
భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం
తిరుత్తణి: పట్టణంలోని ఎగువ తిరుత్తణిలో ద్రౌపదీ దేవి ఆలయంలో ఆదివారం రాత్రి అగ్నిగుండ ప్రవేశం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఎగువ తిరుత్తణిలో ద్రౌపదీ దేవి ఆలయంలో మే 15వ తేదీన నుంచి 18 రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకల్లో అ మ్మవారికి ప్రతిరోజూ అభిషేక పూజలు చేసి, గ్రామ వీధుల్లో ఊరేగించారు. వేడుకల్లో ప్రధానమైన అగ్నిగుండ ప్రవేశం ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా కంకణాలు ధరించిన రెండు వేల మందికి పైగా భక్తులు ఊరేగింపుగా సాయంత్రం 7 గంటల సమయంలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ద్రౌపదీదేవి ఉత్సవమూర్తిని అగ్నిగుండం ముందు కొలువు దీర్చి, పూజలు చేసి, తొలుత గెరిగ మోసిన భక్తుడు అగ్నిగుండం ప్రవేశం చేయగా బాణసంచా వేడుకలు నడుమ భక్తులు గోవింద నామస్మరణలతో అగ్నిగుండం ప్రవేశం చేసి, మెక్కులు చెల్లించారు. సీఐ మదియరసన్ ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. సోమవారం ఉదయం ధర్మరాజుకు పట్టాభిషేకంతో వేడుకలకు ముగిశాయి.

భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం