
ముగ్గురు యువకుల అరెస్టు
కొరుక్కుపేట: చైన్నె ఇంటెలిజెన్న్స్ డివిజన్లోని నందం బాక్కంలో మెథాంఫెటమైన్ కలిగి ఉన్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 11 గ్రాముల మెథాంఫెటమైన్, 1 వెయింగ్ మెషిన్, 3 ఐఫోన్లు , కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌన్సెలింగ్ ప్రారంభం
తిరుత్తణి:స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యూజీ కోర్సులకు సోమవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ప్లస్టూ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు డిగ్రీలో అడ్మిషన్ కోసం దర ఖాస్తులు చేసుకున్నారు. ఈ క్రమంలో తొలిరోజు క్రీడలు, దివ్యాంగులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. 120 మంది ప్రవేశానికి అవకాశం ఉండగా 80 మంది తొలిరోజు కౌన్సెలింగ్లో పాల్గొన్నట్లు కళాశాల ప్రిన్సిపల్ దేవసేన తెలిపారు. అభ్యర్థులు బీకామ్ కోర్సుపై ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.