
సింఫోనీని మన ప్రజల ముందు ప్రదర్శిస్తా...
తమిళసినిమా: సంగీతజ్ఞాని ఇళయరాజా సోమవారం తన 82వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈయనకు ముఖ్యమంత్రి స్టాలిన్తో సహా పలువురు సినీ రాజకీయ నాయకులు శుభాకాంక్షలు అందించారు. స్థానిక టీనగర్, ఆర్కాడ్ రోడ్డులోని ఇళయరాజా రికార్డింగ్ థియేటర్ అభిమానుల సమూహంతో కిటకిటలాడింది. ఆయన్ని చూడడానికి అభిమానులు తరలి వచ్చారు. అందరితోనూ ఇళయరాజా ఫొటోలు దిగి వారిని సంతృప్తి పరిచారు. ఈ సందర్భంగా ఇళయరాజా మీడియాతో మాట్లాడుతూ తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు అన్నారు. ఈ రోజు ఒక తీయని వార్త చెబుతున్నాననీ, లండన్లో తాను నిర్వహించిన సింఫోనీని అదే ఆర్కెస్ట్రా కళాకారులతో ప్రపంచ వ్యాప్తంగా మన ఘనతను చాటే విధంగా చైన్నెలో సంగీత కచేరీని మన ప్రజల సమక్షంలో ఆగస్ట్ 2వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఇళయరాజాకు శుభాకాంక్షలు తెలుపుతూ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ‘నిన్న, నేడు, రేపు ఎప్పుడూ మీరు సంగీతంలో రాజానే. గ్రామీణ సంగీతం, మెలోడీ సంగీతం, పాశ్చా త్య సంగీతం, తమి ళ సంగీతం అంటూ అ న్నింటిలోనూ తమిళుల ఘనతకు చిరునామా గా నిలిచిన సంగీతజ్ఞాని ఇళయరాజాకు నా హృదయపూర్వక జ న్మదిన శుభాకాంక్షలు. మీ సింఫోని సంగీతం తమిళనాడులో ధ్వనించనున్న ఆగస్ట్ 2వ తేదీ కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది అభిమానుల్లో ఒకరిగా నేను వేచి చూస్తు న్నాను. నిన్న, నేడు, రేపు మీ సంగీత రాజ్యాంగ పాలనే’ అని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు.