరియాను లక్ష్యంగా చేసుకుని చంపడానికి ఫేజెస్ అని పిలువబడే నిర్దిష్ట వైరస్లను ఉపయోగిస్తుందని తెలిపారు. ఈ విధానం భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న యాంటీ బయాటిక్–నిరోధక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి, వైద్యశాస్త్రంలో విప్లవాత్మక మార్పులు చేసే సామర్థ్యం కలిగి ఉంటుందని తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలు వైరస్లు పర్యావరణ వ్యవస్థలలో కీలకపాత్ర పోషిస్తాయని, పర్యావరణాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఇతర జీవులకు మద్దతు ఇవ్వడంతో అవి పోషిస్తాయని వెల్లడించారు. సహజ వ్యవస్థల ఆరోగ్యం, స్థిరత్వానికి వైరస్లు ఎలా ప్రయోజనకరంగా ఉంటాయో ఈ అధ్యయనం హైలైట్ చేస్తుందన్నారు. ఈ పరిశోధనకు ఐఐటీ మద్రాస్లోని వాధ్వానీ స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ ఏఐ విజిటింగ్ ప్రొఫెసర్, అలోని విస్కాన్సిన్, మాడిసన్ విశ్వవిద్యాలయంలో మైక్రోబియల్ అండ్ వైరల్ ఎకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కార్తీక్ అనంతరామన్ నాయకత్వం వహించినట్టు ప్రకటించారు.